నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 5 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 5]
[మరణానంతర జీవితం – పార్ట్ 59] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=Dh-tkJ9A784
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త నరకాగ్ని (జహన్నం) యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరిస్తారు. తీర్పుదినాన నరకం కళ్ళు, చెవులు, నాలుక కలిగిన ఒక సజీవ ప్రాణిగా మారి, అహంకారులు, బహుదైవారాధకులు మరియు చిత్రకారుల వంటి పాపాత్ములను గుర్తిస్తుందని హదీసుల ఆధారంగా తెలియజేస్తారు. నరకవాసుల శరీరాలు శిక్షను తీవ్రతరం చేయడానికి ఎంతగానో పెంచబడతాయని, వారి భుజాల మధ్య దూరం, చర్మం మందం, దవడ పళ్ళ పరిమాణం ఊహించలేనంతగా ఉంటాయని వర్ణిస్తారు. వారి ముఖాలు నల్లబడి, అవమానంతో కప్పబడి ఉంటాయని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేస్తారు. చివరగా, నరకవాసులకు అందించే ఆతిథ్యం, వారి ఆహారం (జక్కూమ్ అనే చేదు వృక్షం) మరియు పానీయాల గురించి వివరిస్తూ, ఈ శిక్షల నుండి రక్షణ పొందడానికి విశ్వాసం మరియు సత్కార్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి వహద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, నరకం, నరకవాసులు, నరక శిక్షల గురించి మనం వింటూ ఉన్నాము.

నరకం, దానికి రెండు కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా అది చూస్తుంది. నరకానికి రెండు చెవులు ఉంటాయి, వాటి ద్వారా అది వింటుంది. మరియు దానికి నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. అవిశ్వాసులు, పాపాత్ములు వచ్చి అందులో పడినప్పుడల్లా అది అరుస్తుంది, గర్జిస్తుంది, మహా పెద్ద అరుపులతో శబ్దాన్ని వెలికితీస్తుంది.

మహాశయులారా, ఆ నరకాగ్ని ఎంత భయంకరమైన శిక్ష అంటే దానిని ఇహలోకంలో ఉండి మనం ఊహించలేము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ లోని హదీస్:

يَخْرُجُ عُنُقٌ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ
(యఖ్రుజు ఉనుఖున్ మినన్నారి యౌమల్ ఖియామ)
ప్రళయదినాన నరకంలో నుండి ఒక మెడ బయటికి వస్తుంది.

لَهُ عَيْنَانِ يُبْصِرَانِ
(లహు ఐనాని యుబ్సిరాన్)
దానికి రెండు కళ్ళు ఉంటాయి వాటితో చూస్తుంది.

وَأُذُنَانِ يَسْمَعَانِ
(వ ఉదునాని యస్మఆన్)
రెండు చెవులు ఉంటాయి, వాటితో అది వింటుంది.

وَلِسَانٌ يَنْطِقُ
(వ లిసానున్ యన్తిఖ్)
మరియు నాలుక ఉంటుంది దానితో మాట్లాడుతుంది.

అది ఇలా అరుస్తూ ఉంటుంది:

إِنِّي وُكِّلْتُ بِثَلاَثَةٍ
(ఇన్నీ ఉక్కిల్తు బి సలాస)
“మూడు రకాల మనుషులను నాకు అప్పగించడం జరిగింది.”

వారు నాలో ఉంటారు. ఒకరు,
بِكُلِّ جَبَّارٍ عَنِيدٍ
(బికుల్లి జబ్బారిన్ అనీద్)
అహంకారి మరియు సత్య తిరస్కారి మరియు సత్యం పట్ల విరోధం ప్రకటించే వ్యక్తి.

రెండో రకమైన వారు,
وَبِكُلِّ مَنْ دَعَا مَعَ اللَّهِ إِلَهًا آخَرَ
(వ బికుల్లి మన్ దఆ మఅల్లాహి ఇలాహన్ ఆఖర్)
ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధించేవారో వారిని,

وَالْمُصَوِّرِينَ
(వల్ ముసవ్విరీన్)
మరియు చిత్రాలు చిత్రీకరించే వారిని.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ మనల్ని ఎంత భయపెట్టిస్తుందో గమనించగలము. నరకం అనేది ఏదో ఒక కేవలం అగ్ని మాత్రమే కాదు. అల్లాహు తాలా దానికి ఎన్నో రకాల శక్తి ప్రసాదిస్తాడు. దాని మూలంగా ప్రజలు ఆ రోజు ప్రళయదినాన దాని దగ్గరికి వచ్చిన తర్వాత, అందులో పడిన తర్వాత దాని యొక్క భయంకరత్వాన్ని గుర్తుపడతారు. కానీ ఆ రోజు దాన్ని గుర్తుపట్టడం వల్ల మనకు ప్రయోజనం ప్రయోజనం ఏమిటి? ఈ రోజు అల్లాహ్ తెలిపే ఈ విషయాల్ని, ఈ వివరాల్ని తెలుసుకొని మనం దానికి భయపడి ఉంటే దాని నుండి మనం రక్షింపబడగలతాము.

ఇంకా మహాశయులారా, నరకం చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, గర్జిస్తుంది, ఇంకా అది దాని యొక్క వేడి వల్ల, అందులో వచ్చి పడే అవిశ్వాసులు మరియు పాపాత్ముల వల్ల ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైతే అందులో పడిపోతారో వారికి ఎంత కష్టం కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో అట్లే మనం ఊహించగలము.

