దైవప్రవక్త యేసు (అలైహిస్సలాం) జీవిత గాధ [పుస్తకం]

Life History of Prophet Eesa
దైవప్రవక్త యేసు (అలైహిస్సలాం) జీవిత గాధ [పుస్తకం]

దైవప్రవక్త యేసు (ఆయనపై అల్లాహ్ శాంతి వర్షించుగాక) జీవిత గాధ
Life History of Prophet Esa (alaihissalam) (Telugu)
ఆధారం : ఖుర్ఆన్ కథామాలిక

కూర్పు : రచన అనువాద విభాగం, శాంతిమార్గం పబ్లికేషన్స్
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

[పుస్తకము డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ] [56 పేజీలు] [ప్యాకెట్ సైజు]

  • మర్యమ్ ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) గారి మాతృమూర్తి
  • దైవప్రవక్త ఈసా (అలైహిస్సలాం) జీవిత విశేషాలు
  • ఈనాటి క్రైస్తవ విశ్వాసం
  • క్రైస్తవ విశ్వాసం గురించి తలెత్తే ప్రశ్నలు
  • ఖుర్ఆన్ ను అడుగుదాం

సఫర్ మాసం మరియు దుశ్శకునాలు | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

1) లాభనష్టాల అధికారం కలవాడు ఎవరు?
2) సఫర్ మాసం వగైరా లలో దుశ్శకునం పాటించడం.
3) నక్షత్రాల ద్వారా (గ్రహాల ద్వారా) అదృష్టాన్ని తెలుసుకోవడం.
4) మాంత్రికుల వద్దకు వెళ్ళడం.
5) విచారణ లేకుండానే స్వర్గంలోకి ప్రవేశించే వారి గుణగణాలు

ఇస్లామీయ సోదరులారా!

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కు వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7: 188)

ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్‌” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్‌ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్‌ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్‌ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)

దైవ గ్రంధాల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ

వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)

కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)

నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِ‍ۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]

(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)

ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.

 [ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)

గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.

రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్  మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.

మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి  ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం

నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్  మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి,  ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)

ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]

అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)

మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.

 [أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]

అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)

ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ

(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)

మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.

ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్  మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్  2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.

ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]

ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా  పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో  జరిపిన మార్పుల గురించి  మరియు వక్రీకరణల గురించి  అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను  ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)

ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)

[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.

[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై,  ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.

[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.

షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి  ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్  ఇలా అంటున్నాడు :

[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)

మరోచోట ఇలా అంటున్నాడు:

[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]

(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)

ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.

 అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)

[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము  ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)

[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.

[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని,  అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్  మొదలైనవి.

దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.

ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.

ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు  ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక  కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :

[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]

ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)

ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:

 [وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]

ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)

[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.

ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]

నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)

[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]

(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)

మరొకచోట ఇలా అంటున్నాడు.

 [وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]

వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)

[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు

[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]

ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)

[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి!? [వీడియో]
https://youtu.be/0XIBN4UbyVc [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తఫ్సీరే ఖుర్ఆన్ (ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం) తెలుసుకోవలసిన ఆవశ్యకతపై దృష్టి సారించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఖుర్ఆన్‌ను అవతరింపజేసి, దాని వివరణ బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఖుర్ఆన్‌ను కేవలం అనువదించి చదవడం సరిపోదు, ఎందుకంటే దాని యొక్క లోతైన భావాన్ని మరియు ఆదేశాలను అర్థం చేసుకోవడానికి తఫ్సీర్ అవసరం. సహాబాలు (ప్రవక్త అనుచరులు) అరబీ భాషలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ, వారు కూడా కొన్ని ఆయతుల యొక్క వివరణ కోసం ప్రవక్తపై ఆధారపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులను హదీసుల ద్వారా వివరించారు. ఉదాహరణకు, ఉపవాసానికి సంబంధించిన ఆయత్‌లోని “తెల్లని దారం, నల్లని దారం” అనే పదాన్ని మరియు విశ్వాసాన్ని పాడుచేసే “జుల్మ్” (అన్యాయం) అనే పదాన్ని ప్రవక్త ఎలా వివరించారో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పబడింది. సరైన మార్గదర్శకత్వం కోసం ఖుర్ఆన్, సహీ హదీసులు, మరియు సహాబాల అవగాహన ఆధారంగా తఫ్సీర్‌ను నేర్చుకోవాలని నొక్కి చెప్పబడింది.

అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.

ప్రియ విద్యార్థులారా!ఈ రోజు తఫ్సీర్ క్లాస్‌లో మన యొక్క అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?

సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇంతకుముందు కాలాల్లో ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలపై గ్రంథాలు అవతరింపజేసి వాటి యొక్క వివరణ స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలిపి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలన్నటువంటి బాధ్యత ప్రవక్తలకు అప్పగించాడు. ఆ పరంపరలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపాడు.

అయితే, ప్రవక్తలపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాల రీతిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి, ఖుర్ఆన్‌తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చి, ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలని చాలా స్పష్టంగా తెలిపాడు.

సూరతుల్ హదీద్, ఆయత్ నంబర్ 25లో,

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ
(లఖద్ అర్సల్నా రుసులనా బిల్ బయ్యినాతి వ అన్జల్నా మ’అహుముల్ కితాబ వల్ మీజాన లియఖూమన్నాసు బిల్ ఖిస్త్)
వాస్తవానికి మేము మా ప్రవక్తలను స్పష్టమైన నిదర్శనాలతో పంపాము. ప్రజలు న్యాయంపై నిలబడాలని మేము వారితో పాటు గ్రంథాన్ని, త్రాసును అవతరింపజేశాము. (57:25)

అయితే, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఈ విషయం మనందరికీ తెలిసినదే. రమదాన్‌కు సంబంధించిన ఆయత్ ఏదైతే ఉందో, ‘షహ్రు రమదానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్’. ఇంకా వేరే అనేక సందర్భాల్లో, సూరె ఆలి ఇమ్రాన్ ప్రారంభంలో అనేక సందర్భాల్లో ఆయతులు ఉన్నాయి. అయితే, ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి ఇచ్చి పంపాడు. అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేసి సర్వ మానవాళికి సన్మార్గం చూపాలని, తెలియజేయాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ఇచ్చాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఈ ఖుర్ఆన్ బోధ చేస్తూ ఉండేవారు. మరియు ఈ ఖుర్ఆన్‌తో పాటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చాడు. ఈ విషయం ఖుర్ఆన్‌లో అనేక సందర్భాల్లో ఉంది. సూరతుల్ బఖరాలో, సూరత్ ఆలి ఇమ్రాన్‌లో, సూరతుల్ జుముఆలో. ప్రత్యేకంగా దీని కొరకు “అల్ హిక్మ” అన్న పదం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉపయోగించాడు. మరియు ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ దాని యొక్క వ్యాఖ్యానంలో, వ్యాఖ్యానకర్తల ఏకాభిప్రాయం తెలియజేశారు, అల్ హిక్మ అంటే ఇక్కడ అల్ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు అని.

అయితే ఈ రోజు మన యొక్క ప్రసంగం అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? అయితే ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ దాని యొక్క కేవలం అర్థం చదువుతామో, దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకోమో, చాలా విషయాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకు? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, వారు అరబీ తెలిసినవారు, అరబీ భాషలో ఎంతో ప్రావీణ్యత, ఎంతో వారికి అనుభవం ఉన్నప్పటికీ, ఎన్నో ఆయతుల భావాన్ని, భావాలను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరిచి చెప్పాడు, విడమరిచి చెప్పారు.

అయితే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఇది వ్యాఖ్యానకర్తలు తమ ఇష్టప్రకారంగా చేస్తారు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కొందరిలో ఉన్నది. అయితే వాస్తవానికి ఇది తప్పుడు ఆలోచన, ఎందుకంటే మీరు ఖుర్ఆన్‌లో గనుక చూస్తే సూరతుల్ ఖియామాలో ఈ తఫ్సీర్ యొక్క బాధ్యత కూడా అల్లాహ్ యే అన్నట్లుగా స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు. గమనించండి ఇక్కడ. సూరతుల్ ఖియామా, సూర నంబర్ 75, ఆయత్ నంబర్ 16 నుండి 19 వరకు చూస్తే, ప్రత్యేకంగా 19 లో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రండి అనువాదం మనం చదువుతున్నాము.

“ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్‌ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది.” సమకూర్చే అంటే నీ మనస్సులో, నీ హృదయంలో దాన్ని హిఫ్జ్ చేసే, దాన్ని భద్రంగా ఉండే ఉంచే అటువంటిది. “కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
(సుమ్మ ఇన్న అలైనా బయానహ్)
మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉంది.” (75:19)

దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉన్నది. చూస్తున్నారా? ఖుర్ఆన్ అవతరింపజేసిన వాడు అల్లాహ్, దాని యొక్క వివరణ, ఎక్కడ ఎలాంటి వివరణ అవసరమో అక్కడ అలాంటి వివరణ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలియబరిచాడు.

అయితే ఇక్కడ హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క మాట మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వేరే కొన్ని క్లాసులలో ఈ విషయం ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ఇప్పుడు అందులోనే ఒక విషయం చెబుతున్నాను గమనించండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ఖుర్ఆన్‌లోని ఆయతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని ఒక రకమైన ఆయతులు ఎలాంటివి అంటే ప్రతి మనిషి ఎలాంటి వివరణ లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటివి అవి? అవి ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వం గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రిసాలత్ గురించి, మరియు పరలోకం రానున్నది, మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పకుండా పుట్టిస్తాడు, సర్వ మానవుల్ని మలిసారి బ్రతికిస్తాడు అన్నటువంటి అంశాలకు సంబంధించిన ఆయతులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో చాలా లోతైన వివరాలు ఏమీ అవసరం లేకుండానే కేవలం వాటిని తిలావత్ చేస్తూ, కొంతపాటి అరబీ భాష వచ్చినా గాని లేదా అనువాదం చదివినా గాని అర్థమైపోతుంది.

రెండో రకమైన కొన్ని ఆయతులు ఎలా ఉన్నాయి? అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు అహ్కామ్, వారి జీవిత వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇవి కొందరికి స్పష్టంగా అర్థమౌతే, ధర్మ జ్ఞానంలో ఎవరు ఎంత అధ్యయనం చేసి లోతు జ్ఞానంతో ఉన్నారో వారికి త్వరగా అర్థం కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? ఆ విషయాలను ఆ ఉలమాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎన్నో ఆదేశాలు వాటి యొక్క వివరణ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియబరిచాడు. ఈ రెండవ రకానికి సంబంధించిన వాటిలోనే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కానీ ఆ ఉదాహరణలు తెలుసుకునేకి ముందు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక నియమం ఏదైతే తెలిపాడో దాన్ని కూడా మీరు ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా గమనించండి. చూస్తున్నారా సూరత్ అన్నహల్, ఆయత్ నంబర్ 44.

وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ
(వ అన్జల్నా ఇలైకజ్ జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిమ్)
“ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు మేము అవతరింపజేశాము ఈ జ్ఞాపిక ఈ గ్రంథాన్ని.”
(16:44)

ఓ ప్రవక్త నీవు ప్రజలకు విడమరచి చెప్పడానికి. గమనించారా? అల్లాహ్ ఏ తఫ్సీర్ ప్రవక్తకు తెలుపుతాడో ప్రవక్త ఆ విషయాన్ని విడమరచి చెప్పేవారు. ఇదే భావం, ఇదే సూరత్ అన్నహల్ లోని మరోచోట ఆయత్ నంబర్ 64 లో ఉంది.

وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
(వమా అన్జల్నా అలైకల్ కితాబ ఇల్లా లితుబయ్యిన లహుముల్లజీ ఇఖ్తలఫూ ఫీహి వహుదన్ వ రహ్మతన్ లిఖౌమిన్ యు’మినూన్)
వారు విభేదించుకునే ప్రతీ విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. (16:64)

చూశారా? అయితే ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ అవతరింపజేయడంతో పాటు దీని యొక్క తఫ్సీర్‌ను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తకు ఈ విషయాలు వివరంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పేవాడు మరియు ప్రవక్త సహాబాలకు వివరించేవారు.

తఫ్సీర్ ఆవశ్యకతకు ఉదాహరణలు

దీనికి కొన్ని ఉదాహరణలు ధర్మవేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా తెలిపి ఉన్నారు. ఉదాహరణకు, మీరు ఇదే ఖుర్ఆన్‌లో చూడవచ్చును. సూరతుల్ బఖరాలోని ఒక ఆయత్, ఉపవాసాలకు సంబంధించినది. ఆయత్ కొంచెం పెద్దగా ఉన్నది, కానీ ఇందులో ఒక ఆదేశం ఏమున్నది?

وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ
(వ కులూ వష్రబూ హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్)
అల్లాహ్ ఏమంటున్నాడు ఇందులో?
తొలిజాములోని తెలుపు, నడిరేయి నల్లని చారలో నుంచి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. (2:187)

ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇది. రాత్రివేళ మనం తిన త్రాగవచ్చు, కానీ ఎప్పటివరకు? ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు అని సర్వసామాన్యంగా హదీసుల ఆధారంగా మనం చెబుతాము. కానీ ఖుర్ఆన్‌లో వచ్చినటువంటి విషయం ఏంటి? “హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యద్”. అల్ ఖైతుల్ అబ్యద్, శాబ్దిక అర్థం ఏంటి ఇది? అల్ ఖైత్ అంటే దారం, అల్ అబ్యద్ అంటే తెల్లది, “మినల్ ఖైతిల్ అస్వద్” నల్లని దారం నుండి. అయితే ఒక సహాబీ ఏం చేశారు? ఈ ఆయత్ పదాలతో స్పష్టమై భావం ఏదైతే ఉందో, దాన్ని చూసి అతను తన మెత్త కింద ఒక నల్ల దారం, మరొక తెల్ల దారం పెట్టుకున్నారు. ఇక కొంత కొంత సేపటికి తీసి చూసేవారు. కానీ రాత్రి పూట, చీకటి పూట తెల్ల దారమా, నల్ల దారమా అది స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. తెల్లారిన తర్వాత కనబడుతుంది. కదా? అయితే ఆ విషయం వచ్చి ప్రవక్తకు చెబితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. నీ మెత్త, పిల్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో, అది చాలా పెద్దగా ఉన్నట్టు ఉన్నది. అయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో ఏదైతే అల్ ఖైతుల్ అబ్యద్, తెల్లని దారం అని అంటున్నాడో, దాని ఉద్దేశం, నిజంగా ఏమైనా దారాలు తీసుకోండి అని మాత్రం భావం కాదు, భావం అది కాదు. దీని భావం ఏంటి? ఆకాశంలో, ఆకాశంలో ఈ భేదం అనేది కనబడుతుంది. దాన్ని గమనించి, ఇక్కడ అసలు ఉద్దేశం ఫజ్ర్ సమయ ప్రవేశం గురించి చెప్పడం జరిగింది అని సహీ బుఖారీలో కూడా ఈ హదీస్ వచ్చి ఉంది, హదీస్ నంబర్ 1916. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ హదీస్ హజ్రత్ అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖించడం జరిగింది.

గమనిస్తున్నారా మీరు? ఈ విధంగా కొన్ని ఆదేశాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఏదైతే తెలిపాడో, హదీసుల్లో వాటి వివరణ వచ్చి ఉంది. ఇక అందుకొరకే మనం తఫ్సీర్‌ను తెలుసుకోవడం, తఫ్సీర్‌ను నేర్చుకోవడం, ఖుర్ఆన్ యొక్క ఆయత్ కేవలం నాకు అరబీ వస్తుంది లేదా అనువాదం చదువుకొని ఆచరిస్తాను అంటే సరిపోదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుర్ఆన్ ఆయతుల, ఏ ఆయత్ యొక్క ఏ భావం ఎలా తెలిపారు? సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు? ఆ రీతిలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. లేదా అంటే ఖవారిజ్‌ల మాదిరిగా, ఖదరియా ముర్జియాల మాదిరిగా, మోతజిలాల మాదిరిగా తప్పుడు విశ్వాసాల్లో, బిద్అతులలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు ఏదైతే చెప్పానో, ఖవారిజ్, మోతజిలా, ఖదరియా, ముర్జియా, ఇవి గుమ్రాహ్ ఫిర్ఖాలు. చూడడానికి ముస్లింలే, ఖుర్ఆన్ ద్వారానే మేము ఆధారం తీసుకుంటాము అన్నటువంటి వాదన వాదిస్తారు. కానీ వాస్తవానికి వారు ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నచ్చజెప్పారో, విడమరిచి చెప్పారో, వివరించి చెప్పారో, ఆ అలా సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో వారు ఆచరించరు. అందుకొరకే వారు పెడమార్గాన పడిపోయారు. సన్మార్గం నుండి దూరమైపోయారు. మన పరిస్థితి అలా కాకూడదు. మన పరిస్థితి అలా కాకూడదు.

ఇప్పుడు నేను సూరతుల్ బఖరాలోని ఉపవాసాలకు సంబంధించిన ఒక ఆయత్ మరియు దాని యొక్క వివరణ తఫ్సీర్ సహీ బుఖారీలోని 1916 హదీస్ నంబర్‌తో తెలిపాను. ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? మనం తప్పకుండా తఫ్సీర్ తెలుసుకోవాలి. దీనికి మనకు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు, సహీ బుఖారీలోని హదీసే చూడండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఇచ్చినటువంటి దుఆ. దాని పూర్తి సంఘటన చెప్పలేను. సహీ బుఖారీలో ఇమాం బుఖారీ రహిమతుల్లాహ్ ఈ హదీసును ఎన్నో సందర్భాల్లో తీసుకొచ్చారు. సంక్షిప్త భావం ఏమిటి?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ఒకరు హజ్రత్ మైమూనా రదియల్లాహు తాలా అన్హా. హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఖాలా అవుతుంది. ఖాలా అంటే తెలుసు కదా, పిన్ని అంటారు, చిన్నమ్మ అంటారు. ఇబ్ను అబ్బాస్ యొక్క తల్లి మరియు మైమూనా రదియల్లాహు తాలా అన్హా ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ళు. ఒక రాత్రి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడుపుతారు. అయితే రాత్రి ఎప్పుడైతే ప్రవక్త వారు మేల్కొంటారో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారో, ప్రవక్త తిరిగి వచ్చేవరకు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏం చేస్తారు? ప్రవక్త ఉదూ చేసుకోవడానికి నీళ్లు సిద్ధం చేసి పెడతారు. ఉదూ నీళ్లు. ప్రవక్త వచ్చాక ఈ విషయాన్ని చూసి సంతోషపడి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి దుఆ ఇస్తారు. ఏమని దుఆ ఇస్తారు? ఏమని దుఆ ఇస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ… తొందరగా! మన టాపిక్ ఏం నడుస్తుంది మీకు తెలుసు కదా. అందరి మైక్ ఆఫ్ ఉన్నదా ఏంటి? ఉంది. కానీ ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. లేదా నా వాయిస్ ఎవరి వరకు చేరుతలేదా ఏంటి? ఆ వచ్చింది షేక్. ఖుర్ఆన్ యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ మీకు ఇవ్వాలని దుఆ చేస్తారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను మొదటిసారిగా చెప్పడం లేదు. మిమ్మల్ని ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఈ మాట చెప్పడం జరిగింది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, ఓ అల్లాహ్, ఇబ్ను అబ్బాస్‌కి నీవు ఖుర్ఆన్ యొక్క విద్య, ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం, వివరణ జ్ఞానం ప్రసాదించు అని దుఆ చేశారు. ధర్మ అవగాహన, ఖుర్ఆన్ యొక్క జ్ఞానం, మరియు ఈ ఖుర్ఆన్ యొక్క త’వీల్, వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం యొక్క జ్ఞానం ప్రసాదించు.

ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చిన్న వయసులో ఉన్నప్పటికీ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు 13 ఏళ్ల వయసు కూడా వరకు చేరలేదు. కానీ అల్ హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ, కరుణ, అతని యొక్క లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ బరకత్, అల్లాహ్ కరుణా కటాక్షాలు, ప్రవక్త వారి దుఆ బరకత్ మరియు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఖుర్ఆన్ జ్ఞానం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద సహాబాల తలుపుల ముందు కూర్చొని ఎండ తాపాన్ని భరించి, దుమ్ము ధూళిని భరించి, ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో, ఆ ప్రకారంగా అల్లాహ్ వారికి ప్రసాదించాడు. మరియు సహాబాలలోనే హబ్రుల్ ఉమ్మ, ఖుర్ఆన్ సహాబాలలో ఖుర్ఆన్ యొక్క పెద్ద జ్ఞాని ఎవరు అంటే, ఒక వైపున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు పేరు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క పేరు వస్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మన అంశానికి సంబంధించింది, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు సహాబాలకు ఇలాంటి దుఆ ఇచ్చారు. మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి, అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారి గురించి, ఇంకా వేరే కొందరు సహాబాల గురించి, సూరతుల్ బఖరా దానిని కంఠస్థం చేయడం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తఫ్సీర్‌ని నేర్చుకోవడంలో 8 నుండి 10 సంవత్సరాలు పట్టినది మాకు అని అంటున్నారు. సహాబాల విషయం చెబుతున్నానండి. తర్వాత వచ్చిన కాలాల్లోని తాబిఈన్, తబే తాబిఈన్, ఇంకా ఉలమాలు, అయిమ్మాల గురించి కాదు. సహాబాలు. సూరే బఖరా యొక్క వ్యాఖ్యానంలో మనకు ఒకచోట ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు. ఒక హజ్ సందర్భంలో అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ గురించి ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గురించి ఉంది. వారు సూరే బఖరా యొక్క తఫ్సీర్ ఎంతసేపు, ఎంత వివరంగా చెప్పారంటే, ఒకవేళ ఆ సందర్భంలో గనుక ఆ తఫ్సీర్‌ను యూదులు, క్రైస్తవులు విని ఉంటే ముస్లింలు అయిపోయేవారు అని ఉల్లేఖనకారులు అంటున్నారు. అంటే ఏమిటి విషయం? ఖుర్ఆన్‌ను దాని యొక్క తఫ్సీర్‌తో నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఇది సహాబాల యొక్క అలవాటు కూడా. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక రండి, సమయం సమాప్తం కావస్తుంది. ఈ అంశం మీకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మరొక ఉదాహరణ నేను ఇస్తాను. ఈ ఆయతును మీరు గమనించండి ఖుర్ఆన్‌లో మరియు దీనికి సంబంధించిన సహీ హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆయత్ ఇక్కడ? సూరతుల్ అన్ఆమ్. చూస్తున్నారు కదా సూరతుల్ అన్ఆమ్. ఆయత్ నంబర్ 82.

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
(అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్)
ఎవరైతే విశ్వసించారో, తమ విశ్వాసాన్ని జుల్ముతో కలగాపులగం చేయకుండా ఉన్నారో, ఇక్కడ అరబీలో చూస్తున్నారు మీరు. “వలమ్ యల్బిసూ” కలగాపులగం చేయలేదు, కలుషితం కానివ్వలేదు. “ఈమానహుమ్” తమ విశ్వాసాన్ని, తమ యొక్క ఈమాన్‌ని దేనితో కలుషితం కానివ్వలేదు? “బి జుల్మిన్” జుల్ముతో. ఎవరైతే తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం కాకుండా కాపాడుకున్నారో, అలాంటి వారే “లహుముల్ అమ్న్” సురక్షితంగా ఉన్నవారు. వారికొరకే శాంతి, వారికొరకే పీస్ ఫుల్ లైఫ్. “వహుమ్ ముహ్తదూన్” మరియు వారే సన్మార్గంపై ఉన్నవారు కూడా.

ఇక ఈ ఆయత్ అవతరించిన వెంటనే సహాబాలు భయపడిపోయారు. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 గుర్తు ఉంది కదా. సహాబాలు భయపడిపోయారు. ఎందుకని? మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చిన్న రీతిలో చిన్నపాటి జుల్మ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మా విశ్వాసం బాగులేదా? మేము సన్మార్గంపై లేమా? మాకు నరకం నుండి సురక్షితం అనేది లభించదా? అన్నటువంటి భయం వారికి కలిగింది. అందుకొరకే సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 32. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం. సహీ బుఖారీ ఎంత ప్రామాణిక గ్రంథమో మీ అందరికీ తెలుసున విషయమే. ఇంతకుముందే ఇప్పుడు ఇంతకుముందే మనం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి పేరు కూడా చెప్పాము. తఫ్సీరే ఖుర్ఆన్‌లో ఆయన పేరు కూడా వస్తుంది. సూరే బఖరా నేర్చుకోవడంలో 8 సంవత్సరాలు వీరికి కూడా పట్టింది అని. ఇక ఖుర్ఆన్ తఫ్సీర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉన్నదో అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా సహీ బుఖారీలోని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. హదీస్ నంబర్ 32. ఏమంటున్నారో గమనించండి. “లమ్మా నజలత్” ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయత్, “అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్” (సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నంబర్ 82). అందులో ఏమున్నది? ఈమాన్‌ను జుల్ముతో కలుషితం చేయని వారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ అంటున్నారు, “ఖాల అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం”, ప్రవక్త వారి యొక్క సహచరులు అప్పుడు చెప్పారు, ఏమని? “అయ్యునా లమ్ యజ్లిమ్?” మాలో ఎవరు ఏ మాత్రం జుల్మ్ చేయకుండా ఉండేవారు? అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ లుఖ్మాన్, ఆయత్ నంబర్ 13 తెలియబరిచాడు.

