మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్  -ఇమామ్ ఇబ్నె బాజ్

మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?

మక్కా సరిహద్దులకు చేరుకున్న తరువాత, మక్కాలో ప్రవేశించక ముందు యాత్రికుడు స్నానం చేయటం మంచిది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అల్ మస్జిద్ అల్ హరమ్ చేరుకున్న తరువాత, సున్నతు ప్రకారం, ముందుగా కుడికాలు లోపలకు పెట్టి క్రింది దుఆ చదువుతూ లోపలికి ప్రవేశించవలెను.

బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమ్, వ బివజ్ హిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్, అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక

“అల్లాహ్ పేరుతో, రసూలుల్లాహ్ పై శాంతి మరియు దీవెనలు కురియుగాక, బహిష్కరింపబడిన షైతాను బారి నుండి; ఆయన యొక్క పవిత్ర ముఖము ద్వారా మరియు ఆయన యొక్క అత్యంత ప్రాచీన పరిపాలన మరియు అధికారం ద్వారా సర్వలోక శక్తిమంతుడైన ఆ అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ కారుణ్య ద్వారాలను నా కొరకు తెరుచు”

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు కూడా ఇదే దుఆ పఠించవలెను. నాకు తెలిసినంత వరకు, మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించేటపుడు పఠించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన ప్రత్యేక దుఆ ఏదీలేదు.

మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)

కాబా గృహాన్ని సమీపించిన తరువాత, ఒకవేళ అతను హజ్జె తమత్తు లేదా ఉమ్రహ్ కొరకు సంకల్పం చేసుకుని ఉన్నట్లయితే, తవాఫ్ ఆరంభించక ముందు లబ్బైక్ పలకటం ఆపివేయవలెను. హజ్రె అస్వద్ (నల్లరాయి) దిశ వైపు నిలబడి, తన కుడి చేతితో దానిని స్పర్శించవలెను, వీలయితే దానిని ముద్దు పెట్టుకోవలెను. అలా  చేయటంలో అతను ఇతరులను త్రోయటం గానీ, అసౌకర్యం కలిగించటం గానీ చేయరాదు. అతను దానిని స్పర్శించేటపుడు, ఇలా పలకవలెను – بسم الله، الله اكبر  – బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్ – అల్లాహ్ పేరుతో, అల్లాహ్ మహోన్నతుడు. ఒకవేళ దానిని ముద్దాడటం కష్టమైతే, తన చేతితో లేదా తన చేతికర్రతో దానిని స్పర్శించి, ఆ చేతిని లేదా చేతికర్రను ముద్దాడవలెను. ఒకవేళ అలా చేయడం కూడా కష్టమైతే, హజ్రె అస్వద్ వైపు చేయితో సైగ చేసి, الله اكبر  – అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు అని పలుకవలెను. అయితే దూరం నుండి హజ్రె అస్వద్ వైపు ఊపిన చేతిని లేదా చేతికర్రను లేదా ఇతర వస్తువును ముద్దాడరాదు. తవాఫ్ ఆరంభించినపుడు కాబాగృహం అతని ఎడమ వైపు ఉండవలెను. తవాఫ్ ఆరంభించేటపుడు ఇలా పలకటం మంచిది,

అల్లాహుమ్మ ఈమానంబిక,  వ తస్తదీకమ్ బి కితాబిక, వ వఫాఅమ్ బి అహ్దిక, వత్తిబాఅల్ లిసున్నతి నబియ్యిక ముహమ్మద్

“ఓ అల్లాహ్! నీపై విశ్వాసంతో, నీ గ్రంథంపై విశ్వాసంతో, నీకు చేసిన వాగ్దానాన్ని నేరవేరుస్తూ మరియు నీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానాన్ని అనుసరిస్తూ నేను దీనిని చేస్తున్నాను.”

పై పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వారసత్వంగా సంక్రమించింది. తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు ఉంటాయి. మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయవలెను. మక్కాలో ప్రవేశించిన తరువాత చేసే మొదటి తవాఫ్ లో ఇలా రమల్ చేయవలెను – ఆ తవాఫ్ ఉమ్రహ్ కోసమైనా, హజ్జె తమత్తు ఉమ్రహ్ కోసమైనా లేదా హజ్జె ఖిరాన్ ఉమ్రహ్ కోసమైనా సరే. మిగిలిన నాలుగు ప్రదక్షిణలను మామూలుగా నడుస్తూ పూర్తి చేయ వలెను. ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్ నుండి ఆరంభమవుతుంది మరియు హజ్రె అస్వద్ వద్దనే పూర్తవుతుంది. రమల్ అంటే వడివడిగా నడవడం. మొత్తం తవాఫ్ లో ఇద్తిబా చేయవలెను. ఉమ్రహ్ లేదా హజ్ కోసం చేసే తవాఫ్ లను తప్పించి, ఇతర తవాఫ్ లలో ఇద్తిబా చేయరాదు. ఇద్తిబా అంటే పై వస్త్రాన్ని తమ కుడి భుజం అందరికీ కనబడేలా కుడిచేయి చంక క్రింది నుండి తీసుకువచ్చి, ఎడమభుజం పై వాటి రెండు చివరలు ఉంచటం.