సూరహ్ ఫుర్ఖాన్ ఆయత్ నెంబర్ 12లో అల్లాహు తాలా తెలిపాడు:

إِذَا رَأَتْهُمْ مِنْ مَكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
(ఇదా రఅత్ హుమ్ మిమ్ మకానిమ్ బయీదిన్ సమీఊ లహా తగయ్యుదౌ వ జఫీరా)
దూరం నుంచే అది (నరకాగ్ని) వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.(25:12)

ఎప్పుడైతే అవిశ్వాసులను, పాపాత్ములను దూరం నుండే అది చూస్తుందో, ఇదా రఅత్’హుమ్, వారిని దూరం నుండే చూస్తుందో అప్పుడు వారు ఆ నరకం యొక్క ధ్వనులను, గర్జనలను వింటూ ఉంటారు. గమనించారా? దూరం నుండే అవిశ్వాసులను, నరకంలో వచ్చి పడే వారిని చూసినప్పుడు అది గర్జిస్తూ ఉంటుంది. అంత దూరాన ఉండే ఈ నరకవాసులు దాని గర్జన, దాని భర్జన, దాని యొక్క ధ్వనులను వింటూ ఉంటారు.

ఇమామ్ దహాక్ రహిమహుల్లాహ్ తెలిపారు, ప్రళయ దినాన నరకం గర్జిస్తుంది, దాని గర్జన ఏ సమీపంలో ఉన్న దైవదూత గాని, ప్రవక్తగా పంపబడిన సందేశహరులు గాని దానిని విని సజ్దాలో పడిపోతారు. అప్పుడు, “ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు,” అని వారు అల్లాహ్ తో మొరపెట్టుకుంటూ ఉంటారు.

ఇదే విషయాన్ని మరో రకంగా అల్లాహు తాలా సూరహ్ ముల్క్ లో కూడా తెలిపాడు. ఆ సూరహ్ ముల్క్ ప్రతి రాత్రి పడుకునే ముందు పఠించాలని మనకు ఆదేశం ఇవ్వబడినది.

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
(ఇదా ఉల్ఖూ ఫీహా సమీఊ లహా షహీఖవ్ వహియ తఫూర్)
వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. (67:7)

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ
(తకాదు తమయ్యజు మినల్ గైద్)
ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది.  (67:8)

ఈ విధంగా నరకం అనేది అంత ఆగ్రహానికి గురి అవుతుంది.

ఇక మహాశయులారా, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆకారం మారిపోతుంది. ఇహలోకంలో శరీరం ఎంత పొడవుగా, ఎంత లావుగా ఉండెనో అలా ఉండదు, అంతకంటే ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఆ వివరాలు కూడా మనకు ఖురాన్ మరియు హదీస్ లో తెలుపబడినవి.

ప్రళయదినాన నరకంలో నరకవాసుల శరీరం ఇహలోకంలో ఉన్నట్లు ఉండదు. వారి యొక్క శరీరంలో చాలా మార్పు వచ్చేస్తుంది, వారి ఆకారం కూడా మారిపోతుంది. వారి యొక్క శరీరం ఎంత లావుగా చేయబడుతుందో, సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَا بَيْنَ مَنْكِبَىِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
(మా బైన మన్కిబైల్ కాఫిరి మసీరతు సలాసతి అయ్యామిల్ లిర్రాకిబిల్ ముస్రిఅ)

అవిశ్వాసుని ఈ రెండు భుజాల మధ్యలో, ఇటు నుండి ఇటు వరకు ఈ భుజాల మధ్యలో పొడవు ఎంత పెద్దగా ఉంటుందంటే ఎవరైనా గుర్రపు రౌతు గాని, ఇంకా వేరే ప్రయాణికుడైనా గాని అతి వేగంగా పరిగెత్తుతే మూడు రోజుల ప్రయాణం దీని మీద చేయవచ్చు. అంత లావుగా వారి శరీరాన్ని పెంచబడుతుంది.

మరియు జామే తిర్మిదీ లో అబూ హురైరా రది అల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ غِلَظَ جِلْدِ الْكَافِرِ اثْنَانِ وَأَرْبَعُونَ ذِرَاعًا
(ఇన్న గిలద జిల్దిల్ కాఫిరి ఇస్నాని వ అర్బఊన దిరాఆ)

అవిశ్వాసుల తోలు యొక్క మందము అనేది నలభై రెండు గజాలు ఉంటుంది. మరియు అతని యొక్క దవడ పన్ను ఉహద్ పర్వతం మాదిరిగా పెద్దగా ఉంటుంది, మరియు అతడు కూర్చుంటే అతని యొక్క వైశాల్యం అనేది మక్కా, మదీనా మధ్యలో ఎంత పొడవు ఉందో అంత వెడల్పుగా అతను కూర్చుంటాడు.

మహాశయులారా, ఒక్కసారి మీరు గమనించండి, ఇటు భుజం నుండి ఇటు భుజం వరకు అతివేగంగా పరిగెత్తే ప్రయాణికుడు మూడు రోజులు నడవవచ్చు. దవడ పన్ను ఉహద్ కొండంత ఉంటుంది, మరియు అతని యొక్క ఈ నడుము అనేది, నడుము కింది భాగం కూర్చున్నప్పుడు మక్కా, మదీనా అంటే సుమారు 430 కిలోమీటర్ల దూరం. అంత వెడల్పు ఉంటుంది.

ముస్తద్రక్ హాకిమ్ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు, నరకం యొక్క వైశాల్యం చాలా పెద్దది, చాలా విశాలమైనది నరకం. నరకం యొక్క వైశాల్యం ఎంతదో కేవలం ఒక అంచనా వేసుకోవడానికి, అందులో ఏ అవిశ్వాసులను, పాపాత్ములను వేయడం జరుగుతుందో, ఒక పాపాత్ముని ఈ చెవి మరియు ఈ భుజముల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత స్థలం ఉంటుందో తెలియబరుస్తూ ఇబ్ను అబ్బాస్ రది అల్లాహు తాలా అన్హు చెప్పారు:

سَبْعِينَ خَرِيفًا
(సబ్ఈన ఖరీఫా)
డెబ్బై సంవత్సరాలు నడిచిపోవచ్చు. మరియు అందులో చీము, నెత్తురు ఇలాంటి ఎన్ని ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయని.

ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ సహీహ్ ముస్లిం యొక్క వ్యాఖ్యానంలో పాపాత్ముల, అవిశ్వాసుల శరీరాన్ని ఇంత వైశాల్యంగా, ఇంత లావుగా ఎందుకు చేయడం జరుగుతుందో దాని యొక్క సబబు తెలుపుతూ ఇలా చెప్పారు: వారు ఇహలోకంలో ఎలాంటి ఘోరమైన పాపాలకు పాల్పడ్డారో, దాని యొక్క శిక్ష వారికి సరియైన విధంగా లభించాలంటే ఇహలోకంలో ఉన్న వారి యొక్క ఆ చిన్నపాటి శరీరం సరిపోదు. వారికి వారి పాపాలకు తగ్గట్టు బాధ కలగాలి, శిక్ష దొరకాలి, వారు ఆ శిక్ష యొక్క రుచి చూడాలి మరియు నరకం యొక్క జ్వాలలు, దాని యొక్క అగ్ని వారికి తగిలి వారు దానిని అర్థం చేసుకోవాలి, అందుకొరకు అల్లాహు తాలా ఇలాంటి లావుపాటి శరీరాలు వారికి ఆ రోజు ఇస్తాడు. ఇది వారి శరీరం యొక్క లావుతనం, వారి యొక్క పన్ను, వారి యొక్క భుజం, వారి యొక్క చెవి మరియు భుజాల మధ్యలోని స్థలం, వారు కూర్చుంటే ఎంత వెడల్పు ఉంటారో ఇవన్నీ వివరాలు ఏదైతే తెలుసుకున్నామో, ఇక రండి మహాశయులారా, వారి ముఖం అనేది ఎలా ఉంటుంది ఆ రోజు.

ఆ రోజు వారి యొక్క ముఖం ఎలా ఉంటుంది? అల్లాహు అక్బర్. ఖురాన్ లోని ఎన్నో ఆయతులలో దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ముఖం అనేది క్రిందికి వాలి ఉంటుంది. ముఖము నల్లగా అయిపోతుంది, చీకటి మాదిరిగా. అవమానం అనేది వారిని క్రమ్ముకుంటుంది. వారు తలెత్తి ఒకరిని చూడడానికి, మాట్లాడడానికి యమ సిగ్గుపడుతూ ఉంటారంటే దానికి అంతు లేదు.

సూరహ్ జుమర్ లో అల్లాహు తాలా తెలిపాడు:

وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ
(వ యౌమల్ ఖియామతి తరల్లదీన కదబూ అలల్లాహి ఉజూహుహుమ్ ముస్వద్ద)
ప్రళయదినాన నీవు చూస్తావు ఎవరైతే అల్లాహ్ పై అసత్యాన్ని మోపారో వారి యొక్క ముఖాలు నల్లబడి ఉంటాయి. (39:60)

సూరహ్ అబస, 30వ ఖాండంలో అల్లాహు తాలా తెలిపాడు:

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
(వ ఉజూహున్ యౌమఇదిన్ అలైహా గబర)
ఆ రోజు కొన్ని ముఖాలపై దుమ్ము ధూళి పడి ఉంటుంది. (80:40)

تَرْهَقُهَا قَتَرَةٌ
(తర్హఖుహా ఖతర)
అవమానం అనేది వారిని కమ్ముకుని ఉంటుంది. (80:41)

أُولَئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
(ఉలాయిక హుముల్ కఫరతుల్ ఫజర)
వారే సత్యాన్ని తిరస్కరించిన వారు, పాపాల్లో కూరుకుపోయిన వారు. (80:42)

ఈ భావంలో ఆయత్ లు ఖురాన్ లో ఇంకా అనేక చోట్ల ఉన్నాయి.

خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ
(ఖాషిఅతన్ అబ్సారుహుమ్ తర్హఖుహుమ్ దిల్లా)
వారి యొక్క కళ్ళు కిందికి వాలి ఉంటాయి, వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది. (సూరతుల్ ఖలమ్: 68:43)

సూరతుష్ షూరా ఆయత్ నెంబర్ 45 లో అల్లాహు తాలా తెలిపాడు:

وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنْظُرُونَ مِنْ طَرْفٍ خَفِيٍّ
(వ తరాహుమ్ యుఅ’రదూన అలైహా ఖాషియీన మినద్’దుల్లి యందురూన మిన్ తర్ఫిన్ ఖఫియ్యిన్)

నీవు ఆ రోజు చూస్తావు వారిని నరకాగ్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. అవమానాన్ని భరించలేక తల క్రిందులు చేసుకొని ఉంటారు. మరియు మెలికన్నుతో ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా మెలికన్నుతో వారు ఒక పక్కన ఈ విధంగా చూస్తూ ఉంటారు.” (42:45)

ఇక మహాశయులారా, ఎవరైనా అతిథులు వచ్చారంటే వారిని ఎలా సత్కరించడం జరుగుతుంది, ఎంత గౌరవంతో వారికి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కానీ నరకవాసులు నరకంలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆహ్వానం లభిస్తుంది మరియు ఎలా వారిని స్వీకరించడం, ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందో ఈ ఆయతులలో కొంచెం మీరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
(ఇన్నా అఅ’తద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా)
మేము నరకాన్ని సత్య తిరస్కారుల కొరకు అతిథి మర్యాదల స్థానంగా చేసి ఉంచాము.(18:102)

సూరహ్ తూర్ లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يُدَعُّونَ إِلَى نَارِ جَهَنَّمَ دَعًّا
(యౌమ యుదవ్వూన ఇలా నారి జహన్నమ దఅ’అ)
ఎప్పుడైతే వారిని నరకం వైపునకు త్రోక్కుతూ మరియు వారిని త్రోసిపుచ్చడం జరుగుతుందో, (52:13)

هَذِهِ النَّارُ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(హాదిహిన్నారుల్లతీ కున్తుమ్ బిహా తుకద్దిబూన్)
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే” (52:14)

ఇదే ఆ నరకం, ఇదే ఆ నరకాగ్ని, దేనినైతే మీరు ఇహలోకంలో తిరస్కరించేవారో ఆ నరకం వైపునకే మిమ్మల్ని త్రోసివేయడం జరుగుతుంది, ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతుంది.