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(ఇన్నష్ షిర్క ల జుల్మున్ అజీమ్)
నిశ్చయంగా షిర్క్ అత్యంత ఘోరమైన జుల్మ్. (31:13)

ఇక సూరతుల్ అన్ఆమ్‌లో జుల్మ్ యొక్క పదం ఏదైతే వచ్చిందో ఆయత్ నంబర్ 82 లో, ఇక్కడ జుల్మ్ అంటే సామాన్యమైన జుల్మ్, ఒకరు మరొకరిని కొట్టడం గానీ, తిట్టడం గానీ, ఏదైనా సొమ్మును కాజేయడం గానీ, ఇవన్నీ కూడా జుల్మ్. కానీ ఇక్కడ ఈ ఆయతులో ఈ జుల్మ్ కాదు ఉద్దేశం. ఈ ఆయతులో జుల్మ్ అంటే షిర్క్ అని భావం.

అర్థమైంది కదా? ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసుల ద్వారా మరియు స్వయంగా ఖుర్ఆన్ ద్వారా మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖుర్ఆన్ తఫ్సీర్‌తో నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏ ఉలమాలైతే, ఏ ఆలిములైతే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఖుర్ఆన్‌తో, సహీ హదీసులతో, ప్రవక్త సహాబాల యొక్క వ్యాఖ్యానాలతో తెలియజేస్తున్నారో, అలాంటి వారి ద్వారానే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్ చేస్తున్నారని. కానీ ఎలా? మాకు అరబీ భాష తెలుసు, అరబీ గ్రామర్ తెలుసు, ఖుర్ఆన్ ఈనాటి కాలంలో మన అందరి కొరకు సన్మార్గ గ్రంథం గనుక సైన్స్ టెక్నాలజీ యొక్క విషయాలు అందులో ఏవైతే వచ్చాయో, వాటి యొక్క వివరణలతో తెలుసుకుంటే మరింత మనం వేరే వాళ్లకు కూడా మంచిగా నచ్చజెప్పవచ్చు అని దానిపై మాత్రమే ఆధారపడి అలాంటి విషయాలను వెతికి… చూడండి ఖుర్ఆన్‌లో మానవులందరికీ ప్రళయం వరకు వచ్చే అటువంటి సర్వ మానవాళి కొరకు మార్గదర్శకత్వం ఉంది గనుక, ప్రజలకు లాభదాయకమయ్యే ప్రతీ విద్య మూలాలు ఇందులో ఉన్నాయి. అవును, సైన్స్ కు సంబంధించి, టెక్నాలజీ కి సంబంధించి, జాగ్రఫియా కు సంబంధించి, మెడికల్ కు సంబంధించి, ఇంకా ఎన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విద్యలు ఉన్నాయో, వాటన్నిటి గురించి, వాటన్నిటి గురించి మూల విషయాలు ఉన్నాయి. కానీ ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం, మానవులు ఈ లోకంలో కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తూ, అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడిపి, ఎలా వారు నరకం నుండి రక్షణ పొంది స్వర్గం పొందగలుగుతారో, అల్లాహ్ యొక్క ఏకారాధన, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ పాటిస్తూ ప్రవక్త విధానంలో అల్లాహ్ ను ఆరాధిస్తూ, నరకం నుండి రక్షణ పొంది స్వర్గం ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది గనుక దీనిని మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ, ఇంకా అన్ని రకాల వేరే లాభాలను కూడా మనం స్వయం పొందడం, ఇతరులకు లాభం చేకూర్చడం మంచి విషయమే. కానీ అసలైన ఉద్దేశం నుండి దూరం కాకూడదు.

అయితే ఈ కొన్ని ఆధారాలు, ఎగ్జాంపుల్స్, ఉపమానాల ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఖుర్ఆన్ తప్పకుండా మనం దాని యొక్క వ్యాఖ్యానం, తఫ్సీర్‌తో చదివే, నేర్చుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి రీతిలో మనం ఆచరించగలుగుతాము. లేదా అంటే, ఒకవేళ తఫ్సీరే ఖుర్ఆన్ అవసరం లేదు అంటే, ఒక చిన్న ఉదాహరణ ఇలాంటి పొరపాటులో పడిపోతాము. ఒక రెండు చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ఖుర్ఆన్‌లో ఇప్పుడు నేను చూపించుకుంటూ మళ్ళీ వస్తే సమయం చాలా పడుతుంది, అందుకొరకే రెండే రెండు ఎగ్జాంపుల్స్ తొందరగా చెప్పేస్తున్నాను, గమనించండి మీరు. ఖుర్ఆన్‌లో ఒకచోట కాదు, ఎక్కువ చోట్ల ఉంది, రక్తం నిషిద్ధం అని. కదా? ఈ ప్రకారంగా చూసుకుంటే, ఒక మేకనే అనుకోండి ఉదాహరణకు, మనం జిబహ్ చేసిన తర్వాత సున్నత్ ప్రకారంగా, రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మనం మాంసపు ముక్కలు కూడా చేసేస్తామో, లోపట దాని యొక్క నరాల్లో, మాంసం మధ్యలో చిన్నపాటి రక్తం అనేది, కొంతపాటి రక్తం అనేది కనబడుతుంది. అవునా కాదా? అయితే, ఖుర్ఆన్ ప్రకారంగా చూస్తే అది కూడా ఎక్కడా ఒక చిన్న చుక్క ఉండకుండా పూర్తిగా శుభ్రమైపోవాలి అన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారి సహీ హదీస్ ఉన్నది, ప్రవహించే రక్తం ఏదైతే ఉంటుందో, అదంతా పోయింది. ఈ మాంసం మధ్యలో, చిన్న చిన్న నరాల మధ్యలో ఏదైతే కొంచెం ఆగి ఉన్నదో, అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల మనకు నష్టం జరగదు, ఎందుకంటే అది చాలా ఇబ్బందితో కూడిన పని.

ఇక సోదర మహాశయులారా, ఇది ఇలా ఉంటే, ఎవరైతే హదీస్ అవసరం లేదు, మనకు తఫ్సీర్ అవసరం లేదు, ఖుర్ఆన్ యొక్క బాహ్యమైన ఈ ఆయతుల అనువాదాలు చూసి మనం ఆచరిస్తే సరిపోతుంది అంటారో, వాస్తవానికి వారి యొక్క నమాజులు కూడా సరియైనవి కావు, వారి యొక్క రోజువారి జీవితంలో వివాహ, పేరంటాలు ఇవి కూడా సరియైన సున్నత్ ప్రకారంగా జరగవు. ఎందుకు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ద్వారా ఏ ఖుర్ఆన్‌ను విడమరచి హదీసు ద్వారా కూడా మనకు చెప్పారో, దాన్ని విడనాడినందుకు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్‌ను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సహాబాకు నేర్పారో, సహాబాలు నేర్చుకున్నారో, అలా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఖుర్ఆన్ ఘనతల పుస్తకం – జుల్ఫీ దావహ్

كتاب فضائل القرآن (ఖుర్ఆన్ ఘనతల పుస్తకం)
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

[పుస్తకం డౌన్లోడ్]
[PDF] [51 పేజీలు]

ఖుర్ఆన్ ను గట్టిగా పట్టుకునే ఆదేశం

عَنْ جُبَيْرِ بن مُطْعِمٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ : (أَبْشِرُوا فَإِنَّ هَذَا الْقُرْآنَ طَرَفُهُ بِيَدِ الله ، وَطَرَفُهُ بِأَيْدِيكُمْ ، فَتَمَسَّكُوا بِهِ ، فَإِنَّكُمْ لَنْ تَهْلَكُوا ، وَ لَنْ تَضِلُّوا بَعْدَهُ أَبَدًا).

ఈ హదీసులో:

సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. [దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది]. (ఖుర్ఆన్ 10: 58).

ఇందులో ఖుర్ఆన్ గొప్పతనం, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణల నుండి దూరముండడం.

అల్లాహ్ కు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి.

ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు.[ఎవడు నా ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశానికి, ఖుర్ఆనుకు) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది]. (ఖుర్ఆన్ 20: 123, 124). ఖుర్ఆనును అనుసరించినవానికి భాగ్యము, విజయముందని. దానికి విముఖుడైనవానికి దుర్మార్గం, దౌర్భాగ్యం ఉందని హదీసులో ఉంది. దాసుని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు.

అల్లాహ్ రక్షణ వలన ఖుర్ఆన్ భద్రంగా ఉంది. ఏలాంటి తారుమారు అందులో జరగలేదు. [అసత్యం దాని మీదకు ముందునుండీ రాజాలదు. వెనుక నుండీ రాజలదు. వివేకవంతుడూ, స్తుతిపాత్రుడూ (అయిన అల్లాహ్ యే) అవతరింపజేసిన గ్రంథం ఇది]. (ఖుర్ఆన్ 41: 42).

తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hvciJxQhK5Y [35 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త పవిత్ర ఖురాన్ యొక్క ఘనత, విశిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఖురాన్ అల్లాహ్ చేత పంపబడిన చివరి ఆకాశ గ్రంథమని, ఇది మానవాళికి రుజుమార్గం చూపే మార్గదర్శకమని తెలిపారు. పూర్వపు గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ కాలగర్భంలో కలిసిపోయినా లేదా మార్పులకు లోనైనా, ఖురాన్ మాత్రం అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఖురాన్ పఠనం ద్వారా కలిగే పుణ్యాలు, అది కఠినమైన హృదయాలను కూడా ఎలా మెత్తబరుస్తుందో ఉమర్ (రజిyయల్లాహు అన్హు), తుఫైల్ బిన్ అమర్ దౌసీ వంటి వారి జీవిత ఉదాహరణల ద్వారా వివరించారు. ఖురాన్ ను కంఠస్థం చేయడం (హిఫ్జ్) వల్ల కలిగే గొప్పతనం, ఇహపర లోకాలలో లభించే గౌరవం, మరియు ఇది ఆత్మకు, శరీరానికి ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలియజేశారు. చివరగా, ఖురాన్ ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం ద్వారా ముస్లింలు పొందే సాఫల్యాన్ని గుర్తుచేశారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడైన అల్లాహ్ యే కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఖురాన్ ఘనతల గురించి తెలుసుకోబోతున్నాం.

ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన విషయము. అయితే ఆకాశ గ్రంథము అని దేనిని అంటారు అన్న విషయాన్ని తెలుసుకొని మనం మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిద్దాం.

ఆకాశ గ్రంథము అంటే, భూమండలం మీద మానవులు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయి మార్గభ్రష్టులు అయిపోయారో, అలా దారి తప్పిపోయిన మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకొని రావడానికి సుబ్ హాన వ త’ఆలా మానవుల్లోనే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తల వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు. దైవదూత తీసుకొని వచ్చిన వాక్యాలు ప్రవక్త మానవులకు తెలియజేసి శిష్యుల ద్వారా రాయించారు, ఒకచోట భద్రపరిచారు. అలా భద్రపరచబడిన దైవ వాక్యాల సమూహాన్ని ఆకాశ గ్రంథము అంటారు, దైవ గ్రంథము అని అంటారు.

ఇలాంటి గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో అనేక చోట్ల అనేక గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. సుహుఫ్ ఇబ్రాహీమ్ అని, అలాగే తౌరాత్ అని, ఇంజీల్ అని, జబూర్ అని, ఖురాన్ అని ఇలా కొన్ని ఆకాశ గ్రంథాల దైవ గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో కనబడుతుంది.

సుహుఫ్ ఇబ్రాహీమ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడ్డాయి. తౌరాత్ గ్రంథము మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీల్ గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది.

అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ కు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలు, అది ఇంజీల్ కావచ్చు, జబూర్ కావచ్చు, తౌరాత్ కావచ్చు, సుహుఫ్ ఇబ్రాహీమ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి ఏవీ కూడా నేడు ప్రపంచంలో అసలు రూపంలో భద్రంగా లేవు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని మానవుల కల్పితాలకు గురి అయిపోయాయి. కానీ, ఖురాన్ లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో ఖురాన్ ని సుబ్ హాన వ త’ఆలా ఎలా సురక్షితంగా ఉంచాడో వివరంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతాను.

మొత్తానికి ఆకాశ గ్రంథం అంటే ఏమిటో అన్నది మనం తెలుసుకున్నాం. ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఆయన ద్వారా మనందరి వరకు సుబ్ హాన వ త’ఆలా ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని చేరవేర్చాడు.