ఒకవేళ ఎవరికైనా తాము ఎన్ని ప్రదక్షిణలు చేసామో గుర్తులేక, వాటి సంఖ్య గురించి అనుమానం వస్తే, తాము అనుమానిస్తున్న రెండింటిలో తక్కువ సంఖ్యను తీసుకోవలెను. ఉదాహరణకు, ఒకవేళ ఎవరికైనా తాము మూడు ప్రదక్షిణలు చేసామా లేక నాలుగు ప్రదక్షిణలు చేసామా అనేది గుర్తు లేకపోతే, తాము మూడు ప్రదక్షిణలే చేసామని లెక్కించుకోవాలి. సయీలో కూడా ఇదే విధంగా చేయాలి. తవాఫ్ పూర్తి చేసిన తరువాత, తమ కుడిభుజాన్ని పైవస్త్రంతో కప్పివేయాలి. అంటే తవాఫ్ తరువాత, మఖామె ఇబ్రాహీం వద్ద చేసే రెండు రకాతుల నమాజు కంటే ముందు, తమ రెండు భుజాలను పై వస్త్రంతో నిండుగా కప్పుకోవాలి.

స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.

తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.

“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31

ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.

తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:

మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది. రుకునె యమానీ (యమనీ మూల) వద్దకు చేరుకున్న తరువాత “బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో), అల్లాహు అక్బర్(అల్లాహ్ మహోన్నతుడు)” అని పలికి, దానిని కుడి చేత్తో తాకవలెను. అయితే దానిని ముద్దాడకూడదు మరియు దానిని స్పర్శించిన కుడి చేతిని కూడా ముద్దాడకూడదు. ఒకవేళ రద్దీ వలన రుకునె యమానీని తాకటానికి అవకాశం లభించకపోతే, దాని వైపు చేయి ఊపుతూ సైగ చేయకుండా, అలానే తవాఫ్ కొనసాగించవలెను. అంతేగాక దానివైపు తిరిగి అల్లాహు అక్బర్ అని కూడా పలక కూడదు. అలా దూరం నుండి రుకునె యమానీ వైపు తిరిగి అల్లాహు అక్బర్ అని పలకటం నాకు తెలిసినంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో లేదు. రుకునె యమానీ మరియు హజ్రె అస్వద్ ల మధ్య నడిచేటప్పుడు ఈ క్రింది దుఆ పఠించటం వాంఛనీయం.

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్ సూరహ్ అల్ బఖరహ్ 2:201

“ఓ మా ప్రభూ! ఈ ప్రాపంచిక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు పరలోక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి రక్షించు.”

హజ్రె అస్వద్ కు ఎదురుగా ఉన్నపుడు, దానిని తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, “అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు” అని పలుకవలెను. ఒకవేళ రద్దీ వలన అలా తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం కష్టమైతే, హజ్రె అస్వద్ కు ఎదురుగా వచ్చినపుడల్లా, దాని వైపు సంజ్ఞ చేస్తూ, అల్లాహు అక్బర్ అని పలుకవలెను. మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావి వెనుక నుండి తవాఫ్ చేయటంలో ఎలాంటి దోషమూ లేదు ముఖ్యంగా బాగా రద్దీగా ఉన్నపుడు. తప్పనిసరిగా కాబాగృహానికీ మరియు మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావిల మధ్య నుండే తవాఫ్ చేయాలనే నియమం ఏదీ లేదు. మస్జిదె హరమ్ మొత్తంలో ఎక్కడి నుండైనా తవాఫ్ చేయవచ్చు. రద్దీ బాగా ఎక్కువగా ఉన్నపుడు, కాబా గృహం చుట్టూ ఉన్న మస్జిదు భవనం కప్పు పై నుండి తవాఫ్ చేయటంలో కూడా ఎలాంటి దోషమూ లేదు. అయితే, అవకాశం ఉంటే కాబా గృహం దగ్గరలో నుండి తవాఫ్ చేయటం ఉత్తమం.

