ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి :

ఉపద్రవానికి మూలం: ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్థుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూద వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపకింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇత్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది. 

‘అఖీదయే తహావీయ’ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు:

“రఫ్ద్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌల్ వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తనను ఒక మహా సాత్వికునిగా, దుష్ట శిక్షకు శిష్టరక్షణకు నడుం బిగించిన వానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా అసంతృప్త వాదాన్ని వ్యాపింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. దరిమిలా ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు)అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని కుత్సితబుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్‌ ఖైస్’కు పలాయనం చిత్తగించాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.” 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. వారి హృదయాలు భగ్న హృదయాలైపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నిగిల్లిపోయింది. అప్పటి వరకూ అణగిమణగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాపింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరణిని అవలంబించదలచిన వారు అశక్తులైపోయారు. అందువల్ల వారంతా ఖిలాఫతకు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవాగ్ని రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత, సంఘఠితత్వం సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్లూను కోలేక పోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవనవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్చిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్ధపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.”

(మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305) 

ఇకపోతే హజ్రత్ అలీ, ముఆవియా (రదియల్లాహు అన్హుమ్)ల యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీ (కారణం)ని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు: 

ముఆవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్దానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఆవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి – తానొక ఖలీఫా కావటం చేత ముఆవియ మరియు ముఆవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. తమ వద్ద శక్తి ఉంది. అధికార బలం ఉంది. అయినప్పటికీ వారు మాట వినటం లేదు. కాబట్టి వారితో యుద్ధం చేసి, వారిని దారికి రప్పించాలి. తద్వారా వారు ఖలీఫాకు విధేయులవుతారు. ఆ విధంగా ముస్లింల సామూహిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది – ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన. కాగా; హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది : తాము అలీ (రదియల్లాహు అన్హు)చేతులపై ‘ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయటంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై జులుంకు ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి మనకు న్యాయం చేసే ప్రతిభావంతుడైన ఖలీఫా చేతుల మీద మాత్రమే మనం బైఅత్ (ప్రతిజ్ఞ) చేయాలి.” 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)మధ్య పొడసూపిన విభేదాలు, అంతఃకలహాల ఫలితంగా జరిగిన యుద్ధాలు – ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది. 

ఒకటి : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ రగడపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారిలా వేడుకుంటూ ఉంటారు: 

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయా లలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ :10) 

రెండు: సహాబా (ప్రవక్త సహచరులు రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం. దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి : 

మొదటి పద్దతి: 

అలాంటి కథనాల (ఆసార్)లో కొన్ని పచ్చి అబద్దాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలవి. 

రెండవ పద్ధతి: 

సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులుచేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్దం పాళ్ళు అధికం. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. 

మూడవ పద్ధతి: 

ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి, అలాంటివి చాలా తక్కువే. ఈ విషయంలో మటుకు ప్రవక్త సహచరులు అశక్తులు, క్షంతవ్యులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇత్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు ‘ముజ్తహిద్’ లు (సమకాలీన సవాళ్ళను షరీఅత్ బద్దంగా అన్వయించటానికి శాయశక్తులా కృషిచేసిన విజ్ఞులు). ఈ అన్వయింపు ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకూ చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ – వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ – చిత్తశుద్దితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది

న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తిహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండింతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం) 

నాల్గవ పద్ధతి: 

ప్రవక్త సహచరులు (సహాబా రదియల్లాహు అన్హుమ్) కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి 

1. బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! తప్పులు ఎన్ని జరిగి ఉన్నాసరే, పశ్చాత్తాపం (తౌబా) వాటిని రూపుమాపుతుంది. 

2. ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ : 114) 

3. వారి పుణ్యకార్యాలు వేరితరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరయినా ఒక ‘ముద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక! 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ధర్మవేత్తల నమ్మకం (అఖీదా) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు, పవిత్రులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరయినా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం (తౌబా) ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని క్షమిస్తాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చారో, మరెవరయితే దానిని సత్యమని ధ్రువీకరించారో అటువంటివారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు). (అజ్ జుమర్ : 33-35)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది : 

తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. (అల్ అహ్ ఖాఫ్ : 15,16) 

(మజ్మూల ఫతావా : 35/69)

ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబా వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంట గలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమయిన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తగు ఆధారాలు, నిదర్శనాలు లేకుండానే – కేవలం తమ మనోవాంఛలకు లోబడి – స్వార్థపరుల, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో – ఇస్లాం యొక్క గొప్ప చరిత్రపట్ల, తొలికాలపు మహనీయుల పట్ల లేనిపోని దురనుమానాలను నూరిపోస్తున్నారు. ఆ విధంగా వారిలో ఇస్లాం పట్ల ఏవగింపును కలిగించి, ముస్లిం సముదాయంలో చీలికను తీసుకురావాలని, తొలికాలపు సజ్జనుల పట్ల చివరి కాలపు ప్రజలలో ద్వేషాన్ని, వైషమ్యాన్ని రగుల్గొల్పాలని చూస్తున్నారు. దీనికి బదులు వారు తొలికాలపు సత్పురుషుల అడుగుజాడలలో నడచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది! అలాంటి సద్భావన కలిగి ఉండే వారిని అల్లాహ్ సయితం శ్లాఘిస్తాడు. ఉదాహరణకు – 

వారి తరువాత వచ్చిన వారు (తమ పూర్వీకులను గురించి) ఇలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగినవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ : 10) 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు 

(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు: 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి. 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు – 

“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం) 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు. 

ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా – 

”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం) 

తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు : 

“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.”
(ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్) 

ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:

“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.” 

అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :

“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”

ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :

“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389) 

(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు : 

మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100) 

కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115) 

‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు: 

“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.” 

ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి. 

సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది. 

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు. 
  2. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు. 
  3. అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు. 

మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక! 

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు. 

దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు. 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు నిలకడ [వీడియో]

బిస్మిల్లాహ్

[9: 55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో]

బిస్మిల్లాహ్

[55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

సహాబా

పరలోక చింతన (Fikr-e-Akhirat) [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

పరలోక చింతన (Fikr-e-Akhirat)
https://www.youtube.com/watch?v=H8KcdaHAgEE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు)

ఈ ప్రసంగంలో, వక్త పరలోక చింతన (ఆఖిరత్ కా ఫిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సూరా అల్-హషర్ మరియు సూరా అల్-హజ్ నుండి ఖురాన్ వచనాలను ఉటంకిస్తూ, విశ్వాసులు రేపటి కోసం (పరలోకం కోసం) ఏమి సిద్ధం చేసుకున్నారో ఆలోచించాలని మరియు అల్లాహ్‌కు భయపడాలని (తఖ్వా) గుర్తుచేస్తారు. తఖ్వా యొక్క నిజమైన అర్ధాన్ని వివరించడానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను ఉదాహరణగా చూపిస్తారు. పాపాలు మరియు ప్రాపంచిక ప్రలోభాలు నిండిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడమే తఖ్వా అని వివరిస్తారు. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు ఇస్తూ, వారు ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తారు. ఆధునిక ముస్లింలు ‘వహన్’ (ప్రపంచ ప్రేమ మరియు మరణ భయం) అనే వ్యాధితో బాధపడుతున్నారని, ఇది వారి బలహీనతకు కారణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకిస్తారు. ఇహలోక జీవితం తాత్కాలికమని, పరలోక జీవితమే శాశ్వతమైనదని మరియు శ్రేష్ఠమైనదని ఖురాన్ మరియు కవిత్వం ద్వారా ప్రసంగాన్ని ముగిస్తారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్‌ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

అల్హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బஃదా అమ్మా బஃద్. ఫ అఊదు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమదిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
(యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫీ మౌదయిన్ ఆఖర్

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవు సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు.” (2:32)

రబ్బిష్రహ్లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ, అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా.

