ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

బైతుల్ మఖ్దిస్ (మస్జిద్ అల్ అఖ్సా) యొక్క పది ప్రత్యేకతలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

మొదటి ఖుత్బా :-  

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి. మరియు ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. దైవదూతలలో కొందరికి కొందరిపై మరియు దైవప్రవక్తలలో కొందరికి కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. మరియు సమయాలలో, ప్రదేశాలలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యత ప్రసాదించాడు. అందులో నుండి ఒకటి బైతుల్ మఖ్దిస్. దీనిని (అల్-ఖుద్స్) అని పిలుస్తారు. దీనికి ఇతర ప్రదేశాలపై ఆధిక్యత ఇవ్వబడింది. ఇది అల్లాహ్ యొక్క వివేకము మరియు ఆయన యొక్క గొప్ప ఎంపిక కూడా. అల్లాహ్ ఇలా అంటున్నాడు:  

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)  (28:68)

బైతుల్ మఖ్దిస్ అనగా: షిర్క్ లాంటి దురాచారాల నుండి పవిత్రమైన ఇల్లు. 

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

1.8 ప్రార్ధనా స్థలాల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

298 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: قُلْتُ يَا رَسُولَ اللهِ أيُّ مَسْجِدٍ وُضِعَ فِي الأَرْضِ أَوَّلُ قَالَ: الْمَسْجِدُ الْحَرَامُ قَالَ: قُلْتُ ثُمَّ أيُّ قَالَ: الْمَسْجِدُ الأَقْصى قُلْتُ: كَمْ كَانَ بَيْنَهُمًا قَالَ: أَرْبَعُونَ سَنَةً، ثُمَّ أَيْنَمَا أَدْرَكَتْكَ الصَّلاَةُ بَعْدُ، فَصَلِّ، فَإِنَّ الْفَضْلَ فِيهِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 10 باب حدثنا موسى بن إسماعيل

298. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! ప్రపంచంలో అన్నిటి కంటే ముందు నిర్మించబడిన మస్జిద్ ఏది?” అని అడిగాను. దానికాయన “మస్జిదుల్ హరాం (కాబా గృహం)” అని సమాధానమిచ్చారు. “ఆ తరువాత ఏదీ?” అని నేను మళ్ళీ అడిగాను. “బైతుల్ మఖ్ దిస్” అన్నారు ఆయన. “అయితే ఈ రెండిటి నిర్మాణాల మధ్య ఎంత వ్యవధి ఉంది?” అని తిరిగి ప్రశ్నించాను. “నలభై ఏళ్ళ”ని ఆయన సమాధానమిచ్చారు. ఆ తరువాత “కాల చక్రం నిన్ను ఏ చోటుకు తెస్తే ఆ చోటనే (వేళకు) నమాజు చెయ్యి. అదే శ్రేష్ఠమైన పని” అని హితవు చేశారు ఆయన.” [సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా….. అధ్యాయం ]

299 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ مِنَ الأَنْبِيَاءِ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِيَ الأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلاَةُ فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ، وَكَانَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاس كَافَّةً، وَأُعْطِيتُ الشَّفَاعَةَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 56 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جعلت لي الأرض مسجدًا وطهورًا

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- నాకు పూర్వం ఏ దైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి. (1) నా గాంభీర్యానికి శత్రువులు ఒక నెల ప్రయాణపు దూరం నుండే భయపడిపోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు. (2) నా కోసం యావత్తు భూమండలం * ప్రార్థనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తి ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళయినప్పుడు నమాజు చేసుకోవచ్చు. (3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్)ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది. (4) ఇతర దైవప్రవక్తలందరూ తమ తమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం దైవప్రవక్తగా పంపబడ్డాను. (5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు ** చేసే అధికారం ఇవ్వబడింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 56వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. జుఇలత్ లియల్ అర్జుకుల్లహ మస్జిదన్ వ తహూర]

* అంటే, నిషిద్ధ ప్రదేశాల్లో తప్ప మరెక్కడయినా వేళకాగానే అలస్యం చేయకుండా నమాజు చేయడం ఉత్తమం అని అర్థం. నిషిద్ధ ప్రదేశాలు అంటే శ్మశానం, భవన నిర్మాణ సామగ్రి ఉండే ప్రదేశాలు, పేడ కసువు ఉండే పశువుల కొట్టాలు, మార్గాలు, మలిన ప్రదేశాలు, స్నానాల దొడ్లు మొదలగునవి.

** ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్థం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫార్సు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫార్సు అంటే రద్దు కానటువంటి సిఫార్సు గాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫార్సు గానీ అయి ఉంటుంది.

300 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: بُعِثْتُ بِجَوَامِعِ الْكَلِمِ، وَنُصِرْتُ بِالرُّعْبِ، فَبَيْنَا أَنَا نَائِمٌ أُتِيتُ بِمَفَاتِيحِ خَزَائِنِ الأَرْضِ فَوُضِعَتْ فِي يَدِي
قَالَ أَبُو هُرَيْرَةَ: وَقَدْ ذَهَبَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنْتُمْ تَنْتَثِلُونَهَا
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 122 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نصرت بالرعب مسيرة شهر

300. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాకు సంక్షిప్త పదాలతో విస్తృత భావం కలిగి వున్న ( ఖుర్ఆన్) వాణి ప్రసాదించబడింది. (నా గురించి విని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టేలా) నాకు గాంభీర్యత నిచ్చి సహాయం చేయబడింది. ఓ రోజు నేను నిద్రపోతూంటే (కలలో) నా చేతికి ప్రపంచంలోని సిరిసంపదలు, నిక్షేపాలకు సంబంధించిన తాళపు చెవులు అందించబడ్డాయి”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తర్వాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇహలోకం వీడిపోయిన తరువాత ఇప్పుడు మీరా సిరిసంపదలు, నిక్షేపాలు హస్తగతం చేసుకుంటున్నారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 122వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. నుసిర్తు బిర్రూబి….]

