మానవుల కర్మల నమోదు – [మరణానంతర జీవితం – పార్ట్ 50] https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
హౌదె కౌసర్ (కౌసర్ కొలను)
మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.
ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.
ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.
మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.
అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ (హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా) “నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”
مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ (మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్యబు మినల్ మిస్క్) “దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన“
మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.
مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا (మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా) “ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”
మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.
ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.
అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ (ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్) “నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను“
مَنْ مَرَّ بِي شَرِبَ (మన్ మర్ర బీ షరిబ్) “ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు“
ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.
وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا (వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా) “మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.“
“హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని“
గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.
ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“నా వద్దకు హౌదె కౌసర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో, ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నా అనుచర సంఘాన్ని నేను తీసుకొని పక్కకు జరుపుతాను, హౌదె కౌసర్ వైపునకు తీసుకెళ్లడానికి. అప్పుడు సహాబాలు, సహచరులు అడిగారు, “ప్రవక్తా, తారిఫునా? ఆ రోజు అంత మందిలో, అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “అవును, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, ఓ గుర్తు అనేది ఉంటుంది, అది మరెవరికీ ఉండదు.”
గమనించండి. మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, గుర్తు అనేది ఉంటుంది, లైస లిఅహదిన్ గైరికుమ్. అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు. అదేమిటి?
تَرِدُونَ عَلَىَّ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ (తరిదూన అలయ్య గుర్రమ్ ముహజ్జలీన మిన్ ఆసారిల్ వుదూ) “మీరు వుదూ ఆనవాళ్ల వల్ల ప్రకాశవంతమైన ముఖాలు, కాళ్ళు మరియు చేతులతో నా వద్దకు వస్తారు.”
మీలో ఐదు వేళల నమాజులు చేస్తూ ఉన్నవారు, వారు నమాజు గురించి వుదూ చేస్తూ ఉంటారు, ఆ వుదూ చేయడం వల్ల వుదూ యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో,
وَلَيُصَدَّنَّ عَنِّي طَائِفَةٌ مِنْكُمْ (వల యుసద్దన్న అన్నీ తాయిఫతుమ్ మిన్కుమ్) “అయితే మీలోని ఒక వర్గం వారు నా నుండి అడ్డగించబడతారు.”
ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం, అటు తోయడం జరుగుతుంది. ఫలా యసిలూన్. వారు నా వరకు చేరుకోరు. ఫఅఖూల్, అప్పుడు నేను అంటాను,
يَا رَبِّ هُمْ مِنْ أَصْحَابِي (యా రబ్బి హుమ్ మిన్ అస్ హాబీ) “ఓ ప్రభూ! వీరు నా అనుచరులే.”
ఓ ప్రభువా, వీరు కూడా నన్ను విశ్వసించేవారు, నా వారు అని.
فَيُجِيبُنِي مَلَكٌ (ఫయుజీబునీ మలకున్) “అప్పుడు ఒక దైవదూత నాకు సమాధానమిస్తాడు.”
وَهَلْ تَدْرِي مَاذَا أَحْدَثُوا بَعْدَكَ (వహల్ తద్రీ మాదా అహదసూ బాదక్) “నీ తర్వాత వారు ఏమేమి కొత్తవి కల్పించారో నీకు తెలుసా?”
ప్రవక్తా, నీవు చనిపోయిన తర్వాత, నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా? మరొక ఉల్లేఖనంలో ఉంది,
إِنَّهُمُ ارْتَدُّوا عَلَى أَدْبَارِهِمُ الْقَهْقَرَى (ఇన్నహు ముర్తద్దూ అలా అద్బారిహిముల్ ఖహ్ఖరా) “వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదిలేసి వెనుదిరిగారు“
అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?
ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.
రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.
మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.
అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.
మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.
إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا (ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా) “నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”
మరో ఉల్లేఖనంలో ఉంది,
وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ (వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు) “ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది“
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.
గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.
إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ (ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్) “నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”
నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.
అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,
يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ (యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్) “నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)
నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.
అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినం
మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.
ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.
కర్మలను నమోదు చేసే దైవదూతలు
అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.
కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ (వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్) నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)
మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.
మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.
మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:
لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا ‘అల్లాహ్ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)
ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.
మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ (అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్) ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)
ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.
ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.
మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:
وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ (వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్) వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)
వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.
అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.
إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ (ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్) వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)
అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.
మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:
ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.
అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.
ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.
ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నాలుగు రకాల వారు. ఒకరు, అల్లాహు త’ఆలా అతనికి విద్య ప్రసాదించాడు మరియు ధనము ప్రసాదించాడు. అతడు ఆ విద్యతో ఆ ధనాన్ని అల్లాహ్ కు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతూ, సంబంధాలను పెంచుకుంటూ, అవసరం ఉన్నవారికి సహాయపడుతూ, తర్వాత అన్ని రకాల అల్లాహ్ కు ఇష్టమైన మంచి మార్గాల్లో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ విధంగా అతనికి పుణ్యం రాయబడుతుంది, అతనికి పుణ్యం లభిస్తుంది.
రెండో వ్యక్తి, అతనికి విద్య అయితే ఉంది కానీ అతని వద్ద ధనము లేదు. ఆ వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనము ఉంటే, నేను అతని కంటే ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవాడిని” అని సంకల్పించుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యంలో వీరిద్దరూ సమానులవుతారు.
మూడో వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, అతని వద్ద కేవలం ధనం ఉన్నది. అతడు తన ధనంపై గర్వపడి, విశ్వాస మార్గాన్ని వదిలేసి, అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే, ఇష్టం లేని మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అందువల్ల అతనికి పాపం కలుగుతుంది.
ఇక నాలుగో మనిషి, నాలుగో రకం వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, ధనము లేదు. కానీ అతనేమంటాడు, మూడో రకమైన వారిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనం ఉంటే నేను వారికంటే ఎక్కువ పాపంలో, వారికంటే ఎక్కువగా ఆనందంలో, వారికంటే ఎక్కువగా నేను ఈ ధనం ఖర్చు పెడుతూ ఉంటాను.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఇద్దరూ కూడా పాపంలో సమానము అని.
ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
బోధపడిన విషయాలు
మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:
(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.
(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.
(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.
ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.
అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.
అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.
ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.
అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీం అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్ (పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను అర్థిస్తున్నాను: ఇహపరలోకాల్లో నిన్ను వలీ* గా చేసుకొనుగాక మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక)
وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్) (ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉంది)
[*] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.
