ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు [వీడియో & టెక్స్ట్]

ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
https://www.youtube.com/watch?v=O_Eu55VE-KA [30 నిమిషాలు]

ఈ ప్రసంగంలో, వక్త మలమూత్ర విసర్జన చేసేటప్పుడు పాటించవలసిన ఇస్లామీయ పద్ధతులను హదీసుల ఆధారంగా వివరించారు. ప్రధాన అంశాలు: ఏకాంతాన్ని పాటించడం, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో తప్పులేదని చెప్పడం, భూమికి దగ్గరైన తర్వాతే బట్టలు పైకి తీయడం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత దువాలు చదవడం, ఆ సమయంలో మాట్లాడకూడదని చెప్పడం, అల్లాహ్ పేరు ఉన్న వస్తువులను లోపలికి తీసుకువెళ్లకపోవడం, ఖిబ్లా వైపు ముఖం లేదా వీపు పెట్టకపోవడం (కట్టడాలలో మినహాయింపు ఉంది), శపించబడిన ప్రదేశాలలో (దారి, నీడ, నీటి వనరులు) విసర్జన చేయకపోవడం, శరీరం లేదా దుస్తులపై తుంపరలు పడకుండా జాగ్రత్తపడటం, శుభ్రత కోసం నీటిని (మరియు రాళ్లను) ఉపయోగించడం, ఎడమ చేతిని మాత్రమే వాడటం, కనీసం మూడుసార్లు శుభ్రపరచడం, ఎముక మరియు పేడతో శుభ్రపరచకపోవడం, ఆ సమయంలో సలాంకు జవాబు ఇవ్వకపోవడం, మరియు అవసరమైతే నిలబడి మూత్రవిసర్జన చేయడం అనుమతించబడినప్పటికీ, తుంపరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు మనం మలమూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాము.

మొదటి విషయం, మలమూత్ర విసర్జన కొరకు నాలుగు గోడల మధ్యలో లేదా ఎడారి ప్రాంతంలో పోయే అవసరం ఉన్నప్పుడు కానీ ప్రజల చూపులకు, వారి దృష్టికి దూరంగా వెళ్ళాల్సిన ఆదేశం ఇస్లాం ఇస్తుంది. ఎందుకనగా ప్రతి మనిషి తన మర్మ అవయవాలను ఇతర చూపులకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం.

దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఒక హదీస్, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 148. ఇంకా అలాగే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 363 లో కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ముగైరా బిన్ షోబా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉండేవారు. ఆయన తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు,

فَانْطَلَقَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم حَتَّى تَوَارَى عَنِّي فَقَضَى حَاجَتَهُ
(ఫన్తలఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవారా అన్నీ ఫఖదా హాజతహు)
నాకు కనబడనంత దూరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, తమ అవసరాన్ని తీర్చుకొని తిరిగి వచ్చేశారు.”

సామాన్యంగా కొన్ని పల్లెటూర్లలో ఇప్పుడు అంతగా లేదు కావచ్చు, కానీ అయినా గాని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం మంచిగా భావించరు. కానీ ఇందులో ఎలాంటి అభ్యంతరం ఇస్లామీయ ధర్మ ప్రకారంగా గానీ, ఇందులో ఎలాంటి పాపం అనేది లేదు. స్వయంగా ఆ కాలంలో కూడా మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ ఇంటి మీద ఇలాంటి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం కూడా సహీ బుఖారీలో ఉంది. అందుగురించి ఇమామ్ బుఖారీ రహమతుల్లా అలై ఒక చాప్టర్ పేరేమి పెట్టారు? ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం.

రెండో విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు, లోపలికి వెళ్లి తలుపేసుకున్న తర్వాతే బట్టలు విప్పుతాము. కానీ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఒక పరదా లాంటి స్థలం, ప్రజల చూపులకు మనం కనబడకుండా ఉన్నాము అన్నటువంటి నమ్మకం అయిన తర్వాత, ఏ స్థలంలో మనం కూర్చోవాలి అని అనుకుంటున్నామో అక్కడ కూర్చోవడానికి సిద్ధమవుతూ, కిందికి వంగుతూ బట్టలను ఎత్తుకోవాలి.