తొలగింపబడిన షైతానుకు ఎక్కిన రక్షింప ఉందుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకే అంకితము. ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచి మరియు వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్య మూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో, వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.

సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో 59వ సూరా, సూరా అల్-హషర్, వాక్య నెంబర్ 18లో అల్లాహ్ త’ఆలా ఇలా అంటున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ

విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.” (59:18)

ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ రెండుసార్లు ‘యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్’ – ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని చెబుతూ, తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ మరియు ప్రతీ వ్యక్తి రేపటి కోసం తాను ఏమి తయారు చేసుకున్నాడో దాని గురించి చూసుకోవాలని చెప్పి, దాని తర్వాత మరొక్కసారి అల్లాహ్ తబారక వ త’ఆలా ఒకే వాక్యంలో రెండుసార్లు ‘ఇత్తఖుల్లాహ్’ అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి, రెండుసార్లు తఖ్వా గురించి ప్రస్తావించడం జరిగింది.

అమీరుల్ మోమినీన్ హజ్రతే ఉమర్ ఫారూఖ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు, “తఖ్వా అంటే ఏమిటి?”. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తున్నారు, “ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్?” ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, మీరు మీ జీవితంలో ముళ్ల కంచెలతో నిండి ఉన్నటువంటి ఎక్కడైనా ఒక ఇరుకైనటువంటి మార్గము గుండా మీరు పయనించారా?” అని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారిని అడిగారు. అప్పుడు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు అన్నారు, “ఖాల బలా”, నేను అటువంటి మార్గంపై నడిచాను. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ నువ్వు అటువంటి మార్గంపై నడిచినట్లయితే, “ఫమా అమిల్త?” నువ్వు అటువంటి మార్గంపై నడిచినప్పుడు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి అంటే, హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “షమ్మర్తు వజ్తహత్తు”, నేను చాలా కష్టపడ్డాను, చాలా జాగ్రత్తగా నా యొక్క వస్త్రాలు, నా యొక్క బట్టలు వాటికి అంటకుండా, ముళ్ల కంచెలకు తగలకుండా నేను చాలా జాగ్రత్తగా దానిలో నుంచి బయటకు వచ్చేసానని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు జవాబు పలుకుతున్నారు. ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “ఫదాలికత్ తఖ్వా”, ఇదే తఖ్వా అంటే.

కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ ముళ్ల కంచెలు అంటే మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి మహాపాపాలు మరి అదే విధంగా అశ్లీలమైనటువంటి కార్యాలు, మరి ఈ ఇరుకైనటువంటి సందు ఏమిటంటే మన జీవితం సోదరులారా, మరి మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పనులు మరి అదే విధంగా మహాపాప కార్యాల నుండి మనల్ని మనము అదే విధంగా మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకుంటూ బయటకు వెళ్లిపోవటమే తఖ్వా.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరా అల్-హషర్ 59వ సూరాలో 18వ వాక్యంలో ఒకే వాక్యంలో రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు: య్యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ – ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు భయపడండి దేని గురించి? వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ – అంటే రేపటి కోసం అంటే మీరు పరలోకం కోసం ఏమి తయారు చేసుకున్నారో ఆ విషయంలో మీరు భయపడండి. మరి దాని తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా మళ్ళీ అంటున్నాడు: వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా త’మలూన్ – ఈ ఇహలోకంలో మీరు ఏం చేస్తున్నారో అల్లాహ్ తబారక వ త’ఆలా దాని గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని ఇటు ఇహలోకము, అటు పరలోకము, ఈ రెండు విషయాల్లో కూడా ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా రెండుసార్లు తఖ్వా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది.

సూరా అంబియా, 21వ సూరా, ఒకటో వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా మరోచోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ
ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. (21:1)

మానవుల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.

ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు పరలోక చింతనను కలుగజేస్తూ, పరలోకం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో అతి ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఈమాన్ బిల్లాహ్ (అల్లాహ్ తబారక వ త’ఆలా పై విశ్వాసము). రెండు, ఈమాన్ బిర్రుసుల్ (ప్రవక్తలపై విశ్వాసము). మరి మూడవది, ఈమాన్ బిల్ ఆఖిరా (అంటే పరలోకంపై విశ్వాసము). ఈరోజు ఏవైతే మీ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడ్డాయో, ఇందులో అల్లాహ్ తబారక వ త’ఆలా పరలోకం గురించి ప్రస్తావిస్తూ, పరలోక చింతన ఏ విధంగా కలిగి ఉండాలో అల్లాహ్ తబారక వ త’ఆలా తెలియజేస్తున్నాడు.

సూరా అల్-హజ్, 22వ సూరా, మొదటి వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ ‎﴿١﴾‏ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ ‎﴿٢﴾

ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:1-2)

అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ వాక్యంలో ఇలా ప్రస్తావిస్తున్నాడు: “యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్” – ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల మీరు భయపడండి. “ఇన్న జల్జలతస్సాఅతి షైయున్ అజీమ్” – ఎందుకంటే ప్రళయం రోజు వచ్చేటటువంటి జల్జలా (భూకంపము) అది ఎంతో భయంకరమైనటువంటిది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు: “యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్” – ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చేటటువంటి ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. “వతరన్నాస సుకారా వమాహుమ్ బిసుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్” – మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శిక్షను చూసి, ఆ ప్రళయాన్ని చూసి వారి మతిస్థిమితం పోతుంది అని దైవం ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు.

కాబట్టి సోదర మహాశయులారా, మనిషి జీవితంలో ఇహపరలోకాలలో సాఫల్యం చెందడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశము పరలోక చింత. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేదంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాలే నమాజులు చదివేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉపవాసాలు ఉండేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించగానే జకాత్‌ను చెల్లించేటటువంటి వారు. మరి అదే విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క మార్గంలో పోరాడడానికి కూడా వారు వెనకాడినటువంటి వారు కాదు.

అయినప్పటికీ కూడా సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: “ఖాల యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇஃదిల్లీ అస్అలుక అన్ కలిమతిన్ ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ.” ఫఖాల నబియ్యుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “సల్నీ అమ్మా షిஃతా.” హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు అంటున్నారు, ఈ హదీసును ముస్నదే అహ్మద్‌లో ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారు 22,122వ నెంబర్ హదీసులో తీసుకొచ్చారు. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నారు: “ఓ ప్రవక్తా, నా లోపల ఒక రకమైనటువంటి చింత ఉంది. అది నన్ను లోలోపల నుంచి ఎంతగా తినేస్తుందంటే, ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ – నన్ను బాధకు గురిచేస్తుంది, నా లోలోపలే అది తినేస్తుంది.” ఎలాగైతే సోదరులారా, ఒక వ్యక్తి యవ్వనుడైనప్పటికీ కూడా అతని లోపల బాధ గనుక, దుఃఖము గనుక లోలోపల అతన్ని తినివేస్తూ ఉన్నప్పుడు, అతడు ఎంత యవ్వనుడున్నా కూడా ఆ యవ్వనము ఉన్నప్పటికీ కూడా అతని ముఖంపై ముసలి యొక్క కవళికలు కనిపించడం ప్రారంభమవుతాయి. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ ముఆద్, అదేమిటో అడుగు. ఇస్సల్నీ అమ్మా షిஃతా – ఏమిటో అడుగు” అంటే, ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు సోదర మహాశయులారా అడుగుతున్నారు. ఏమన్నారంటే: “యా నబియ్యల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హద్దిస్నీ బి అమలిన్ యుద్ఖిల్నియల్ జన్నహ్” – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గములో ఎలా ప్రవేశించాలో ఏదైనా అమలు ఉంటే అది చెప్పండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీగా ధృవీకరించారు.

అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సహాబా అనుచరులు, వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నమాజులు చదువుతూ కూడా, వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ కూడా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎంతో మంది సహాబాలు అడుగుతున్నారు, “దుల్లనీ అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్నహ్” – ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఆచరణ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని చేసి నేను స్వర్గంలో ప్రవేశించడానికి. ఏ విధంగా సహాబాలలో పరలోకం అనేటటువంటి చింత ఎంత అధికంగా ఉండేదో మనం ఇక్కడ గమనించగలం.

అంతేకాదు సోదరులారా, హజ్రతే అబూదర్ రిఫారీ రది అల్లాహు అన్హు వారైతే ఆయన అంటున్నారు, నన్ను గనక ఒక వృక్షంగాను అల్లాహ్ తబారక వ త’ఆలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు, ఎవరైనా దాన్ని నరికి వెళ్ళిపోయేటటువంటి వారు, నాకు పరలోకంలో అల్లాహ్ తబారక వ త’ఆలా లేపి నువ్వు ఈ పని ఎందుకు చేశావు అనేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తి ఉండేది కాదేమో అని ఈ విధంగా సహాబాలు దుఃఖించేటటువంటి వారు.

ముస్నద్ ఏ అహ్మద్ లో 13,150వ హదీసులో హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారి యొక్క ఉల్లేఖనంలో ఈ హదీస్ వస్తుంది. ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, “సమిஃతున్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు ఫీ బஃది సలాతిహి, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా.” హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చదివేటటువంటి నమాజుల్లో కొన్నింటిలో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు: “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా” – ఓ అల్లాహ్, నా యొక్క లెక్కలను తేలికపాటి లెక్కలుగా నువ్వు తీసుకో. అమ్మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తేలికపాటి లెక్కలంటే ఏమిటి?” అని ఆయిషా రది అల్లాహు అన్హా వారు హజ్రతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు చెబుతూ అంటున్నారు, “ఖాల అయ్ యన్జుర ఫీ కితాబిహి ఫయతజావదు అన్హు.” దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఆయిషా, నువ్వు భలే ప్రశ్నలు వేస్తావే! వాస్తవానికి తేలికపాటి లెక్కలంటే ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలా తన దాసుల యొక్క కర్మపత్రాలను చూసిన తర్వాత వారిని అట్టే విడిచిపెట్టటము లేక వారిని అలాగే క్షమించివేయటము ఇదే తేలికపాటి లెక్కలు. ఎందుకంటే ఆయిషా, ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం ప్రారంభిస్తే, ఆయన ప్రశ్నించేటటువంటి జవాబులు చెప్పేటటువంటి ధైర్యము గానీ లేక జవాబు చెప్పేటటువంటి స్తోమత ఎవరికీ ఉంటుంది? ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం మొదలుపెడితే, వివరంగా అడగటం మొదలుపెడితే ఆ వ్యక్తి నాశనమైపోతాడు” అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో ప్రస్తావిస్తున్నారు.

ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎంతగా పరలోకం గురించి చింతన చెందేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మన జీవితాల్ని మనం చూసుకున్నట్లయితే, మన జీవితాల్లో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటి? వాస్తవానికి మనం పరలోక జీవితం గురించి ఆలోచించి మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామా? ఇహలోక జీవితంలో పడిపోయి పరలోక జీవితాన్ని మరచి నడుస్తున్నామా? అల్లాహ్ తబారక వ త’ఆలా అందుకనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, “ఇఖ్ తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిమ్ ముஃరిదూన్” – ప్రజల యొక్క లెక్కల గడియ సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం పరధ్యానంలో పడి ఉన్నారని దైవం అంటున్నాడు.

అందుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబూ దావూద్ లో 4297వ నెంబర్ లో హదీస్ ఈ విధంగా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు: “యూషికుల్ ఉమము అన్ తదాఅ అలైకుమ్ కమా తదాఅల్ అకలతు ఇలా ఖస్అతిహా.” ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్? ఖాల “బల్ అన్తుమ్ యౌమయిదిన్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్. వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్, వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్.” ఫఖాల ఖాయిలున్ “యా రసూలల్లాహ్, వమల్ వహన్?” ఖాల “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్.”