అలాగే, అవకాశం లభిస్తే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చేయటం ఉత్తమం. రద్దీగా ఉండటం వలన ఒకవేళ అలా చేయలేక పోతే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత కాబా మస్జిదులో మీకు వీలయిన చోట రెండు రకాతుల నమాజు చేసుకోవలెను.

ఈ రెండు రకాతుల నమాజులో సూరతుల్ ఫాతిహా తరువాత మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్ మరియు రెండో రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ పఠించవలెను. ఇలా పఠించటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో ఉన్నది.

తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

మదీనా లోని జన్నతుల్ బఖీని దర్శించడం – ఇమామ్ ఇబ్నె బాజ్

జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:

زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ
జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత
స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి.

[ముస్లిం హదీథు]

సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,

أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ

అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్  మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.

మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:

أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ
అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్

సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.

ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.

మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.

అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:

زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً
జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్
సమాధులను సందర్శించండి, కానీ చెడు పలుకులు పలుకవద్దు.

ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.

ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

మస్జిదె ఖుబా (Masjid-e-Quba) ప్రత్యేకతలు [వీడియో]

మస్జిదె ఖూబ ప్రత్యేకతలు – షరీఫ్ మదనీ [3 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QOclavePcwo

మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.

ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58) లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు… దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.

ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:

ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం. ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది.

అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

“అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)

మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).

ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడంలో బిదత్ విధానాలు పాటించకండి [ఆడియో]

ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడంలో బిదత్ విధానాలు పాటించకండి [ఆడియో]
https://youtu.be/SRlQmVpTG38 [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దరూద్

దరూద్ (Darood) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3dmBNdvVTSUW1Aue1g1kf8

అందరి ఆహార బాధ్యత అల్లాహ్ తీసుకున్నప్పుడు కొందరు తిండి లేక ఎందుకు చనిపోతున్నారు?

అందరి ఆహార బాధ్యత అల్లాహ్ తీసుకున్నప్పుడు కొందరు తిండి లేక ఎందుకు చనిపోతున్నారు?
https://youtu.be/F2yNYWRr5NQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పిల్లలకు చెవులు కుట్టించినప్పుడు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఫంక్షన్లు చేసుకోవచ్చా? వాటికి వెళ్లవచ్చా?

పిల్లలకు చెవులు కుట్టించినప్పుడు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఫంక్షన్లు చేసుకోవచ్చా? వాటికి వెళ్లవచ్చా?
https://youtu.be/hBJsEa1uiKk [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖురాన్ కథామాలిక [పుస్తకం]

ఖురాన్ కథామాలిక [పుస్తకం]

Quran Kadha Malika - Book - ShantiMargam

Qur'an Katha Maalika 
Selected Stories from Qur'an  (Telugu)

Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)

ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూబకర్ నజార్
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/quran-kadha-malika
[PDF] [374 పేజీలు] [డెస్క్ టాప్ బుక్] [16 MB]

కథా సూచిక

అరబీ ఖాయిదా (అరబ్బీ అక్షరాలు, గుణింతాలు) – మర్కజ్ దారుల్ బిర్ర్ [పుస్తకం & వీడియో పాఠాలు]

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/qaida-darulbirr
[PDF] [36పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

అరబ్బీ అక్షరాలు, గుణింతాల చార్టులు క్రింద డౌన్లోడ్ చేసుకోండి
[అన్నీ చార్టులు పేజీ 1 నుండి 11 వరకు] [PDF]
[ఫస్ట్ చార్ట్ – అలిఫ్, బ,త] [PDF]
[బ గుణింతం – బ, బి, బు …] [PDF]

వీడియో పాఠాలు – ఆసాన్ (ఈజీ) అరబీ ఖాయిదా

వీడియో పాఠాలు – ఆసాన్ (ఈజీ) అరబీ ఖాయిదా – డా. సయీద్ అహ్మద్ ఉమరి మదని (హఫిజాహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV13sUtrjfPyX7DY-KOSrTQn (43 వీడియోలు)
  • మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్ పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు
    https://teluguislam.net/markaz-darulbirr-books/

తబర్రుక్ –  ప్రత్యేక స్థలాల్లో, ప్రత్యేక వస్తువుల ద్వారా, పుణ్యప్రజల యందు శుభాలను కాంక్షిస్తూ చేసే ఆరాధనలు

అత్ తబర్రుక్ అంటే; శుభాలను ఆశించడం. మేళ్ళు, శుభాలు కలగడం మరియు శుభాలు ప్రాప్తించడం. ఎవరికైతే మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే అధికారం ఉందో, వారితోనే కోరడం సమంజసం. శుభాలను ప్రసాదించే అధికారం ఎవరికైతే లేదో, వారి ద్వారా శుభాలు ఆశించడం లేక కోరడం అవివేకం. కనుక మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించగలిగే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. సర్వసృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే శక్తిగాని, ఆధికారంగాని లేదు. 