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ حَاجَةً لاَ يَرْفَعُ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْضِ
(అన్నన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా అరాద హాజతన్ లా యర్ఫవు సౌబహు హత్తా యద్నువ మినల్ అర్ద్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించినప్పుడు భూమికి దగ్గరగా అయ్యేంతవరకు తమ వస్త్రాలు, తమ బట్టలు తీసేవారు కాదు.” (సునన్ అబీ దావూద్: 14)

అయితే ఎంతగా మనం మన మర్మావయవాలను ఇతర చూపుల నుండి దాచి ఉంచవలసిన అవసరం ఉందో, దీని గురించి ఎంత మంచి శిక్షణ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆచరణ ద్వారా మనకు చూపుతున్నారో గమనించండి. ఈ హదీస్ సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 14.

మరుగుదొడ్డిలో ప్రవేశిస్తూ లేదా ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యంగా ప్రజలకు తెలిసి ఉంటుంది, అర కిలోమీటర్, పావు కిలోమీటర్, కిలోమీటర్ నడిచి వెళ్తారు, కానీ ఇక్కడి నుండి కాలకృత్యాలు తీర్చుకునే ఈ ప్రాంతం అన్నటువంటి ఒక ఏర్పాటు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాతనే దుఆ చదువుకోవాలి. ఇక మరుగుదొడ్డి ఏదైతే ఉంటే, నాలుగు గోడల మధ్యలో ఏదైతే ఉంటే, బాత్రూంలో, టాయిలెట్లో ప్రవేశించేకి ముందే దాన్ని చదువుకోవాలి.

బిస్మిల్లాహ్ అనాలి, ఆ తర్వాత,

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్
ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి

ఇది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 142. కానీ బిస్మిల్లాహ్ గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప విషయం చెప్పారో గమనించండి. కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మనిషి తన మర్మ అవయవాలను దాచి ఉంచలేకపోతాడు గనుక, ఆ సందర్భంలో జిన్నాతులు కూడా చూసే అవకాశం ఉంటుందా లేదా? అందుగురించి మీరు బిస్మిల్లాహ్ అని ఆ సందర్భంలో ముందే అనేది ఉంటే మీకు మరియు జిన్నాతులకు మధ్యలో ఒక పరదా ఏర్పడుతుంది, వారు మీ మర్మ అవయవాలను చూడలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రత, పరిశుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో, బయటికి వచ్చిన తర్వాత “గుఫ్రానక” అని అనాలి. బిస్మిల్లా – అల్లాహ్ యొక్క పేరుతో నేను ఈ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న భావం. అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక – ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ – స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి. తిరిగి వచ్చిన తర్వాత ఏమనాలి? గుఫ్రానక – అంటే ఓ దేవా, నీవు నన్ను క్షమించు.

నాలుగవ విషయం, కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. ఏ మాత్రం మాట్లాడవద్దు. మరీ ఏదైనా అత్యవసర విషయం ఉండి సంక్షిప్తంగా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం అని కొందరు పండితులు చెప్పారు. కానీ ఒక సామాన్య పద్ధతి ఏమిటి? మన కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. సహీహాలో ఈ హదీస్ ఉంది, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అని చెప్పారు.

إِذَا تَغَوَّطَ الرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ وَلَا يَتَحَدَّثَانِ عَلَى طَوْفِهِمَا فَإِنَّ اللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ
ఇద్దరు మనుషులు కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ తన స్నేహితుని చూపులకు దూరంగా ఉండే అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. మరి తమ అవసరం తీర్చుకున్న సందర్భంలో ఏ మాత్రం మాట్లాడవద్దు. ఇందువల్ల అల్లాహ్ త’ఆలా వారిపై చాలా ఆగ్రహపడతాడు.”

ఐదవ విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అల్లాహ్ యొక్క పేరు గల ఏ వస్తువు కూడా వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో వచ్చిన ఒక హదీస్ బలహీనంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉంగరం మీద “ముహమ్మద్ రసూల్ అల్లాహ్” అంటే ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న భావం, ఈ మూడు పదాలు ఉండేవి. అయితే అల్లాహ్ యొక్క పేరు కూడా వచ్చింది గనుక దాన్ని తీసి బయట పెట్టి వెళ్ళేవారు అని. కానీ హదీస్ దయీఫ్ ఉంది. అయినా గానీ సర్వసామాన్యంగా పండితులందరూ కూడా ఏకీభవించారు, అల్లాహ్ పేరు గల ఏ వస్తువు కూడా ఎంబడి తీసుకొని వెళ్ళకూడదు.