ప్రళయానికి సమీప కాలంలో ముస్లిం సమాజంపై ఇస్లాం వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆ విధంగా విరుచుకొని పడతాయి, ఏ విధంగానైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి జంతువు విరుచుకొని పడుతుందో. అప్పుడు ఒక అతను అడుగుతున్నాడు, “ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్” – ఆ సమయంలో మా యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందా? అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లేదు, “బల్ అన్తుమ్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్.” మీరు ఆ సమయంలో అత్యధికంగా ఉంటారు, కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోయి ఉంటారు. ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి నురగ ఉంటుందో. వాస్తవానికి ఇక్కడ ఆలోచించినట్లయితే సోదర మహాశయులారా, ఎవరైనా దాహము, దప్పికతో ఉంటే ఒక గ్లాసు నీళ్లు అతనికి దప్పిక తగ్గడానికి, దాహం తీరడానికి మనం ఇచ్చినట్లయితే అతడు ఆ గ్లాసు నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోగలడు గానీ అదే గనక మనం అదే గ్లాసులో మనం ఒక గ్లాసు నురగ అతనికి ఇచ్చినట్లయితే ఆ నురగతో అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే నీటికి విలువ ఉంది గానీ నురగకు ఆ విలువ ఉండదు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోతారు. మరి అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది? “వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్” – మీ యొక్క శత్రువుల యొక్క హృదయాల్లో మీ పట్ల ఉన్నటువంటి భయాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా తొలగిస్తాడు. మరి అదే విధంగా, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – మీ యొక్క హృదయాలలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఆ సమయంలో ఒక రోగాన్ని జనింపజేస్తాడు. ఏమిటండీ ఆ రోగము అంటే, బీపీనా? కాదు సోదరులారా. షుగరా? కాదు సోదరులారా. మరి ఇటువంటి వ్యాధులేమీ కానప్పుడు అది ఏ వ్యాధి అండీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వింతైనటువంటి పదాన్ని వినియోగించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – అదేమిటంటే మీ హృదయాల్లో జనించేటటువంటి వ్యాధి, ఆ వ్యాధి పేరే వహన్. మరి ఈ వ్యాధి వహన్ అన్నటువంటిది అరబ్బులో కూడా సహాబాలు కొత్తగా విన్నారు. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నారు, “వమల్ వహను యా రసూలల్లాహ్?” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వహన్ అంటే ఏమిటి అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్” – పరలోక చింత వదిలేసి ఇహలోక వ్యామోహంలో పడిపోవటము ఈ వ్యాధికి ఉన్నటువంటి మొదటి లక్షణము. మరి రెండవ లక్షణం ఏమిటండీ అంటే మరణము అంటే భయము.

అయితే సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే, మరి మన సమాజం దేని వైపునైతే పరుగెడుతుందో, ఆ పరుగును మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మన సమాజము ఇహలోకం అన్నటువంటి వ్యామోహంలో కొట్టిమిట్టాడుతుంది. పరలోక ధ్యానాన్ని మరిచిపోయి ఉన్నాము. అల్లాహ్ త’ఆలా సూరతుల్ ఆలాలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ‎﴿١٦﴾‏ وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ‎﴿١٧﴾‏
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. (87:16-17)

అయినప్పటికీ ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా – ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క సహీఫాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఎలా ఉంది అంటే “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా” – మీరు అయినప్పటికీ ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తున్నారే గానీ, పరలోక జీవితం ఎటువంటిది? అల్లాహ్ త’ఆలా అంటున్నాడు, “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా వల్ ఆఖిరతు ఖైరువ్ వ అబ్ఖా.” వాస్తవానికి ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం ఎంతో మేలైనటువంటిది. ఎందుకంటే అది కలకాలం ఉండిపోయేటటువంటిది. ఇహలోక జీవితం అంతమైపోయేటటువంటిది.