అయితే ఈ ఖురాన్ గ్రంథానికి అనేక ఘనతలు ఉన్నాయండి. మొదటి ఘనత ఏమిటంటే, ఈ ఖురాన్ లోని ప్రతి అక్షరానికి బదులుగా పారాయణము చేస్తున్న భక్తునికి పది పుణ్యాల చొప్పున ఇవ్వబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ఉదాహరించి మరి తెలియజేసి ఉన్నారు. ఒక వ్యక్తి ‘అలిఫ్ లామ్ మీమ్’ అని పఠిస్తే, అతనికి ‘అలిఫ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘లామ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘మీమ్’ కి బదులుగా పది పుణ్యాలు, మొత్తం ముప్పై పుణ్యాలు అతనికి దక్కుతాయి అని ప్రవక్త వారు ఉదాహరించి మరి తెలియజేశారు.

ఆ ప్రకారంగా ఒక భక్తుడు ఖురాన్ లోని ఒక సూరా ఒక అధ్యాయం పఠిస్తే ఎన్ని పుణ్యాలు పొందుతాడు? ఒక్క పేజీ చదివితే ఎన్ని పుణ్యాలు దక్కించుకుంటాడు? ఒక్క పారా చదివితే ఎన్ని పుణ్యాలు అతనికి దక్కుతాయి? పూర్తి ఖురాన్ పారాయణము పూర్తి చేస్తే, అతను ఎన్ని లక్షల కోట్ల పుణ్యాలు సంపాదించుకుంటాడో ఆలోచించండి మిత్రులారా! ఇంతటి పుణ్యాలు మనిషికి దక్కేలా చేస్తున్న గ్రంథం ఒక ఖురాన్ మాత్రమే. ఇతర గ్రంథాలకు ప్రతి అక్షరానికి బదులుగా పదేసి పుణ్యాలు దక్కుతాయి అన్న ఘనత, విశిష్టత లేదు. ఒక్క ఖురాన్ కు మాత్రమే ఉంది కాబట్టి, ఇది ఖురాన్ యొక్క ఘనత, ప్రత్యేకత మిత్రులారా.

అలాగే ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ఆధారంగా మనం చూస్తే, ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము, నూట ఎనభై ఐదవ వాక్యంలో సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ
[హుదల్ లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ ఖాన్]
అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి.” (2:185)

స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ లో స్పష్టం చేసేసి ఉన్నాడు అని అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ ఖురాన్ మానవులందరికీ రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ప్రవక్త వారి కాలం నాటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేటికీ కూడా అనేక ఉదాహరణలు మనము చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు మనం ప్రవక్త వారి జీవిత కాలంలోని ఒక రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నాం ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారిది. ఈయన దౌస్ తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు ఒకసారి వచ్చారు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. అయితే మక్కా పెద్దలు ఆ రోజుల్లో ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న రోజులవి. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లి, “ముహమ్మద్ వారి మాట వినకండి, ముహమ్మద్ వారి మాట వింటే మీరు దారి తప్పిపోతారు, భార్య బిడ్డలకు దూరమైపోతారు, తల్లిదండ్రులకు దూరమైపోతారు” అని రకరకాలుగా ఆయనకు చెప్పి భయపెట్టేశారు. ఆయన ఆ మాటలన్నీ నిజమేమో అని నమ్మేసి, ప్రవక్త వారి మాటలు వినకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ తలిచిందే జరుగుతుంది అన్నట్టుగా, ఒకరోజు కాబా పుణ్యక్షేత్రం వద్ద ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉంటే, సమీపంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం ఆయన చెవిలో పడింది.

ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినేశారో, ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. “నేను చదువుకున్న వ్యక్తిని, ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ణయించుకోగలను. అలాంటప్పుడు ముహమ్మద్ వారి మాట నేను వినడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఆయన మాట విని చూస్తాను, మంచిదా కాదా అని నిర్ణయించుకుంటాను. అంతమాత్రాన నేను కంగారు పడటం ఎందుకు, దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకు?” అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడికి వెళ్లారు. చూస్తే ప్రవక్త వారు ఉన్నారు.

ప్రవక్త వారి వద్దకు వెళ్లి, “ఏమండీ! మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? మీరు చెబుతున్న ఏ మాటలను బట్టి ప్రజలు మీ గురించి ఈ విధంగా చెబుతున్నారు? ఆ మాటలు నాకు కూడా చెప్పండి” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, అటు ఇటు ఏమీ మాట్లాడకుండా ఖురాన్ లోని దైవ వాక్యాలు పఠించి వినిపించారు. ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటే, ఖురాన్ లోని దైవ వాక్యాలు ఆయన విన్న తర్వాత ఏమన్నారంటే: “నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చెబుతున్నది ఇది కవిత్వము కాదు, మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము కాదు. నేను కవిత్వము విని ఉన్నాను, నేను మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని. కానీ మీరు పలుకుతున్నది మాత్రం అది కవిత్వము కాదు, మంత్రతంత్రము కాదు, ముమ్మాటికీ ఇది దేవుని వాక్యము” అని అప్పటికప్పుడే ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయిపోయారు అల్హందులిల్లాహ్.

చూసారా! ఖురాన్ ద్వారా దారి తప్పిపోయిన వాళ్లు మళ్లీ దారి పైకి వచ్చేస్తారు. ఈ ఖురాన్ రుజుమార్గం వైపుకి దారి చూపిస్తుంది.

మరొక ఉదాహరణ విందాం. జిమాద్ అజ్దీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. ఈయన అజ్ద్ తెగకు చెందిన వాళ్లు. ఈయన కూడా మక్కాకు వచ్చారు. కాకపోతే ప్రవక్త వారితో ఆయనకు పరిచయం ఉంది. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లారు. ఈయన దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ! మీకు మంత్రించడం వచ్చు కాబట్టి, మీ మిత్రునికి పిచ్చి పట్టినట్లు ఉంది, ఏదేదో వాగుతూ ఉన్నాడు, కొంచెం మంత్రించి వైద్యము చేయొచ్చు కదా” అని చెప్పారు. ఆయన నిజమేమో అని నమ్మి, ప్రవక్త వారితో పరిచయం ఉండింది కాబట్టి చక్కగా ప్రవక్త వారి దగ్గరికి వెళ్లి, “ప్రజలు ఈ విధంగా మీ గురించి చెబుతున్నారు, అలాంటిది ఏమైనా మీకు సమస్య ఉంటే చెప్పండి, నేను మంత్రించి మీకు వైద్యం చేస్తాను” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు కూడా కూర్చోబెట్టుకొని, నేను ఏమి చెబుతున్నానో నువ్వు విను అని సూరా ఇఖ్లాస్, సూరా ఫలఖ్, చిన్న చిన్న సూరాలు – ‘ఖుల్ హువల్లాహు అహద్’ అని ఒక సూరా ఉంది కదా, అలాగే ‘ఖుల్ అరూజు బి రబ్బిల్ ఫలఖ్’ అని సూరా ఉంది కదా – ఈ చిన్న చిన్న సూరాలు పఠించి వినిపించగానే, వెంటనే ఆయన కూడా ప్రవక్త వారి సమక్షంలో సాక్ష్యం పలికారు. “అయ్యా! మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో నేను మంత్రాలు నేర్చుకొని ఉన్న వాడిని కాబట్టి, విని ఉన్న వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము ఎప్పటికీ కానే కాదు. అలాగే మీరు చెబుతున్నది ఇది కవిత్వము కూడా కాదు. ఇది స్పష్టమైన దేవుని వాక్యమే” అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి, కలిమా చదివి, అప్పటికప్పుడే ఆయన కూడా ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్.

రెండు ఉదాహరణలు ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేను వినిపించానండి. నేటికీ కూడా అనేకమంది వివిధ భాషలలో అనువాదం చేయబడి ఉన్న దైవ గ్రంథం ఖురాన్ ని చదువుతూ ఉన్నారు. చదివి అల్హందులిల్లాహ్ రుజుమార్గాన్ని పొందుతూ ఉన్నారు. అల్హందులిల్లాహ్ ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయిపోయాము, ఖురాన్ ను చదివి తెలుసుకున్నాము అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనేక ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూడవచ్చు మిత్రులారా.

మొత్తానికి ఖురాన్ కి ఉన్న ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా ప్రజలు రుజుమార్గం పైకి వస్తారు.

అలాగే ఖురాన్ ఎలాంటి తప్పులు లేని సురక్షితమైన గ్రంథము. ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
[జాలికల్ కితాబు లా రైబ ఫీహ్]
ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు.” (2:2)

అంటే ఇవి దైవ వాక్యాలు అన్న విషయంలో అనుమానానికి తావే లేదు అన్నారు. మరి అనుమానానికే తావు లేనప్పుడు తప్పులు దాంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పులు లేని గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రవక్త వారి కాలంలో కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన తర్వాత నుండి ఇప్పటివరకు కూడా ఎవరూ ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని నిరూపించలేకపోయారు. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అని ఎవరూ నిరూపించలేరు.

కానీ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాను. అదేమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రపంచానికి నిరూపించడానికి కొంతమంది ముస్లిమేతరులు, పండితులు ఖురాన్ ని పఠించారు. తప్పులు వెతకడానికి పఠించారు. పఠిస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు, చదువుతూ పోతూ ఉన్నారు. చివరికి ప్రభావితులైపోయి సురక్షితమైన గ్రంథం ఖురాన్, దైవ వాక్యాలతో నిండిన గ్రంథం ఖురాన్, సత్యమైన దేవుని గ్రంథం ఖురాన్ అని వారు కూడా అల్హందులిల్లాహ్ కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది పండితులు తప్పులు వెతకడానికి మాత్రమే ఖురాన్ చదివారు. కానీ అల్హందులిల్లాహ్ దారి పైకి వచ్చేశారు, ఇస్లాం స్వీకరించేశారు. ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అలాగే ఖురాన్ ద్వారా హృదయాలు మెత్తబడతాయి. కొంతమంది యొక్క మనస్తత్వం మరియు వారి గుండె చాలా గట్టిది. కానీ ఖురాన్ చదివితే ప్రజల గుండెలు, ప్రజల హృదయాలు మెత్తబడతాయి. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు మరియు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి, గట్టి మనుస్కుడు.

ఒకరోజు అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట దైవ వాక్యాలు వినేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉన్నారు. అల్లాహ్ తెలియజేసిన సూరా హాక్కా లోని వాక్యాలు.

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం. నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (69:41-43)

అవి విన్న తర్వాత కొంచెం ఇస్లాం వైపుకి, ప్రవక్త వారి వైపుకి మొగ్గు చూపించారు. కానీ మళ్లీ ఉదయాన్ని చూస్తే, మక్కా పెద్దలు రకరకాలుగా ప్రవక్త వారి గురించి చెబుతూ ఉంటే అయోమయంలో పడిపోయారు. మక్కా పెద్దలు చెబుతున్నది నమ్మాలా? లేదా ప్రవక్త ముహమ్మద్ వారు చెబుతున్నది నమ్మాలా? తేల్చుకోలేకపోతున్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, చిరాకు వచ్చేసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే ముహమ్మద్ వారిని చంపేస్తే సరిపోతుంది అని కత్తి పట్టుకొని బయలుదేరిపోయారు.

దారిలో నుఐమ్ అనే ఒక వ్యక్తి చూసుకున్నారు. చూసుకొని “ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగారు. “ముహమ్మద్ వారిని చంపడానికి” అని చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “అయ్యా, ముహమ్మద్ వారి విషయం తర్వాత, ముందు మీ చెల్లెలు ఫాతిమా, మీ బావ సయీద్, వాళ్లిద్దరూ కూడా ఇస్లాం స్వీకరించేశారు, నీకు తెలుసా?” అని చెప్పారు. ముందే కోపంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో చెల్లెలు, బావ ఇద్దరు కూడా ఆయనకు తెలియకుండానే ఇస్లాం స్వీకరించేశారు అన్న మాట వినగానే, కోపం రెట్టింపు అయిపోయింది. మరింత కోపంలో ఆయన అక్కడి నుంచి చక్కగా చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.

ఆ సమయానికి ఖబ్బాబ్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఉమర్ వారి చెల్లెలకు, బావకు ఖురాన్ నేర్పిస్తూ ఉన్నారు. శబ్దం విని ఆయన, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఇంట్లో దాక్కున్నారు. చెల్లెలు బావ ఇద్దరూ కూడా ఆ ఖురాన్ పత్రాలు దాచిపెట్టేసి తర్వాత తలుపు తెరిచారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు కోపంలో ఉన్నారు, ఆ పారాయణము చేసే శబ్దం కూడా వినేసి ఉన్నారు. “నేను శబ్దం విన్నాను, అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. మీరు తాతముత్తాతల ధర్మాన్ని వదిలేశారంట, ముహమ్మద్ తీసుకొని వచ్చిన కొత్త ధర్మాన్ని మీరు అంగీకరించేశారంట. ఏదో మీరు చదువుతూ ఉన్నారు, నేను శబ్దం బయటి నుంచి విన్నాను” అని అలా ఎందుకు చేశారు అని కొట్టడం ప్రారంభించేశారు. బావను చితకబాదేశారు, చెల్లెలను చితకబాదేశారు. చివరికి చెల్లె తలకు గాయమయింది. ఆమె తిరగబడి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి సమాధానం ఇస్తూ, “ఓ ఉమర్! నువ్వు వినింది నిజమే. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను విన్నాము, నమ్మాము, విశ్వసించాము. ఇక నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ఇక మేము మాత్రము ఆ మార్గాన్ని వదిలేది లేదు, ఆ ధర్మాన్ని వదిలేది లేదు” అని చెప్పేశారు.