కానీ కొన్ని వస్తువులు దాన్ని బయట పెట్టి వెళ్ళడం ద్వారా ఏదైనా మనకు నష్టం ఉంది, దాన్ని కాపాడలేకపోతాము, అలాంటి సందర్భంలో మరికొందరు పండితులు ఏం ఫత్వా ఇచ్చారంటే దానిని బహిరంగంగా ఉండకుండా జేబు లోపల గానీ, దస్తీ లోపల గానీ, ఇలాంటివన్నీ దాచిపెట్టి పోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి ఖురాన్ కంఠస్థం చేసి ఉంటాడు, దాన్ని బయటికి తీసి వెళ్ళలేడు కదా. అయితే దాని యొక్క పోలిక అని కొందరు పండితులు చెప్పారు. అలాగే జవ్వాలల్లో ఉదాహరణకు ఖురాన్ ఉంటుంది, లేదా ఏదైనా కాయితం ఉంది, ఏదైనా దువాల పుస్తకం ఉంది, అలాంటివి బయట పెట్టి వెళ్ళడం వల్ల, బయట పెట్టి వెళ్ళడం వల్ల ఏదైనా నష్టం అన్నటువంటి భయం ఉండేది ఉంటే లోపల పెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు.

ఆరో విషయం, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో ఖిబ్లా దిశలో ముఖము గానీ వీపు గానీ ఉండకూడదు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 394 లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖకులు:

إِذَا أَتَيْتُمُ الْغَائِطَ فَلاَ تَسْتَقْبِلُوا الْقِبْلَةَ وَلاَ تَسْتَدْبِرُوهَا
“మీరు మీ అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఖిబ్లా వైపునకు ముఖము చేయకండి, వీపు చేయకండి.”

కానీ నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కూడా ఉండకుండా ముందు నుండే జాగ్రత్తపడటం మరీ మంచిది. ఎందుకనగా అబూ దావూద్ లో హదీస్ నెంబర్ 11 లో, ఇంకా సహీ బుఖారీ వేరే చోట కూడా ఈ హదీస్ ఉంది ఈ భావంలో, సహీ బుఖారీలో ఉంది 148, ఇబ్నె ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ఏదో అవసరం పడి తమ సోదరి అయిన హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా గారి ఇంటి కప్పు మీదికి వెళ్ళడానికి పైన ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త గారు ఖిబ్లా దిశలో, ఖిబ్లా దిశలో వీపు పెట్టి తమ కాలకృత్యాలు తీర్చుకున్నట్టు కనబడింది, తర్వాత బహుశా ఆ విషయంలో అడిగారు. అయితే ఈ హదీస్ ద్వారా ధర్మవేత్తలు ఏమన్నారంటే నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కాకుండా ఒక సందర్భంలో ఇబ్ను ఉమర్ స్వయంగా ప్రయాణంలో ఉన్నారు, అప్పుడు తమ ఒంటెను నిలిపారు, ఖిబ్లా దిశలో మూత్రం పోశారు. ఆ సందర్భంలో మర్వానల్ అస్ఫర్ అనే ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే ప్రశ్నించారు: “యా అబా అబ్దిర్రహ్మాన్, అలైస ఖద్ నుహియ అన్ హాదా? ఖిబ్లా దిశలో ఉండి, ఖిబ్లా దిశలో ముఖం గానీ వీపు గానీ చేసి కాలకృత్యాలు తీర్చుకోవద్దు, మూత్ర మలమూత్రానికి వెళ్ళవద్దు అని మనకు నిషేధించబడలేదా?“అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు?

نُهِيَ عَنْ ذَلِكَ فِي الْفَضَاءِ
“ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని నిషేధించబడింది.”

فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلاَ بَأْسَ
“ఒకవేళ నీ మధ్యలో మరియు ఖిబ్లా మధ్యలో ఏదైనా అడ్డు ఉండి దాని వెనుక నీవు నీ అవసరాన్ని తీర్చుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు చెప్పారు.

నాలుగు గోడల మధ్యలో ఖిబ్లా దిశలో ఉన్నా గానీ మన టాయిలెట్, ఎలాంటి అభ్యంతరం లేదు అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా గానీ ఎవరైనా ముందు నుండే దాన్ని కట్టేటప్పుడు ఖిబ్లాకు వ్యతిరేక దిశలో కట్టేది ఉంటే మరీ మంచిది.

ఏడవ విషయం, శాపనకు గురి కావలసిన స్థలాల్లో మలమూత్రం చేయకూడదు. శాపనకు గురి కావలసిన స్థలాల్లో అంటే ఏంటి? హదీస్ లో ఇలాగే ఉంది. ముస్లిం షరీఫ్ 269 లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا اللَّعَّانَيْنِ
(ఇత్తఖుల్ లఅనైన్)
“అధికంగా శాపం ఇచ్చే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి.”