అందుగురించి సోదరులారా, నరకాన్ని తిరస్కరించి మనం ఏమీ సంపాదించలేము. నరకాగ్నిని విశ్వసించాలి కూడా, దాని నుండి రక్షణ పొందడానికి ఏ విశ్వాసం, ఏ సత్కార్యాలు అవసరం ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కూడా.

ఇహలోకంలో కొందరు మరికొందరిని అనుసరించి సత్యాన్ని తిరస్కరిస్తారు. కానీ నరకంలో వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు నరకంలో ప్రవేశింపజేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఆహ్వానం వారికి ఇవ్వబడుతుందో ఈ ఆయతులను మీరు శ్రద్ధగా వినండి. సూరహ్ సాద్, ఆయత్ నెంబర్ 55 నుండి 60 వరకు:

هَذَا فَوْجٌ مُقْتَحِمٌ مَعَكُمْ لَا مَرْحَبًا بِهِمْ إِنَّهُمْ صَالُوا النَّارِ
(హాదా ఫౌజుమ్ ముఖ్తహిముమ్ మఅకుమ్ లా మర్హబమ్ బిహిమ్ ఇన్నహుమ్ సాలున్నార్)
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు. (38:59)

ఇదిగో మరొక జట్టు, నరకానికి ఆహుతి అయ్యే మరొక జట్టు వచ్చేసింది. ‘లా మర్హబమ్ బిహిమ్’ వారికి ఎలాంటి స్వాగతం లేదు, వారికి ఎలాంటి మర్యాదలు లేవు. ‘ఇన్నహుమ్ సాలున్నార్’ వారు తప్పకుండా నరకంలో ప్రవేశించవలసినదే.

ఇక రండి మహాశయులారా, నరకంలో ఎవరికి ఎలాంటి తిండి లభిస్తుంది, త్రాగడానికి ఎలాంటి పానీయాలు లభిస్తాయో వాటి వివరణ కూడా అల్లాహ్ ఖురాన్ లో మనకు తెలియబరిచాడు.

ఇహలోకంలో ఎవరైనా అపరాధిని పట్టుకోవడం జరిగి అతన్ని ఒక జైలులో పంపిస్తారు అని తెలిస్తే, ఆ జైలులో తినడానికి తిండి సరిగా లభించదు, అక్కడ పడుకోవడానికి సరియైన పడకలు ఉండవు అని తెలిస్తే, మరియు అక్కడ చాలా ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది అని తెలిస్తే, ఆ అపరాధి ఏ కొంచెమైనా అవకాశం పొందినప్పుడు ఏం చేస్తాడు? దారిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అవకాశం ఉంటే ఎవరి సిఫారసులు అయినా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇహలోకంలో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కావచ్చు.

కానీ నరకంలో అలాంటిది ఏదైనా అవకాశం ఉందా? నరకంలో పడి ఉన్నారు అంటే అక్కడ చాలా ఇరుకైన స్థలంలో, బాధాకరమైన స్థలంలో, అక్కడ ఎలాంటి ఏ సిఫారసు పనిచేయదు, ఏ ప్రాణ స్నేహితుడు కూడా సహాయం చేయడు, ఏ జట్టు కూడా, ఏ గ్రూప్ కూడా, ఏ గ్యాంగ్ లీడర్ కూడా, ఏ పెద్ద నాయకులు కూడా ఎవరికీ ఏ ప్రయోజనం చేకూర్చరు. అందుగురించి అక్కడి ఆ కష్టాల నుండి, ఆపదల నుండి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా మనకు మనం సరిదిద్దుకోవాలి, విశ్వాస మార్గాన నడుస్తూ, సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

రండి ఒకసారి మనం, నరకవాసులకు ఎలాంటి తిండి ఇవ్వడం జరుగుతుందో ఖురాన్ ఆయతుల ద్వారా తెలుసుకుందాము. అయితే మహాశయులారా, మీరు కనీసం ఒక రెండు మూడు రోజుల నుండి నరకవాసులకు ఇవ్వబడే శిక్షల గురించి వివరాలు ఏవైతే వింటున్నారో ఇక పుణ్యాత్ములకు, మహా భక్తులకు, సత్కార్యాలు చేసే వారికి, విశ్వాసంపై నడిచే వారికి ఎలాంటి ఏ స్వాగతం అనేది, ఎలాంటి ఏ మంచి స్థలం అనేది లేదా అని భావించకండి. క్రమంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది గనుక, ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గనుక ఇప్పుడు నరకానికి సంబంధించిన వివరాలు తెలుపుతున్నాము. బహుశా ఇది ఒక వారం వరకు నడవవచ్చు, ఆ తర్వాత స్వర్గ శుభవార్తలను గురించి కూడా మనం తెలుసుకొనన్నాము. స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు, స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు ఏమిటి. కానీ అతి ముఖ్యమైనది అక్కడ మనకు పనికి వచ్చేది విశ్వాసం మరియు సామాన్యంగా సర్వ సత్కార్యాలు చేస్తూ ఉండడం. అయితే రండి, నరకవాసులకు ఎలాంటి తిండి, ఎలాంటి ఆహారం లభిస్తుందో, ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో తెలుసుకుందాము.