ఈ ప్రసంగంలో, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే పుస్తకం యొక్క పరిచయం మరియు ప్రారంభ దుఆల గురించి వివరించబడింది. ఇస్లాం యొక్క పునాది అయిన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ప్రాముఖ్యతతో ప్రసంగం ప్రారంభమవుతుంది. తౌహీద్ను షిర్క్ నుండి వేరు చేయడానికి ఇమామ్ ఈ పుస్తకాన్ని రచించారని, మరియు పాఠకుల కోసం దుఆతో ప్రారంభించడం ఆయన పద్ధతి అని వక్త పేర్కొన్నారు. మూడు ముఖ్యమైన దుఆలు వివరించబడ్డాయి: 1) అల్లాహ్ ఇహపరలోకాలలో తన వలీ (మిత్రుడు)గా చేసుకోవాలని కోరడం. 2) ఎక్కడ ఉన్నా ముబారక్ (శుభవంతుడు)గా చేయమని ప్రార్థించడం. 3) అనుగ్రహం పొందినప్పుడు కృతజ్ఞత (షుక్ర్), పరీక్షకు గురైనప్పుడు సహనం (సబ్ర్), మరియు పాపం చేసినప్పుడు క్షమాపణ (ఇస్తిగ్ఫార్) కోరే వారిలో చేర్చమని వేడుకోవడం. ఈ మూడు గుణాలు సౌభాగ్యానికి మరియు సాఫల్యానికి ప్రతీకలని వక్త నొక్కిచెప్పారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
ప్రియ వీక్షకులారా, అల్హందులిల్లాహి హందన్ కసీరా. ఇస్లాం ధర్మానికి పునాది అయినటువంటి కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు ఉన్నాయి. అయితే 1115వ హిజ్రీ శకంలో జన్మించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్, ఆయన ఈ సౌదీ అరబ్లోని రియాద్ క్యాపిటల్ సిటీకి దగ్గర దిర్ఇయ్యాలో జన్మించారు. ఆయన ధర్మ విద్య నేర్చుకున్న తర్వాత ధర్మ ప్రచారం మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడ ఈ అరబ్ ప్రాంతంలో, వారి చుట్టుపక్కల్లో అనేక మంది ముస్లింలు చాలా స్పష్టమైన షిర్క్ చేస్తుంటే చూశారు. వారు చేస్తున్న ఆ షిర్క్ పనులు, వాటిని వారు షిర్క్ అని భావించడం లేదు. ఈ రోజుల్లో అనేక మంది ముస్లింలలో ఉన్నటువంటి మహా భయంకరమైన అజ్ఞానం అనండి, పొరపాటు అనండి, అశ్రద్ధ అనండి, వారు ఏ షిర్క్లో ఉన్నారో దానిని షిర్క్ అని భావించడం లేదు. అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వారి ముందు వారు చేస్తున్న ఆ పనులన్నిటినీ కూడా షిర్క్ అని స్పష్టపరిచారు. దానికై ఎన్నో సంవత్సరాలు చాలా కృషి చేశారు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే ఈ దావా ప్రచారంలో ఆయన కేవలం చెప్పడం ద్వారానే కాదు, ప్రజల వద్ద ఆధారాలు స్పష్టంగా ఉండాలి, ఇంకా ముందు తరాల వారికి కూడా తెలియాలి అని కొన్ని చిన్న చిన్న రచనలు, పుస్తకాలు కూడా రచించారు. ఉసూల్ ఎ సలాసా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా, కష్ఫుష్ షుబహాత్ ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి పుస్తకం అల్-ఖవాయిద్ ఉల్-అర్బా. నాలుగు నియమాలు. నాలుగు మూల పునాది లాంటి విషయాలు. దేనికి సంబంధించినవి? ఈ నాలుగు నియమాలు వీటిని మనం తెలుసుకున్నామంటే తౌహీద్లో షిర్క్ కలుషితం కాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడగలుగుతాము.
అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి అలవాటు ఏమిటంటే, ఆయన ఎక్కడ బోధ చేసినా గాని, ఏ పుస్తకాలు రచించినా గాని సర్వసామాన్యంగా పాఠకులకు, విద్యార్థులకు ముందు దీవిస్తారు, దుఆలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అల్లాహ్తో వీరి గురించి ఎన్నో మేళ్ళను కోరుతారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ పద్ధతి ఇది.
అయితే రండి, ఏ ఆలస్యం లేకుండా మనం ఈ పుస్తకం చదవబోతున్నాము. మధ్యమధ్యలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను కూడా. అయితే అసలు నాలుగు నియమాలు చెప్పేకి ముందు ఒక నాలుగు రకాల మంచి దుఆలు ఇస్తారు, ఆ తర్వాత తౌహీద్కు సంబంధించిన ఒక మూల విషయం తెలియజేస్తారు, ఆ తర్వాత ఆ నాలుగు నియమాలు చెప్పడం మొదలుపెడతారు. అయితే ఇది చాలా చిన్న పుస్తకం. మనం ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుంటాము. మంచిగా అర్థం కావడానికి, మన సమాజంలో ఉన్నటువంటి షిర్క్ను మనం కూడా ఉత్తమ రీతిలో ఖండిస్తూ ప్రజలను ఈ షిర్క్ నుండి దూరం ఉంచడానికి.
ద్వారా పుస్తకం ప్రారంభిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే ఖురాన్ గ్రంథం యొక్క ప్రారంభం కూడా బిస్మిల్లాహ్ నుండే అవుతుంది. ఏ పని అయినా మనం బిస్మిల్లాహ్, అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలుపెట్టాలి. అప్పుడే అందులో మనకు చాలా శుభాలు కలుగుతాయి. అల్లాహ్, ఇది మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అసలైన పేరు. ఆ తర్వాత రెండు పేర్ల ప్రస్తావన వచ్చింది, అర్-రహ్మాన్, అర్-రహీమ్. ఇందులో అల్లాహ్ యొక్క విశాలమైన కారుణ్యం, ప్రజలపై ఎడతెగకుండా కురుస్తున్నటువంటి కారుణ్యం గురించి చెప్పడం జరిగింది.
సోదర మహాశయులారా, సోదరీమణులారా దీని ద్వారా మనం గమనించాలి ఒక విషయం. అదేమిటంటే అల్లాహ్ త’ఆలా యొక్క పేర్లు, అల్లాహ్ యొక్క శుభ నామములు వాటిని సమయ సందర్భంలో దృష్టి పెట్టుకొని, ఎక్కడ ఎలాంటి పేరు ఉపయోగించాలి, ప్రత్యేకంగా దుఆ చేస్తున్నప్పుడు మనం అల్లాహ్తో ఏ విషయం కోరుతున్నాము, అడుగుతున్నాము, అర్ధిస్తున్నాము, దానికి తగిన అలాంటి భావం గల అల్లాహ్ యొక్క పేర్లు ఉపయోగించడం ద్వారా మనం చాలా లాభం పొందగలుగుతాము మరియు అలాంటి దుఆలు త్వరగా స్వీకరించబడతాయి కూడా.
ఇమామ్ గారి ప్రారంభ దుఆలు
ఇక ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు,
أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక్ ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్ నిన్ను వలీగా చేసుకొనుగాక.
సోదర మహాశయులారా, ఇక్కడ మీరు చూశారు, ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ త’ఆలా నిన్ను ఇహపరలోకాలలో వలీగా చేసుకొనుగాక. మొదటి దుఆ ఇది. ఆ తర్వాత మరో రెండు దుఆలు కూడా ఉన్నాయి. ఈ దుఆ ప్రస్తావించేకి ముందు, అస్అలుల్లాహ్ అల్-కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్ యొక్క రెండు పేర్లు, అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత మహా పెద్దగా ఉన్నటువంటి ఆ సృష్టికి నీవు ప్రభువు అన్నటువంటి ఆ సృష్టి ప్రస్తావన ఇక్కడ చేశారు.
అల్-కరీమ్, అల్లాహ్ యొక్క పేరు. గత రమదాన్లో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి దర్స్ ఇవ్వడం జరిగింది. నాYouTube ఛానల్లోమీరు చూడవచ్చు, అల్లాహ్ యొక్క ఎన్నో పేర్ల గురించి వివరం అక్కడ ఇవ్వడం జరిగింది. అల్-కరీమ్, ఎక్కువగా కరం చేసేవాడు, దాతృత్వ గుణం గలవాడు, ఎక్కువగా ప్రసాదించేవాడు. పరమదాత అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు అల్లాహ్ యొక్క ఈ పేరు అల్-కరీమ్లో మరెన్నో ఉత్తమ పేర్లు వచ్చేస్తాయి. ఎన్నో ఉత్తమ పేర్ల భావాలు ఇందులో వచ్చేస్తాయి.
ఆ తర్వాత రబ్. రబ్ అంటే మనం తెలుగులో సర్వసామాన్యంగా ప్రభువు అని అనువదిస్తాము. అయితే ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, రబ్ అన్న ఈ పదం యొక్క భావంలో సృష్టించడం, పోషించడం, ఈ విశ్వ వ్యవస్థను నడిపించడం ఈ మూడు భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరిలోనైతే ఈ మూడు రకాల శక్తి, సామర్థ్యాలు, గుణాలు ఉన్నాయో, అలాంటివాడే రబ్ కాగలుగుతాడు. అతను ఎవరు? అల్లాహ్.
ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం, అల్-అర్షిల్ అజీమ్. రబ్, ఎవరికి రబ్? సర్వమానవులకు రబ్. సర్వ జిన్నాతులకు రబ్. సర్వలోకాలకు రబ్ అల్లాహ్ మాత్రమే. కానీ ఇక్కడ దుఆ చేస్తూ అల్-అర్షిల్ అజీమ్ అని చెప్పడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు, షేక్ అబ్దుర్రజాక్ అల్-బద్ర్ హఫిదహుల్లాహ్, షేక్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్ మస్జిద్-ఎ-నబవీ యొక్క ఇమామ్ ఇంకా వేరే ఎందరో పెద్ద పెద్ద పండితులు అరబీలో ఈ పుస్తకాన్ని వివరించారు. వారు ఇక్కడ ఒక మాట ఏం చెబుతున్నారు? సర్వసృష్టిలో అల్లాహ్ యొక్క అర్ష్ చాలా పెద్దది, బ్రహ్మాండమైనది. అయితే అల్లాహ్ యొక్క గొప్ప తౌహీద్ విషయంలో ముందు కొన్ని ముఖ్య బోధనలు వస్తున్నాయి, అందుకు అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత బ్రహ్మాండమైన, పెద్ద సృష్టికి నీవు ప్రభువు అని ఇక్కడ అర్ధించడం జరుగుతుంది.
ఖురాన్లో అర్ష్ యొక్క గుణంలో దానితోపాటు అల్-అర్షిల్ కరీమ్, అల్-అర్షిల్ అజీమ్, అల్-అర్షిల్ మజీద్ అన్నటువంటి ప్రస్తావన వచ్చి ఉంది. అయితే అర్ష్ ఎంత పెద్దగా ఉన్నది ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీసులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు విని ఉన్నారు, ఖురాన్ వ్యాఖ్యానాలలో, అలాగే ప్రత్యేకంగా ఆయతుల్ కుర్సీ యొక్క వ్యాఖ్యానంలో కూడా ఈ మొత్తం భూమ్యాకాశాలు, విశ్వం ఇదంతా ఒక చిన్న ఉంగరం మాదిరిగా కుర్సీ ముందు, ఆ కుర్సీ ఈ బ్రహ్మాండమైన విశ్వం లాంటిగా మనం భావిస్తే, దాని ముందు ఈ భూమ్యాకాశాలన్నీ కూడా కలిసి ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అలాగే కుర్సీ, అర్ష్ ముందు ఎంత చిన్నదంటే అర్ష్ను మనం ఒక పెద్ద ఎడారిగా భావిస్తే అందులో కుర్సీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అర్థమైందా? గమనించారా మీరు?
ఈ భూమ్యాకాశాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉదాహరణ ఇస్తారంటే ఒక పెద్ద ఎడారి ఉంది, దాని మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఉంగరం పడి ఉన్నది. అల్లాహ్ యొక్క అర్ష్ ఎడారి మాదిరిగా అయితే కుర్సీ ఆ ఉంగరం లాంటిది. కుర్సీ ఆ ఎడారి లాంటిదైతే ఈ భూమ్యాకాశాలు మొత్తం విశ్వం ఆ ఉంగరం లాంటిది. అంటే ఈ మొత్తం భూమ్యాకాశాల కంటే చాలా చాలా చాలా ఎన్నో రెట్లు పెద్దగా కుర్సీ. మరియు కుర్సీ కంటే ఎన్నో రెట్లు పెద్దగా అల్లాహ్ యొక్క అర్ష్.
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు, సింహాసనంపై అల్లాహ్ త’ఆలా ఇస్తివా అయి ఉన్నాడు. ఇక్కడ సలఫె సాలిహీన్ యొక్క మన్హజ్, వారి యొక్క విధానం ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క అర్ష్ను విశ్వసించాలి, అర్ష్ అంటే ప్రభుత్వం, ఏదో కేవలం శక్తి అని నమ్మకూడదు. అల్లాహ్ యొక్క సృష్టి అది. అత్యంత పెద్ద సృష్టి. అల్లాహ్ త’ఆలా దానిపై ఇస్తివా అయి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? ఎటువైపులా ఉన్నాడు? ఈ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. అర్థమైంది కదా?
అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. ఆ తర్వాత ఏం దుఆ చేస్తున్నారు? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ త’ఆలా నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.
సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప దుఆ. అల్లాహ్ మనల్ని వలీగా చేసుకోవడం, మనం అల్లాహ్కు వలీగా అయిపోవడం, అల్లాహ్ మన కొరకు వలీ అవ్వడం ఇది మహా గొప్ప అదృష్టం. ఎవరైతే అల్లాహ్కు వలీ అవుతారో, మరి ఎవరికైతే అల్లాహ్ వలీ అవుతాడో, అలాంటి వారికి ఏ బాధ, ఏ చింత ఉండదు. ఖురాన్లో అనేక సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా తెలియజేశాడు,
జరిగిపోయిన భూతకాలం గురించి గాని, రాబోతున్న భవిష్యత్తు గురించి గాని ఎలాంటి భయము, ఎలాంటి చింత ఉండదు. ఎవరికి? అల్లాహ్ యొక్క వలీలకు. అంతేకాదు, ఎవరైతే అల్లాహ్ యొక్క వలీ అవుతారో అలాంటివారు మార్గభ్రష్టత్వంలో పడే, షిర్క్లో పడేటువంటి ప్రమాదం ఉండదు. అవును, సూరత్ ఆయతుల్ కుర్సీ వెంటనే ఆయత్ ఏదైతే ఉన్నదో ఒకసారి దాని తర్వాత ఆయతులు గమనించండి. ఆయతుల్ కుర్సీ తర్వాత లా ఇక్రహ ఫిద్దీన్, ఆ తర్వాత
اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ అల్లాహు వలియ్యుల్లజీన ఆమనూ యుఖ్రిజుహుమ్ మినజ్జులుమాతి ఇలన్నూర్. విశ్వసించినవారి వలీ గా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. (2:257).
అల్లాహ్ త’ఆలా విశ్వాసులకు వలీ. అల్లాహ్ తమ ఔలియాలను జులుమాత్ల నుండి వెలికితీసి నూర్ వైపునకు తీసుకొస్తాడు. జులుమాత్, అంధకారాలు, చీకట్లు. ఎలాంటివి? షిర్క్ యొక్క అంధకారం, బిదాత్ యొక్క అంధకారం, పాపాల అంధకారం నుండి బయటికి తీసి అల్లాహ్ త’ఆలా తౌహీద్ యొక్క వెలుతురులో, సున్నత్ యొక్క కాంతిలో మరియు పుణ్యాల యొక్క ప్రకాశవంతమైన మార్గంలో వేస్తాడు. గమనించారా?
మరియు ఈ గొప్ప అదృష్టాన్ని ఎలా పొందగలుగుతాము మనం? ఒకరు దుఆ ఇస్తారు. కానీ ఆ దుఆకు తగ్గట్టు మన ప్రయత్నం కూడా ఉండాలి కదా? నా కొడుకు పాస్ కావాలని దుఆ చేయండి. సరే మంచిది, చేస్తాము. కానీ కొడుకు అక్కడ ప్రిపరేషన్ కూడా మంచిగా చేయాలి కదా? నా కొడుకు ఆరోగ్యం బాగలేదు, మీరు అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని దుఆ చేయండి. సరే మనం చేస్తాము. కానీ మందులు వాడడం గాని, డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం గాని ఇలాంటి ప్రయత్నాలు కూడా జరగాలి కదా? అలాగే మనం అల్లాహ్ యొక్క వలీ కావాలంటే ఏం చేయాలి?