ప్రవక్తను అడిగారు, వమల్ లఅనాని యా రసూలల్లాహ్? ప్రవక్తా, ఆ రెండు అధికంగా శాపనానికి గురి అయ్యే ఆ విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاسِ أَوْ فِي ظِلِّهِمْ
(అల్లది యతఖల్లా ఫీ తరీఖిన్నాసి అవ్ ఫీ దిల్లిహిమ్)
“ప్రజల దారి మధ్యలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేసేవాడు.”

అంటే ఆ మలమూత్ర విసర్జన అనేది ఆ ప్రాంతంలో చేయడం ద్వారా ప్రజలు అసహ్యించుకుంటారు, ప్రజలు శపిస్తారు, ఆ శాపనకు అలాంటి వారు గురి అవుతారు.

సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 26 లో ఉంది, ముఆద్ ఇబ్ను జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا الْمَلَاعِنِ الثَّلَاثَةَ
(ఇత్తఖుల్ మలాయినిస్ సలాస)
“మూడు శాపనానికి గురి అయ్యే విషయాల నుండి మీరు దూరం ఉండండి:
అల్ బరాజ్ ఫిల్ మవారిద్, వఖారిఅతిత్ తరీఖ్, వ దిల్ల్.
నీళ్ళు త్రాగేచోట మల విసర్జన చేయడం, లేదా దారి మధ్యలో దారి పక్కన, ఇంకా నీడ ఉన్నచోట.”

ఎనిమిదవ విషయం, శరీరం లేక మన దుస్తులపై ఎలాంటి మలమూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనగా ఇది చాలా భయంకరమైన విషయం, ఇది చాలా పెద్ద పాపంలో లెక్కించబడుతుంది. ఘోర పాపంలో. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 348 లో,

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ مِنَ الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి మినల్ బౌల్)
“సమాధిలో ఎక్కువగా శిక్ష దేని గురించి అయితే జరుగుతుందో, అది మూత్ర విసర్జనలో అశ్రద్ధ చేయడం, లేక మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడకపోవడం, లేదా మూత్రం పోసిన తర్వాత పరిశుభ్రత విషయంలో అశ్రద్ధకు గురి కావడం.”
ఇవన్నీ భావాలు కూడా అందులో వస్తాయి.

ఇంకా సహీ బుఖారీ హదీస్ నెంబర్ 216 లో ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే రెండు సమాధులు కనబడ్డాయి. అందులో ఉన్న ఆ ఇద్దరు మనుషులకు, శవాలకు చాలా శిక్ష అవుతుంది అని చెప్పారు. అయితే ప్రవక్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో ఒకరి గురించి చెప్పారు,

كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ
(కాన అహదుహుమా లా యస్తతిరు మిన్ బౌలిహి)
“ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన మూత్రం నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మూత్ర తుంపరలు మీద పడకుండా తనను తాను కాపాడుకునేవాడు కాడు, ఇంకా మూత్రం పోసిన తర్వాత శుభ్రం చేసుకునేవాడు కాడు, శుభ్రం చేసుకున్నా అందులో కూడా అశ్రద్ధతనం పాటించేవాడు.”
ఇవన్నీ భావాలు కూడా ఈ హదీస్ లో వస్తాయి. రెండో వ్యక్తి ఎవరు? చాడీలు చెప్పేవాడు.

తొమ్మిదవ విషయం, మలమూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్లు ఉపయోగించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 150 లో ఉంది, “ఇదా ఖరజ లిహాజతిహి అజీవు అన వగులామున్ మఅనా ఇదావతున్ మిమ్మాఇన్ యఅనీ యస్తంజీ బిహి.” హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారు ఈ విషయం తెలుపుతున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు నేను మరియు ఇంకో నాలాంటి యువకుడు, మేము ఇద్దరము ప్రవక్త గారి వెంట వెళ్ళేవాళ్ళము, మా వెంట మేము నీళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అయితే ఎక్కడి వరకైతే వెళ్ళేవారో అక్కడికి వెళ్లి, ఆ తర్వాత ఎక్కడనైతే ప్రజల చూపులకు కనబడకుండా వెళ్ళేది ఉందో, అక్కడి నుండి ప్రవక్త ఆ నీళ్లు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. అయితే నీళ్ళతో పరిశుభ్రత అనేది పాటించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు అన్న విషయం మనకి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