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ ۚ وَٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِهِۦ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا۟ دُعَآءَكُمْ وَلَوْ سَمِعُوا۟ مَا ٱسْتَجَابُوا۟ لَكُمْ ۖ

కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆయనే అల్లాహ్ మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను పదిలి మీరు వేడుకొనే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు- మీరు వారిని వేడుకున్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను విసలేరు, ఒక వేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు” (సూరతుల్ ఫాతిర్ 35:13-14). 

మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”ఓ అల్లాహ్ నీవు ఎవరికైన ప్రసాదిస్తే దానిని నివారించేవారు ఎవరూ లేరు. నీకృపే లేకపోతే కృషి చేయువాని కృషికి ప్రతి ఫలము ఏమియు లేదు.” (బుఖారీ:799, ముస్లిం:725) 

ప్రత్యేక స్థలాల్లో మరియు బ్రతికున్న లేక మరణించిన పుణ్యప్రజల యందు శుభాలను ఆశించడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ వారి ద్వారా శుభాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తే అది షిర్క్ అవుతుంది. మరియు కొన్ని వస్తువులను పవిత్రంగా భావించి వాటి తాకిడి వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని, ప్రత్యేకమైన స్థలాలలో బస చేయడం వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని నమ్మడం షిర్క్ వైపుకే దారి తీస్తోంది.

ముఖ్య గమనిక: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బ్రతికుండగా ఆయన శిరోజాలను, ఆయన చమటను, మరియు ఆయన దుస్తులను శుభాలుగా భావించి సహాబాలు వాటితో ప్రయోజనం పొందేవారు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యక్తిత్వంతో మాత్రమే శుభాలను ఆశించడం ధర్మం. మరియు ఆయన శరీరానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు (వెంట్రుకలు, తలపాగ, దుస్తులు, ఉంగరం వంటివి) మనకు లభించిన వాటిని పవిత్రంగా భావించి శుభాలను ఆశించడం కూడా ధర్మమే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన తరువాత ఆయనకు సంబంధించిన వస్తువులు ప్రస్తుత కాలంలో లేవు, కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వనల్లం)వ్యక్తిత్వం ద్వారా మరియు వారి వస్తువుల ద్వారా శుభాలను ఆశించడం అనేది కూడా లేదు. ఒక వేళ పవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి సంభందించిన వస్తువు ప్రామాణి కమైన ఆధారాలతో లభించినట్లయితే శుభంగా ఉపయోగించడం ధర్మం. 

కాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటిని లేక సమాధిని మరియు ఆయన నమాజు చేసే చోటును లేక ఆయన కూర్చునే చోటును శుభాల కొరకు ప్రత్యేకించలేదు. అలాగే హిరా కొండను, సౌర్ కొండను, జబలుర్ రహ్మా (అరాఫాత్) మైదానంలో నిలబిడి ప్రసంగించిన) కొండను శుభాలుగా ఆశించి ఎక్కడం లేక బస చేయడం మరియు అక్కడ నమాజు కొరకు ప్రధాన్యత ఇవ్వడం కూడా ధర్మం కాదు. ప్రపంచంలో మక్కా మరియు మదీనా పవిత్రమైన స్థలాలు. అక్కడ ఉన్న కాబతుల్లాహ్ మసీదు, మరియు మదీనాలో ఉన్న మస్జిద్ నబవీ మరింత పవిత్రమైనవి. అలాగే మజ్జిదే అఖ్సా కూడా పవిత్రమైనది. మరియు మక్కా మసీదులో ఉన్న జమ్ జమ్ నీరు అతి పవిత్రమైనది. మదీనా లో పండే ‘అజ్వా’ ఖర్జూరాలు శుభమైనవి. 