సూరతుద్ దుఖాన్, ఆయత్ నెంబర్ 43 నుండి 46 వరకు:

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
(ఇన్న షజరతజ్ జక్కూమ్)
నిశ్చయంగా జముడు యొక్క వృక్షం, (44:43)

طَعَامُ الْأَثِيمِ
(తఆముల్ అతీమ్)
పాపాత్ములకు అది ఆహారంగా ఉంటుంది. (44:44)

يَغْلِي فِي الْبُطُونِ
(యగ్లీ ఫిల్ బుతూన్)
పొయ్యి మీద కుండ పెడితే కాగి కాగి ఎలా ఉడుకుతుందో, ఆ జముడు వృక్షాన్ని మనిషి తిన్న వెంటనే కడుపులో ఆ విధంగా మంట లేపుతుంది, ఆ విధంగా అది ఉడుకుతుంది. (44:45)

كَغَلْيِ الْحَمِيمِ
(కగల్ యిల్ హమీమ్)
(సలసల కాగే నీరు మరుగుతున్నట్లు). (44:46)

ఈ జముడు వృక్షం అనేది నరకంలోని అతి కింది స్థలంలో నుండి అది పుట్టుకు వస్తుంది, అది చాలా దుర్వాసన గలది మరియు తినే వారి గురించి అతి చెడ్డ ఆహారం.

అల్లాహు తాలా ఒక సందర్భంలో స్వర్గవాసులకు ఇవ్వబడే వరాలను తెలుపుతూ:

أَذَلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
(అదాలిక ఖైరున్ నుజులన్ అమ్ షజరతుజ్ జక్కూమ్)
స్వర్గవాసులకు లభించే ఈ స్వర్గంలో ఆతిథ్యం ఇది చాలా మంచిగా ఉందా లేక జముడు వృక్షం ఎవరికైతే తినడానికి ఇవ్వబడుతుందో అది ఉత్తమంగా ఉందా? (37:62)

జక్కూమ్, ఈ జముడు వృక్షం అనేది దాని యొక్క ఒక చుక్క, ఒక బిందువు కూడా ఎంత చేదు మరియు ఎంత చెడుగా ఉంటుందో దానిని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

لَوْ أَنَّ قَطْرَةً مِنَ الزَّقُّومِ قُطِرَتْ فِي دَارِ الدُّنْيَا لأَفْسَدَتْ عَلَى أَهْلِ الدُّنْيَا مَعَايِشَهُمْ فَكَيْفَ بِمَنْ تَكُونُ طَعَامُهُ

జక్కూమ్ యొక్క ఒక బిందు, ఒక చుక్క కూడా ఇహలోకంలో ఉన్న వారిపై వేయడం జరిగితే వారి యొక్క జీవితాలు, వారి యొక్క సంసారాలు అనేటివన్నీ కూడా చెడిపోతాయి. ఇక అవి తినే వారి గురించి ఎలా ఉంటుందో, వారి యొక్క గతి ఎలా అవుతుందో.
(ముస్నద్ అహ్మద్, తిర్మిదీ మరియు నిసాయీ యొక్క ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు)

ఈ విధంగా మహాశయులారా, జముడు వృక్షం అలాంటి పాపాత్ములకు తినడానికి ఇవ్వబడుతుంది.

అల్లాహు తాలా నరకంలోని అన్ని రకాల శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. నరకంలోకి తీసుకువెళ్లే పాపాల నుండి మనల్ని అల్లాహు తాలా దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44355

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) – మరణానంతర జీవితం : పార్ట్ 47 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.

మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)

ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.

అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,

فما ظنكم
(ఫమా జన్నుకుమ్)

చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.

ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.

ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.

ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,

ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.

మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.

అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?

తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.

కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.

17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.

ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)

“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)

దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.

18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.

ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.

ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.

అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1) – మరణానంతర జీవితం : పార్ట్ 42 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1)
[మరణానంతర జీవితం – పార్ట్ 42]
https://www.youtube.com/watch?v=lATws_WFGpM [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయదినాన కర్మల త్రాసు (మీజాన్) గురించి మరియు దానిని తేలికగా చేసే కార్యాల గురించి వివరించబడింది. పుణ్యాల బరువును పెంచుకోవాలనే ఆకాంక్షతో పాటు, పాపాల వల్ల త్రాసు తేలిక అవుతుందనే భయం కూడా విశ్వాసికి ఉండాలి. పాపాలు రెండు రకాలు: పెద్ద పాపాలు (గునాహె కబీరా) మరియు చిన్న పాపాలు (గునాహె సగీరా). పెద్ద పాపాలు క్షమించబడాలంటే స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం, అయితే చిన్న పాపాలు సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ప్రసంగం ముగింపులో, కొన్ని ఘోరమైన పాపాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మరియు అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, వ’అలా ఆలిహీ వ’సహ్బిహీ వ’మన్ వాలా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము. త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష, కోరిక, తపన, ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి, త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే, పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది. అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడక ముందే పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. మాటిమాటికీ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి.

ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ, చింత, ఆవేదనకు గురి కాకండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా? కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం, ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము. ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము. ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం, ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము. అయితే సామాన్, సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది, పోతూ ఉన్నది, మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా? లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా? జాగ్రత్త పడుతూ ఉంటాము కదా? ఏదైనా సామాన్ చెడిపోయి, అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని, దుకాన్లో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి, ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా? లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది, దందా చాలా మంచిగా నడుస్తూ ఉన్నది, కానీ మన యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. తీసుకుంటామా లేదా?