అంతే కాదు, సునన్ తిర్మిదీలో, సునన్ తిర్మిదీలో హదీస్ నెంబర్ 19, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా స్త్రీలతో చెప్పారు. “ముర్న అజ్వాజకున్న అన్ యస్తతీబూ బిల్ మాఇ ఫఇన్నీ అస్తహ్యీహిమ్, ఫఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యఫ్అలు.” “మీరు మీ భర్తలకు, మీ పురుషులకు నీళ్ళతో శుభ్రపరుచుకోవాలని, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లు ఉపయోగించాలని, నీళ్లతో శుభ్రపరుచుకోవాలని మీరు ఆదేశించండి. వారికి నేను చెప్పడంలో సిగ్గుపడుతున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.”

ఒకవేళ నీళ్ళు లేని సందర్భంలో లేదా నీళ్లతో పాటు కూడా ఇటిక పెడ్డలను, నీళ్ళు పీల్చే రాయిని లేక టిష్యూ పేపర్, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించడం మరీ మంచిది. మరీ మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వచ్చిన తర్వాత సూరె తౌబాలో ఆయత్ నెంబర్ 108 లో,

فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ
(ఫీహి రిజాలున్ యుహిబ్బూన అన్ యతతహర్రూ, వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్)
“దానిలో పవిత్రంగా ఉండటాన్ని ప్రేమించేవారున్నారు. అల్లాహ్ పవిత్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు.” (9:108)

ఈ మదీనా వాసుల్లో అన్సార్ లో కొందరు, ప్రత్యేకంగా ఖుబా వాసులు, ఖుబా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవారు, వారిని ప్రశంసిస్తూ ఈ ఆయత్ అవతరించింది. ఏంటి? అక్కడి వాసుల్లో కొందరు పరిశుభ్రంగా ఉండడాన్ని చాలా ప్రేమిస్తారు, మరియు అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఆ మనుషులు ఎవరు? పరిశుభ్రతను చాలా ఇష్టపడతారు. అయితే వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ ఏమన్నాడు? వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్ – అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని ప్రేమిస్తాడు.

అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు గారు అంటున్నారు, ఇబ్నె ఖుజైమాలో ఈ హదీస్ ఉంది, సహీ హదీస్, వారు నీళ్ళను ఉపయోగించేవారు. అందుగురించి వారి యొక్క ప్రశంసలో అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం ఉంది, వారు నీళ్లతో పాటు మట్టి పెడ్డలను, ఇటికలను ఇలాంటి వాటిని, నీళ్లు పీల్చే అలాంటి వస్తువులను ఉపయోగించేవారు, రెండిటి ద్వారా వారు పరిశుభ్రతను పాటించేవారు గనుక వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ని అవతరింపజేశాడు. అంటే విషయం ఏంటి ఇక్కడ? నీళ్ళు అయితే కంపల్సరీ వాడాలి, నీళ్ళు లేని సందర్భంలో లేక నీళ్లతో పాటు కూడా ఈ వస్తువులు వాడడం కూడా మరీ మంచిది అన్న విషయం ఈ ఆయత్ మరియు దీనికి సంబంధించిన తఫ్సీర్ల ద్వారా మనకు తెలుస్తుంది.

అయితే పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగించకూడదు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

إِذَا بَالَ أَحَدُكُمْ فَلَا يَأْخُذَنَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلَا يَسْتَنْجِ بِيَمِينِهِ
“మీలో ఎవరైనా మూత్రం పోయినప్పుడు తన మూత్రాంగాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. కుడి చేతితో పరిశుభ్రత కూడా చేయకూడదు.”

అలాగే పరిశుభ్రత సందర్భంలో నీళ్లతో మనం పరిశుభ్రం చేసినా గానీ, పెడ్డలతో చేసినా, టిష్యూ పేపర్ తో చేసినా గానీ, మూడేసి సార్లు చేయాలి. కానీ కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్లారు, నీళ్ళు లేవు, పెడ్డలు ఉపయోగిస్తాము, మూడు పెడ్డలు తీసుకోవాలి. లేదా ఒక పెద్ద రాయి తీసుకొని మూడు దిక్కుల్లో, మూడు సార్లు… ఈ విషయాన్ని వివరంగా చెప్పడంలో చాలా సిగ్గుపడుతూ ఉంటాము, కానీ అర్థం కావడానికి, ఒక పెడ్డ తీసుకున్నాము, మూత్రం పోసిన తర్వాత తొందరపాటు పడవద్దు. మధ్యలో ఆగి ఉన్న చుక్కలన్నీ పడిపోయేంతవరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పెడ్డ తీసుకొని ఒక వైపున తుడువాలి, దాన్ని తిప్పేసి రెండోసారి తుడువాలి, మళ్ళీ తింపేసి మూడోసారి తుడువాలి. లేదా మూడు వేరేవేరే రాళ్లు పెడ్డలు తీసుకోవాలి. అంటే కనీసం మూడుసార్లు ఈ కడగడం అనేది, తుడువడం అనేది జరగాలి.

ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆదేశించారో, ఇబ్నె మాజాలో ఈ హదీస్ ఉన్నది, హదీస్ నెంబర్ 350. కానీ దీని యొక్క లాభాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎలా చెబుతున్నారో శ్రద్ధ వహించండి. ఈ ప్రవక్త గారి ఆదేశం వచ్చిన తర్వాత మేము మూడేసి సార్లు కడిగేవాళ్ళం,

فَوَجَدْنَاهُ دَوَاءً وَطَهُورًا
(ఫవజద్నాహు దవాఅన్ వతహూరా)
“దాని మూలంగా దానివల్ల పరిశుభ్రత కూడా పొందినాము, ఎన్నో రోగాలకు చికిత్స కూడా మేము పొందాము.”

అలాగే పరిశుభ్రత కొరకు ఎముక, బొక్క, లేదా పేడ లేదా ఎండిన పిడిక, పెండను పిడికగా చేస్తారు కదా, ఆ పిడికలను గానీ ఏ మాత్రం ఉపయోగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీ బుఖారీలో 3571 లో ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి ఆదేశించారు రాళ్లు తీసుకురమ్మని, కానీ ఏం చెప్పారు?

وَلاَ تَأْتِنِي بِعَظْمٍ وَلاَ بِرَوْثَةٍ
(వలా తఅతినీ బిఅద్మిన్ వలా బిరౌసతిన్)
“ఎముక గానీ లేదా పేడ గానీ తీసుకురాకు.”

కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ పరిశుభ్రతలు అయిపోయినాయి, తర్వాత ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, “మీరు ఎందుకు ఈ రెండిటినీ తీసుకురావద్దని చెప్పారు?” అని. అవి మీ సోదరులైన జిన్నాతులకు ఆహారంగా పనిచేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

మలమూత్ర విసర్జన సందర్భంలో సలాం కూడా చేయరాదు, ఎవరైనా సలాం చేస్తే సమాధానం కూడా, జవాబు కూడా ఇవ్వకూడదు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూత్రం పోస్తున్నారు. కొంచెం దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పలేదు. తర్వాత అతనితో కలిసి చెప్పారు, ఇలాంటి సందర్భంలో మీరు సలాం చేయకండి. ఒకవేళ మీరు సలాం చేసినా నేను మీకు సమాధానం పలుకను. ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది 346.

ఇంతవరకు అల్లాహ్ యొక్క దయవల్ల మనం మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఇంచుమించు 14, 13 పద్ధతులను, విషయాలను ఆధారాలతో సహా విన్నాము.

చివరి విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నిలబడి మూత్రం పోసే అవసరం పడవచ్చు. అది ఇస్లాంలో ధర్మమేనా లేదా? అందులో ఎలాంటి అనుమానం లేదు, అది యోగ్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో ఇలాంటి అవసరం పడింది, నిలబడి మూత్రం పోశారు అన్న విషయం సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 224 లో ఉంది.

కానీ అవసరం ఉండి నిలబడి పోసినా లేదా సామాన్యంగా కూర్చుండి మూత్రం పోసినా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తుంపరలు, మూత్రపు చుక్కలు మీద పడకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమాధిలో ఎక్కువగా శిక్ష దీని గురించే జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

ఈరోజు అల్లాహ్ యొక్క దయవల్ల ఈ విషయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సరైన పద్ధతిలో ఈ అవసరాలు ఇంకా మన సర్వ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.

కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః

اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్‌ ఖుబుసి వల్ ఖబాయిస్ .
(అల్లాహ్‌ పేరుతో, ఓ అల్లాహ్‌ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

غُفْرَانَك (గుఫ్రానక)
(నీ మన్నింపుకై అర్ధిస్తున్నాను) (తిర్మిజి 7).


2- అల్లాహ్‌ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.

4- సతర్‌ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్‌ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్‌ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5168

ఇతరములు :