అందుకనే సోదర మహాశయులారా, ఒక కవి తెలుగులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎల భ్రమచితివోయి మనసా! కాలూని వలలోన కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా! తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా! నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీవెంట రాదేది మనసా!

ఇల్లు, వాకిలి, నీవు కట్టుకున్నటువంటి ఇల్లాలు ఇవన్నీ నీవే అని అనుకుంటున్నావు. కాలూని వలలోన కానేక చిక్కేవు, కడచేరుటే త్రోవ మనసా. బంధుత్వం అన్నటువంటి వలలో చిక్కుకొని పోయావు, మరి ఈ బంధుత్వాన్ని బ్యాలెన్స్ గా చేసుకొని ఇహపరలోకాలలో సాఫల్యం చెందటం అంటే మామూలు విషయం కాదు. నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. కానీ నీ తనయులు, చుట్టాలు నీ వారని నమ్ముతున్నావేమో, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేది కేవలం నువ్వు చేసుకున్నటువంటి నీ పాపపుణ్యాలు తప్ప మరొకటి ఏమీ రాదు అన్నటువంటి విషయాన్ని ఒక కవి కూడా తెలుగులో ఈ విధంగా చక్కగా తన తెలుగు కవితంలో తెలియజేస్తున్నాడు.

అల్లాహ్ తబారక వ త’ఆలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వాస్తవానికి పరలోక జీవితమే అసలైనటువంటి జీవితము. ఇహలోక జీవితము కేవలం ఒక ఆటవినోదం తప్ప మరేమీ కాదు. ఒక మోసపూరితమైనటువంటి జీవితం తప్ప మరేమీ కాదు అని దైవం ఎన్నో చోట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.

అల్లాహ్ తబారక వ త’ఆలాతో దువా ఏమనగా, అల్లాహ్ తబారక వ త’ఆలా మనందరికీ కూడా పరలోక చింతనను కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పటివరకైతే మనం ఇహలోకంలో బ్రతికి ఉంటామో అప్పటివరకు కూడా అల్లాహ్ తబారక వ త’ఆలాను ఆరాధిస్తూ బ్రతికి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎప్పుడైతే మనం మరణిస్తామో అల్లాహ్ తబారక వ త’ఆలా వైపునకు విశ్వాస స్థితిలోనే అల్లాహ్ వైపునకు మరలేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
(రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీయుల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్తవ్వాబుర్రహీమ్)

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.


సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌).

అల్లాహ్‌ తన అంతిమ గ్రంథంలో వారిని కొనియాడుతూ ఇలా సెలవిచ్చాడు :

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ

“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించినవారితోనూ అల్లాహ్‌ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్‌ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (అత్‌ తౌబా : 100)

ఇంకా ఈ విధంగా స్తుతించాడు :

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్‌ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవ కృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగ పడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇన్‌జీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆపైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానం చేసి ఉన్నాడు. (అల్‌ ఫత్‌హ్‌ : 29)

ఇంకా అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ

وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

(ముఖ్యంగా ఈ ‘పై’ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండీ, తమ ఆస్తి పాస్తుల నుండీ గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు చెందుతుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని దైవప్రసన్నతను ఆశిస్తూ దైవానికీ, ఆయన ప్రవక్తకూ తోడ్పడుతున్నారు. వారే సిసలయిన సత్యసంధులు. ఇకపోతే; వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా) లోనూ, విశ్వాసంలోనూ స్థానికులుగా ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది). వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపునకు వలసవచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా తమ ఆంతర్యాలలో ఏ కాస్త కూడా సంకోచాన్ని రానివ్వరు. తాము ఎంతో అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ ఆంతర్యంలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు. (అల్‌ హష్ర్  : 8, 9)

ఈ సూక్తులలో అల్లాహ్ ముహాజిర్లను, అన్సార్లను మెచ్చుకున్నాడు. వారిని సత్కార్యాల వైపు ముందంజవేసే వారుగా అభివర్డించాడు. తాను వారి పట్ల ప్రసన్నుణ్తి అయ్యానని, వారి కొరకు పిల్లకాలువలు ప్రవహించే ఉద్యాన వనాలను సిద్ధపరచి ఉంచానని తెలిపాడు. ఇంకా వారిలోని సుగుణాలను తెలుపుతూ వారు పరస్పరం దయాగుణం కలవారని, అవిశ్వాసులకు మాత్రం సింహస్వప్నమని చెప్పాడు. వారు అత్యధికంగా దైవసన్నిధిలో వంగేవారని, సాష్టాంగ ప్రణామాలు చేసేవారని, వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండేవని చెప్పాడు. వారిలోని మరో ప్రత్యేకత ఏమిటంటే; వారు దైవవిధేయతా చిహ్నంతో కనుగొనబడేవారు. అల్లాహ్‌ వారిని తన ప్రవక్త సహచర్యం కొరకు ఎంపిక చేశాడు – తద్వారా అవిశ్వాసులను మరింతగా ఉడికించాలని. వారిలో ముహాజిర్లు అనబడే వారి విశిష్టత ఏమిటంటే, వారు అల్లాహ్‌ ప్రీతి కొరకు, ధర్మసంస్థాపనార్థం తమ స్వదేశాన్ని, తమ ఆస్తిపాస్తులను వదలి ప్రస్థానం చేశారు. ఈ విషయంలో వారు నిజాయితీపరులని నిరూపించుకున్నారు. అన్సార్లు అనబడేవారి ప్రత్యేకత ఏమిటంటే వారు మదీనావాసులు. ముహాజిర్లను ఆదుకోవటంలో, దైవధర్మానికి తోడ్పడటంలో నికార్సయిన విశ్వాసులని నిరూపించుకున్నారు. వారిలోని ఓ గొప్ప సుగుణం ఏమిటంటే వారు తమ ముహాజిర్‌ సోదరులను అమితంగా ప్రేమించేవారు. వారి ప్రేమ నిష్కల్మషమయినది. వారి ఆంతర్యాలలో కల్లాకపటం ఉండేది కాదు. వారు ఎల్లప్పుడూ తమ ఆత్మలపై తమ ముహాజిర్‌ సోదరులకే ప్రాధాన్యత ఇచ్చారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు. వారి మనసులలో పిసినారితనం, సంకుచిత స్వభావం ఏ కోశానా ఉండేవి కావు. అందుకే వారు విజయ భాగ్యానికి నోచుకున్నారు. ఇవి వారిలోని సర్వసామాన్యమయిన సుగుణాలు. అలాగే కొన్ని ప్రత్యేక సుగుణాల దృష్టా వారిలో కొందరు మరికొందరి కంటే గొప్పవారుగా కీర్తించబడ్డారు – ముఖ్యంగా ఇస్లాం కొరకు, ధర్మయుద్ధం కొరకు, హిజ్రత్ కొరకు ముందంజవేసిన కారణంగా!

వారిలో అందరికన్నా గొప్ప సహాబీలు (రది అల్లాహు అన్హుమ్)నలుగురు ధర్మ ఖలీఫాలు. అంటే హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హుమ్). ఆ తరువాత అష్ర ముబష్షిరన్ – అంటే స్వర్గలోక శుభవార్త ప్రపంచంలోనే పొందిన ధన్యజీవులు. వారు (నలుగురు ధర్మఖలీఫాలతో పాటు) తల్హా జుబైర్‌, అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌, అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్, సాద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్, సయూద్‌ బిన్‌ జైద్‌ (రది అల్లాహు అన్హుమ్). ముహాజిర్లకు అన్సార్లపై ఒకింత ప్రాధాన్యం ఉంది. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నవారికి, అహ్లో బైఅతే రిజ్వాన్‌లో ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత వొసగబడింది. అలాగే మక్కా విజయానికి పూర్వం ఇస్లాం స్వీకరించి జిహాద్‌ చేసినవారు, మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించిన సహాబీల కన్నా గొప్పవారు.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]