హజ్రత్ అబూబకర్ మరియు హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ, హజ్రత్ హసన్, హుసైన్ వంటి ఉత్తమమైన సహాబాలు, మరియు వారిలో కొందరు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారు. అంతేకాక వారందరితో అల్లాహ్ ప్రసన్నుడ య్యాడు. మరియు వారు కూడా అల్లాహ్ తో సంతుష్టులయ్యారు. అనే విషయం దైవ గ్రంథం ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి మహా పుణ్యాత్ములైన సహాబాలను, వారు ఉపయోగించిన వస్తువులను ఆ నాటి ప్రజలు శుభాల కొరకు ప్రత్యేకించలేదంటే, వారి తరువాత తరాల ప్రజల నుండి శుభాలను ఆశించడం ఎంతవరకు ధర్మం? 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తరానికి చెందినవారు సహాబాలు మరియు సహబాల తరానికి చెందినవారు తాబయీన్లు, తబా తాబయీన్లు. వారందరూ పవిత్రమైన తరాలకు మరియు కుటుంబాలకు చెందినవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: 

ప్రజలందరిలోకెల్లా నా తరం ప్రజలు ఉత్తములు (పుణ్యాత్ములు) మరియు ఆ తరువాతి తరంవారు, మరియు ఆ తరువాతి తరంవారు” (బుఖారీ:2457, ముస్లిం:4603) 

అంటే; వారందరు పుణ్యాత్ములనీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ధృవీకరించారు. అయినా వారి నుండి, వారి సమాధుల నుండి మనం ఎలాంటి శుభాలను ఆశించడం లేదు మరియు ఆశించకూడదు. 

వారి తరువాత జ్ఞానవంతులైన ఇమాములు, హదీసు జ్ఞానం కలిగిన ముహద్ధిసీన్లు (హదీసు ధర్మవేత్తలు), ధర్మాన్ని తూచతప్పకుండా అనుసరించే ఔలియాలు (పుణ్యాత్ములు) మరియు సాధారణ ముస్లింలు ప్రళయం వరకూ సమాజంలో ఉంటారు. వారిలో మనం కొందరినీ ఔలియాలనీ నిర్ణయించుకొని వారిద్వారా శుభాలను ఆశించడం మరియు వారు తిని త్రాగి వదలిన వస్తువులను, వారు ధరించే వస్త్రాలను, లేక వారికి సంబంధించిన ఇతర వస్తువులను శుభాలుగా భావించటం ఎంతవరకు సమంజసం? మరియు వారు మరణిస్తే వారి సమాధులను దర్గాలుగా నిర్మించి ప్రత్యేకంగా దర్శించటం, వాటి ద్వారా శుభాలను ఆశించటం మరియు అక్కడ భయం భక్తిని చూపటం ఎంతవరకు ధర్మసమ్మతం? అందుకనే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా హెచ్చరించారు: 

 “ఎవరైనా మేము ఆదేశించని పని ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది” (బుఖారీ:2499, ముస్లిం:3242). 

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meraj-kanuna-namaz
[PDF] [27 పేజీలు]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు: 

  • 1) నమాజ్ విధి గావించబడడం
  • 2) నమాజ్ ప్రాధాన్యత
  • 3) నమాజ్ మహత్యం
  • 4) నమాజ్ ను త్యజించేవారి శిక్ష మరియు దాని ఆజ్ఞ. 

ఇస్లామీయ సోదరులారా! 

ఈ రోజు జుమా ఖుత్బాలో (ఇన్షా అల్లాహ్) అల్లాహ్ సామీప్యం పొందడానికి అన్నింటికన్నా గొప్ప మాధ్యమం, కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత అయిన ఒక (ముఖ్యమైన) ఆచరణ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ ముస్లిమ్ అయినా ప్రాపంచిక ఆందోళనలకు, దు:ఖానికి గురై నిరుత్సాహ స్థితిలో ఈ ఆచరణ నిమిత్తం అల్లాహ్ ముందు నిలబడితే అతని ఆందోళన, దు:ఖాల భారం తగ్గి అతనికి అసలైన హృదయ ప్రశాంతత లభిస్తుంది. ఆ ఆచరణ పేరు నమాజ్. అల్లాహ్ దీనిని అర్హత కలిగిన ప్రతి ముస్లిమ్ పై విధిగా ఖరారు చేశాడు. 

విధిగా చేయబడిన ఆచరణలన్నీ ఈ భూమి మీదే విధిగా గావించబడగా, నమాజ్ ను మాత్రం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వైపునకు పిలిచి, ఆకాశాలపై తాను అనుకొన్న చోట దానిని విధి (ఫర్జ్)గా చేయడం దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను సూచిస్తుంది. . 

మేరాజ్ సంఘటనను గూర్చి చెబుతూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: