దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆయేషా బిన్త్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) – 5 వీడియోలు – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
5 ఆడియో భాగాలు :
పార్ట్ 1:
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ను స్తుతించిన తర్వాత ఇస్లాంలో స్త్రీ యొక్క ఉన్నత స్థానాన్ని వివరిస్తారు, సుగుణవతి అయిన స్త్రీ ఈ ప్రపంచంలోని ఉత్తమ సామాగ్రి అని తెలిపే ఒక హదీస్ను ఉదహరిస్తారు. ఆ తర్వాత, వక్త విశ్వాసుల తల్లి ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆమె వంశం, ఆమెకు సంతానం లేకపోయినప్పటికీ “ఉమ్మె అబ్దుల్లా” అనే కున్నియత్ (బిరుదు పేరు) ఎలా వచ్చిందో వివరిస్తారు. ఇంకా, ఆమె యొక్క అనేక బిరుదులైన ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి), హబీబా (ప్రియమైనది), హుమైరా మరియు మువఫ్ఫకా వంటి వాటి వెనుక ఉన్న కారణాలను మరియు ప్రాముఖ్యతను హదీసులు మరియు ఖురాన్ ఆధారంగా వివరిస్తారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ [అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్] సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు.
وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ [వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్] మరియు అంతిమ విజయం దైవభీతిపరులకే.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ [వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్] మరియు శాంతి మరియు శుభాలు ప్రవక్తల నాయకునిపై మరియు దైవసందేశహరులపై వర్షించుగాక.
وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ [వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్] మరియు ప్రళయదినం వరకు ఉత్తమ రీతిలో వారిని అనుసరించిన వారిపై కూడా.
أَمَّا بَعْدُ [అమ్మాబాద్] ఇక ఆ తర్వాత.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ [అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈ రోజు మనం ఆదర్శ మూర్తి, ఆదర్శ మహిళ, విశ్వాసుల మాతృమూర్తి, ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం.
స్త్రీ స్థానం
ప్రపంచపు గొప్ప సౌభాగ్యం స్త్రీ. ఆ కోమలాంగి గనక భార్య రూపంలో వస్తే, ఆమె తన భర్త పాలిట, తన పిల్లల పాలిట సౌభాగ్యవతిగా అవతరిస్తుంది.
సత్కార్యం అంటే కేవలం తల మీద గుడ్డ కప్పుకోవటం, ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవటం మాత్రమే కాదు. అది అందులో భాగం కావచ్చు. అయితే, నిజమైన సత్కార్యం ఏమిటంటే, స్త్రీ తనకు శోభాయమానమైన మౌలిక సుగుణాలను కలిగి ఉండాలి. ఏ స్త్రీలోనైనా ఆ ప్రాథమిక గుణాలు లేకపోతే ఆ వైవాహిక జీవితం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
స్త్రీ గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు.
ఉత్తమ సామాగ్రి గురించి హదీస్
الدُّنْيَا كُلُّهَا مَتَاعٌ وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا الْمَرْأَةُ الصَّالِحَةُ [అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాయిద్దునియా అల్ మర్అతుస్సాలిహా] ఈ ప్రపంచమంతా ఒక తాత్కాలిక వసతి, మరియు ఈ ప్రపంచంలోని ఉత్తమ వసతి సుగుణవతి అయిన స్త్రీ.
ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.
ప్రపంచం మొత్తం కేవలం కొన్ని రోజుల జీవన సామగ్రి. అందులో అన్నిటికంటే మేలైన సామగ్రి సుగుణవతి అయిన స్త్రీ.
الله أكبر [అల్లాహు అక్బర్] అల్లాహ్ గొప్పవాడు.
స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క ప్రాముఖ్యత, స్త్రీ యొక్క గొప్పతనం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఈ పూర్తి ప్రపంచం, ఈ ప్రపంచం యొక్క విలువ, ఈ ప్రపంచంలోని అందచందాలు, ఆస్తి, ఐశ్వర్యాలు, హోదాలు, పదవులు, డబ్బు, బంగారం, వెండి, ఆణిముత్యాలు, వజ్రాలు, ఈ పూర్తి ప్రపంచం, ప్రపంచం యొక్క సామగ్రి ఇవన్నీ ఒక పక్క పెట్టి, మరో పక్క సుగుణవతి అయిన స్త్రీ. అంటే ఈ మొత్తం ప్రపంచపు సామగ్రి కంటే సుగుణవతి అయిన స్త్రీ గొప్పది, మేలైనది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
ప్రియ సోదరులారా, ఇటువంటి గొప్ప సుగుణవతులలో ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒకరు. ఆవిడ రదియల్లాహు అన్హా గురించి ఇన్షా అల్లాహ్ మనం ఈ రోజు క్లాసులో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి వంశం మరియు జీవితం
ఆవిడ పేరు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. తండ్రి పేరు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ప్రవక్త గారి ప్రాణమిత్రులు, పురుషులలో అందరికంటే ముందు ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు. ఆ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు కూతురు ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా.
ప్రవక్త గారి వంశం, ఆయిషా రదియల్లాహు అన్హా గారి వంశం ఏడు లేదా ఎనిమిదవ తరములో ఒకటైపోతుంది. ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ముర్రా బిన్ కాబ్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశంలో ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఈ వంశంలో ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ఆ తైమ్ నుంచి అబూబకర్ రదియల్లాహు అన్హు, ఆయిషా రదియల్లాహు అన్హా. అదే ముర్రా బిన్ కాబ్ యొక్క ఇంకో కుమారుడు కిలాబ్ నుంచి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఏడు లేదా ఎనిమిదవ తరములో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వంశం ఒకటైపోతుంది.
ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి కున్నియత్: ఉమ్మె అబ్దుల్లా
ఇక బిరుదుల కంటే ముందు కున్నియత్ గురించి చెప్తాను ఇన్షా అల్లాహ్. కున్నియత్. కున్నియత్ అంటే అరబ్ దేశాలలో ఉన్న వారికి బాగా తెలుసు ఇది. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. అబూ అబ్దుల్లా, అబ్దుల్లా కి తండ్రి. అబూ ముహమ్మద్, ముహమ్మద్ కి తండ్రి. ఆ విధంగా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కున్నియత్ ఏమిటి? అబుల్ ఖాసిం. మన ప్రవక్త గారి ఒక కుమారుడు ఖాసిం. బాల్యంలోనే మరణించారు. ఆ ఖాసిం పేరుతో అబుల్ ఖాసిం. ఖాసిం కి తండ్రి అని అర్థం.
ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు ఉమ్మె అబ్దుల్లా. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. అబ్దుల్లా కి తల్లి అని. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా కడుపున సంతానం పుట్టలేదు. సంతానం కలగలేదు. మరి సంతానం లేకుండా అబ్దుల్లా కి తల్లి ఎలా అయింది? ఆ కున్నియత్ ఎలా వచ్చింది? అనే విషయం తెలుసుకోవాలంటే ఒక హదీస్ మనం తెలుసుకోవాలి.
ఆ హదీస్ అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ వగైరా హదీస్ గ్రంథాలలో ఉంది. ఈ హదీస్ని అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి సహీ అన్నారు. అన్ ఉర్వా, ఉర్వా రదియల్లాహు అన్హు కథనం. ఒకసారి ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇలా విన్నవించుకున్నారు. యా రసూలల్లాహ్, ఓ దైవ ప్రవక్తా, కుల్లు సవాహిబీ లహున్న కునా. నా స్నేహితులందరికీ, స్నేహితురాళ్ళందరికీ కున్నియత్ ఉంది. నా స్నేహితురాలు వారందరూ తమ తమ బిడ్డల తల్లులు అని పిలువబడుతున్నారు. వారందరికీ కున్నియత్ ఉంది. మరి నేను ఎవరి తల్లి అని అనిపించుకోవాలి, పిలిపించుకోవాలి అని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా విన్నవించుకుంటే, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు. ఖాల్, ఫక్తునీ బిబ్నికి అబ్దుల్లాహిబ్ని అజ్జుబైర్ యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. ఓ ఆయిషా, నువ్వు నీ కొడుకు అయిన అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి అని పిలిపించుకో. అంటే నీ అక్క కొడుకు. యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. నీ అక్క కొడుకు. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అక్క కూతురు. అస్మా రదియల్లాహు అన్హా. అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క పెద్ద కూతురు అస్మా రదియల్లాహు అన్హా గురించి మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఘారె సౌర్లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ ఉన్నప్పుడు అస్మా రదియల్లాహు అన్హా ఆ ముఖ్యమైన విషయాలు, అన్నం, పానీయాలు తీసుకుని పోయి ఇచ్చేవారు. ఆ అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్. అబ్దుల్లా బిన్ జుబైర్ ముహాజిర్లు మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత ముహాజిర్లలో మొట్టమొదటి సంతానం అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు. ముహాజిర్లు హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనాకు వచ్చాక ఆ ముహాజిర్లలో మొదటిగా ఎవరు పుట్టారంటే వారు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు.
ఆ విధంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఓ ఆయిషా నువ్వు నీ అక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ కి తల్లి అని పిలిపించుకో అని సమాధానం ఇస్తే, ఫకానత్ తుద్ఈ బి ఉమ్మి అబ్దిల్లా హత్తా మాతత్. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా పరమపదించే వరకు ఉమ్మె అబ్దుల్లా అనే కున్నియత్తో పిలువబడేవారు. ఈ హదీస్ అనేక హదీస్ గ్రంథాలలో ఉంది. ఉదాహరణకు అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ, అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ని సహీ అన్నారు. అంటే ఈ హదీస్ పరంగా మొదటి విషయం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారి కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. రెండో విషయం, సంతానం లేకపోయినా కున్నియత్ పెట్టుకోవచ్చు అని అర్థమయింది. ఇది కున్నియత్ గురించి.
ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి బిరుదులు (అల్ఖాబ్)
ఇక అల్ఖాబ్, బిరుదులు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అనేక బిరుదులు ఉన్నాయి. మనం కూడా సమాజంలో చూస్తున్నాము. అనేక మందిని వారి ప్రత్యేక సేవల వల్ల కొన్ని బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రభుత్వం కూడా కొంతమందిని బిరుదు కేటాయిస్తుంది. ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులు అనేకం ఉన్నాయి. ఆ అనేక బిరుదులలో కొన్ని బిరుదులు మనం తెలుసుకుందాం.
ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి)
అన్నిటికంటే గొప్పది ఆ బిరుదు ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. విశ్వాసుల తల్లి. విశ్వాసుల మాతృమూర్తి. ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. ఈ బిరుదు స్వయంగా సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ బిరుదు. ఈ ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణిలందరికీ ఈ బిరుదు అల్లాహ్ ఇచ్చాడు. ప్రవక్త గారి భార్యలందరికీ ఈ బిరుదు వర్తిస్తుంది. ఇది అల్లాహ్ ఇచ్చిన బిరుదు. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నెంబర్ ఆరులో ఇలా ఉంటుంది.
النَّبِيُّ أَوْلَى بِالْمُؤْمِنِينَ مِنْ أَنْفُسِهِمْ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ [అన్నబియ్యు ఔలా బిల్ ముఅమినీన మిన్ అన్ఫుసిహిమ్ వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్] ప్రవక్త విశ్వాసులకు వారి ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియమైనవారు, మరియు ఆయన భార్యలు వారి తల్లులు.
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. దైవ ప్రవక్తకు విశ్వాసులపై, మూమినీన్లపై వారి ఆ విశ్వాసుల, ఆ మూమినీన్ల ఆత్మ కన్నా, ప్రాణం కన్నా ఎక్కువ హక్కు ఉంది. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ఆయన భార్యలు, అంటే ప్రవక్త గారి సతీమణులు విశ్వాసుల కొరకు తల్లులు. ప్రతి విశ్వాసికి ప్రవక్త గారి ఏ భార్య అయినా సరే తల్లి. ఉమ్ముల్ మూమినీన్. ఈ బిరుదు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన బిరుదు సూరా అహ్జాబ్, సూరా నెంబర్ 33, ఆయత్ నెంబర్ ఆరు. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ప్రవక్త గారి భార్యలు విశ్వాసులకు తల్లులు. ఇది మొదటి బిరుదు, ఉమ్ముల్ మూమినీన్.
హబీబా (ప్రియమైనది)
ఇక రెండో బిరుదు హబీబా. ఇది హబీబ్ దీనికి స్త్రీ వచనం హబీబా. హబీబ్ మేల్ అయితే హబీబా ఫీమేల్. హబీబ్ పురుషులకి వర్తిస్తుంది, హబీబా స్త్రీలకు వర్తిస్తుంది. దాని అర్థం ఏమిటి? ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. హబీబా అంటే ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో ఒక బిరుదు హబీబా. ప్రియమైన వారు. ఆవిడ పట్ల మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ వల్ల ఈ బిరుదు ఇవ్వబడింది.
బుఖారీ మరియు ముస్లిం సంయుక్తంగా ఒక హదీస్ ఉంది. ముత్తఫకున్ అలైహి హదీస్. ఫకద్ సుఇల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడగడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి? ఒక్క సహాబీ అడిగారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక సహాబీ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి? అయ్యున్నాసి అహబ్బు ఇలైక్? ఓ దైవ ప్రవక్తా, అందరికంటే ప్రియమైన వారు ఎవరు? మీకు, మీ దృష్టిలో, మీ వద్ద అందరికంటే ప్రియమైన వారు, ఇష్టమైన వారు ఎవరు అని ఆ సహాబీ ప్రవక్త గారిని అడిగితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటి? ఖాల్, ఆయిషా. నాకు అందరికంటే ప్రియమైన వారు ఆయిషా అని సమాధానం ఇచ్చారు రదియల్లాహు అన్హా.
ఫకుల్తు, మినర్రిజాల్? ఆ సహాబీ మళ్ళీ అడిగాడు. ఓ దైవ ప్రవక్తా, పురుషులలో ఎవరు? ఖాల్, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. అబూహా. ఆవిడ తండ్రి అన్నారు. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా తండ్రి అబూబకర్ గారు. స్త్రీలలో నాకు అందరికంటే ప్రియమైన వారు, హబీబా ఆయిషా అయితే పురుషుల్లో అబూబకర్ అన్నారు. కుల్తు, సుమ్మ మన్? ఆ సహాబీ మూడోసారి అడిగారు. ఓ దైవ ప్రవక్తా, ఆ తర్వాత ఎవరు? ఖాల్, ఉమరుబ్నుల్ ఖత్తాబ్. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ అని సెలవిచ్చారు. రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. ఈ హదీస్ ముత్తఫకున్ అలైహి. ఈ హదీస్లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని అందరికంటే ప్రియమైన వారు అన్నారు గనక ఆ హబీబా అనే బిరుదు ఆమెకు ఉంది.
ఇంకా అహ్మద్ మరియు హాకింలో ఒక ఉల్లేఖనం ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు కాలములోని ఇరాఖ్ యుద్ధం గురించి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలములో ఇరాఖ్ విజయంలో గనీమత్ సొమ్ము వస్తుంది. ఇరాఖ్ విజయములో ఖిలాఫతే ఉమర్ బిన్ ఖత్తాబ్. ఇరాఖ్ విజయములో చాలా గనీమత్ సొమ్ము వస్తుంది, ధనం వస్తుంది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం కూడా ఉన్నింది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం ఉన్నింది. ఆ ఆభరణం చూసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి అడిగారు. ఈ ఆభరణం యొక్క విలువ మీకు తెలుసా అని. సహాబాలందరూ మౌనం వహించారు. చాలా ఖరీదైన, విలువైన ఆభరణం అది. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి మీరందరూ అనుమతిస్తే నేను ఈ విలువైన ఆభరణాన్ని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాకి ఇస్తాను. ఆవిడ వద్దకు పంపిస్తాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాల అనుమతి తీసుకుని ఆ విలువైన ఆభరణం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వద్దకి పంపిస్తారు. ఈ ఉల్లేఖనంలో చివర్లో నేను ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఈ ఆభరణం ఎందుకు ఇస్తున్నాను అని కారణం చెప్పారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. కారణం ఏమిటంటే ఎందుకంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అంటున్నారు, నేను ఈ ఆభరణం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఎందుకు ఇస్తున్నాను? కారణం చెప్తున్నారు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల అంటే ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు. అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు కాబట్టి నేను ప్రవక్త గారి ఆ ప్రేమ మూలంగా ఈ విలువైన ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి ఇస్తున్నాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈ ఉల్లేఖనంలో మన కోసం అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటి గుణపాఠం ఏమిటి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ సహాబాలని అసలు అనుమతి కోరే అవసరమే లేదు. ఖలీఫా ఆయన. అయినా కూడా ఆయన యొక్క దైవభీతి, న్యాయం, నీతి, నిజాయితీ ఆ విధంగా ఉన్నింది. ఆయన అనుమతి కోరారు. రెండవది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తన కూతురు హఫ్సాకి అయినా ఇవ్వచ్చు కదా ఈ ఆభరణం. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా ఉమ్ముల్ మూమినీన్ కదా. ఉమ్ముల్ మూమినీన్ ఇంకా కూతురు. హఫ్సా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుకి కూతురు అవుతుంది. ఇంకా ప్రవక్త గారి భార్య గనక ఉమ్ముల్ మూమినీన్ కూడా. ఆ ఉద్దేశంతో నా కూతురు ఉమ్ముల్ మూమినీన్ కదా అని ఉద్దేశంతో ఇస్తే తప్పు ఏముంది? ఇవ్వచ్చు. కానీ నా కూతురు కూడా ఉమ్ముల్ మూమినీన్, ఆయిషా కూడా ఉమ్ముల్ మూమినీన్, ఇంకా ఇతర ఉమ్మహాతుల్ మూమినీన్ కూడా ఉన్నారు. అయినప్పటికిని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే ఎందుకు ఇచ్చారంటే అదే కారణం. ఎందుకంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉన్నవారు. మాషా అల్లాహ్, చూడండి సహాబాలు ఏ విధంగా ప్రవక్త గారి హదీసులను, ప్రవక్త గారి ప్రేమని, ప్రవక్త గారి ప్రసన్నతను, ప్రవక్త గారి విధేయతను ఏ కోణములో ఆలోచన చేసేవారు? ఏ విధంగా ప్రవక్త గారిని ప్రసన్నత పొందపరిచాలి? అలాగే ఆయన విధేయత ఎలా చూపాలి? ప్రవక్త గారికి ఏ విషయంలో ప్రేమ ఉన్నింది? ఎవరితో ప్రేమ ఉన్నింది? ఆ విధంగా సహాబాలు గమనించేవారు, ఆలోచించేవారు.
సిద్దీఖా, తయ్యిబా, ముబర్రఆ
అభిమాన సోదరులారా, అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో సిద్దీఖా అని ఒక బిరుదు. ఎల్లప్పుడూ సత్యం పలికేవారు. తండ్రి సిద్దీఖ్, కూతురు సిద్దీఖా. అలాగే తయ్యిబా ఒక బిరుదు ఉంది. ముబర్రఆ ఒక బిరుదు ఉంది. తయ్యిబా అంటే పవిత్రురాలు. ముబర్రఆ అంటే దోషాల నుంచి ఆ పాపం ఏ అభాండం వేయబడిందో, అపనింద మోపబడిందో దాని నుంచి బరాఅత్. ముబర్రఆ. ఏ అభాండం మీరు వేశారో ఆ విషయంలో ఆవిడ పవిత్రురాలు అని అర్థం. ఇది స్వయంగా ఖురాన్లో ఉంది ఇది. తయ్యిబా, ముబర్రఆ అనేది.
హుమైరా
ఇంకో బిరుదు ఉంది, హుమైరా. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు హుమైరా. హుమైరా అంటే అరుణిమ లేక ఎరుపు రంగుని హుమైరా అంటారు అరబీలో. అరుణిమ లేక ఎరుపు రంగు. అంటే తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటం. తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటాన్ని అరబీలో హుమైరా అంటారు. తెలుపు ఎరుపు రంగు అన్నమాట. ఇటువంటి రంగు హిజాజ్లో బహు తక్కువ అని ఇమాం జహబీ, ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలాలో తెలియజేశారు. ఈ తెలుపు రంగులో ఎరుపు రంగు, ఇటువంటి రంగు హిజాజ్లో చాలా తక్కువ, అరుదు అని ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలా, భాగం ఏడు, పేజ్ నెంబర్ 168లో ఈ విషయం తెలియజేశారు.
ఈ హదీస్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని యా హుమైరా అనే పదంతో సంబోధించిన, సంభాషించిన హదీస్ నసాయీలో ఉంది. ఇమాం నసాయీ రహమతుల్లాహి అలైహి సుననుల్ కుబ్రాలో ఈ హదీస్ ని సున వచ్చారు. ఈ హదీస్ ఈ విధంగా ఉంటుంది. దఖలల్ హబశతు యల్అబూన్. హబశాకి చెందిన వారు, ఇథియోపియన్లు ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి మస్జిద్ నబవీలో ప్రవేశించారు. ఆ ప్రత్యేకమైన ఆట వారు ప్రదర్శించేటప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఇలా అన్నారు. ఫఖాల లియన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా స్వయంగా అంటున్నారు, దైవ ప్రవక్త నాతో అన్నారు. ఏమన్నారు?
يَا حُمَيْرَاءُ أَتُحِبِّينَ أَنْ تَنْظُرِي إِلَيْهِمْ [యా హుమైరా అతుహిబ్బీన అన్ తన్జురీ ఇలైహిమ్] ఓ హుమైరా, నువ్వు వారిని చూడటానికి ఇష్టపడుతున్నావా?
ఓ హుమైరా, నువ్వు ఆ హబశా చెందిన వారి ఆ ప్రత్యేకమైన ఆటను నువ్వు చూడాలనుకుంటున్నావా? అతుహిబ్బూన, చూడటం ఇష్టపడతావా? అంతన్జురీ ఇలైహిమ్. ఆ ఆట ప్రదర్శన. ఫకుల్తు నఅమ్. నేను అవునన్నాను అని ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా తెలియజేశారు. అంటే ఈ హదీస్లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని హుమైరా అనే బిరుదుతో పిలిచారు.
అభిమాన సోదరులారా, ఇక్కడ హదీస్ పరంగా ఒక ముఖ్యమైన గమనిక ఉంది. హదీస్ పరంగా, ఉసూలే హదీస్ పరంగా. ఆ గమనిక ఏమిటి? ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఒక పుస్తకం ఉంది, దాని పేరు అల్ ఇజాబా. ఆ పుస్తకంలో ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి యొక్క కౌల్ ఆయన నఖల్ చేశారు. ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఇమాం మిజ్జీ రహమతుల్లాహి యొక్క కౌల్ ని నఖల్ చేశారు. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఈయన కూడా పెద్ద పండితులు, ముహద్దిస్. అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఏం చెప్తున్నారంటే, ఏ హదీస్లో యా హుమైరా అనే పదం ఉంటుందో ఆ హదీస్ జయీఫ్ లేదా మౌజూ అయి ఉంటుంది అన్నారు. నసాయీలోని ఈ ఒక్క హదీస్ తప్ప. ఇప్పుడు నేను చెప్పిన హదీస్ నసాయీలో ఉంది. దఖలల్ హబశతు యల్అబూన హబశాకి చెందిన వారు మస్జిద్ నబవీలో ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి వచ్చారు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని ఉద్దేశించి యా హుమైరా అంటే ఓ ఆయిషా నువ్వు ఈ ప్రదర్శన చూస్తావా, నీకు ఇష్టంగా ఉందా అని అడిగారు అనే ఈ హదీస్ తప్ప, ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని యా హుమైరా అన్నారు. నసాయీలోని ఈ హదీస్ తప్ప మిగతా హదీసులన్నీ ఏ హదీసులో యా హుమైరా అనే పదం ఉంటుందో అవి జయీఫ్ లేక మౌజూ అయి ఉంటుందని ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి తెలియజేశారు. ఈ విషయం మనం ఇమాం జరకశీది అల్ ఇజాబాలో చూడగలం.
మువఫ్ఫకా
అభిమాన సోదరులారా, ఇక అనేక బిరుదులు ఉన్నాయి. ఒక్క బిరుదు చెప్పి నేను ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిస్తాను. వచ్చే వారం ఇన్షా అల్లాహ్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి వేరే విషయాలు తెలుసుకుందాం. ఆ బిరుదు ఏమిటంటే మువఫ్ఫకా. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు మువఫ్ఫకా. మువఫ్ఫకా అంటే సద్బుద్ధి ప్రసాదింపబడిన వారు. మనం ఉర్దూ భాషలో దుఆ చేస్తాం. ఓ అల్లాహ్, అయ్ అల్లాహ్, ముఝే నేక్ తౌఫీఖ్ దే. నేక్ తౌఫీఖ్ దే. తౌఫీఖ్. ఈ తౌఫీఖ్ ఎవరికి ఇవ్వబడుతుందో వారు మువఫ్ఫఖ్ అవుతారు. పురుషుడు అయితే పురుషుడు అయితే మువఫ్ఫఖ్, స్త్రీ అయితే మువఫ్ఫకా.
ఒక హదీస్ ఉంది. తిర్మిజీ, అహ్మద్ మరియు తబరానీలో. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అంటున్నారు, సమీతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా నేను విన్నానని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ చెప్తున్నారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. ఎవరికి నా ఉమ్మత్లోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం ప్రాజ్ఞ వయసు బాలిగ్ అవ్వకముందే మరణించారు, అటువంటి తల్లిదండ్రులు స్వర్గానికి పోతారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. నా అనుచర సమాజములోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం, ఫరతున్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తికి ఫరత్ అంటారు. ఫరతాన్ ముందు వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు. అంటే ప్రాజ్ఞ వయసు చేరకముందే, బాలిగ్ అవ్వకముందే, బాల్యములోనే ఎవరి ఇద్దరి సంతానం మరణిస్తారో అటువంటి వారు స్వర్గములో పోతారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తే, ఆ సందర్భంలో ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒక ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే, వమన్ కాన లహు ఫరద్? ఓ దైవ ప్రవక్తా, మీ మాట పరంగా ఎవరి సంతానంలోని ఇద్దరు పిల్లలు బాల్యంలో మరణిస్తే అని చెప్పారు కదా మీరు, మరి ఎవరి తల్లిదండ్రుల ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో మరణిస్తే? అని ప్రశ్న. దానికి ప్రవక్త గారు, వమన్ కాన లహు ఫరద్ యా మువఫ్ఫకా. ఓ తౌఫీఖ్ ఇవ్వబడిన ఆవిడ, ఒక సంతానమైనా బాల్యంలో మరణిస్తే అటువంటి అమ్మ నాన్న కూడా, అటువంటి వారి అమ్మ నాన్న కూడా స్వర్గంలో పోతారు అని ప్రవక్త గారు సెలవిచ్చారు. ఇంకో ప్రశ్న అడిగారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. ఫమన్ లం యకున్ లహు ఫరదున్ మిన్ ఉమ్మతిక్? ఓ దైవ ప్రవక్తా, మీ ఉమ్మత్లోని కొంతమంది ఉంటారు, వారి సంతానం బాల్యంలో చనిపోలేదు, ఒక సంతానం కూడా, ఒక బిడ్డ కూడా బాల్యంలో చనిపోలేదు. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? చూడండి ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఉమ్మత్ గురించి ఎంత ఆలోచన చేసేవారు మాషా అల్లాహ్. మన గురించి ఎంత ఆలోచన చేసేవారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి మాట ఏమిటి? ఇద్దరు సంతానం, ఇద్దరు పిల్లలు బాల్యంలో చనిపోతే వారి అమ్మ నాన్న స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో చనిపోతే? వారు కూడా స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా మూడో ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, చాలా మంది ఉంటారు, వారికి సంతానం ఉండదు లేకపోతే సంతానం అయినా కూడా బాల్యంలో చనిపోరు. మరి వాటి పరిస్థితి ఏమిటి? దానికి సమాధానం ప్రవక్త గారు ఇచ్చారు. ఫఅన ఫరతు ఉమ్మతీ లం యుసాబూ బి మిస్లీ. అటువంటి వారి కోసం నేను ముందు వెళ్ళిపోయి ఉంటాను. ముందు వెళ్ళిపోయిన వ్యక్తిని నేనవుతాను అటువంటి వారి కోసం. ఎందుకంటే నాలాంటి బాధలు ఎవరికీ రాలేదు. అంటే ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఎవరి సంతానం బాల్యంలో చనిపోతే వారు ముందుగా వెళ్ళిపోయి వారి ఆతిథ్యం కోసం సిద్ధం ఉంచి ఉంచుతారు. అందుకు నా ఉమ్మత్కి నేను ఫరత్ అవుతాను. నేను ముందు వెళ్ళిపోయి నా ఉమ్మత్ కోసం నేను సిద్ధం చేసి ఉంచుతాను ఆ ఆతిథ్యం అని దానికి అర్థం.