సూరత్ ఫుస్సిలత్లో అల్లాహ్ త’ఆలా ఇచ్చినటువంటి శుభవార్త, ఆ శుభవార్త ఎవరికి ఇవ్వబడినది? ఆ పనులు మనం చేయాలి. అలాగే అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్ అనే ఆయత్ తర్వాత సూర యూనుస్లో వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరు వారు ఔలియా? అల్లజీన ఆమనూ వకాను యత్తఖూన్. (10:63). ఎవరైతే విశ్వసిస్తారో, తౌహీద్ను అవలంబిస్తారో, భయభీతి మార్గాన్ని అవలంబిస్తారో. ఇక ఫుస్సిలత్లో చూస్తే ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్. “అల్లాహ్ యే మా ప్రభువు” అని పలికి, ఆ తరువాత దానికే కట్టుబడి ఉన్నవారిపై (41:30). ఎవరైతే మా యొక్క ప్రభువు అల్లాహ్ అని అన్నారో, సుమ్మస్తఖామూ. ఆ తౌహీద్ పై, ఆ విశ్వాసంపై, సత్కార్యాలపై స్థిరంగా ఉన్నారు. షిర్క్, బిదాత్లు, పాపకార్యాల యొక్క ఎలాంటి తుఫానీ గాలులు వచ్చినా గాని వారు ఏమాత్రం అటు ఇటు వంగకుండా, ఆ పాపాల్లో పడకుండా, తౌహీద్ పై, పుణ్యాలపై, సున్నత్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ త’ఆలా అల్లా తఖాఫూ వలా తహ్జనూ అని శుభవార్తలు ఇచ్చాడు. ఆ శుభవార్తలోనే ఒకటి ఏముంది? ఆ తర్వాత ఆయత్లో
نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ నహ్ను ఔలియా ఉకుమ్ ఫిల్ హయాతిద్దున్యా వ ఫిల్ ఆఖిరహ్. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. (41:31).
మేము మీ ఇహలోక జీవితంలో కూడా మీకు ఔలియా. వ ఫిల్ ఆఖిరహ్, పరలోకంలో కూడా. చూశారా దుఆ? ఏమి ఇచ్చారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.
ఇక సోదర మహాశయులారా, ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఎన్నో ఆయతులు, హదీసుల ఆధారంగా ఇవ్వవచ్చు. కానీ సమయం చాలా ఎక్కువగా అవుతుంది. కేవలం సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీసు వినిపించి, ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో అది మనం విందాము, మరొక దుఆ ఏదైతే ఇచ్చారో అది కూడా మనం తెలుసుకుందాం. సహీ బుఖారీలో హదీసు ఏమిటి?
“ఎవరైతే అల్లాహ్ యొక్క వలీలతో శత్రుత్వం వహిస్తారో, నేను స్వయంగా వారితో యుద్ధానికి సిద్ధమవుతాను” అని అల్లాహ్ చెప్పినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూస్తున్నారా? ఎవరైతే అల్లాహ్కు వలీలుగా అవుతారో, వారు అల్లాహ్కు ఎంత ప్రియులు అవుతారు మరియు అల్లాహ్ వారి వైపు నుండి ఎలా పోరాడుతాడో. కానీ అల్లాహ్ యొక్క ఈ వలీ కావడానికి ఏంటి? అదే హదీసులో చెప్పడం జరిగింది. అదే హదీసులో చెప్పడం జరిగింది.
అల్లాహ్ ఏ విషయాలైతే మనపై విధిగావించాడో వాటిని మనం తూచా తప్పకుండా, పాబందీగా పాటిస్తూ ఉండాలి. ఇక అల్లాహ్ విధించిన వాటిలో అత్యుత్తమమైనది, అత్యున్నత స్థానంలో, మొట్టమొదటి స్థానంలో తౌహీద్. కదా? వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. సూర బఖరా ఆయత్ నెంబర్ 187 కూడా చూడవచ్చు మనం.
ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా విధిగావించిన విషయాలు పాటించిన తర్వాత నఫిల్ విషయాలు ఎక్కువగా పాటిస్తూ ఉండడం. ఇక్కడ నఫిల్ అంటే ఎంతో మంది కేవలం నమాజులు అనుకుంటారు, కాదు. నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు, హుకూకుల్లాహ్, అల్లాహ్ మరియు దాసులకు మధ్య సంబంధించిన విషయాల్లో, హుకూకుల్ ఇబాద్ మరియు మన యొక్క సంబంధాలు దాసులతో ఏమైతే ఉంటాయో అన్నిటిలో కూడా కొన్ని విధులు ఉన్నాయి, మరి కొన్ని నఫిల్లు ఉన్నాయి. ఆ నఫిల్లు కూడా అధికంగా చేస్తూ ఉండాలి. అప్పుడు అల్లాహ్ యొక్క వలీ కావడానికి మనం చాలా దగ్గరగా అవుతాము.
లేదా అంటే ఈ రోజుల్లో ఎందరో చనిపోయిన వారిని, ఎందరో సమాధులను ఔలియాల యొక్క సమాధులు అని, చనిపోయిన వారిని మాత్రమే వలీగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక నియమం తెలుసుకోండి. ఎవరైతే ఇహలోకంలో వలీ అవ్వడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదో, చనిపోయిన తర్వాత వారు వలీ కాజాలరు.
సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.
సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.
రెండవ దుఆ
وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ (వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్) నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.
ఇది చాలా గొప్ప విషయం. ముబారక్, కేవలం పేరు పెట్టుకుంటే ముబారక్ కాజాలరు.
సోదర మహాశయులారా, ఇది కూడా చాలా మంచి దుఆ, చాలా గొప్ప దుఆ. మరియు ప్రవక్తల గురించి అల్లాహ్ త’ఆలా తెలిపినటువంటి ఇది ఒక గొప్ప శుభవార్త. ఈసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్రలో మీరు విని ఉన్నారు,
وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا వ జఅలనీ ముబారకన్ అయ్న మా కున్తు వ అవ్సానీ బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా. “నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు.“ (19:31).
అల్లాహ్ త’ఆలా నన్ను ఎక్కడ ఉన్నా గాని ముబారక్, శుభవంతుడిగా చేశాడు అని ఈసా అలైహిస్సలాం చెప్పారు. ఇమామ్ హసన్ అల్-బస్రీ రహిమహుల్లాహ్ చెబుతున్నారు, అల్లాహ్ త’ఆలా నిన్ను ముబారక్ చేయుగాక, నిన్ను శుభవంతుడిగా చేయుగాక అంటే నీవు ధర్మంపై స్థిరంగా ఉండి ఇతరులకు మంచిని ఆదేశిస్తూ, ఇతరులను చెడు నుండి ఖండిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ నీకు ప్రసాదించుగాక. ఇంత గొప్ప విషయం చూస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో బర్కత్, శుభాలు రావాలంటే ఎలా వస్తాయి? స్వయంగా మనం ఆ బర్కత్, శుభాలు వచ్చేటువంటి విషయాలను పాటించడం మరియు మన చుట్టుపక్కల్లో ఎవరైతే దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వారికి కూడా ప్రేమగా బోధ చేస్తూ ఆ చెడుల నుండి దూరం చేస్తూ వారు కూడా శుభవంతులుగా అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఒకసారి మీరు క్రింది ఈ ఆయత్ను గమనించండి, అల్లాహ్ త’ఆలా చెబుతున్నాడు:
وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ వలవ్ అన్న అహలల్ ఖురా ఆమనూ వత్తఖవ్ ల ఫతహ్నా అలైహిమ్ బరకాతిమ్ మినస్సమాఇ వల్ అర్ద్. ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం (7:96)
గమనిస్తున్నారా? బరకాత్ ఎలా వస్తాయి? ముబారక్ మనిషి ఎలా కాగలుగుతాడు? దానికి కొరకు ఉత్తమ మార్గం అల్లాహ్ త’ఆలా స్వయంగా తెలియజేశాడు. ఆ మార్గాలను మనం అవలంబించాలి, వాటిపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
మూడవ దుఆ
ఇక రండి ఆ తర్వాత మూడవ దుఆ, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటి మూడవ దుఆ? చెబుతున్నారు,
وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్) ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.
మూడు విషయాల ప్రస్తావన ఇక్కడ ఉంది. ఇది మూడవ దుఆ. గమనిస్తున్నారా ఎంత మంచి ఉత్తమమైన దుఆ ఉంది ఇక్కడ? ఏముంది?
వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్. అల్లాహ్ వైపు నుండి మనకు ఏది ప్రసాదించబడినా, దానికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప అనుగ్రహం. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారు? నాకేమున్నది? తిండికి మూడు పూటలు సరిగ్గా తిండి దొరుకుతలేదు. నాకు జాబ్ లేదు. నాకు ఉద్యోగం లేదు. నా పిల్లలు మంచిగా నా యొక్క అడుగుజాడల్లో లేరు. ఈ విధంగా మనం ఓ నాలుగు విషయాలు ఏదో మనకు నచ్చినవి లేవు, ఇక మనకు ఏ మేలూ లేదు అని అనుకుంటాము. తప్పు విషయం. మనం బ్రతికి ఉండడం ఇది అల్లాహ్ యొక్క చాలా గొప్ప వరం. మనం ఆరోగ్యంగా ఉండి ఈ శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము, చూస్తున్నాము, వింటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఇవన్నీ గొప్ప వరాలు కావా? ఇంకా ఇస్లాం యొక్క భాగ్యం మనకు కలిగింది అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ గొప్ప వరం ఏమున్నది? మనం ఉన్న విషయాలను గనక ఒకవేళ ఆలోచిస్తే, వ ఇన్ తఉద్దూ ని’మతల్లాహి లా తుహ్సూహా. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. (16:18). వమా బికూమ్ మిన్ ని’మతిన్ ఫమినల్లాహ్. మీ వద్ద ఉన్న ప్రతి అనుగ్రహం అల్లాహ్ తరఫు నుంచే వచ్చినది. (16:53). అయితే మనం మనలో కృతజ్ఞత భావాన్ని పెంచాలి. ఎందుకంటే కృతజ్ఞత ద్వారా అనుగ్రహాలు పెరుగుతాయి. ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుమ్. అల్లాహ్ వాగ్దానంగా చెబుతున్నాడు, ఒకవేళ మీరు కృతజ్ఞత చూపిస్తే నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. (14:7). మీరు గనక కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ల అజీదన్నకుమ్. ఇంకా అధికంగా నేను మీకు ప్రసాదిస్తాను, మీ యొక్క అనుగ్రహాలను ఇంకా పెంచుతూ పోతాను. అందుకొరకే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి.
కృతజ్ఞత ఎలా చెల్లించాలి? కేవలం థాంక్స్ అంటే సరిపోతుందా? కాదు. ముందు విషయం, మనసా వాచా అన్ని అనుగ్రహాలు కేవలం అల్లాహ్ వైపు నుండే అన్నటువంటి భావన, నమ్మకం, నాలుకతో వాటి ప్రస్తావన ఉండాలి. అయ్యో ఆ గొట్ట కాడికి పోతేనే అయ్యా, మాకు దొరికిండు, మాకు లభించినది అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఫలానా బాబా దగ్గరికి పోతేనే మాకు ఈ ఆరోగ్యం వచ్చింది అని అనుకుంటారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. సంతానం ఇవ్వడం గాని, ఆరోగ్యాలు ఇవ్వడం గాని కేవలం ఒకే ఒక్కడు అల్లాహ్ మాత్రమే ఇచ్చేవాడు. వేరే ఎవరి శక్తిలో లేదు. ఈ అనుగ్రహాలను మనం అల్లాహ్ వైపునకు కాకుండా వేరే వారి వైపునకు అంకితం చేస్తే ఇది షిర్క్లో చేరిపోతుంది. కృతజ్ఞతకు వ్యతిరేకం ఇది.
ఇక కృతజ్ఞత నోటితో ఉంటుంది, ఆచరణతో కూడా ఉంటుంది. అల్లాహ్ ఏం చెప్పాడు? ఇ’మలూ ఆల దావూద షుక్రా. “ఓ దావూదు సంతతివారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి.” (34:13). ఓ దావూదు సంతతివారలారా, మీరు ఇ’మలూ, అమల్ చేయండి షుక్ర్ను ఆచరణ రూపంలో చెల్లించండి, కృతజ్ఞత ఆచరణ పరంగా చెల్లించండి. కృతజ్ఞత ఆచరణ రూపంలో ఎలానండి? ఇలా అంటే ఏ ఏ అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి మనకు లభించినదో దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క విధేయతలోనే ఆ అనుగ్రహాన్ని మనం ఉపయోగించాలి. చెవు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? కళ్ళు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు చేతులు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? అల్లాహ్ ఏ దేని కొరకైతే అవి ఇచ్చాడో వాటి ఆ ఉద్దేశంలోనే వాటిని ఉపయోగించాలి. నేను ఉదాహరణగా ఇవి చెప్పాను. ప్రతి అనుగ్రహం. ఎవరైతే ఈ షుక్రియా, కృతజ్ఞత భావం కలిగి, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారో, అల్లాహ్ వారికి అనుగ్రహాలు పెంచడంతో పాటు వారి యొక్క పుణ్యాలు చాలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అల్లాహ్ షకూర్. ఎవరైతే షుక్రియా అదా చేస్తారో, కృతజ్ఞత చెల్లిస్తారో, వారిని ఆదరణిస్తాడు, వారికి ఎంతో గౌరవం ప్రసాదిస్తాడు. షకూర్, అల్లాహ్ యొక్క దాసులు. అల్లాహ్ త’ఆలా తమ ప్రవక్తల్లో కొందరిని అబ్దన్ షకూరా, ఇతడు నా దాసుడు, కృతజ్ఞత చెల్లించేవాడు అని ప్రశంసించాడు. ఇంకా ఈ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండడం ద్వారా అల్లాహ్ యొక్క ప్రియమైన, తక్కువ దాసులు ఎవరైతే ఉంటారో, వారిలో మనం చేరిపోతాము.
హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి గురించి వస్తుంది. ఒక సందర్భంలో ఆయన, ఓ అల్లాహ్ నీ యొక్క తక్కువ దాసులలో నన్ను చేర్చుకో అని దుఆ చేశారట. పక్కన ఎవరో విన్నవారు, ఏంటి ఇలా దుఆ చేస్తున్నారు మీరు అంటే, ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడు? వ ఖలీలుమ్ మిన్ ఇబాదియష్ షకూర్. నా యొక్క కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. (34:13). అల్లాహ్ త’ఆలా ఆ కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.
రెండవది ఏమిటి? ఇజబ్తులియ సబర్. ఉబ్తులియ. ఏదైనా బలా, ఆపద, కష్టం, పరీక్ష వచ్చింది, ఓపిక సహనం వహించాలి. సోదర
మహాశయులారా, షుక్ర్, సబ్ర్ ఇవి రెండు ఎంత పెద్ద అనుగ్రహాలో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసు ఉంది, ఇన్న అమ్ రల్ ము’మిని అజబ్. విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతగా ఉంది. మరియు ఈ విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు. అతడు అన్ని స్థితుల్లో కూడా మేలు, ఖైర్, మంచినే పొందుతాడు. అల్లాహ్ అతనికి ఏదైనా అనుగ్రహించాడు, అసాబతుస్సర్రా, షకర్. అతను కృతజ్ఞత చెల్లిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అదే అతని కొరకు మేలు అవుతుంది. వ ఇజా అసాబతుద్దర్రా. ఒకవేళ అతనికి ఏదైనా కీడు, ఏదైనా నష్టం వాటిల్లింది, సబర్. అతను సహనం వహిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అతనికి మేలు జరుగుతుంది. ఈ మేలు విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు అని చెప్పారు.
సబ్ర్ అన్నది, సహనం అన్నది పుణ్య కార్యాలు చేస్తూ పాటించాలి. ఇది చాలా అవసరం. ఉదాహరణకు తౌహీద్ పై ఉండడం, ఇది గొప్ప పుణ్య కార్యం. నమాజు చేయడం, ఉపవాసాలు పాటించడం, ఇందులో కూడా సహనం అవసరం ఉంటుంది. పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అవును, ఎలా? మనకు ఒక పాప కార్యం చాలా ఇష్టంగా ఉంటుంది, అది అల్లాహ్కు ఇష్టం లేదు. దాన్ని మనం వదులుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో మన చేతుల్లో మొబైల్ ఉంటుంది. పాటలు వినడం గాని, ఏదైనా ఫిలిములు చూడడం గాని, నగ్న చిత్రాలు చూడడం గాని, ఎన్నెన్నో అనవసరమైన వీడియోలు వస్తూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్తారు, టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము అని అనుకుంటారు, కానీ అది వారి యొక్క టైం ఫెయిల్ అవుతుంది. వారి యొక్క కర్మ పత్రాల్లో పాపాలు రాయబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాం. ఈ విధంగా పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం, ఓపిక చాలా అవసరం ఉంటుంది.