చెల్లెలు తిరగబడి మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కొంచెం వెనక్కి తగ్గి, ఆశ్చర్యపోయి, “ఏంటమ్మా! మీలో ఇంత మార్పు తీసుకొని వచ్చిన ఆ మాటలు ఏమిటి? నాకు కూడా వినిపించండి” అన్నారు. “చెల్లెలు ముందు మీరు వెళ్లి స్నానం చేసుకొని రండి” అంటే, వెళ్లి స్నానం చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఖురాన్ పత్రాలలో సూరా తాహా కు చెందిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ వాక్యాలు చదివారు. ఆ వాక్యాలు చదివి ఎంత ప్రభావితులైపోయారంటే, “ముహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను కూడా వెళ్లి ఆయన మాటను అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పారు.

ఆ మాట వినగానే అక్కడ దాక్కొని ఉన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు బయటికి వచ్చి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి శుభవార్త తెలియజేశారు. “ఓ ఉమర్! మీకు శుభవార్త ఏమిటంటే, కొద్ది రోజుల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేసి ఉన్నారు. ‘ఓ అల్లాహ్! ముస్లింలకు, ఇస్లాంకు ఉమర్ లేదా అబూ జహల్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి హిదాయత్ ప్రసాదించి బలం ఇవ్వు’ అని కోరి ఉన్నారు. అల్లాహ్ మీ అదృష్టంలో, మీ విధిరాతలో ఇస్లాం యొక్క భాగ్యం రాసాడని నాకు తెలుస్తూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారే అరఖమ్ లో ఫలానా చోట సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లండి” అనగానే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు అక్కడికి వెళ్లారు.

అక్కడ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు, విద్య నేర్చుకుంటూ ఉన్నారు, ఇస్లామీయ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఉమర్ వచ్చేసాడు అని తెలియగానే కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన కోపిష్టుడు, ఇస్లాం స్వీకరించలేదు. ఏం ఉద్దేశంతో వచ్చారో, ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “ఆయన్ని నా దగ్గరికి రానియ్యండి” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన వెళ్లారు. వెళ్లిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు.

ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరిస్తున్న దృశ్యాన్ని, అక్కడ కూర్చొని భయపడుతూ ఉన్న ఆ శిష్యులందరూ, సహాబాలు చూసి ఒక్కసారిగా ఎంత సంతోషపడిపోయారంటే, బిగ్గరగా “అల్లాహు అక్బర్” అని పలికారు. వారందరూ పలికిన ఆ శబ్దము మక్కా వీధుల వరకు కూడా వెళ్లింది.

అంటే అర్థం ఏమిటండీ? ఖురాన్ చదివి, అప్పటికే చంపాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎంత మారుమనసు పొందారంటే, ఆయన హృదయం ఎంతగా మెత్తబడిపోయింది అంటే, వచ్చి ప్రవక్త వారి శిష్యుడిగా మారిపోయారు. ప్రవక్త వారిని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి, దారిలో ఖురాన్ వాక్యాలు చదివారు, ప్రవక్త వారి వద్దకు వచ్చి శిష్యుడిగా మారిపోయారు. చూసారా! కాబట్టి ఖురాన్ పారాయణము ద్వారా హృదయాలు మెత్తబడతాయి అనటానికి ఇది గొప్ప ఉదాహరణ మిత్రులారా.

అలాగే ఖురాన్ కి చాలా ఘనతలు ఉన్నాయండి. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవలసి ఉంది కాబట్టి, క్లుప్తంగా ఇన్షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ సురక్షితమైన గ్రంథం. ఇంతవరకే మనం విని ఉన్నాం, ఇతర గ్రంథాలన్నీ కూడా కల్పితాలకు గురైపోయాయి, లేదా కాలగర్భంలో కలిసిపోయాయి అని. కానీ ఖురాన్ అలా కాదు. ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది. ఖురాన్ గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
[ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్]
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” (15:9)

మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని సురక్షితంగా ఉంచుతూ ఉన్నాము అన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు అన్నది రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇండియాలో ఖురాన్ చూడండి, అరేబియా దేశాలలోని ఖురాన్ చూడండి, యూరప్ దేశాలలో ఖురాన్ చూడండి, ఇతర ఖండాలలో, ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఖురాన్ ఉన్నా మీరు చూడండి, ప్రతి చోట మీకు ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది.

ఒక దేశంలో వంద సూరాల ఖురాన్, మరొక దేశంలో యాభై సూరాల ఖురాన్, మరొక దేశంలో నూట పద్నాలుగు సూరాల ఖురాన్ – కనిపించదు. పూర్తి ప్రపంచంలో నూట పద్నాలుగు సూరాలు, నూట పద్నాలుగు అధ్యాయాలు కలిగిన ఖురాన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. అదే మీరు వేరే గ్రంథాలని చూడండి. వేరే గ్రంథాలు మీరు చూస్తే, ఒక దేశంలో కొన్ని పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తే, మరొక దేశంలో అంతకు మించిన పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తుంది. ఒకచోట ఎక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము, మరొక చోట తక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము. వీళ్లేమంటారంటే అందులో ఎక్కువైపోయింది అంటారు. వాళ్లేమంటారంటే అందులో కొన్ని తీసేశారు అంటారు. మొత్తానికి తీయటమో లేదా జొప్పించటమో జరిగింది స్పష్టంగా.

కానీ ఖురాన్ లో అలా జరగలేదు. పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్ ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది. ఇది ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.

మరొక ఉదాహరణ, అదేంటంటే: నేడు భూమండలం మీద మస్జిద్ లలో గాని, మదరసాలలో గాని, లైబ్రరీలలో గాని, ఇంకా ఎక్కడైనా గాని ఖురాన్ ఉంది అంటే, ఆ ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని వెళ్లి ఒక సముద్రంలో పడవేసేస్తే, ఖురాన్ గ్రంథము ప్రపంచంలో నుంచి తొలగిపోదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాగితాలలోనే ఈ ఖురాన్ భద్రంగా లేదు, మానవుల గుండెల్లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని భద్రంగా ఉంచి ఉన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏడు సంవత్సరాల కుర్రాడు, తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, పూర్తి ఖురాన్ గ్రంథం “అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్” నుంచి మొదలెట్టి “ఖుల్ అరూజు బి రబ్బిన్ నాస్” అనే సూరా వరకు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. ఇలా ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్లను ‘హుఫ్ఫాజ్‘ అని అంటారు. ఇలాంటి హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో అల్హందులిల్లాహ్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్.

పూర్తి కాగితాలలో ఉన్న ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని పోయి సముద్రంలో పడవేసినా, ఈ ఖురాన్ ని కంఠస్థం చేసిన ఈ హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్లు మళ్లీ మరుసటి రోజే ఖురాన్ ని మళ్లీ రాయగలరు, ముద్రించగలరు, సిద్ధం చేసుకోగలరు. కాబట్టి ఖురాన్ ప్రపంచంలో నుంచి తొలగిపోదు, అది కాగితాలలోనే కాదు, హృదయాలలో కూడా భద్రంగా ఉంది. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖురాన్ ని సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు.

ఒక ప్రశ్న, అదేమిటంటే: ఖురాన్ గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఖురాన్ కాకుండా వేరే గ్రంథాలు ఇవి కూడా దేవుని గ్రంథమే అని పలుకుతున్నారు కదా, అందులోని సగం గ్రంథం ప్రపంచం లోనుంచి తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేస్తే, ఆ సగం గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? లేదా పావు గ్రంథాన్ని కూడా చూడకుండా కంఠస్థం చేసిన వాళ్లు ప్రపంచంలో ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఖురాన్ ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత భద్రంగా ఏ విధంగా ఉంచాడో చూడండి, ఇది ఖురాన్ యొక్క ఘనత మరియు ప్రత్యేకత.

అలాగే ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవం, పరలోకంలో కూడా గౌరవం దక్కించుకుంటాడు భక్తుడు, విశ్వాసుడు. ఎలాగంటే చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا
[ఇన్నల్లాహ యర్ ఫఉ బిహాజల్ కితాబి అఖ్వామన్]
“నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతులకు (లేదా సముదాయాలకు) సాఫల్యం ప్రసాదిస్తాడు (గౌరవం ప్రసాదిస్తాడు).”

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు]
“మీలో ఎవరైతే ఖురాన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో, వారు సమాజంలోని ఉత్తమమైన వాళ్లు” అని చెప్పేశారు.

ఉత్తమమైన వారు అన్న యొక్క ఘనత, గౌరవం వారికి ప్రపంచంలో దక్కింది. దీనికి ప్రాక్టికల్ గా ఒక మాట చెబుతాను చూడండి. మనం ప్రతిరోజు మస్జిద్ కి వెళ్తాం. నమాజు ఐదు పూటలా ఆచరిస్తాం. ఇమాం గారు ఫర్జ్ నమాజు ఆచరిస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. వెనకాల నిలబడిన వాళ్లలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రిన్సిపల్ లు ఉంటారు, పండితులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇంకా ఏదేదో నేర్చుకొని ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్లందరూ వెనుక ఉంటే, వారి ముందర ఒక వ్యక్తి ఇమాం గా నిలబడి అందరికీ నమాజు చేయిస్తారు. ఆయన దగ్గర ఇంజనీరింగ్ పట్టా ఉండదు, అలాగే డాక్టర్ పట్టా ఉండదు, ఆయన గొప్ప కోటీశ్వరుడు కూడా కాడు. కానీ అందరి ముందర నిలబడి అందరికీ నమాజు చేయించే గౌరవం ఆయనకు దక్కుతా ఉంది అంటే ఆయన దగ్గర ఏముందో తెలుసా? ఆయన హృదయంలో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఆ గౌరవం ఇచ్చాడు. ఆయన గురువుగా అందరికీ నమాజు చేయిస్తారు, అందరూ ఆయనను గౌరవిస్తూ ఆయన వెనకాల నమాజు చేసుకొని వస్తారు. అల్హందులిల్లాహ్, ప్రపంచంలో ఇది అల్లాహ్ ఇచ్చిన గౌరవం.

పరలోకంలో కూడా గౌరవం దక్కుతుంది. అదేంటో కూడా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: ఎప్పుడైతే లెక్కంపు రోజు వస్తుందో, ఆ లెక్కంపు రోజున ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్! ఫలానా భక్తుడు ప్రపంచంలో ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు, అందులో ఉన్న విషయాల ప్రకారం అమలు పరిచాడు కాబట్టి ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా చేయండి”.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా గౌరవ కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఒక రాజు పిలిచి ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చేస్తే దాన్ని ఎంత గౌరవంగా భావిస్తాడు మనిషి? పేపర్లలో, న్యూస్ ఛానల్ లలో ప్రతి చోట అదే సంచలనమైన వార్తగా మారిపోతుంది. ఆయన ఫలానా అవార్డు దక్కించుకున్నాడు, ఫలానా ప్రధాని చేతి మీద లేదా రాజు చేతి మీద ఆ అవార్డు ఆయన తీసుకున్నాడు చూడండి, చూడండి అని ప్రతి వీడియోలో ఆయనదే వీడియో, ప్రతి పేపర్లలో ఆయనదే ఫోటో కనిపిస్తుంది. కానీ పూర్తి ప్రపంచానికి రారాజు, విశ్వానికి మొత్తానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆ రోజు మానవులందరి ముందర ఆ భక్తుని తల మీద కిరీటం ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అంటుంది: “ఓ అల్లాహ్! మరింత గౌరవం వచ్చేలాగా ఆయనకి గౌరవించండి” అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఖరీదైన బట్టలు ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడుగుతుంది: “ఓ అల్లాహ్! ఇతని తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చేలాగా చేయండి” అంటే, అప్పుడు ఆ భక్తుని యొక్క తల్లిదండ్రులకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరి ముందర కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ప్రపంచంలో ఖురాన్ నేర్పిస్తారో, ఖురాన్ ప్రకారంగా జీవించుకోవడానికి మార్గదర్శకత్వం చేస్తారో, అలాంటి తల్లిదండ్రులు కూడా పరలోకంలో లెక్కంపు రోజున గౌరవం పొందుతారు మిత్రులారా.

ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవము ఉంది, పరలోకంలో కూడా గౌరవము ఉంది. ఖురాన్ ను కాకుండా వేరే గ్రంథాల వలన ఇలాంటి గౌరవం కలుగుతుంది అన్న విశిష్టత ఉందా? లేదు. ఒక ఖురాన్ కు మాత్రమే ఉంది, ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతేకాదండి, ఖురాన్ కి ఉన్న మరో ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా మానవుడు స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటాడు. ఎలాగా? ఎలాగంటే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గానికి చేరినప్పుడు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని, కంఠస్థం చేసి, పఠించి, దాని ప్రకారంగా అమలు పరిచిన భక్తులతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటాడు: “ఓ భక్తుడా! ఎలాగైతే నీవు ప్రపంచంలో ప్రశాంతంగా ఖురాన్ పారాయణము చేసేవాడివో, ఈరోజు స్వర్గంలో కూడా ఖురాన్ పారాయణము చేస్తూ పో మరియు స్వర్గం యొక్క స్థానాలు ఎక్కుతా పో” అని చెప్పేస్తాడు. అతను ఖురాన్ పారాయణము మొదలెట్టి, స్వర్గపు యొక్క స్థాయులు ఎక్కుతా పోతాడు. ఎక్కడైతే ఆయన ఖురాన్ పారాయణము పూర్తి అయిపోతుందో, అప్పటివరకు ఎంత పైకి వెళ్ళిపోతాడో, అంత పైకి వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోతాడు. అల్లాహు అక్బర్! ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతే కాదండి, ఖుర్ఆను ద్వారా సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ పారాయణం చేస్తారో, ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు సూరా ముల్క్ 67వ అధ్యాయాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకు సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

చూశారా? ప్రపంచంలో గౌరవం, సమాధి శిక్షల నుండి రక్షణ, మరియు పరలోకంలో గౌరవం, స్వర్గంలోని ఉన్నత స్థానాలు, ఎన్ని ఘనతలు దక్కుతున్నాయో చూడండి మిత్రులారా ఈ ఖుర్ఆన్ ద్వారా. మరి,

ఖుర్ఆను ద్వారా మనుషులు స్వస్థత కూడా పొందగలరు. పదిహేడవ అధ్యాయం 82వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.” (17:82)

అంటే, ఇది స్వస్థత ఇస్తుంది అని అన్నారు. మనిషికి శారీరక వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. హృదయాలలో మనిషికి అసూయ, అహంకారం, ఇలాంటి కుళ్ళు బుద్దులు, కొన్ని దురలక్షణాలు ఉంటాయి, అవి హృదయాలలో ఉంటాయి. ఖుర్ఆన్ పఠిస్తే, ఖుర్ఆన్ ప్రకారంగా నడుచుకుంటే ఆ రోగాలన్నీ దూరమైపోతాయి, మనిషి స్వస్థత పొందుతాడు, మంచి స్వభావము కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. అలాగే శారీరక వ్యాధులకు కూడా ఖుర్ఆన్ పారాయణము ద్వారా స్వస్థత లభిస్తుంది అని తెలియజేయడం జరిగి ఉంది.

అంతే కాదండి, మనిషికి మేలు చేసే అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ లో తెలియజేసి ఉన్నాడు. కాకపోతే దాని బాగా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఖుర్ఆన్ చదివి చూడండి. ప్రపంచం ఎలా మొదలైందో కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం మొదలైన తర్వాత నేటి వరకు ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రళయం వరకు ఏమేమి సంభవిస్తాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత మరణానంతరం ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి అవసరమైన అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇందులో తెలియజేశేశాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, ఏమండీ, సైన్స్ గురించి కూడా ఉందా ఖుర్ఆన్ లో అంటారు. సైన్స్ గురించి కూడా ఉంది. ఖుర్ఆన్ మరియు సైన్స్ అనే ఒక పుస్తకం ఉంది, అది చదవండి ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి పరిశీలించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులారా.

ఇక చివరిగా మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము ఎవ్వరూ సృష్టించలేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పదిహేడవ అధ్యాయము 88వ వాక్యంలో తెలియజేశాడు, మానవులందరూ కలిసిపోయినా, మానవులతో పాటు జిన్నాతులు, షైతానులు కూడా కలిసిపోయినా, అందరూ కలిసి ప్రయత్నించినా ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము తయారు చేయలేరు.

అలాగే, ఖుర్ఆన్ సులభమైన గ్రంథము. యాభై నాలుగవ అధ్యాయము 22వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వలఖద్ యస్సర్నల్ ఖుర్ఆన. మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని సులభతరం చేసేశాము అని అన్నారు. కాబట్టి ఖుర్ఆను గ్రంథాన్ని పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు, పురుషులు, మహిళలు, అందరూ కూడా ఖుర్ఆను గ్రంథాన్ని నేర్చుకోవచ్చు, చదవవచ్చు, కంఠస్థం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అల్ హందులిల్లాహ్.

మిత్రులారా, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహిమలు, ఘనతలు, ప్రత్యేకతలు కలిగిన ఖుర్ఆను గ్రంథాన్ని చదువుకొని, కంఠస్థం చేసుకొని, అర్థం చేసుకొని, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖుర్ఆను ద్వారా ప్రపంచంలోనూ, పరలోకంలోనూ గౌరవమైన స్థానాల వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30451

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]
https://youtu.be/xe-0DyNUTCQ [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జామిఅ్ హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా జుల్ఫీ(KSA)లో షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్‌లాల్ ఇచ్చిన జుమా ఖుత్బా అనువాదం

ఖుర్’అన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

ఖుర్ఆన్ పారాయణ మహత్యం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ పారాయణ మహత్యం
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s24pAH6baPY [23 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఘనత గురించి వివరించారు. ఖురాన్ అనేది హితోపదేశం, స్వస్థత, మార్గదర్శకత్వం మరియు కారుణ్యంతో కూడిన అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం అని ఆయన పేర్కొన్నారు. ఖురాన్ పారాయణం చేసేవారికి, దాన్ని నేర్చుకుని, నేర్పించేవారికి లభించే గొప్ప ప్రతిఫలాలను ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త హదీసుల ద్వారా వివరించారు. ఖురాన్ పారాయణ సభల యొక్క ఘనత, ప్రళయ దినాన ఖురాన్ తన సహచరులకు సిఫారసు చేయడం, మరియు స్వర్గంలో ఖురాన్ సహచరుడి ఉన్నత హోదా గురించి కూడా చర్చించారు. ఖురాన్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పట్ల మరియు అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే వ్యక్తి పట్ల అసూయ పడటం అనుమతించబడిందని తెలిపారు. చివరగా, ఖురాన్‌ను విడిచిపెట్టిన వారి పశ్చాత్తాపాన్ని మరియు ‘ఖురాన్ నేర్చుకుని, ఇతరులకు నేర్పించేవారే మీలో ఉత్తములు’ అనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

أَلْحَمْدُ لِلّٰهِ نَحْمَدُهُ وَنَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ
[అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త’ఈనుహూ వ నస్తగ్ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్]
సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయననే క్షమాపణ కోరుతున్నాము, ఆయనపైనే విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే భారం మోపుతున్నాము.

وَنَعُوْذُ بِاللهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా]
మరియు మేము మా ఆత్మల కీడుల నుండి మరియు మా చెడు కార్యాల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహ్]
అల్లాహ్ ఎవరికైతే మార్గనిర్దేశం చేస్తాడో, అతనిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన ఎవరిని తప్పుదారి పట్టిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
[వ అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహ్]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైక దేవుడు మరియు ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيْثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’ద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా అన్ని మాటలలో కెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్). మరియు అన్ని మార్గాలలో కెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గం.

وَشَرَّ الْأُمُوْرِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో కెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం బిద్అత్ (ధర్మంలో నూతన ఆవిష్కరణ). మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు, ఉపకారం చేశాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఖురాన్ గ్రంథం అవతరణ. ఖురాన్ అవతరణ ద్వారా ఈ ఉమ్మత్ పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసిన గొప్ప ఉపకారాలలో ఒకటి. ఈ ఖురాన్ గ్రంథంలో మౌఇదా, హితోపదేశం ఉంది. షిఫా, స్వస్థత ఉంది. హుదా, మార్గదర్శకం ఉంది. రహ్మా, కారుణ్యం ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ లో ఇలా తెలియజేశాడు.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
“ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసుగుతుంది. మరియు నమ్మే వారి కోసం మార్గదర్శకం చూపుతుంది (మరియు కారుణ్యం).”

ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దానిలో ఏముంది? అది మనం తెలుసుకోవాలి. చదివి, అర్థం చేసుకొని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
“అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది, అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.”

يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

అంటే ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దాని ద్వారా, ఖురాన్ ద్వారా, ఈ జ్యోతి ద్వారా, ఈ నూర్ ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన కోరిక మేరకు వారిని చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాడు, ఈ ఖురాన్ ద్వారా, ఈ నూర్, ఈ జ్యోతి ద్వారా.

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. (35:29)

అంటే, ఈ జ్యోతిని, ఈ స్పష్టమైన గ్రంథాన్ని, ఈ ఖురాన్‌ని పఠిస్తూ నమాజును నెలకొల్పే వారు, ఖురాన్ పారాయణం, ఖురాన్ పఠనం, అలాగే నమాజును నెలకొల్పే వారు, వారిని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను, బహిరంగంగాను ఖర్చు చేసేవారు. అంటే ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూడు విషయాలు తెలియజేశాడు. ఒకటి, ఖురాన్ గ్రంథాన్ని పఠించేవారు, పారాయణం చేసేవారు. రెండవది, నమాజును నెలకొల్పేవారు. మూడవది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన వాటిలో గోప్యంగా, బహిరంగంగా దానం చేసేవారు, ఖర్చు పెట్టేవారు. వారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.

దీని సారాంశం ఈ ఆయత్ యొక్క.

لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ

వారికి వారి ప్రతిఫలాలు పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను, (అంటే ఈ గుణాలు, ఈ లక్షణాలు కలిగిన వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.) నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.(35:30)

అభిమాన సోదరులారా, ఇప్పటివరకు మనం ఖురాన్ ఆయతులు లో కొన్ని ఖురాన్ గురించి, దైవ గ్రంథం గురించి తెలుసుకున్నాం.

ఈ ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్చుకోవటం, ఖురాన్‌ని నేర్పించటం. దీని గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అబూ హురైరా రది అల్లాహు త’ఆలా అన్హు కథనం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్తమ’అ ఖౌమున్ ఫీ బైతిమ్ మిమ్ బుయూతిల్లాహి యత్లూన కితాబల్లాహి వ యతదారసూనహూ బైనహుమ్ ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్హుముల్ మలాయికతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

ఈ జ్యోతి గురించి, ఈ ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి, జమా అయి, దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ కేవలం పారాయణం మాత్రమే కాదు. యతదారసూనహూ దాన్ని గురించి పరస్పరం చర్చించుకునేవారు అంటే నేర్చుకునేవారు, నేర్పించేవారు. ఒకరికొకరు అర్థం చేసుకునేవారు, అర్థం చెప్పేవారు, నేర్చుకునేవారు, నేర్పించేవారు. అల్లాహ్ తరఫు నుండి వారి మీద ప్రశాంతత ఆవరిస్తుంది, మొదటి ప్రయోజనం, మొదటి ప్రతిఫలం. ఒకచోట జమా అయి ఖురాన్ పారాయణం చేస్తూ దాన్ని చర్చించుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే అల్లాహ్ యొక్క ప్రశాంతత వారి మీద ఆవరిస్తుంది, అల్లాహ్ తరఫు నుండి. రెండవది, అల్లాహ్ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. మూడవది, దైవదూతలు వారిని చుట్టుముడతారు. నాలుగవది, ఇంకా వారిని గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని దైవదూతల దగ్గర వారికి పరిచయం చేస్తాడు.

ఇది ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్పించడం గురించి.