అభిమాన సోదరులారా, కాకపోతే ఈ హదీస్లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారిని మువఫ్ఫకా అనే బిరుదుతో సంభాషించారు. కాకపోతే అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని జయీఫ్ అన్నారు. ఇమాం అహ్మద్ షాకిర్ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని సహీ అన్నారు. సారాంశం ఏమిటంటే ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారికి అనేక బిరుదులు ఉన్నాయి. ఉమ్ముల్ మూమినీన్ అల్లాహ్ ఇచ్చిన బిరుదు. హబీబా ఆవిడ పట్ల ప్రవక్త గారి ప్రేమ వల్ల హబీబా అనే బిరుదు. ఆమె పవిత్రత, విశ్వాసం, తఖ్వా, దైవభీతి వలన ఇంకా అల్లాహ్ ఆమె గురించి బరాఅత్ ఆయత్ అవతరింపజేశాడు దాని మూలంగా తయ్యిబా, ముబర్రఆ అనే బిరుదులు. అలాగే హుమైరా అనే బిరుదు, అలాగే మువఫ్ఫకా అనే బిరుదు. అభిమాన సోదరులారా, ఇంకా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి ఇన్షా అల్లాహ్ వచ్చే క్లాసులలో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఉమ్మహాతుల్ మూమినీన్ల జీవితాల చరిత్రను చదివి అర్థం చేసుకుని ఆ చరిత్రను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ చరిత్రను మనం కేవలం చరిత్ర మాదిరిగానే కాకుండా వారి జీవితంలోని మన కోసం ఆదర్శం ఏమిటి? ఈ విషయాలు మనము గ్రహించాలి. ఇవన్నీ ఇన్షా అల్లాహ్ మనము వచ్చే క్లాసులలో ఇంకా వివరంగా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా జీవితం చాలా వివరంగా ఉంటుంది. అవన్నీ వివరాలు ఇన్షా అల్లాహ్ మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ [వఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్] మరియు మా చివరి ప్రార్థన, సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ [వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్జాబ్లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.
ఒక హిందూ సోదరుడు ప్రశ్న అడిగి ఉన్నారు షేక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కొందరు 11 మంది భార్యలు అంటారు, మరికొందరు 9 మంది భార్యలు అంటారు. అసలు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎంత మంది భార్యలు? ఎందుకు దైవప్రవక్త ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు? అనేసి ఒక హిందూ సోదరుడు అడుగుతున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.
అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్జాబ్లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.
బహుళ వివాహాల వెనుక ఉన్న కారణాలు
సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.
రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్జాబ్లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.
అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? https://youtu.be/koWlTdlX4BI [52 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా పొందవచ్చో వివరించబడింది. సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన తలచినప్పుడే అన్నీ జరుగుతాయని గట్టి నమ్మకం కలిగి ఉండాలని ప్రసంగీకులు నొక్కిచెప్పారు. ఖుర్ఆన్ కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని అల్లాహ్ స్వయంగా చెప్పిన విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇది శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది. సూరహ్ యూనుస్, సూరహ్ అల్-ఇస్రా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని సంఘటనలను ఉదాహరిస్తూ, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందాలంటే దృఢ విశ్వాసం, పాపాలకు దూరంగా ఉండటం మరియు ఖుర్ఆన్ బోధనలను ఆచరించడం తప్పనిసరి అని బోధించారు. మూఢనమ్మకాలు, షిర్క్ వంటి పద్ధతులకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో ఖుర్ఆన్ ద్వారా చికిత్స పొందాలని వారు ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్. వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్.
وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ (వ నునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫావువ్ వ రహ్మతుల్ లిల్ మూమినీన్) మేము అవతరింపజేసే ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. (17:82)
సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సర్వ మానవాళి సన్మార్గం కొరకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్హందులిల్లాహ్, ఈ రోజు ధర్మ సందేశ విభాగం, రాష్ట్ర జమీయతే అహ్లె హదీస్ తెలంగాణ వారి తరఫున మూడు ప్రసంగాలు, మూడు పాఠాలు మీ ముందు ఇన్షా అల్లాహ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇన్షా అల్లాహ్ ప్రప్రథమంగా మీ ముందు ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా అనే అంశంపై ఫజీలతుష్ షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామయీ హఫిదహుల్లాహ్ మీ ముందు ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన ప్రసంగించనున్నారు. నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా గురువు గారిని నేను ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన మాకు ఎన్నో ఖుర్ఆన్ హదీసు వెలుగులో ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందాలి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ గ్రంథం ద్వారా ఎలా స్వస్థతను పొందుపరిచాడు అనే అంశాల గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తారని ఆశిస్తున్నాను. వలియత ఫద్దల్ మష్కూరున్ మాజూరా ఫలియత ఫద్దల్.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)
قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.” (10:58)
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ ధర్మ ప్రేమికులారా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం. మన కొరకు స్వస్థత ఎలా? అనే అంశంపై ప్రసంగించడానికి చెప్పడం జరిగింది. అయితే ఖుర్ఆన్ మన కొరకు ఏ రూపంలో స్వస్థత ఉంది, దాని ద్వారా మనం ఎలా స్వస్థత పొందగలుగుతామో తెలుసుకునేకి ముందు ఒక రెండు విషయాలు మనం గ్రహించడం చాలా అవసరం. ఏంటి ఆ రెండు విషయాలు? ముందు మనమందరమూ కూడా చాలా బలంగా విశ్వసించవలసినది, దృఢంగా నమ్మవలసినది ఏమిటంటే,
సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే
సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే జరుగుతుంది. చివరికి అమ్రే కౌనీ అని ఏదైతే అనడం జరుగుతుందో, మానవులు, జిన్నాతులు తప్ప మిగతా సృష్టి రాశులందరికీ కూడా వారి వారి ఏ పనిని బాధ్యతను అల్లాహ్ అప్పగించాడో, తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అది మన దృష్టిలో ఒకప్పుడు ఏదైనా చెడు అనిపించినా, అది కూడా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది, దీనినే అమ్రే కౌనీ అని అంటారు. ఎక్కడైనా ఏదైనా మంచి జరిగినా అది కూడా అల్లాహ్ వైపు నుండే జరుగుతూ ఉంది.
అగ్నిలో కాల్చే గుణం, కత్తిలో కాటు వేసే గుణం, ఇంకా సృష్టి రాశుల్లో వేరే ప్రతీ ఒక్క దానిలో అల్లాహ్ త’ఆలా అనుమతితోనే అది తన పని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అల్లాహ్ కోరుతాడో, అది తన ఆ పని చేయకూడదు అని, అది ఆ పని చేయదు. అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాంను కాల్చకూడదు అంటే అది కాల్చలేదు. కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాంను కోయకూడదు అని అంటే, కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపైన నడిచినప్పటికీ రవ్వంత గాయం కూడా కాలేదు. సముద్రంలో మునగడం, అందులో ఉన్న పెద్ద జీవరాశులు, తిమింగలాలు మనిషిని గానీ ఇంకా వేరే వాటిని తినడం ఒక సర్వసాధారణ అలవాటుగా మనం చూస్తాము, కానీ అదే యూనుస్ అలైహిస్సలాంను అతనికి ఏ కొంచెం నష్టం జరగకుండా అలాగే కాపాడాలి అని అల్లాహ్ ఆదేశం వస్తే కాపాడింది.
ఈ విధంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిలో తాను కోరిన విధంగా తన ఈ సృష్టిలో మార్పుచేర్పు చేస్తూ ఉంటాడు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే ఉర్దూలో, అరబీలో ఒక పదం ఉపయోగపడుతుంది. మనం మన లాభానికి ఎన్ని సాధనాలు ఏర్పరచుకున్నా, నష్టం నుండి దూరం ఉండడానికి మనం ఏ మార్గాలు అవలంబించినా, ఇవన్నీ కూడా అస్బాబ్ (సాధనాలు). కానీ, ముసబ్బిబుల్ అస్బాబ్, ఆ సాధనాలకు అవి తమ పని చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చేవాడు ఆ అల్లాహ్ మాత్రమే. ఈ బలమైన నమ్మకం మనకు ఉండాలి.
అల్లాహ్ తలచినప్పుడే అన్నీ జరుగుతాయి
రెండో విషయం, అల్లాహ్ ఏది కోరితే అదే జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం ఏమీ జరగదు. మనం ఏదైనా మంచి కోరి, మంచి సాధనం దాని గురించి ఉపయోగిస్తే అల్లాహ్ తలచినప్పుడే ఆ మంచి మనకు జరుగుతుంది. అంటే, అల్లాహ్ త’ఆలా అందులో ఒక కారణం పెట్టాడు. కానీ అది ఎప్పుడు పని చేస్తుంది? అల్లాహ్ అనుమతి జరిగినప్పుడు, అల్లాహ్ తాను కోరి అనుమతి ఇచ్చినప్పుడు. ఈ నమ్మకం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాను, మనం సర్వసాధారణంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారిమి, హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ సిటీగా మనం చూస్తున్నాము, అందుకొరకు కొన్ని ఉదాహరణలుగా ఎప్పుడైనా దాని పేరు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎన్నో గల్లీలలో మీరు చూస్తూ ఉంటారు, “హమారే పాస్ హర్ తరహా కా రూహానీ ఇలాజ్ హై, ఖురానీ ఇలాజ్ హై”(మా దగ్గర అన్ని రకాల ఆధ్యాత్మిక చికిత్స ఉంది, ఖుర్ఆన్ చికిత్స ఉంది) ఇలాంటి బోర్డులు వేసి ఉంటాయి. వారి యొక్క మొబైల్ నెంబర్లు ఇచ్చి ఉంటాయి. జనాలు, ప్రజలు ధర్మ అవగాహన సరైన రీతిలో లేనందువల్ల, విశ్వాసాలు బలహీనంగా అయిపోయినందువల్ల, వారు ఎన్నో రకాల మోసాలకు గురి అవుతారు. తర్వాత కొందరు అల్లాహ్ యొక్క సత్య గ్రంథం ఖుర్ఆన్ విషయంలో శంకించడం మొదలు పెడతారు. ఇలా ఉండకూడదు.
అందుకొరకే నేను నా అసలైన టాపిక్ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా? ప్రారంభించేకి ముందు ముఖ్యమైన రెండు మాటలు చెప్పాను. వాటిపై చాలా శ్రద్ధ ఇవ్వండి.
ఖుర్ఆన్ – శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు స్వస్థత
ఇక ఖుర్ఆన్ మన కొరకు స్వస్థత ఇది మన శారీరక రోగాలకు కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మన యొక్క బాహ్య రోగాలకు కూడా మరియు ఇది అంతర్య కళ్ళకు కనబడనటువంటి రోగాలకు కూడా ఒక మంచి స్వస్థత కలుగజేసేది.
దీనికి సంబంధించిన ఆయతులు, హదీసులు చెప్పి, ఏ ఏ రీతిగా మనం ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందగలుగుతామో చెప్పేకి ముందు, ఖుర్ఆన్ గురించి స్వయంగా అల్లాహ్ త’ఆలా స్వస్థత అన్న పదం ఏదైతే పలికాడో, “షిఫా” అని ఖుర్ఆన్ లో వచ్చి ఉంది. సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో, అలాగే సూరత్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ అని అంటారు, సూరహ్ నెంబర్ 17, ఆయత్ నెంబర్ 82, అలాగే సూరత్ ఫుస్సిలత్, సూరహ్ నెంబర్ 41, ఆయత్ నెంబర్ 44, ఇంకా ఈ భావంలో వేరే కొన్ని చోట్ల కూడా ఆయతులు ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా మనలో ఎవరైనా ఏదైనా రోగానికి గురి అయితే, ఏ మందు తీసుకుంటున్నావు? ఎవరి వద్ద చికిత్స చేయిస్తున్నావు? చికిత్స, మందు తీసుకోవడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే అల్లాహ్ త’ఆలా ఈ ఖుర్ఆన్ మీ అన్ని రకాల రోగాలకు ఒక ఔషధం అని, దవా అని, ఇలాజ్ అని, చికిత్స అని చెప్పలేదు. మందుల ఉపయోగంతో ఏ ప్రయోజనం కలుగుతుందో, అంటే మనిషి యొక్క రోగం దూరమైపోయి స్వస్థత కలగడం. మర్ద్ (రోగం) పూర్తిగా అతనిలో నుండి వెళ్ళిపోవడం, దాని చోట అతనికి సిహ్హత్, షిఫా (ఆరోగ్యం, స్వస్థత) కలగడం. డైరెక్ట్ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఆ చివరి లాభం ఏదైతే ఉందో, స్వస్థత, ఆరోగ్యం అది అని తెలిపాడు. మందు అని తెలపలేదు, ఔషధం అని తెలపలేదు.
ఇందులో ఉన్నటువంటి గొప్ప మహిమ గ్రహించాల్సినది ఏమిటంటే, మనం చూస్తూనే ఉన్నాము, ఔషధాలు, మందులు సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో అవి పని చేస్తాయి, మనకు వాటి ద్వారా స్వస్థత కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వాటి ద్వారా మనకు స్వస్థత అనేది కలగదు. కానీ ఇక్కడ ఖుర్ఆన్ గురించి అల్లాహ్ త’ఆలా ఏం చెబుతున్నాడు అంటే, దీని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అంతమైపోతాయి, నామరూపాలు లేకుండా “లా తుగాదిరు సఖమా”, ఆ రోగం నామరూపాలు లేకుండా మీలో నుండి దూరమైపోతాయి.
సోదర మహాశయులారా, తొందర తొందరగా పది, ఇరవై ఆయతులు చదివేయడం, పది, ఇరవై హదీసులు వినడం అది గొప్ప కాదు. ఒక్క ఆయతు విన్నా, అందులో ఉన్న భావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మనలో ఒక మార్పు తీసుకురావడం, స్వయం మనం రోగం నుండి ఆరోగ్యం, మరియు అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు, బలహీన విశ్వాసం నుండి బలమైన విశ్వాసం వైపునకు, ఆచరణ పరంగా ఎంతో లోపం, దోషం ఉన్న మనం, సత్కార్యాలు పాటించడంలో చాలా వేగంగా ముందుకు రావడం, ఇలాంటి మంచి మార్పు మనలో రావాలి.
సూరహ్ యూనుస్ ఆయత్ (10:57) వివరణ
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)
అయితే, సూరత్ యూనుస్ యొక్క ఆయత్ నేను ముందు మీకు వినిపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమను గ్రహించండి. ఒకవేళ గత నెలలో ఖుర్ఆన్ ఎవరి గ్రంథం, ఎవరి కొరకు అన్న విషయంలో నేను హుదన్, హిదాయత్ ఏ ఏ రకంగా ఉంది అనే విషయం ఏదైతే తెలిపాను, సూర యూనుస్ యొక్క ఆయత్ ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు మీ ముందు పఠిస్తున్నానో, స్టార్టింగ్ లో కూడా సంక్షిప్త ఖుద్బయే మస్నూన తర్వాత పఠించాను, దాన్ని ఒక్కసారి గమనించండి మీరు.
“యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా, అల్లాహు అక్బర్. ఎందరో మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇంకా వేరే ఇస్లాం ధర్మం పై లేని వారు నా మాట వింటున్నారో కొంచెం శ్రద్ధ వహించండి. దివ్య గ్రంథం ఖుర్ఆన్, సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో అల్లాహ్ త’ఆలా “యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా అని సంబోధించాడు. అంటే, ముస్లింలారా అని అనలేదు, అరబ్బులారా అని అనలేదు, మక్కావాసులారా అని అనలేదు. సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ త’ఆలా ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు? ఇక సర్వ మానవులకు ఉంది గనక మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే, ఇది నా మాట కాదు, ఏదో తురుకోని మాట కాదు, ఏదో నీకు ఇష్టం లేని నీ పక్కన ఉన్నటువంటి నీ శత్రువుని మాట కాదు. నిన్ను సృష్టించిన నీ నిజ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ యొక్క మాట. నీతో సంబోధిస్తున్నాడు, నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. “యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, “ఖద్ జాఅత్కుం మౌఇజతుమ్ మిర్రబ్బికుం”. మీ ప్రభువు వైపు నుండి మీ కొరకు ఉపదేశం వచ్చేసింది. అల్లాహు అక్బర్.
ఈ ఉపదేశాన్ని గనక మీరు పాటించారంటే, అల్హందులిల్లాహ్, మీకు ఎంత లాభం కలుగుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అన్ని రకాల చెడులు, అది విశ్వాసానికి సంబంధించిన, లేదా ఆచరణ పరంగా నైనా, అశ్లీలత, అన్ని రకాల దుష్కార్యాలు వాటి నుండి మీరు దూరం ఉండగలుగుతారు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశాన్ని మీరు ఆచరించారంటే, విశ్వాసంలో కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మీరు మరల గలుగుతారు. ఆచరణ పరంగా కూడా మీరు అల్లాహ్ కు ఇష్టమైన సదాచరణ చేయగలుగుతారు. ఎప్పుడు? అల్లాహ్ మీ కొరకు పంపినటువంటి ఉపదేశాన్ని స్వీకరించారంటే.
ఆ తర్వాత చెప్పాడు, “వ షిఫావుల్ లిమా ఫిస్ సుదూర్”. సుదూర్, మీ యొక్క హృదయాలకు ఇది మంచి నివారణ, స్వస్థత. హృదయాలు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు,
مِنَ الشُّبَهِ وَالشُّكُوكِ، وَهُوَ إِزَالَةُ مَا فِيهَا مِنْ رِجْسٍ وَدَنَسٍ. “మినష్ షుబహి వష్ షుకూకి, వహువ ఇజాలతు మా ఫీహా మిన్ రిజ్సిన్ వ దనస్”. “ఇది మీ రోగాల యొక్క, మీ హృదయాలకు నివారణ, స్వస్థత. హృదయాలలో ఏ అనుమానాలు, ఏ సందేహాలు, ఏ డౌట్స్ వస్తూ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ఈ ఖుర్ఆన్ మంచి నివారణ.”
అవును. నిజమైన సృష్టికర్త అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఆరాధ్యుడు ఉన్నాడు అటువంటి అనుమానంలో ఎవరైతే పడి ఉన్నారో, ఈ ఖుర్ఆన్ ను శ్రద్ధగా చదివారంటే, వారి యొక్క ఈ అనుమానాలు దూరమైపోతాయి. మేము ఆ అరబ్బుల్లో వచ్చిన ముహమ్మద్ ను ఎందుకు విశ్వసించాలి అన్నటువంటి సందేహంలో ఇంకా పడి ఉన్నారో, వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారంటే వారి యొక్క ఈ సందేహాలు దూరమవుతాయి. ఆయన కేవలం అరబ్బుల కొరకు కాదు. ఇక్కడ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఎలాగైతే చెబుతున్నాడో, మీ కొరకు ఉపదేశం, మీ కొరకు స్వస్థత, మీ రోగాలకు మంచి నివారణ కలిగిస్తూ మీకు స్వస్థత కలుగజేసేది అని, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఇదే ఖుర్ఆన్ లో తెలిపాడు, “యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ”, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. ఇంతకంటే మరీ స్పష్టంగా “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్”, సర్వ లోకాల వైపునకు మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపడం జరిగింది.
మనిషి ఇహలోకంలో శాంతి, పరలోకంలో కూడా నరకం నుండి ముక్తి పొంది శాంతి స్థలమైన ఆ స్వర్గంలో చోటు పొందాలంటే తప్పకుండా ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలి, ప్రవక్తపై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి అన్ని రకాల రోగాలకు స్వస్థత కలిగించేటువంటి ఈ ఖుర్ఆన్ ను చదివి మనలో మార్పు తీసుకురావాలి. దీని ద్వారా అన్ని రకాల చెడుగులు మన నుండి దూరమై, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనం మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గంలో ఉండగలుగుతాము.
సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు “వ హుదవ్ వ రహ్మ”. ఎప్పుడైతే మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ రోగాలకు స్వస్థత కలిగించే దానిని మీరు సరైన రీతిలో చదివి ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు మీకు మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. తద్వారా మీ జీవితాల్లో అల్లాహ్ యొక్క ప్రత్యేక కరుణలు మీపై దిగుతూ ఉంటాయి.
ఆ తర్వాత ఏం చెప్పాడు? “లిల్ ముఅమినీన్”.విశ్వాసుల కొరకు. కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఆయత్ యొక్క ఆరంభం యా అయ్యుహన్ నాస్ తోనే ఉంది. మరియు ఖుర్ఆన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇది ఉపదేశం, ఇది స్వస్థత, ఇది మార్గదర్శకత్వం, ఇది కారుణ్యం, నాలుగు గుణాలు చెప్పబడ్డాయి. ఆయత్ యొక్క చివరి పదం ఏముంది? లిల్ ముఅమినీన్, విశ్వాసుల కొరకు. అంటే ఏమిటి? ఇంతకు ముందు నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. వాస్తవానికి ఇది సర్వ మానవాళి కొరకు ఉపదేశము, స్వస్థత మరియు మార్గదర్శకత్వము, ఇంకా కారుణ్యము. కానీ ఎవరైతే వాస్తవ రూపంలో ఈ లాభాలు పొందుతారో, సర్వ మానవాళి పొందకుండా విశ్వాసులు ఈ లాభాలు పొందుతారు. ఎందుకు? విశ్వసించి దానిని అదే రీతిలో ఆచరిస్తారు గనుక.
ఇంతకు ముందు ఇచ్చిన ఒక సామెత మీకు గుర్తుందా? టార్చ్ లైట్ మీ చేతిలో ఉంది. బ్యాటరీ ఉంది. కానీ ఏం చేయాలి? రాత్రి మీరు ఏ దారి గుండా చీకటి దారిలో నడుస్తూ వెళ్తున్నారో, బ్యాటరీ ఆ టార్చ్ లైట్ వెంట తీసుకోవాలి, దాని బటన్లు నొక్కి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు మార్గం కనబడదు. ఎందుకు? మీరు దానిని మీరు నడిచే మార్గం వైపునకు కరెక్ట్ గా చూపించుకుంటూ వెళ్ళాలి. మీరు ఉదాహరణకు టార్చ్ లైట్ తీసుకున్నారు, బటన్ నొక్కారు, ఇక్కడ లైట్ ఉంది. కానీ దానిని ఆకాశం వైపునకు ఇలా ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. మీ ముంగట చీకటిలో ఏ దారి అయితే ఉందో అక్కడ వెలుతురు పడుతుందా? పడదు కదా?
అలాగే ముస్లింలారా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ కేవలం ఇళ్ళల్లో పెట్టుకొని, చేతిలో అందకుండా పైన ఎక్కడో అటుక మీద పెట్టి చదవకుండా, దానిని శ్రద్ధగా ఆలకించకుండా, దాని యొక్క అర్థ భావాలు తెలుసుకోకుండా, దాని ద్వారా ఎలా స్వస్థత పొందాలో ఆ ప్రయత్నం చేయకుండా మనం ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ఇంట్లో కాదు, జేబులో ఉన్నప్పటికీ, మీ యొక్క మొబైళ్ళలో ఉన్నప్పటికీ, మీ దుకాణాల్లో ఉన్నప్పటికీ, మీ బండిలో మీరు పెట్టుకున్నప్పటికీ మీ యొక్క జీవితాల్లో శుభాలు అనేటివి రావు. రోగాలు దూరం కావు, స్వస్థత అనేది కలగదు.
సూరతున్నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 69లో అల్లాహ్ త’ఆలా తేనె గురించి తెలిపాడు. తేనెటీగ మరియు తేనె యొక్క లాభం గురించి. “ఫీహి షిఫావుల్ లిన్నాస్”, తేనెలో సర్వ మానవాళికి స్వస్థత ఉంది అని. మొన్న కూడా మీరు వార్త చూశారు కావచ్చు. చివరికి కరోనా లాంటి రోగాలకైనా గానీ మన భారతదేశపు పాతకాలపు నాటి చికిత్సలను, ఔషధాలనే అమెరికా, యూరప్ లో కూడా వాడుతున్నారు. అక్కడి ల్యాబొరేటరీస్ లలో, అక్కడి శాస్త్రవేత్తలు తేనె లాంటి గొప్ప ఔషధం మరొకటి లేదు అని చెబుతున్నారు. అని తెలుగులో వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. తేనె, ఒరిజినల్ తేనె, 2000 రూపాయలకు కిలో పెట్టి మీరు కొన్నారు కావచ్చు. ఎంతో అందమైన బాటిల్ లో మీరు తీసుకొని వచ్చారు కావచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఎంతో మంచి చోట దాన్ని పెట్టేది ఉంటే, ఒక మంచి అందమైన చిన్న బాటిల్ లో ఒక 20, 30 గ్రాములు వేసుకొని జేబులో వేసుకుంటే లేదా కడుపునొప్పి ఉన్నప్పుడు కడుపుకు కట్టుకుంటే, ఏదైనా మెడనొప్పి ఉన్నప్పుడు మెడకు కట్టుకుంటే లేదా గొంతులో ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మెడ కింద కట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు కదా? డాక్టర్ మరియు ఆయుర్వేద అనుభవజ్ఞులైన వారు దానిని ఏ మోతాదులో, పొద్దున ఎన్నిసార్లు, నీళ్లలోనా, పాలల్లోనా, ఎందులో, నీళ్లు అయితే కూడా సామాన్య నీళ్లా, లేకుంటే కొంచెం కునుకున నీళ్లా, ఇవన్నీ మనం పద్ధతులు తెలుసుకొని ఆ విధంగా పాటించినప్పుడే దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో రోగాలకు మీరు డాక్టర్ల వద్ద నుండి మందు బిళ్ళలు గానీ, గొట్టం గోలీలు గానీ, లేకుంటే ఇంకా టానిక్ త్రాగే మందు గానీ తీసుకొని వస్తారు కదా? పొద్దుకు రెండు సార్లు తీసుకోవాలా, మూడు సార్లు తీసుకోవాలా, ఒక్కసారి తీసుకోవాలా, అన్నం కంటే ముందు తీసుకోవాలా, అన్నం తర్వాత తీసుకోవాలా, ఇవన్నీ విషయాలు మంచి విధంగా కనుక్కుంటారు కదా? అదే విధంగా దాన్ని పాటిస్తూ ఉంటారు కదా?
ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందే విధానం మరియు షరతులు
మరి ఖుర్ఆన్ విషయంలో కూడా స్వస్థత పొందే మార్గం ఏంటి? మనం ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందగలుగుతాము, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇంతవరకు చేయలేదు అంటే, మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో మనమే గమనించండి.
సోదర మహాశయులారా, ఖుర్ఆన్ ద్వారా మనం స్వస్థత అనేది నేను ఇంతకు ముందే తెలిపినట్లు, మన శారీరక రోగాలకు అంతకంటే ముఖ్యమైన మన హృదయ సంబంధమైన రోగాలకు కూడా ఇది మంచి స్వస్థత. హృదయ సంబంధ రోగాల గురించి కొన్ని విషయాలు ఇంతవరకే నేను చెప్పి ఉన్నాను. అయితే మనం ఖుర్ఆన్ చదువుతూ ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉండేది ఉంటే, దాని ప్రకారంగా మన ఆచరణ, దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో నడవడికలో మార్పు తెచ్చుకొని సదాచరణ పాటిస్తే, తప్పకుండా మన హృదయాల రోగాలకు స్వస్థత కలుగుతుంది.
హృదయ రోగాల యొక్క ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గుర్తుంచుకోండి.
“ఇన్న ఫిల్ జసది ముద్గా”, శరీరంలో ఒక అవయవం ఉంది. “ఇదా సలుహత్, సలుహల్ జసదు కుల్లు”, అది బాగుందంటే పూర్తి శరీరం బాగున్నట్లు. “వ ఇదా ఫసదత్, ఫసదల్ జసదు కుల్లు”, అది పాడైపోతే శరీరం అంతా కూడా పాడైపోతుంది. అదేమిటి? “అలా వహియల్ ఖల్బ్”, వినండి, అదే హృదయం.
అందుకొరకే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అన్నిటికంటే ముందు ఏం చూస్తారు? చెవిలో పెట్టుకొని రెండు దాని ద్వారా మీ యొక్క ఈ హృదయాన్ని, ముందు కూడా వెనక కూడా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? లేదా కొందరు ఆయుర్వేద అనుభవజ్ఞులు ఇక్కడ నాడి పట్టి చూస్తారు. దీని ద్వారా కూడా ఏం తెలుస్తుంది? హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? దీని ద్వారా శరీరంలోని ఎన్నో రోగాలను గుర్తుపడతారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హృదయం బాగుంది అంటే, అది అన్ని రకాల రోగాల నుండి స్వస్థత పొందింది అంటే మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎంతో మంచి మార్పు వస్తుంది. అందుకొరకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ నివారణ కొరకు, హృదయం మార్గదర్శకత్వంపై స్థిరంగా ఉండడానికి ఎన్నో దువాలు కూడా చేస్తూ ఉండేవారు. “అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా” ఇంకా వేరే ఎన్నో దువాలు ఉన్నాయి.