మూడవ విషయం, సబ్ర్, సహనం అన్నది అల్లాహ్ వైపు నుండి ఏవైనా ఆపదలు వచ్చేసాయి. అంటే అనారోగ్యానికి గురయ్యారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారా? సంతానం ఏదైనా మీకు చాలా ఇబ్బందిలో పడవేస్తున్నారా? మీ యొక్క పంట పొలాలు గిట్ల ఏవైనా నష్టంలో పడ్డాయా? మీ యొక్క వ్యాపారం ఏదైనా మునిగిపోయిందా? అందులో ఏదైనా లాస్ వచ్చేసిందా? మీ యొక్క జాబ్ పోయిందా? ఏ ఆపద అయినా గాని, ఏ కష్టమైనా గాని తూఫానీ గాలి వచ్చింది, ఇల్లు పడిపోయింది. ఇలాంటి ఏ ఆపద అయినా గాని సహనం వహించాలి. సహనం అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా. సహనం అన్నది కష్టం, ఆపద యొక్క ప్రారంభంలో నుండే మొదలవ్వాలి. రోజులు గడిచిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక సరే మంచిది ఇక సహనం చేద్దాం, ఓపిక వహిద్దాం, ఇది సహనం అనబడదు. ఈ సహనం వల్ల కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వద్ద స్థానాలు చాలా పెరుగుతాయి. ఇన్నమా యు వఫ్ఫస్సాబిరూన అజ్ రహూమ్ బిగైరి హిసాబ్. నిశ్చయంగా సహనం పాటించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. (39:10).
ఇక మూడవది ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్. ఏదైనా పాపం జరిగితే ఇస్తిగ్ఫార్ చేయాలి, అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, షుక్ర్, సబ్ర్, ఇస్తిగ్ఫార్. ప్రవక్తల యొక్క ఉత్తమ గుణాలు, పుణ్యాత్ముల యొక్క ఉత్తమ గుణాలు. ఇది మనం పాటించాలి. సూర ఆలి ఇమ్రాన్లో చూడండి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?
وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ వల్లజీన ఇజా ఫఅలూ ఫాహిషతన్ అవ్ జలమూ అన్ఫుసహుమ్ జకరుల్లా ఫస్తగ్ఫరూ లి జునూబిహిమ్. మరియు వారు ఏదేని నీచ కార్యానికి పాల్పడినపుడు గానీ, తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నపుడు గానీ వెంటనే అల్లాహ్ను స్మరించి తమ పాపాల క్షమాపణ కొరకు వేడుకుంటారు. (3:135).
వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది, అశ్లీల కార్యం జరిగింది, ఏదైనా వారు తమపై అన్యాయం చేసుకున్నారు అంటే వెంటనే అల్లాహ్ను గుర్తు చేసుకొని అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటారు. ఈ ఉత్తమ గుణం రావాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి పాపం చేయని వారు. అయినా ఒక్కొక్క సమావేశంలో వంద వంద సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. అంతే కాదు సహీ ముస్లిం, సహీ బుఖారీ లోని హదీసు, యాఅయ్యుహన్నాస్, ఓ ప్రజలారా తూబూ ఇలల్లాహి వస్తగ్ఫిరూ. అల్లాహ్ వైపునకు మరలండి, పాపాల నుండి క్షమాపణ కోరుకోండి. నేను అల్లాహ్తో 70 సార్ల కంటే ఎక్కువగా, (మరో ఉల్లేఖనంలో) 100 సార్ల కంటే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. ప్రవక్తకు అవసరమే లేదు కదా? ఎందుకంటే ఆయన పాప రహితుడు, రసూలుల్లాహ్. అయినా గాని అంత క్షమాపణ కోరుతున్నారంటే మనకు ఈ అవసరం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే అల్లాహ్ త’ఆలా పుణ్యాత్ముల యొక్క గుణం సూర నిసాలో ఏం తెలిపాడు? వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది అంటే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. ఇన్నమత్తవ్బతు అలల్లాహి లిల్లజీన య’మలూ నస్సూఅ బిజహాలతిన్. ఏదో పొరపాటున, అశ్రద్ధగా, తెలియనందువల్ల. బిజహాలతిన్, పొరపాటు జరిగింది. వెంటనే ఫస్తగ్ఫరూ, వెంటనే వారు అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటారు. అందుకు ఇక ఎవరైతే పొరపాట్లపై పొరపాట్లు, పాపాలపై పాపాలు చేసుకుంటూ పోతారో, అలాంటి వారిని నేను క్షమించను వ లైసతిత్తవ్బతు అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.
అందుకొరకే షుక్ర్తో జీవితం గడపండి. ఆపద వస్తే సహనం వహించండి. మరియు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎప్పుడు జరిగినా గాని, ఎంత పెద్దది జరిగినా గాని వెంటనే అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ కోరుతూ ఉండండి.
ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్?
ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్ వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
ఈ మూడు మనిషి యొక్క సౌభాగ్యానికి, అదృష్టానికి గొప్ప చిహ్నం, గొప్ప గుర్తు. అల్లాహు అక్బర్. అందుకొరకు మనం కూడా భాగ్యవంతుల్లో చేరాలి, మనం కూడా అదృష్టవంతుల్లో చేరాలి అంటే తప్పకుండా ఏం చేయాలి? షుక్ర్, సబ్ర్ మరియు ఇస్తిగ్ఫార్.
అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ ఈ పాఠాలు ఇంకా ముందుకి మనం వింటూ ఉంటాము. మరియు ఇలాంటి పుస్తకాలు తప్పకుండా మీరు చదువుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దయ గలిగితే ఈరోజే లేకుంటే రేపటి వరకు దీని యొక్క PDF కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంతే కాదు అల్లాహ్ యొక్క దయ గలిగితే ఒక షార్ట్ వీడియో, మూలం, మతన్ అని ఏదైతే అంటారో ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారిది, అది కూడా మీకు పంపించే ప్రయత్నం ఇన్షాఅల్లాహ్ చేస్తాను. అయితే ఈనాటి పాఠంలోని మతన్, మూలం ఏమిటి?
وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ (వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్) నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.
وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్, వ ఇజబ్తులియ సబర్, వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్, ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్) ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
అర్థమైంది కదా? అల్లాహ్తో నేను అర్ధిస్తున్నాను. ఆ అల్లాహ్ యే పరమదాత మరియు మహోన్నత సింహాసనానికి ప్రభువు. ఏమని అర్ధిస్తున్నారు? నిన్ను ఇహపరలోకాల్లో వలీగా చేసుకొనుగాక. నీవు ఎక్కడా ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేసుకొనుగాక. ఇంకా ఏదైనా నీతో, ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
ఇక ఈ దుఆల యొక్క వివరణ నేను మీకు ఇచ్చాను ఈనాటి క్లాస్లో. ఇక రేపటి క్లాస్లో హనీఫియత్, మిల్లతి ఇబ్రాహీమీ అంటే ఏమిటి అది తెలుసుకుందాము. ఆ తర్వాత అల్లాహ్ యొక్క దయతో ఆ నియమాలు ఏమిటో అవి కూడా ఇన్షాఅల్లాహ్ ఇంకా ముందు క్లాసులో తెలుసుకుంటూ ఉందాము.
జజాకుముల్లాహు ఖైరా, వాఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఖుర్ఆన్ యొక్క హక్కులు – ఒక పరిచయం
ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.
మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను
ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు: విశ్వాసం (ఈమాన్)
మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.
ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)
దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.
అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.
ఖుర్ఆన్ సంరక్షణ బాధ్యత అల్లాహ్ దే
ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ (ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్) నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)
మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.
సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ (జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్) ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)
ముగింపు
అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.
కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్. అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఖురాన్ అంటే ఏమిటి?
قُرْآن كَلَامُ الله (ఖురాన్ కలాముల్లాహ్) ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.
ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.
అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.
ఖురాన్ అవతరణ విధానం
జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.
అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.
‘ఖురాన్’ పదం యొక్క అర్థం
ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్లో ఇలా తెలియజేశాడు:
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ (తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్) ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది. (39:1)
ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:
شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)
రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.
ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.
ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తులు), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల యొక్క ఉన్నత స్థానం మరియు ప్రత్యేకతలను వివరిస్తారు. సాధారణ స్త్రీల కంటే వారి స్థాయి ఎంతో ఉన్నతమైనదని, అల్లాహ్ వారిని ప్రత్యేకంగా ప్రవక్త కోసం ఎంపిక చేశారని ఖురాన్ ఆయతుల ఆధారంగా తెలియజేస్తారు. వారు విశ్వాసులందరికీ తల్లులని, ప్రవక్త మరణానంతరం వారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేస్తారు. వారి సత్కార్యాలకు రెండింతల పుణ్యం లభిస్తుందని మరియు అల్లాహ్ వారిని అన్ని రకాల మాలిన్యాల నుండి పరిశుభ్రపరిచాడని వివరిస్తారు. ఈ ప్రపంచంలోనే కాక, స్వర్గంలో కూడా వారు ప్రవక్త భార్యలుగానే ఉంటారనే గౌరవాన్ని కూడా ప్రస్తావించారు.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతలు) యొక్క ఘనత
ఉమ్మహాతుల్ ము’మినీన్ అందరి ఘనత, ప్రత్యేకత. ఉమ్మహాతుల్ ము’మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమూనా రదియల్లాహు అన్హా వరకు, వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు.
ఉమ్మహాతుల్ ము’మినీన్, వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు. వారి ప్రత్యేకత ఇది. ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు. ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్ లో కొంచెం వివరంగా ఉంటుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ (యా నిసాఇన్ నబియ్యి లస్తున్న కఅహదిమ్ మినన్ నిసా) ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. (33:32)
గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీలు కారు , వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైనా, తాబయీన్లు, ముహద్దసీన్లు, సామాన్య ప్రజలు, ఎవరైనా సరే, ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత, అలాగే ఇతరుల వారు సమానులు కారు. ఇది వారి ప్రత్యేకత.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకే ఎంపిక చేయబడ్డారు
అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని, ఉమ్మహాతుల్ ము’మినీన్లని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! (33:52)
ఓ ప్రవక్తా! ఇక, అంటే మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, ఉమ్మహాతుల్ ము’మినీన్, 11 మంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమూనా బిన్తె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆదేశం ఇచ్చాడు. ఓ ప్రవక్తా! ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు, ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీ కోసం ఎంపిక చేశాను, ఇక నీకు అనుమతి లేదు. ఇక తర్వాత ఏ స్త్రీని అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ప్రసాదించాడు.
విశ్వాసులందరికీ తల్లులు
మూడవది, వారు ఉమ్మహాతుల్ ము’మినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత.
النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. (33:6)
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తర్వాత వారితో వివాహం నిషిద్ధం
ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ము’మినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మనకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ము’మినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు, ఈ విషయం చెప్పింది ఇప్పుడు.
وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا (వలా అన్ తన్కిహు అజ్వాజహూ మిమ్ బ’అదిహీ అబదా) అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. (33:53)
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది.
స్వర్గంలో కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) భార్యలే
ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు.
ఆరవ ప్రత్యేకత, ఆయతె తఖ్ఈర్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్లను ఒక సందర్భంలో రెండు అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా? పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా?
అల్లాహ్ ఈ ఆయతును సెలవిచ్చాడు సూరహ్ అహ్జాబ్ లోనే.
يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –(33:28)
ప్రపంచం కోరుకుంటే, ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో కొంత మొత్తం నేను ఇచ్చేస్తాను, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే.
وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا “కాని ఒకవేళ అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.” (33:29)
ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా, అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లలో అందరూ, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లో అందరూ ఉమ్మడిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే.
అల్లాహ్ చే పరిశుద్ధులుగా చేయబడ్డారు
ఉమ్మహాతుల్ ము’మినీన్లను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని షిర్క్ నుండి, షైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.(33:33)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది, ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత.
సత్కార్యాలకు రెండింతల పుణ్యం
ఇక ఎనిమిదవది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్య కార్యం ఏది చేసినా వారికి రెండింతల పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. రెండింతల పుణ్యం.
అల్లాహ్ సెలవిచ్చాడు:
وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا మరి మీలో ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.(33:31)
మీలోని వారు అల్లాహ్ కు విధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, మంచి పనులు చేస్తారో, సదాచారాలు చేస్తారో, సత్కార్యాలు చేస్తారో, మేము రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాము. గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటంటే, వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత.
వారి గృహాల ప్రస్తావన
అలాగే, వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్ తో చేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్ తో చేశాడు. అదే సూరా 34వ ఆయత్.
وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.(33:34)
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మృదు స్వభావి, అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల ఇండ్ల ప్రస్తావన ఖురాన్ పారాయణం మరియు హిక్మత్, ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలీ అయినా, వహీ ఖఫీ అయినా, ఖురాన్ మరియు హిక్మత్ తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు, ఇది వారి ప్రత్యేకత.
అలాగే, స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు. ఓ దైవ ప్రవక్తా, స్వర్గంలో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఏ సతీమణి స్వర్గంలో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే, దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయతుల ఆధారంగా, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా, భార్యలుగా ఉన్నారో, స్వర్గంలో కూడా వారు మహా ప్రవక్తకి సతీమణులుగానే ఉంటారు.
అభిమాన సోదరులారా! ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ము’మినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.
అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.
అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.
మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్ని రాసిపెట్టాడు.
కష్టాలు ఎదురైనప్పుడు పాటించవలసిన విషయాలు
మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:
నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.
సహనం యొక్క గొప్పతనంపై హదీస్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).
إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ (ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ) పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.
గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.
మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:
وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ (వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్) మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.
ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.
ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:
فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ (ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్) ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.
ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.
కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.
ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,
وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ (వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్) అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.
దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.
శుభవార్త మరియు హెచ్చరిక
అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?
శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.
ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.
అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.
ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.
رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ (రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్) మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)
అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?
لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ (లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్) ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)
ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.
ప్రవక్తలలో ప్రథముడు మరియు అంతిముడు
ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.
ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:
إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ (ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).
అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.
ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.
అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.
وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ (వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్) అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)
అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.
ప్రవక్తలందరి సందేశం
ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?
يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ (య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్) కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు
وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ (వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్) మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.
ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.
ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا (వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా) ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)
ఆ ప్రవక్త తమ జాతి వారికి:
أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ (అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్) అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)
అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.
పాఠం యొక్క సారాంశం
ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.
ఈ తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.
واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته (వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి https://teluguislam.net/2023/04/19/u3mnj/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వ్యభిచారం (జినా) యొక్క నిషేధం గురించి, దాని తీవ్రత, అది దారితీసే మార్గాలను ఇస్లాం ఎలా నిరోధిస్తుంది, మరియు ఈ పాపానికి పాల్పడిన వారికి ప్రపంచంలో మరియు మరణానంతరం విధించబడే కఠిన శిక్షల గురించి చర్చించబడింది. హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత, చూపులను అదుపులో ఉంచుకోవడం, మరియు ఒంటరిగా పర స్త్రీ-పురుషులు కలవడాన్ని ఇస్లాం ఎందుకు నిషేధించిందో వివరించబడింది. వివాహితులు మరియు అవివాహితులు చేసే వ్యభిచారానికి గల శిక్షలలో తేడా, వృద్ధాప్యంలో ఈ పాపానికి పాల్పడటం యొక్క తీవ్రత, మరియు పేదరికాన్ని కారణంగా చూపి ఈ పాపంలో మునిగిపోవడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టం చేయబడింది. ఆధునిక సమాజంలో వ్యభిచారానికి దారితీసే కారణాలను వివరిస్తూ, ఈ చెడు నుండి దూరంగా ఉండేందుకు అల్లాహ్ను ప్రార్థించడం జరిగింది.
ఇక రండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి, ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ నిషేధాల్లో అనేకమంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము. అది వ్యభిచారం.
ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ త’ఆలా సూరత్ బనీ ఇస్రాయీల్ ఆయత్ నంబర్ 32 లో తెలిపాడు,
وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا “వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం” (17:32)
వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇక్కడ గమనించండి ఆయతులో ‘లా తఖ్రబు’ అని చెప్పబడింది. ‘లా తజ్నూ’ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ గా చెప్పలేదు. ‘లా తఖ్రబు’ అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకండి.