అలాగే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి ఇలా అన్నారు, “ఇన్న లిల్లాహి అహ్లీన మినన్నాస్” (నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు ఉన్నారు). జనులలో అల్లాహ్ దాసులలో కొందరు అహ్లుల్లాహ్ (అల్లాహ్ ప్రజలు) ఉన్నారు. అల్లాహ్ కు చెందిన వారు. ఈ మాట విని సహాబాలు ప్రశ్నించారు, “ఓ దైవ ప్రవక్తా, మన్ హుమ్?” (వారెవరు?). ఆ అహ్లుల్లాహ్ అనే వారు, అహ్లుల్లాహ్ అనబడే వారు, అల్లాహ్ కు చెందిన వారు, వారెవరు? అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. వారు, “హుమ్ అహ్లుల్ ఖురాన్” (వారు ఖురాన్ ప్రజలు). వారే అహ్లె ఖురాన్, ఖురాన్ వారు అల్లాహ్ కు చెందిన వారు. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ పఠించే వారు, ఖురాన్ పారాయణం చేసే వారు, ఖురాన్ ని నేర్చుకునే వారు, ఖురాన్ ని అర్థం చేసుకునే వారు, ఖురాన్ ని నేర్పించే వారు, వారు అహ్లుల్ ఖురాన్. వారి జీవితం ఖురాన్ పరంగా ఉంటుంది. వారే, “అహ్లుల్లాహి వ ఖాస్సతుహు” (అల్లాహ్ యొక్క ప్రజలు మరియు ఆయన ప్రత్యేకమైన వారు). వారే అల్లాహ్ కు చెందిన వారు, వారే అల్లాహ్ కు ప్రత్యేక దాసులు. ఇది ఖురాన్ పారాయణం యొక్క మహత్యం.

అభిమాన సోదరులారా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు త’ఆలా అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
[ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వ యద’ఉ బిహీ ఆఖరీన్]
నిశ్చయంగా, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథం ఆధారంగా, ఈ ఖురాన్ మూలంగా కొన్ని జాతుల్ని ఉన్నత స్థితికి లేపుతాడు. ఈ ఖురాన్ మూలంగానే కొన్ని జాతుల్ని అధోగతి పాలు చేస్తాడు.

అంటే ఖురాన్ పారాయణం చేసే వారికి, ఖురాన్ అర్థం చేసుకునే వారికి, ఖురాన్ ని నేర్పించే వారికి, ఖురాన్ పరంగా తమ జీవితం గడిపే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఎవరైతే ఖురాన్ ని విడనాడుతారో, వదిలేస్తారో, ప్రక్కన పెట్టేస్తారో, పట్టించుకోరో అటువంటి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అధోగతి పాలు చేస్తాడు, అగౌరవాన్ని పాలు చేస్తాడు.

ఈ ఖురాన్ గ్రంథం ఇహలోకంలో మరియు పరలోకంలో, ఈ ఇహపరలోకాలలో ఖురాన్ మూలంగా మనుషుల గౌరవం, స్థానం ఎన్నో రెట్లు, ఎంతగానో పెరిగిపోతుంది.

ప్రళయ దినాన ఖురాన్ గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అబూ ఉమామా రది అల్లాహు అన్హు అంటున్నారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నాను.

اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ
[ఇఖ్రవుల్ ఖురాన ఫ ఇన్నహూ య’తీ యౌమల్ ఖియామతి షఫీ’అన్ లి అస్ హాబిహీ]
“ఓ దైవ దాసులారా, ఖురాన్‌ను పఠించండి, పఠిస్తూ ఉండండి. అత్యధికంగా ఖురాన్ పారాయణం చేయండి. ఎందుకంటే ప్రళయ దినాన ఖురాన్ గ్రంథం తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారుగా వస్తుంది.”

అల్లాహు అక్బర్. రేపు ప్రళయ దినాన భయంకరమైన రోజు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు కుడి చేతిలో కర్మల పుస్తకం ఇస్తాడో, ఎడమ చేతిలో ఇస్తాడో తెలియదు. ఆ రోజు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వేరే వారి గురించి పట్టించుకోరు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, ఇందస్ సిరాత్ (పుల్ సిరాత్ దాటే సమయంలో), ఇందల్ కితాబ్ (కర్మల పుస్తకం ఇచ్చే సమయంలో), ఇందల్ మీజాన్ (కర్మలు తూచే సమయంలో). కర్మలు ఇది చేసే సమయంలో, ఎవరి కర్మలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి కర్మలు తక్కువగా ఉన్నాయి, త్రాసులు, కర్మల, కర్మల త్రాసులు వేసే సమయంలో. ఈ మూడు సందర్భాలలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ మూడు సందర్భాలలో నేను నా గురించి తప్ప ఇతరుల గురించి నాకు ఆలోచన రాదు అని ఎవరికి అంటున్నారు? ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా గారిని అంటున్నారు. అటువంటి సమయంలో ఖురాన్ అత్యధికంగా పఠించే వారికి ఖురాన్ ఆ రోజు సిఫారసు చేస్తుంది.

అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు.

يُقَالُ لِصَاحِبِ الْقُرْآنِ اقْرَأْ وَارْتَقِ وَرَتِّلْ كَمَا كُنْتَ تُرَتِّلُ فِي الدُّنْيَا فَإِنَّ مَنْزِلَتَكَ عِنْدَ آخِرِ آيَةٍ تَقْرَأُ بِهَا
[యుఖాలు లి సాహిబిల్ ఖురాన్, ఇఖ్ర’ వర్తఖి వర్రత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా, ఫ ఇన్న మన్జిలతక ఇంద ఆఖిరి ఆయతిన్ తఖ్రవుహా]

“రేపు ప్రళయ దినాన ఖురాన్ వారితో ఇలా అనడం జరుగుతుంది. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ ని పఠించేవారు. ఖురాన్ పారాయణం చేసేవారు అత్యధికంగా. ఖురాన్ ను అర్థం చేసుకునేవారు. ఖురాన్ పరంగా ఆచరించే వారు. సాహిబె ఖురాన్ తో, ఖురాన్ వానితో ఇలా అనబడుతుంది, ఏమని? ‘ఇఖ్ర’’, ఓ ఖురాన్ వాడా, ఓ ఖురాన్ కి చెందిన వాడా, ‘ఇఖ్ర’’ పఠిస్తూ ఉండు. ‘వర్తఖి’, ‘వరత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా’ నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖురాన్ పఠించినట్లు ఎప్పుడూ కూడా అలాగే పఠిస్తూ పైకెళ్తూ ఉండు. అలా పఠిస్తూ వెళ్తూ ఎక్కడ పఠనం, పారాయణం చేయటం ఆపుతావో ఆ చివరి ఆయత్ దగ్గరే నీ అంతస్తు ఉంటుంది.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, పాపాలలో అసూయ అనేది ఘోరమైన పాపం. పెద్ద పాపం. కానీ రెండు విషయాలలో లేదా రెండు వ్యక్తుల, రెండు రకాల వ్యక్తుల విషయంలో అసూయ చెందవచ్చు, అనుమతి ఉంది. అదేమిటి?

لَا حَسَدَ إِلَّا فِي اثْنَتَيْنِ
[లా హసద ఇల్లా ఫిస్నతైన్]
“ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు”

ఘోరమైన పాపం అసూయ. కానీ ఇద్దరి పట్ల అసూయ చెందవచ్చు.

رَجُلٌ آتَاهُ اللَّهُ الْقُرْآنَ فَهُوَ يَقُومُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[రజులున్ ఆతాహుల్లాహుల్ ఖురాన ఫహువ యఖూము బిహీ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
ఒకడు, అల్లాహ్ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాడు, రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి.

ఖురాన్ పఠించే వ్యక్తి, ఖురాన్ పరంగా ఆచరించే వ్యక్తి, ఖురాన్ నేర్పించే వ్యక్తి విషయంలో అసూయ చెందవచ్చు. అలాగే రెండో వ్యక్తి ఎవరు?

وَرَجُلٌ آتَاهُ اللَّهُ مَالًا فَهُوَ يُنْفِقُهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[వ రజులున్ ఆతాహుల్లాహు మాలన్ ఫహువ యున్ఫిఖుహూ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
రెండవ వ్యక్తి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి.

ఈ ఖురాన్ కి చెందిన వ్యక్తి, ఈ దానం చేసే వ్యక్తి, వీరిద్దరి విషయంలో అసూయ పడవచ్చు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో ఖురాన్ లో కొన్ని ఆయతుల అర్థం తెలుసుకుని ముగిద్దాం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. దుర్మార్గుడు పరలోకంలో వాడు ఎవడు అనేది మనకు తెలుస్తుంది.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا

ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!” (25″27)

ఆ రోజు, ప్రళయ దినాన, ఎవ్వరూ ఎవరికీ పనికి రారు. సహాయం చేయరు, చేయలేరు. భార్య అయినా, సంతానం అయినా, అమ్మ నాన్న అయినా, బంధువులైనా ఎవ్వరైనా సరే, సిరిసంపదలైనా, హోదా అయినా ఏదీ పనికి రాదు. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ, బాధతో, దుఃఖంతో తనను తాను నిందించుకుంటూ, “అయ్యో, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది.”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا
“అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.” (25:28)

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسانِ خَذُولًا
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!” (25:29)

“నా వద్దకు ఉపదేశం వచ్చింది. ‘అద్-దిక్ర్’ వచ్చింది, ఖురాన్ వచ్చింది. కానీ వాడు నాకు ఖురాన్ నుంచి దూరం చేశాడు. నా దగ్గరకు అల్లాహ్ ‘దిక్ర్’ పంపించాడు. ఖురాన్ వచ్చింది, హితోపదేశం వచ్చింది, ‘దిక్ర్’ వచ్చింది, మౌఇదా వచ్చింది, రహ్మా వచ్చింది. ఇవన్నీ ఖురాన్. కానీ వాడు నాకు వీటి నుంచి దూరం చేశాడు. ఎంతైనా షైతాను మనిషికి ద్రోహం చేసేవాడే.” కానీ అక్కడ తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి.

ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోరు విప్పుతారు. వాడు బాధపడుతున్నాడు, “నా పాడుగాను”, తన్ను తాను నిందించుకుంటున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తారు.

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا
“ఓ నా ప్రభువా! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్‌ను వదిలిపెట్టారు.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుతారు. అంటే పరలోకంలో పరాజయం, అవమానం, దుర్భర స్థితి, శిక్షకు కారణం ఏమిటి? ఖురాన్‌ను విడనాడటం, వదిలివేయటం.

కావున, అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తములు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఇచ్చారు. ఈ ప్రపంచంలో, అందరికంటే ఉత్తములు, ప్రవక్త గారు సెలవిచ్చారు, బుఖారీ గ్రంథంలోని హదీస్ ఇది.

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ త’అల్లమల్ ఖురాన వ అల్లమహూ]
“మీలో ఖురాన్‌ను నేర్చుకుని ఇతరులను నేర్పించేవారు అందరిలోకెల్లా ఉత్తములు.”

అంటే ఈ భూమండలంలో మానవులలో, అల్లాహ్ దాసులలో, ఈ ఉమ్మత్ లో అందరికంటే శ్రేష్టమైన వారు, ఉన్నతమైన వారు, ఉన్నత స్థితికి చెందిన వారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట పరంగా ఎవరు? ఖురాన్ నేర్చుకునేవారు, ఖురాన్ నేర్పించేవారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసే సౌభాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అహ్లె ఖురాన్ లో చేర్చుగాక. మన జీవితాంతం ఖురాన్ ను పఠించే, ఖురాన్ ను అర్థం చేసుకునే, ఖురాన్ ను ఆచరించే సౌభాగ్యం ప్రసాదించు గాక.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై కారుణ్యం కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు కారుణ్యం కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّdٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు శుభాలు కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
[రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్]
ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
[రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బ’ద ఇద్ హదైతనా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మా, ఇన్నక అంతల్ వహ్హాబ్]
ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్రమార్గం వైపు త్రిప్పకు. మరియు నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.

رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
[రబ్బనగ్ ఫిర్ లనా వ లి ఇఖ్వానినల్లదీన సబఖూనా బిల్ ఈమాని వలా తజ్’అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్]
ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు విశ్వాసంలో మా కంటే ముందు గడిచిపోయిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వసించిన వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని ఉంచకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా నువ్వు దయగలవాడవు, కరుణామయుడవు.

رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
[రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయానీ సగీరా]
ఓ నా ప్రభూ! నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎలా కారుణ్యంతో పెంచారో, నువ్వు కూడా వారిపై అలాగే కారుణ్యం చూపు.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ
[సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్]
ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు నీకే సర్వ స్తోత్రాలు. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే పశ్చాత్తాపంతో మరలుతున్నాను.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[ఆఖిరు ద’వానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మరియు మా చివరి ప్రార్థన, సర్వ స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

  1. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]
ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

ఖుర్ఆన్ ప్రత్యేకతలు – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ప్రత్యేకతలు
https://youtu.be/C-C0jePaXXc [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ యొక్క అనేక గొప్ప ప్రత్యేకతలు మరియు ఘనతలు వివరించబడ్డాయి. ఇది అల్లాహ్ చే స్వయంగా ప్రళయం వరకు భద్రపరచబడిన, ఎలాంటి సందేహాలకు తావులేని ఏకైక గ్రంథమని నొక్కి చెప్పబడింది. ఖుర్ఆన్ పఠనం హృదయాలకు శాంతిని, మార్గదర్శకత్వాన్ని మరియు శారీరక, ఆత్మిక రోగాలకు స్వస్థతను ఇస్తుందని ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు తుఫైల్ (రదియల్లాహు అన్హు) వంటి వారి ఇస్లాం స్వీకరణ గాథలతో వివరించబడింది. ఖుర్ఆన్ పారాయణ ప్రతి అక్షరానికి పది పుణ్యాలను ఇస్తుందని, ఇది ఇహలోకంలోనే కాక, సమాధిలో మరియు పరలోకంలో కూడా తన సహచరుడికి రక్షణగా, సిఫారసుగా నిలిచి స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేరుస్తుందని చెప్పబడింది.