ఇక ఈ ఖుర్ఆన్ శారీరక రోగాలకు కూడా స్వస్థత. అవును. అల్హందులిల్లాహ్. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పేకి ముందు ఒక విషయం శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖుర్ఆన్ మీ శారీరక రోగాలకు కూడా స్వస్థత అని అంటే, ధర్మపరమైన వేరే ఔషధాలు వాడే అవసరం లేదు అని ఎంతమాత్రం భావం కాదు. చికిత్స చేయించుకోకూడదు అని ఎంతమాత్రం భావం కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. “దావూ మర్దాకుం యా ఇబాదల్లాహ్”, ఓ అల్లాహ్ దాసులారా, మీ యొక్క రోగాలకు మీరు చికిత్స చేయించండి. అయితే ఖుర్ఆన్ కు ప్రాధాన్యత అనేది ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఏముంది? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసి అన్ని మందులు వాడాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కానీ ఇక ఏదీ కూడా లాభం లేదు. ఇక అల్లాహ్ యే ఏదైనా చేయాలి అని ఇక ఖుర్ఆన్ ద్వారా స్వస్థత గురించి వచ్చాము. ఇలా ఉండకూడదు. ఖుర్ఆన్ శారీరక రోగాలకు మంచి ఔషధం, మంచి చికిత్స, దీని ద్వారా స్వస్థత కలుగుతుంది. అయితే రోగ ఆరంభంలో, అంతకంటే ముందు ఇంకా రోగం రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వెంటనే ఆరంభంలో, మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో దీని ద్వారా చికిత్స మనం పొందుతూ ఉండాలి. చిట్టచివరిసారిగా కాదు, ఈ యొక్క తప్పును మనం సరిదిద్దుకోవాలి.
రెండో విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఖుర్ఆన్ తప్పకుండా స్వస్థత. ఎందుకంటే అల్లాహ్ త’ఆలా తెలిపాడు ఈ విషయం ఖుర్ఆన్ లో. “వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా”, వాస్తవానికి మేము ఖుర్ఆన్ ద్వారా, ఖుర్ఆన్ ను స్వస్థత కొరకు అవతరింపజేశాము. “వ రహ్మతుల్ లిల్ ముఅమినీన్“, విశ్వాసుల కొరకు కారుణ్యంగా పంపాము.
అయితే ఇంతటి సత్యమైన మాటను మనం ఎలా తిరస్కరించగలుగుతాము? కానీ ఎంత ఎక్కువగా మన విశ్వాసం ఉంటుందో, ఎంత సత్యంగా మనం నమ్మి దీని ద్వారా చికిత్స చేయిస్తామో, అంతే ఎక్కువగా, అంతే తొందరగా అల్లాహ్ యొక్క దయతో మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఖుర్ఆన్ చదివినప్పటికీ స్వస్థత కలుగుతలేదు అని ఎవరైతే అంటారో వారు ఖుర్ఆన్ ను శంకించకూడదు, ఇంకా విశ్వాసం పాడైపోతుంది. తనలో, తాను అనాలసిస్ చేసుకోవాలి. తనలో తాను మార్పు తీసుకురావాలి. తనలో ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో దానిని కనుక్కునే ప్రయత్నం చేయాలి, దానిని వెతకాలి.
చిన్న ఉదాహరణ, షుగర్ రోగం తగ్గడానికి సర్వసాధారణంగా డాక్టర్లు, షుగర్ స్పెషలిస్టులు ఒక టాబ్లెట్ ఇస్తారు. స్టార్టింగ్ లో 2 mg. ఒక వారం, పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు ఇచ్చి చూసి డౌన్ కాకపోతే కొంచెం పెంచుతారు. కొందరు మూడు, మరికొందరు ఐదు. ఇంకా తగ్గకుంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు, ఒకటి కాడ రెండు, లేదా దానితో పాటు మరొకటి ఉంది, అది ఇస్తారు. కొందరి కొందరికి 300 కు పైగా, 400 కు ఆ విధంగా ఉండేది ఉంటే 400 కూడా దాటి ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ గురించి కూడా సలహా ఇస్తారు. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆయుర్వేద అనుభవజ్ఞులు, ఈ స్టార్టింగ్ డోస్ ద్వారానే మీకు 15 రోజుల్లో ఎందుకు తగ్గలేదు? మీరు ఏమైనా అన్నం తింటున్నారా? లేక మీరు పొటాటో లాంటి ఏమైనా కూరగాయలు తింటున్నారా? లేదా మీరు ఇంకా తీపి పదార్థాలు కూడా తింటూ ఉన్నారా? అని కూడా కనుక్కొని కొంచెం చురక పెడతారు. ఇది మీరు తగ్గించుకోకుంటే చాలా ప్రమాదంగా ఉంది అని. ఇక్కడ టాబ్లెట్ పని చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం, అటువైపు నుండి మీరు ఏ పత్యం చేయాలో అందులో సరిగ్గా పాస్ అవ్వలేదు. ఒక్క కారణం చెప్తున్నాను, మీరు 100% గా ఇదే విషయాన్ని ఖుర్ఆన్ పై ఫిట్ చేయకండి, విషయం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఖుర్ఆన్ చదివినప్పటికీ శారీరక కొన్ని రోగాలు మనకు దూరం కాలేదంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి కొరత లేదు నవూదుబిల్లాహ్, మనలో ఉంది. దాన్ని మనం అన్వేషించాలి, వెతకాలి, ఆ కొరత, ఆ లోపం, ఆ దోషాన్ని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి.
దీనికి సంబంధించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా తెలుపుతున్నారు. ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారంటే, ఏం చేసేవారు? ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బి రబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బి రబ్బిన్నాస్ చదువుకొని, తమ చేతులతో తమ శరీరంపై తుడుచుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వేదనకు గురి అయ్యారో, అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ దువాలు చదివి, ఈ సూరాలు చదివి, ప్రవక్త యొక్క చేతులను పట్టుకొని, ప్రవక్త యొక్క చేతులలో ఊది, ఎంతవరకు చేరగలుగుతుందో నేను ప్రవక్త చేతులతోనే ప్రవక్త శరీరంపై తుడుచేదాన్ని.ఇప్పుడు నేను చెప్పిన హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.
ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ఉక్బా రది అల్లాహు త’ఆలా అన్హు చెప్పారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సందర్భంలో ఓ ప్రయాణంలో ఉన్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ లోని రెండు రకాతులలో సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్ చదివారు. మళ్ళీ చెప్పారు, “లమ్ యతఅవ్వద్ ముతఅవ్విదున్ బిమిస్లిహిన్”, ఓ ఉక్బా, ఏ రకమైన రోగం గానీ, ఏ సమస్య ఎదురైనా గానీ, ఈ రెండు సూరాల కంటే ఉత్తమమైన వేరే ఏదీ కూడా అవసరం లేవు. గమనించారా? యూదుల్లో ఒకరు ప్రవక్తపై చేతబడి చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందులోనైతే చేతబడి చేయడం జరిగిందో ఆ వస్తువులను తెప్పించారు. వాటిలో 11 ముడులు వేసి ఉన్నాయి. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్, ఈ రెండు సూరాలలో కలిపి 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు సూరాల యొక్క తిలావత్ మొదలు పెట్టారు. ఒక్కొక్క ఆయత్ పూర్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి దానంతట అదే విడిపోయేది. ఏ విధంగా ముడులు విడిపోతూ ఉండేవో, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వస్థత అనేది ఎక్కువగా, మంచిగా ఏర్పడుతూ వచ్చింది.
సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారు ఓ ప్రయాణంలో ఉన్నారు, ఓ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది. ఆ ప్రాంతం యొక్క పెద్దలను కలిసి, మీ వద్ద మేము ఈ రాత్రి చుట్టాలుగా ఉంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు. ఆ ప్రాంతం యొక్క బయట శివార్లలో ఎలాగో రాత్రి గడుపుదాము అని ఉన్నారు. అదే రాత్రి ఆ గ్రామ పెద్ద మనిషికి ఏదో ఒక విషపురుగు కాటేసింది. ఎవరెవరో మంత్రగాళ్ళను, డాక్టర్లను పిలిపించి చికిత్స గురించి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు వారికి గుర్తొచ్చింది. అయ్యో, సాయంకాలం అయ్యేకి ముందుగా ఎవరో బయట నుండి కొందరు బాటసారులు వచ్చారు కదా, ఏమో వెళ్లి చూడండి కొంచెం ఏదైనా చుట్టుపక్కల ఉండవచ్చును, వారి దగ్గర ఏదైనా మంచి మందు ఉందో తెలుసుకుందాము. అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు తన వెంట ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లారు, సూరతుల్ ఫాతిహా చదివారు. అప్పటికప్పుడే అల్లాహ్ త’ఆలా ఆ గ్రామ పెద్ద మనిషికి ఆరోగ్యం ప్రసాదించాడు.
సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ ను శారీరక రోగాలకు కూడా స్వస్థతగా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్వస్థతకు అడ్డు కలిగించే విషయాలు ఏమున్నాయో, వాటి నుండి మనం దూరం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ వాటి నుండి మనం దూరం ఉండలేము అంటే చాలా నష్టపోతాము.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ గ్రంథాన్ని మన కొరకు స్వస్థత అని ఎన్నో హదీసుల్లో కూడా తెలిపారు. అంతేకాదు, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కొరకు కొన్ని దువాలు కూడా నేర్పి ఉన్నారు. అందుకొరకు ఒక సహీ హదీస్ లో వస్తుంది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త వద్దకు ఒక అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అతనికి అతనిపై షైతాన్ యొక్క ప్రభావం, షైతాన్ అతనిలో ప్రవేశించి ఉన్నాడు అని తెలిసింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులు తిలావత్ చేసి అతనిపై ఊదుతారు, అల్లాహ్ త’ఆలా అతనికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి,
కానీ చివరిలో నేను చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా మనం ఎలా స్వస్థత పొందాలి. మొట్టమొదటి విషయం, నేను చెప్పినటువంటి రెండు విషయాలను నమ్మాలి. అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ ముసబ్బిబుల్ అస్బాబ్, అన్ని సాధనాలకు మూల కారకుడు మరియు ఆ సాధనాలకు ఏ గుణం ఇచ్చాడో, ఆ గుణం ఇచ్చినవాడు అల్లాహ్ మాత్రమేనని. రెండో విషయం, అల్లాహ్ తలచినప్పుడే స్వస్థత కలుగుతుంది, అల్లాహ్ తలచినప్పుడే ప్రతీ సాధనం పని చేస్తుంది, అల్లాహ్ తలచినప్పుడే ఈ సృష్టిలో అల్లాహ్ కోరినది మాత్రమే జరుగుతూ వస్తుంది.