అలాగే విశ్వాసం ఒక మూలధనం అయితే, సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ ని, లాభాన్ని, మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈ పాపాలు అనేటివి లాస్ కు గురి చేసేవి. అయితే వాటి నుండి జాగ్రత్త పడి ఉండడం, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం, ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి, పశ్చాత్తాప రూపంలో గాని, వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా గానీ మరింత పెద్ద లాస్ కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం.

ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా ఇలా తెలిపారు. “నీవు పరలోకాన అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు. ఇహలోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి.”

ప్రళయదినాన త్రాసు నెలకోల్పడం జరుగుతుంది. దానికి రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్లెంలో పుణ్యాలు, మరొక పళ్లెంలో పాపాలు. ఒక పళ్లెంలో సత్కార్యాలు, మరో పళ్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేది ఉంటే, ఆ పళ్లెం బరువుగా కిందికి జారిపోతుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది?

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.

ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు. మరెవరి పుణ్యాల త్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది. ఏంటి హావియా? నారున్ హామియా. అది చాలా రగులుతున్నటువంటి అగ్ని. అందులో పడవలసి వస్తుంది.

అయితే పాపాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. పెద్ద పాపాలు, చిన్న పాపాలు. గునాహె కబీరా, గునాహె సగీరా. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాలు చాలా ఘోరమైనవి. మరికొన్ని చిన్న పాపాలు అని అనబడతాయి. ఘోర పాపాల జాబితా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే సర్వ సత్కార్యాల్ని భస్మం చేసేస్తాయి, చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు. ఇక పుణ్యమే లేనప్పుడు, పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది? అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది.

అయితే గమనించండి, మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి. కానీ చిన్న పాపాలు అంటే, అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి. ఎలాంటి భయం లేకుండా మెదలకండి. చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక సామెత ద్వారా చెప్పాలా? ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడు అవుతాయి. ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది? వర్షం ఎలా కురుస్తుంది? కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం, సైలాబ్, పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది. పర్వతం దేన్ని అంటారు? ఒక్క రాయినా? కొన్ని రాళ్ల సముదాయాన్ని. మహాశయులారా, చిన్న పాపాల్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు, వాటి నష్టాలతో పాటు, ఆ ఘోర పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ పాపాలు పుణ్యాలను నశింపజేసి, త్రాసు బరువును తగ్గిస్తాయి, అవి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా, పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. చిన్న పాపాలు, వీటి గురించి అల్లాహు త’ఆలా మనకు ఒక వాగ్దానం చేశాడు, శుభవార్త ఇచ్చాడు. అదేమిటంటే చిన్న పాపాల్ని మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు. మరి ఈ క్షమించడం, ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లాహ్ తరఫున, అంటే ఏ పుణ్యానికి బదులుగా కాకుండా స్వయంగా అల్లాహ్ యే క్షమించడం, అట్లనే. మరొక రకం, మనం కొన్ని విధులు నిర్వహిస్తాము, కొన్ని పుణ్యాలు చేస్తాము, ఉదాహరణకు ఉదూ చేయడం, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, హజ్ చేయడం, ఇంకా. అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహు త’ఆలా శుభవార్త ఇచ్చాడు.

కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు షరతులు, రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? మొదటి నిబంధన, చిన్న పాపాలు మన్నించబడాలంటే, మొదటి నిబంధన, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి. ఘోర పాపాలు చేస్తూ ఉన్నాము, చిన్న పాపాలు కూడా మన్నించబడవు. రెండవ నిబంధన, ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు. దీనికి ఒక చిన్న సామెత ఇవ్వాలా? ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. చేసి, మీరు చూసిన వెంటనే, “సారీ, క్షమించండి” అతను “సారీ” అని నోటితో చెప్పక ముందు అతని యొక్క, “అరె, సారీ చెప్తున్నట్లు ఉంది”. “లేదండి, పర్వాలేదు, పర్వాలేదు, అట్లేం లేదు” అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము.

చేసింది అతను చిన్న తప్పే కావచ్చు, కానీ మీరు అతని వెంట చూస్తేనే, “ఏంటి?” తిరిగేసి, గుడ్లు తెరిచి, అయితే ఏంది? ఈ విధంగా ఎదురుమాట, అంటే చేసింది చిన్నదైనప్పటికీ, “అయ్యో, తప్పు జరిగింది కదా” అన్న భావన లేకుండా విర్రవీగడం, గర్వం చూపడం ఇది మన మానవులకే నచ్చదు. విషయం అర్థమైంది అనుకుంటాను.

ఈ విధంగా మహాశయులారా, మన చిన్న పాపాలు మన్నించబడాలంటే, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాల్ని “అరె, చిన్నవియే కదా” అన్నటువంటి భావనలో ఉండకూడదు. చదవండి ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్:

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ
[అల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్ లమమ్, ఇన్న రబ్బక వాసివుల్ మగ్ ఫిరహ్]

ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు.” (53:32)

ఎవరైతే చిన్న చిన్న తప్పులు, పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి పట్ల నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఏమర్థమైంది? పెద్ద పాపాల నుండి, మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది సూర నజ్మ్ లోని ఆయత్, ఆయత్ నంబర్ 32.

అయితే సూర నిసా, ఆయత్ నంబర్ 31 లో ఇలా తెలియబరిచాడు:

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
[ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్హు నుకఫ్ఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్ వనుద్ ఖిల్కుమ్ ముద్ ఖలన్ కరీమా]

“మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో (స్వర్గాలలో) ప్రవేశింపజేస్తాము”. (4:31)

ఈ రెండు ఆయతులకు తోడుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును కూడా వినండి. మ’జమ్ కబీర్, తబరానీలో ఈ హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామి’ లో ప్రస్తావించారు, 2687.

إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ
[ఇయ్యాకుమ్ వ ముహఖ్ఖరాతిజ్ జునూబ్]

فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَمَثَلِ قَوْمٍ نَزَلُوا بَطْنَ وَادٍ
[ఫ ఇన్నమా మసలు ముహఖ్ఖరాతిజ్ జునూబి క మసలి ఖౌమిన్ నజలూ బత్న వాదిన్]

మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా, చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది. కొందరు ఒక ప్రాంతంలో దిగారు, వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు. కొంతమందిని పంపారు, ఒక వ్యక్తి ఒక పుల్ల, మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె, ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు, కొన్ని చిన్న చిన్న కట్టెలు, కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది? మంచి మంట, మంచి వంటకాలు చేసుకున్నారు. ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు త’ఆలా పట్టడం, వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి. అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు. మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తెలిపారు, ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు, సత్కార్యాల్లో ఉంటాడు, ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం, మన్నింపు వైఖరి అవలంబించడం ఏదీ పాటించడు. అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటాడు, చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి. మరొక వ్యక్తి, అతని నుండి పాపం జరుగుతుంది, కానీ అతడు భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉంటాడు, చివరికి అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహు త’ఆలా అతన్ని మన్నించి, అతనికి మోక్షం కలిగిస్తాడు. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు త’అన్హు గారి యొక్క ఈ కొటేషన్ ని హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహమతుల్లాహ్ అలైహ్ ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6492 యొక్క వ్యాఖ్యానంలో.

ఇప్పుడు మహాశయులారా, ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఘోర పాపాన్ని దేన్ని అంటారు? ఈ విషయం అర్థమైంది అంటే మిగితవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది. ఖుర్ఆన్ మరియు హదీస్ లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో, పెద్ద పాపం అని తెలపడం జరిగిందో, అవి ఘోర పాపాలు. మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో, ఉదాహరణకు, దొంగ యొక్క చేతులు కట్ చేయడం, వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు, ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవో ఆ పాపాలు, మరియు ఏ పాపాల గురించి అయితే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో, మరియు ఏ పాపాలు చేసే వారి గురించి అయితే శాపనార్థాలు పెట్టడం జరిగినదో, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. అలాగే ఏ పాపాలు చేసే వారిని ఫాసిఖ్, అపరాధి, అని అనడం జరిగిందో ఆ పాపాలు కూడా ఘోర పాపాల్లో లెక్కించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఏమిటి? అలాంటి హదీసులను, అలాంటి ఆయతులను మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఉదాహరణకు ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ
[ఇన్న అ’జమజ్ జునూబి ఇందల్లాహ్]
అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి,

رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً
[రజులున్ తజవ్వజమ్ ర అతన్]
ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెండ్లాడాడు,

فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا طَلَّقَهَا
[ఫలమ్మా ఖదా హాజతహూ మిన్హా తల్లఖహా]
అతను ఆమెతో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు,

وَذَهَبَ بِمَهْرِهَا
[వ జహబ బి మహ్రిహా]
ఆమె యొక్క మహర్ ను కూడా తినేశాడు, మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్, లేదా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదు. ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడింది.

وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا فَذَهَبَ بِأُجْرَتِهِ
[వ రజులున్ ఇస్త’మల రజులన్ ఫ జహబ బి ఉజ్రతిహి]
ఒక మనిషి మరో మనిషికి, మనిషిని ఒక మజ్దూరీగా తీసుకున్నాడు, మరి అతనికి ఇచ్చే మజూరీ ఏదైతే ఉందో, బత్తెం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు, తినేశాడు.

మూడో వ్యక్తి,

وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا
[వ ఆఖరు యఖ్తులు దాబ్బతన్ అబసన్]
ఎవరైతే ఏదైనా పశువును, ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు. షికారీ చేయడం పేరుతో, లేదా కొందరికి అలవాటు ఉంటుంది, కుక్కలను, పిల్లులను పరిగెత్తించి, వెనక రాళ్లతో కొట్టి ఇంకా వేరే విధంగా.

అయితే మహాశయులారా, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహాశయులారా, పాపాల విషయాల్లో ఖుర్ఆన్ లో గాని, హదీస్ లో గాని మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాటిని అంటారు,

مُحْبِطَاتُ الْأَعْمَالِ
[ముహ్బితాతుల్ అ’మాల్]
సత్కార్యాలను నశింపజేసే పాపాలు అని.

వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి, దేని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో, దేని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో, ఆ పాపాలను తెలుసుకొని, వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల పాపాల నుండి, ఘోర పాపాల నుండి, చిన్న పాపాల నుండి మరియు مُحْبِطَاتُ الْأَعْمَالِ [ముహ్బితాతుల్ అ’మాల్] సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43771

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

హౌదె కౌసర్ | మరణానంతర జీవితం : పార్ట్ 50 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మానవుల కర్మల నమోదు  – [మరణానంతర జీవితం – పార్ట్ 50]
https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.

ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.

ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.

మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.

అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ
(హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా)
“నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”

مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ
(మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్‌యబు మినల్ మిస్క్)
దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన

మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.

مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا
(మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా)
“ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”

మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.

ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.

అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ
(ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్)
“నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను

مَنْ مَرَّ بِي شَرِبَ
(మన్ మర్ర బీ షరిబ్)
ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు

ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.

وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا
(వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా)
మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.