అల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను’మినుబిహి వ నతవక్కలు అలైహ్. వ న’ఊదుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యి’ఆతి అ’మాలినా. మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్, వ మై యుద్లిల్ ఫలా హాదియ లహ్.వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నదీరా. అమ్మా బ’అద్

ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్. వ ఖైరల్ హద్యి హద్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా. వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్. వ కుల్ల దలాలతిన్ ఫిన్ నార్.

قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ
(ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్)
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. (3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.(4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి). తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (33:70-71)

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానం ఏమిటంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు.

ఆ విధంగా ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే, ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒకచోట పొందుపరిచి, ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనం చూచినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్ షా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని సూర బఖరా, రెండవ అధ్యాయం, 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖుర్ఆన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖుర్ఆన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది, ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇన్ షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖుర్ఆన్ లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్)
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.(15:9)

అనగా, మేమే ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవలసిన ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు, ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు, మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు.

ఈ రోజు మనం కువైట్ లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూచినా పూర్తి ఖుర్ఆన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖుర్ఆన్, మరో దేశంలో మరోలాంటి ఖుర్ఆన్ మీకు కనిపించదు. ప్రపంచ నలుమూలలా మీరు ఎక్కడికి వెళ్లి చూసినా ఒకే రకమైన ఖుర్ఆన్ దొరుకుతుంది.

అలాగే, ఖుర్ఆన్ కి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖుర్ఆన్ గ్రంథాలన్నిటినీ తీసుకుని వెళ్లి సముద్రంలో పడివేసినా, మళ్లీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫిజ్ లు, ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో, వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్లీ ఖుర్ఆన్ ను రచించుకోగలరు. ఎందుకంటే ఖుర్ఆన్ ని ప్రారంభం నుండి చివరి వరకు, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ అ’ఊదు బిరబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫిజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు. అల్ హమ్దులిల్లాహ్. ఏడు సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి కూడా ఖుర్ఆన్ ని కంఠస్థం చేసినవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు.

అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజల హృదయాలలో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖుర్ఆన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూచినట్లయితే, ఆ గ్రంథములోని ఒక్క చాప్టర్ నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ ని మళ్ళీ రచించుకోవడానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసినవాళ్లు ఎవరూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

అలాగే ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరికీ ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవితకాలం నుండి నేటి వరకు కూడా ఎవరూ ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్ షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభువు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి, ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరూ తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరా, రెండవ అధ్యాయం, రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహ్)
“ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” (2:2)

ఈ గ్రంథంలో ఎంతమాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూచినట్లయితే అభిమాన సోదరులారా, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట దేవుడు ఒక్కడు అంటే, ఒకచోట దేవుడు ఇద్దరు, ముగ్గురు అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖుర్ఆన్ ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము.

అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప ఘనుడు కాబట్టి, ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూచినట్లయితే సూర యాసీన్, 36వ అధ్యాయము, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

يس وَالْقُرْآنِ الْحَكِيمِ
(యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్)
“యాసీన్. వివేకంతో నిండిన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!” (36:1-2) అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖుర్ఆన్ ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖుర్ఆన్ రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖుర్ఆన్ చదివిన వాళ్ళు చాలామంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి చాలామంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి రెండు ఇన్ షా అల్లాహ్ ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను.

ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్, దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైనవారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, “చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్.” విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. “అతని మాటలు నువ్వు వినకు. ఎందుకంటే అతని మాటలు నీవు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు. నీ తల్లిదండ్రులకు, నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు. అతనితో నువ్వు దూరంగా ఉండు. నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా” అన్నారు.

వారి మాటలని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసీ, ముహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని. నేను ముహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిదైతే మంచిదనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డదనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకొని ఆయన ముహమ్మద్ వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన చదువుతున్న గ్రంథాన్ని, చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించారు.

ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడికక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, “ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్ర తంత్రాలు కావు. అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు. నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజల వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు ప్రవక్త అని. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ యే దేవుడు అని” అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూశారా అభిమాన సోదరులారా.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, “ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా. ఏదేదో వాగేస్తున్నాడు. నీకు ఏదో మంత్ర తంత్రాలు వచ్చు కదా. పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా. నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా” అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మాడు. నిజమే అని నమ్మి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉంది కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు. నాకు వైద్యం చేయడం వచ్చు. కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను. మీరు వైద్యం చేయించుకోండి” అన్నారు.

దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను. నువ్వు విను. విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తున్నది పిచ్చివాని మాటలా, మంత్ర తంత్రాలా, ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు” అని చెప్పారు. “సరే చెప్పండి ఓ ప్రవక్త” అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ లోని రెండు చిన్న సూరాలు వినిపించారు. సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్. రెండు చిన్న సూరాలు వినిపించగానే, అక్కడికక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేయి పట్టుకొని ఏమన్నాడంటే, “నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను. నేను మాంత్రికుల నోటి నుండి మంత్ర తంత్రాలు విని నేర్చుకొని ఉన్నాను. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది మంత్రము కాదు. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది కవిత్వము కాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్ర తంత్రాలకు అతీతమైన పలుకులు” అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని అల్లాహ్ యే ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు.

చూశారా అభిమాన సోదరులారా, అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ అంధకారంలో ఉన్నవారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత.

అలాగే, మనం ఖుర్ఆన్ కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూచినట్లయితే, ఖుర్ఆన్ ద్వారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్నవారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలిచి నిలబడిపోతాయి ఖుర్ఆన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే గనుక. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి. బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్.

ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేవో చెప్తా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖుర్ఆన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశాడు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖుర్ఆన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా? లేదా మక్కా పెద్దలు చెప్తున్న మాటలు నిజమని నమ్మాలా? అయోమయంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్.

చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువైపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే కదా జరుగుతా ఉండేది, కాబట్టి ముహమ్మద్ నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకొని ఆయన కత్తి పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈ రోజు ప్రాణం తీసేస్తాడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓ ఉమర్, ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసాడు. “ఈ ముహమ్మద్ వల్ల నేను అయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను” అని చెప్పేసాడు.

అప్పుడు ఆయన అన్నారు, “అయ్యా, ముహమ్మద్ విషయం తర్వాత. ముందు నీ చెల్లెలు, నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు. ముహమ్మద్ మాటల్లో వచ్చేసారు. ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో” అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటివారు, సొంత వాళ్ళ చెల్లెలు, బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు అన్న విషయాన్ని తెలుసుకోగా, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళాడు.

దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖుర్ఆన్ చదువుతూ ఉండింది, కొన్ని పత్రాలు తీసుకుని. అవి బంద్ చేసేసి ఒకచోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్లి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు. “నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను నేను. మీరు ఏదో చదువుతా ఉన్నారు. ఏంటి అది?” అని ప్రశ్నించాడు. “నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా. తాత ముత్తాతల ధర్మాన్ని, మార్గాన్ని వదిలేశారంట కదా. నిజమేనా?” అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆవిడ అంది, “లేదు లేదు” అని ఏదో రకంగా ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే, “ఆ నేను వినింది నిజమే” అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని, బావని ఇద్దరినీ చితకబాదేశాడు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనింది అంటే, “ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. మేము ముహమ్మద్ వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాము. అల్లాహ్ యే ప్రభువు అని నమ్మేసాము. తాత ముత్తాతల మార్గాన్ని వదిలేసాము. నువ్వు చంపుతావో, ఏమి చేస్తావో చేసుకో. ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము. ఏం చేస్తావో చేసుకో” అని.

అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, “అమ్మా, నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో, నాకు కూడా కొంచెం వినిపించు చూద్దాం” అన్నాడు. అప్పుడు చెల్లెలు అన్నారు, “లేదయ్యా, ముందు వెళ్లి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను.” వెళ్లి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెలు వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా, ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం ముహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి, ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, “సుబ్ హా నల్లాహ్! ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి! ముహమ్మద్ వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ముహమ్మద్ వారు తీసుకువచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.

చూశారా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లిపోయారు. చూసిన వాళ్ళు కంగారుపడిపోయారు, ఉమర్ వచ్చేసాడు ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. అల్లాహ్ యే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త” అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ “అల్లాహు అక్బర్” అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసివచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి శక్తి అల్లాహ్ పెట్టి ఉన్నాడంటే కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది. హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

అలాగే అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ కు ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకుని వ్యక్తి ప్రారంభిస్తే, ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తికి పదేసి పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్లీ చెప్పారు, “ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి మూడు అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి మూడు అక్షరాలు చదివిన పుణ్యం, అనగా ముప్పై పుణ్యాలు అతనికి లభిస్తాయి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖుర్ఆన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు, కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు, మనిషి శరీరంలో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖుర్ఆన్ ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతని ఇస్తుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా.

అలాగే ఈ ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, “మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గానీ, సైన్స్ కూడా ఖుర్ఆన్ లో ఉందా?” అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకునిపోతే చాలా విషయాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించేవాళ్లు అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది, “రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, రండి చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి చదివి గ్రహించండి” అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనం.

అలాగే, పరలోకంలో కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఇన్ షా అల్లాహ్ రెండు మూడు విషయాలు చెప్పేసి నా మాటను ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖుర్ఆన్ ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న.

ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, “నీ ప్రభువు అల్లాహ్ అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని నీకు ఎలా తెలిసింది?” అని నాలుగవ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, “నేను దైవ గ్రంథమైన ఖుర్ఆన్ ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను” అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారట, “నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభము కలుగుగాక. నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో” అని దూతలు అతనికి చూపించేస్తారట. అతను సంతోషపడిపోతాడు అభిమాన సోదరులారా.

చూశారా? సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖుర్ఆన్ గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తల వైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తల వైపు నుంచి వస్తారో, ఖుర్ఆన్ గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందట, “ఈ వ్యక్తి ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివిన వాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పేస్తుందట. అల్లాహు అక్బర్. చూశారా.

ఆ తర్వాత దూతలు అతని కుడి వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దానధర్మాలు అక్కడికి వచ్చి, “మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఈ భక్తుడు ప్రపంచంలో దానధర్మాలు చేసేవాడు కాబట్టి, మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని దానధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రపంచంలో అతను నమాజ్ చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ, వెళ్తూ, వస్తూ, వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, “మీరు ఎక్కడికి వస్తున్నది? ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్ళతోనే నడిచి నమాజ్ కు వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూశారా అభిమాన సోదరులారా. సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం.

ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరినీ మళ్లీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు. ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గానీ, తండ్రి గానీ, స్నేహితుడు గానీ, సోదరి గానీ, భార్య గానీ, బిడ్డలు గానీ ఎవరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారుపడిపోతూ ఉంటే, ఖుర్ఆన్ గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖుర్ఆన్ గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖుర్ఆన్ చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను. ఇతనిని మన్నించి నీవు స్వర్గానికి పంపించు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఈ ఖుర్ఆన్ గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖుర్ఆన్ యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట.

చూశారా అభిమాన సోదరులారా. ఎవరూ పనికిరాని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా.

మరొక విషయం ఏమిటంటే, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునితో అంటారట, ఏమని అంటాడో తెలుసా? “ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివేవాడివో, ఇక్కడ కూడా స్వర్గంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు, ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం పూర్తి అవుతుందో అప్పటివరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ, ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం ఆగిపోతుందో అదే నీ స్థానము” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటిస్తాడు. చూశారా. ఈ ఖుర్ఆన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, ఖుర్ఆన్ గ్రంథం యొక్క ప్రత్యేకతలని అర్థం చేసుకుని ఖుర్ఆన్ గ్రంథాన్ని గౌరవిస్తూ, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖుర్ఆన్ ద్వారా ప్రపంచంలో కూడా మాకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు స్వర్గం ప్రసాదించు.” ఆమీన్.

అఖూలు ఖౌలీ హాదా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25451

ఖుర్ఆన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/