ఈనాటి నా ప్రసంగంలోని సారాంశంలో రెండో విషయం, ఖుర్ఆన్ ను మనం అల్లాహ్ యొక్క గ్రంథం అని, అల్లాహ్ యొక్క వాక్కు అని చాలా బలంగా విశ్వసించాలి. ఈ విశ్వాసంలో ఏ మాత్రం లోటు రాకూడదు, కొరత ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు.
ఈ ఖుర్ఆన్ మన యొక్క రోగాల, హృదయ రోగాలకు కూడా చికిత్స, మంచి ఔషధం, స్వస్థత కలుగుతుంది. అంటే, విశ్వాసం సరిగా లేనివారు విశ్వాసపరులు అవుతారు. నమాజులకు దూరం ఉన్నవారు నమాజు చదవగలుగుతారు. ఇంకా వేరే దుష్కార్యాలు చేసేవారు మంచి కార్యాలు చేయగలుగుతారు. కానీ ఎప్పుడు? ఖుర్ఆన్ ను చదివి శ్రద్ధగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు. ఖుర్ఆన్ గ్రంథం మన యొక్క ధర్మపరమైన అనుమానాలకు మంచి స్వస్థత కలుగజేస్తుంది. మరియు ఖుర్ఆన్ గ్రంథం మనలో ఏ చెడు పనుల గురించి కోరికలు పుడతాయో, మన యొక్క చెడు మనస్సు ఏ చెడులకైతే ప్రేరేపిస్తుందో, వాటన్నిటి నుండి కూడా అల్హందులిల్లాహ్ స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా? ఖుర్ఆన్ ను చదవడం ద్వారా, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకోవడం ద్వారా, ఖుర్ఆన్ ప్రకారంగా మన జీవితం గడుపుకోవడం ద్వారా.
అలాగే ఖుర్ఆన్ మన యొక్క శారీరక రోగాలకు కూడా మంచి స్వస్థత. అది కూడా ఎప్పుడు? పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, పూర్తి సత్యంతో మనం ఈ ఖుర్ఆన్ ను స్వయం మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు గానీ, లేక వేరే ఇంకా ఏదైనా రోగికి చదవాలి.
కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, ఈ ఖుర్ఆన్ ద్వారా అల్హందులిల్లాహ్ అల్లాహ్ త’ఆలా ఏ స్వస్థత మనకు కలుగజేస్తాడని శుభవార్త ఇచ్చాడో, ఖుర్ఆన్ లోని ఎన్నో ఆయతులలో, ఈ ఖుర్ఆన్ ను ప్రజల రోగాల కొరకు స్వస్థత అని ప్రజల విశ్వాసాలను పాడు చేయకూడదు. అబద్ధపు, అసత్యపు బోర్డులు వేసి, సోషల్ మీడియా ద్వారా తమ గురించి ప్రచారం చేసుకుంటూ, తమ నెంబర్ ప్రజలకు ఇస్తూ, రూహానీ ఇలాజ్, ఖురానీ ఇలాజ్ మా దగ్గర జరుగుతుంది అంటూ వారిని షిర్క్ లో పడవేయడం గానీ, ఖురానీ ఇలాజ్ అన్న పేరుతో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి, ఫలానా రాత్రి, ఫలానా చోట జిబా చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, సోదర మహాశయులారా ఫలానా సమాధి వద్ద, ఫలానా బాబాగారు ఖుర్ఆన్ తో ఇలాజ్ మరియు స్వస్థత కలుగజేస్తాడట అని అలాంటి సమాధుల వైపునకు వెళ్లడం, ఈ విషయాలన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను చివరిలో, ఈ తప్పు విషయాల నుండి మనం చాలా దూరం ఉండాలి. వీటి ద్వారా విశ్వాసం పాడైపోతుంది, వీటి ద్వారా మనం ఇస్లాం నుండి దూరమైపోతాము అని మనం భయపడాలి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్ ద్వారా సరైన రీతిలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త యొక్క పద్ధతి, విధానంలో స్వస్థత కోరే, పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వ ఆఖిరు దఅవానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ప్రసంగ సారాంశం:
అల్లాహ్పై దృఢ విశ్వాసం: సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదని గట్టిగా నమ్మాలి. అన్నీ ఆయన తలచినప్పుడే జరుగుతాయి.
ఖుర్ఆన్ – కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత: అల్లాహ్ ఖుర్ఆన్ను కేవలం ఔషధం (దవా) లేదా చికిత్స (ఇలాజ్) అని చెప్పలేదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఖుర్ఆన్ ద్వారా రోగం పూర్తిగా నయమవుతుంది.
శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు నివారణ: ఖుర్ఆన్ కేవలం జ్వరం, నొప్పి వంటి శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు, చెడు ఆలోచనలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది.
విశ్వాసులకు ప్రత్యేకం: ఖుర్ఆన్ సర్వమానవాళికి మార్గదర్శకమైనప్పటికీ, దాని ద్వారా సంపూర్ణ స్వస్థత మరియు కారుణ్యం పొందేది విశ్వాసులు మాత్రమే. ఎందుకంటే వారు దానిని నమ్మి ఆచరిస్తారు.
సరైన పద్ధతిలో ఆచరించడం ముఖ్యం: తేనె సీసా ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం రానట్లే, ఖుర్ఆన్ను చదవకుండా, అర్థం చేసుకోకుండా, దాని బోధనలను ఆచరించకుండా ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత కలగదు.
మూఢనమ్మకాలకు దూరం: ఖుర్ఆన్ పేరుతో నిమ్మకాయలు, కోడి బలులు, సమాధుల వద్ద మొక్కుబడులు వంటి షిర్క్ మరియు మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఇది విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.
లౌకిక చికిత్సను తిరస్కరించరాదు: ఖుర్ఆన్ స్వస్థత ఇస్తుందని వైద్య చికిత్సను మానేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చికిత్స చేయించుకోవాలని బోధించారు. ఖుర్ఆన్ పారాయణంతో పాటు వైద్యం కూడా కొనసాగించాలి.
ముస్లింలు ఆచరించవలసిన విషయాలు:
విశ్వాసాన్ని బలపరచుకోండి: ప్రతిదీ అల్లాహ్ అధీనంలోనే ఉందని, ఆయన తలచినప్పుడే స్వస్థత లభిస్తుందని మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి.
ఖుర్ఆన్ను రోజూ పారాయణం చేయండి: ఖుర్ఆన్ను అర్థంతో సహా క్రమం తప్పకుండా చదవండి. దాని బోధనలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి.
రుఖియా (ఖుర్ఆన్ ద్వారా చికిత్స) చేసుకోండి: అనారోగ్యానికి గురైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిలో సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫలక్, సూరతున్నాస్ వంటి సూరాలను చదివి మీపై లేదా రోగిపై ఊదుకోండి.
దువా చేయండి: స్వస్థత కోసం అల్లాహ్ను ప్రార్థించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దువాలను నేర్చుకొని వాటి ద్వారా అల్లాహ్ను వేడుకోండి.
పాపాలకు దూరంగా ఉండండి: స్వస్థతకు అడ్డుపడే పాప కార్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
మూఢనమ్మకాలను వదిలివేయండి: ఖుర్ఆన్ పేరుతో జరిగే మోసాలకు, షిర్క్కు దారితీసే పద్ధతులకు దూరంగా ఉండండి. స్వస్థతను ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమేనని నమ్మండి.
వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు: రుఖియాతో పాటు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోండి మరియు వారు సూచించిన మందులను వాడండి. ఇస్లాం వైద్య చికిత్సను ప్రోత్సహిస్తుంది.
సమస్య ఆరంభంలోనే ఖుర్ఆన్ను ఆశ్రయించండి: కేవలం అన్ని దారులు మూసుకుపోయాకే కాకుండా, అనారోగ్యం ప్రారంభ దశలోనే ఖుర్ఆన్ ద్వారా స్వస్థత కోసం ప్రయత్నించండి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఎవరేమన్నారు?
కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).
జోర్జ్ బర్నార్డ్ షా:
George Bernard Shaw. జననం 26/7/1856. మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.
జోర్జ్ బర్నార్డ్ షా తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.
ఇంకా ఇలా వ్రాశాడు: “అజ్ఞానం, లేదా పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణనాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.
థోమస్ కార్లైల్:
Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్లాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881. లండన్ లో. ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కారుడు, సాహిత్య పరుడు.
థోమస్ కార్లైల్ తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడు: “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధిహీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశవంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితాలను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.
రామక్రిష్ణ రావు:
Prof. K. S. Ramakrishna Rao, Head of the Department of Philosophy, Government College for Women, University of Mysore.
మన ఇండియా తత్వవేత్త రామక్రిష్ణారావు గారు ఇలా చెప్పారు: “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
S.M.జ్వీమర్:
Samuel Marinus Zwemer. జననం 12/4/1867. Michigan. మరణం 2/4/1952. New York.
(S.M. Zweimer) ఇలా వ్రాశాడు: “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళవాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం.
విలియం మోయిర్:
Sir William Muir. జననం 27/4/1819. UK. మరణం 11/7/1905. UK.
సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడు: “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణనాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు?. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభమైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.
లియో టోల్స్ టాయ్:
Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828 Tula Oblast, Russia. మరణం 20/11/1910 ప్రపంచపు గొప్ప నవలా రచయిత, తత్త్వవేత్త
గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్ ఇలా చెప్పాడు: “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుంది: ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.
ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.
ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ
తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.
ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.
అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.
ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం
న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.
ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.
అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.
అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:
(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)
[1]అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.
ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.
బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.
ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.