నిశ్చయంగా అది అతి దుష్టకార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం. షేక్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు. ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది? ఎందుకు దీనిని అశ్లీలం, అతి దుష్టకార్యం అని చెప్పడం జరిగింది? అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్స్ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము.
సర్వసామాన్యంగా వ్యభిచారానికి పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల. అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది. దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది.
హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత
ఈ మార్గాలను, వ్యభిచారం వరకు చేర్పించే సాధనాలను ఏదైతే మూసివేశాడో, వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ త’ఆలా హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు, పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా, రెడ్ లైన్ గా, రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోదీ మీడియా అనండి లేదా స్వార్థపరులైన పత్రికా రిప్రజెంటేటివ్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికే లేదు వారికి, ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు, అస్తగ్ఫిరుల్లాహ్.
ఇక్కడ చూడండి, సూరతుల్ అహ్ జాబ్, సూరా నంబర్ 33, ఆయత్ నంబర్ 53. అలాగే సూరతుల్ అహ్ జాబ్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే,
فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَاۤءِ حِجَابٍ (ఫస్ అలూహున్న మివ్ వరా’ఇ హిజాబ్) “పరదా వెనుక ఉండి అడగాలి.” (33:53)
హిజాబ్ వెనుక ఉండి అడగాలి. ముంగటగా అటు ఒక స్త్రీ ఉంది, ఇటు నేను ఉన్నాను, డైరెక్ట్ గా అడగకూడదు. ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి, పరదా ఉండాలి, హిజాబ్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ‘ఫస్ అలూహున్న’ అనేది అమ్ర్ (ఆర్డర్, ఆదేశం). అంతేకాకుండా ‘మివ్ వరా’ఇ హిజాబ్’ అని చెప్పాడు అల్లాహ్ త’ఆలా. ఇది డైరెక్ట్ ఆదేశమే ఉన్నది. ఇక ఖుర్ఆన్లో ఎక్కడా కూడా పరదా ఆదేశం లేదు అని అంటారు? ఇది వారి యొక్క అజ్ఞానం. వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం.
అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఆయత్ నంబర్ 59 లో కనబడుతుంది. అక్కడ అల్లాహ్ త’ఆలా అంటున్నాడు,
قُلْ (ఖుల్) “ఓ ప్రవక్త, మీరు చెప్పండి.” (33:59)
వారికి ఆదేశం ఇవ్వండి. ఎంత స్పష్టంగా ఉంది! చెప్పండి, ఆదేశం ఇవ్వండి,
ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము? మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్లాలంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? సూరతున్ నూర్, ఆయత్ నంబర్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది.
మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు, కానీ మాట వచ్చింది గనుక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను. ఇవి సరిపోతాయి, మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాఅల్లాహ్ తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ‘సాధనాలను’ అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో, దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి ఒక వీడియో మీకు ఇన్షాఅల్లాహ్ ఓపెన్ అవుతుంది.
వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను, అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు. చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి, మితిమీరి వ్యభిచారానికి పాల్పడ్డాడంటే, ఇక వారికి శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది, ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని.
వ్యభిచారానికి శిక్షలు
శ్రద్ధగా వినండి. వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం. అతను చనిపోయేవరకు అతనిపై రాళ్లు రువ్వబడాలి. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి. అతని శరీరము యొక్క ప్రతీ భాగం, అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో, అలాగే ఈ శిక్ష ద్వారా బాధను, నొప్పిని అనుభవించాలి. ఇది ఎవరి కొరకు? వివాహితుడైన, పెళ్లి అయిన తర్వాత భార్యతో అతడు సంసారం చేసేసాడు, ఆ తర్వాత మళ్లీ వ్యభిచారానికి పాల్పడ్డాడు, అలాంటి వానికి ఈ శిక్ష.
కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువ. ఇక్కడ వివాహం కాని యువకుడు, యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద కొరడా దెబ్బల శిక్ష, ఇది చాలా ఎక్కువ సంఖ్య, ఈనాటి ఈ పాపానికే విధించబడినది.
అంతేకాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. ఇది ప్రాపంచిక శిక్ష.
చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహితునికైనా, వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మనం సామాన్య మనుషులం, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు. ఒక ప్రభుత్వం, అధికారం చేతిలో ఉన్నవారు ఈ శిక్షను విధిస్తారు.
సమాధిలో శిక్ష
ఇక రండి, ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు, శిక్ష పడలేదు, అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి.
పైన ఇరుకుగా, కింద వెడల్పుగా ఉండే కుండ లాంటి ఆవంలో వారు నగ్నంగావేయబడతారు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మ అజిర్నా మిన్హు. ఓ అల్లాహ్ మమ్మల్ని రక్షించు ఇలాంటి పాపాల నుండి, ఇలాంటి శిక్షల నుండి. దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది. అందులో జ్వాలలను ప్రజ్వలింప జేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు. కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు. ఇలా పైకి రావడం, జ్వాలలు ఎగిరినప్పుడు, అవి చల్లారినప్పుడు కిందికి పోవడం, అగ్నిలో కాలుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు.
క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష, ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే మాటేనా? కానీ ప్రపంచ వ్యామోహంలో పడి, స్త్రీల యొక్క ఫితనాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు. ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.
వృద్ధాప్యంలో చేసే పాపం యొక్క తీవ్రత
పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు? మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ, అల్లాహ్ శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తౌబా కొరకు, అల్లాహ్ తో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునిగి తేలుతున్నప్పుడు. ఏంటి ఆ విషయం? వినండి హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).
గమనించారా? వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే, అల్లాహ్ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి.
వ్యభిచారం ద్వారా సంపాదన
సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).
ఇక దీని గురించి మరొక విషయం, సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అయితే అలాంటి సంపద చాలా చెడ్డది. ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో, అర్ధరాత్రి ఆకాశ ద్వారాలు తెరువబడే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క దుఆలను అంగీకరించే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క రోదనలను, వారి యొక్క ఆర్ధింపులను వింటున్న సమయాన ఆ వ్యభిచారి యొక్క దుఆ స్వీకరించబడదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా. అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసికోవాలి.
ఇక పేదరికం, అవసరం కొందరంటారు కదా, పేదరికం ఉన్నది, ఎక్కడా మాకు ఏ మార్గం లేదు, మా బ్రతుకు తెరువు ఎలా గడవాలి, మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము, అందుకొరకే ఈ చెడుకు పాల్పడ్డాము. అయితే, పేదరికం, అవసరం అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంతమాత్రం ధార్మిక సబబు కావు. అరబ్బుల్లో జాహిలియ్యత్ లో, ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది, “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.
ముగింపు
నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పరదా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడటం, స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు, నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యా గృహాలు లైసెన్సులు ఇచ్చి తెరువబడుతున్నాయి, అల్లాహు అక్బర్. ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయని. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి, అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి, అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.
ఓ అల్లాహ్, మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధపరచి, మా మానాలను కాపాడుము, మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము. ఆమీన్. అందుకొరకే దుఆ చేసుకుంటూ ఉండాలి.
اَللّٰهُمَّ طَهِّرْ قُلُوْبَنَا (అల్లాహుమ్మ తహ్హిర్ ఖులూబనా) ఓ అల్లాహ్ మా హృదయాలను శుద్ధిపరచు
اَللّٰهُمَّ أَحْصِنْ فُرُوْجَنَا (అల్లాహుమ్మ అహ్సిన్ ఫురూజనా) మా మర్మాంగాలను కాపాడు.
ఓ అల్లాహ్ మా చూపులను మేము కిందికి వాలించి, కిందికి వేసి ఉండే విధంగా మాపై ఎల్లప్పుడూ భాగ్యం ప్రసాదించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.
మూత్ర తుంపరల నుండి జాగ్రత్త
ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.
అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)
ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.
ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.
ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?
ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.
మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.
ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.
అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ (అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్) “అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).
మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.
ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.
ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.