وَلَيَرِدَنَّ عَلَىَّ أَقْوَامٌ أَعْرِفُهُمْ وَيَعْرِفُونَنِي ثُمَّ يُحَالُ بَيْنِي وَبَيْنَهُمْ فَأَقُولُ إِنَّهُمْ مِنِّي فَيُقَالُ إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ فَأَقُولُ سُحْقًا سُحْقًا لِمَنْ بَدَّلَ بَعْدِي
(వలయరిదన్న అలయ్య అఖ్వామున్ ఆరిఫుహుమ్ వ యారిఫూననీ, సుమ్మ యుహాలు బైనీ వ బైనహుమ్. ఫ అఖూలు ఇన్నహుమ్ మిన్నీ, ఫ యుఖాలు ఇన్నక లా తద్రీ మా అహదసూ బాదక, ఫ అఖూలు సుహ్ఖన్ సుహ్ఖన్ లిమన్ బద్దల బాదీ)

హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని

గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.

ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.

అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?

ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.

రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.

మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.

అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.

మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.

إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا
(ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా)
“నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”

మరో ఉల్లేఖనంలో ఉంది,

وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ
(వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు)
ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.

గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.

إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ
(ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్)
“నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”

నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.

అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,

يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ
(యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్)
“నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)

నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.

అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41749

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 57] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 3]
నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 57] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=NZqkJ0Gly10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.అల్హమ్దులిల్లాహిల్లజీ అఅద్దల్ జన్నత లిల్ ముత్తఖీన్, వ అఅద్దన్నార లిజ్జాలిమీన్, వస్సలాతు వస్సలామ్ అలా మన్ ఉర్సిల బషీరన్ వ నజీరా, అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరకం, నరకవాసులు, వారి యొక్క శిక్షల వివరాలు మనం తెలుసుకుంటున్నాము.

మహాశయులారా, నరకం దాని రంగు ఎలా ఉంటుంది? నరకవాసుల రంగు ఎలా ఉంటుంది? ఈ వివరాలు కూడా మనకు ఖురాన్ హదీసుల్లో తెలుపబడ్డాయి. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము అంటే ఆఫీస్ కు ఒక రకంగా తయారయి వెళ్తాము, మార్కెట్లో వెళ్ళాలంటే ఒక రకంగా తయారయి వెళ్తాము. ఎవరైనా ఫ్రెండ్స్ తో పార్టీలలో పాల్గొనాల నుకుంటే మరో రకంగా మేకప్ చేసుకుని వెళ్తాము. ఈ విధంగా మనిషి యొక్క స్వభావంలో అందంగా ఉండాలి, నలుగురు మెచ్చుకునే రీతిలో మనం వారి ముందు ఉండాలి అని భావిస్తూ ఉంటాడు. నశించిపోయే ఈ ప్రపంచంలో ఇంతటి అలంకరణ విషయాలు మనం ప్రదర్శిస్తూ ఉంటాము. కానీ శాశ్వత జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా?

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఏమిటి? ఆ నరకం అంటే మీరు ఇహలోకంలో కాల్చే అగ్ని మాదిరిగా అనుకుంటున్నారా? కాదు.

أُوقِدَ عَلَى النَّارِ أَلْفَ سَنَةٍ حَتَّى احْمَرَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى ابْيَضَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى اسْوَدَّتْ، فَهِيَ سَوْدَاءُ مُظْلِمَةٌ.

వెయ్యి సంవత్సరాల వరకు నరకాగ్నిని దహించి వేయడం జరిగింది, అది ఎర్రగా ఎరుపుగా మారింది. ఆ తర్వాత మళ్లీ వెయ్యి సంవత్సరాల వరకు దానిని తేజోవంతంగా చేయడం జరిగింది, అది తెలుపుగా మారింది. ఆ తర్వాత ఇంకా వెయ్యి సంవత్సరాలు అగ్నిని కాల్చడం కాల్చడం జరిగింది. చివరికి అది నలుపుగా మారింది. ఫహియ సౌదావు ముజ్లిమతున్ కల్లైలిల్ ముజ్లిమ్ (అది అమావాస్య చిమ్మని చీకటి రాత్రి ఎలా ఉంటుందో ఆ విధంగా అది ఇప్పుడు నలుపుగా మరియు చీకటిగా ఉంది).

అల్లాహు అక్బర్. గమనించండి, మీరు ఉన్న రూమ్ లో బ్లాక్ కలర్ వేసుకొని ఉండగలుగుతారా? దానిపై ఒకవేళ ఇంకా చీకటి ఉండేది ఉంటే, ఇంత భయంకరంగా ఉంటుంది. నరకం ఆ విధంగా తయారు చేయడం జరిగింది.

మువత్తా ఇమామ్ మాలిక్ లోని ఒక హదీస్ లో ఉంది:

أَتَرَوْنَهَا حَمْرَاءَ كَنَارِكُمْ هَذِهِ؟ لَهِيَ أَسْوَدُ مِنَ الْقَارِ

మీరు నరకాగ్నిని మీ ఇహలోకపు అగ్ని మాదిరిగా ఎరుపుగా ఉంది అని భావిస్తున్నారా? అది తార్ (రోడ్డుపై వేసే డాంబర్) కంటే ఎక్కువ నలుపుగా ఉంది.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు [మరణానంతర జీవితం – పార్ట్ 55] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.

మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:

  • అన్నార్ (النَّار) – అగ్ని
  • జహన్నమ్ (جَهَنَّم) – నరకం (అత్యంత ప్రసిద్ధమైన పేరు)
  • జహీమ్ (جَحِيم) – ప్రజ్వలించే అగ్ని
  • సఈర్ (سَعِير) – మండుతున్న జ్వాల
  • లజా (لَظَىٰ) – భగభగమండే అగ్ని
  • సఖర్ (سَقَر) – కాల్చివేసేది
  • హుతమా (حُطَمَة) – ముక్కలు ముక్కలుగా నలిపివేసేది
  • హావియా (هَاوِيَة) – అగాధం, పాతాళం

ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.