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేదా బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే? [ఆడియో]

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో /బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే?
https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?

బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?
https://youtu.be/EBFz1Z_TW9g [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సఫ్ (లైన్)లో ఖాలీ స్థలం వదలకండి, స్వర్గంలో గృహం పొందండి

తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్
తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)

తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)
https://youtu.be/5hhWL5q0q6M [49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సూరతుల్ జుముఆ (అధ్యాయం 62), ఆయతులు 9 నుండి 11 వరకు వివరించబడ్డాయి. శుక్రవారం నమాజు కొరకు పిలుపు వచ్చినప్పుడు వ్యాపారాలు మరియు ఇతర ప్రాపంచిక పనులను విడిచిపెట్టి అల్లాహ్ ధ్యానం వైపునకు పరుగెత్తాలని విశ్వాసులకు ఇచ్చిన ఆదేశంపై దృష్టి సారించబడింది. ఖురాన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు ఎంత అవసరమో నొక్కి చెప్పబడింది; హదీసును తిరస్కరించడం అంటే పరోక్షంగా ఖురాన్‌ను తిరస్కరించడమే అని స్పష్టం చేయబడింది. శుక్రవారం రోజు యొక్క ఘనత, ఆ రోజున స్నానం చేయడం, త్వరగా మస్జిద్‌కు రావడం, మరియు నిశ్శబ్దంగా ఖుత్బా వినడం వల్ల కలిగే గొప్ప పుణ్యాల గురించి హదీసుల ఆధారంగా వివరించబడింది. ప్రవక్త ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యాపార బృందం రాకతో కొందరు సహాబాలు పరధ్యానంలో పడిన చారిత్రక సంఘటనను ప్రస్తావిస్తూ, వినోదం మరియు వ్యాపారం కంటే అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం ఎంతో మేలైనదని ఈ ఆయతులు గుర్తుచేస్తున్నాయని బోధించబడింది. ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, అల్లాహ్‌ను నిరంతరం స్మరించుకోవడమే నిజమైన సాఫల్యానికి మార్గమని ప్రసంగం ముగిసింది.


అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, అల్హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఈరోజు తఫ్సీర్ క్లాస్ ప్రారంభం చేయబోతున్నాము. ఈనాటి మన తఫ్సీర్ క్లాస్‌లో మనం ఇన్షాఅల్లాహ్, సూరతుల్ జుముఆ, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి చివరి వరకు మూడు ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకోబోతున్నాము.

అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, నేను అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ జుముఆ ఆయత్ నంబర్ తొమ్మిది నుండి తిలావత్ ప్రారంభించబోతున్నాను. ఇంతలో మీరు మీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా గుర్తు చేసుకోండి, ఈనాటి ఈ శుభప్రదమైన ప్రోగ్రాంలో హాజరవ్వడానికి వారికి ప్రోత్సహించండి.

వాస్తవానికి, మనం ముస్లిముగా, అల్లాహ్‌ను విశ్వసించే వారిగా పుట్టడం లేదా తర్వాత ఇస్లాం ధర్మంలో చేరడం, ఆ తర్వాత ఇస్లాం ధర్మం నేర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు మనకు కలుగుతూ ఉండటం ఇది అల్లాహ్ యొక్క ఎంతో గొప్ప దయ. ఎందుకంటే ధర్మ విద్యనే మనిషికి అల్లాహ్‌కు చాలా దగ్గరగా చేస్తుంది. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం నేర్చుకుంటూ ఉంటే మనం నశించిపోయే ఈ లోకం యొక్క వ్యామోహంలో పడకుండా పరలోక చింతలో మనం గడపగలుగుతాము మన యొక్క ఈ ఇహలోక రోజులు. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం అభ్యసిస్తూ ఉంటే, అల్లాహ్ ఆదేశించినవి ఏమిటో వాటిని ఆచరిస్తూ, అల్లాహ్‌కు ఇష్టం లేని, ఆయన మన కొరకు నిషేధించినవి ఏమిటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండగలుగుతాము.

ఈ రోజుల్లో మనలో అనేక మంది పురుషులు గానీ, స్త్రీలు గానీ ఎన్నో రకాల పాపాల్లో పడి, కరోనా మహమ్మారి యొక్క ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులకు గురియై వారు ఒక రకంగా నష్టపోతున్నారు. కానీ వాస్తవానికి ఇది అంత పెద్ద నష్టం కాదు. మహా భయంకరమైన పెద్ద నష్టం ఆ శాశ్వతమైన పరలోక జీవితాన్ని గుర్తించకపోవడం, అక్కడి ఆ జీవితం మనకు సాఫల్యం, స్వర్గం ప్రాప్తించడానికి ఈ లోకంలో చేసుకునేటువంటి కొన్ని సత్కార్యాలు చేసుకోకపోవడం.

అయితే రండి సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో ఆ ఆయతుల యొక్క తిలావత్ మనం ప్రారంభం చేస్తున్నాము. ముందు మీరు చాలా శ్రద్ధగా ఖురాన్ ఈ ఆయతులను ఆలకించండి. ఖురాన్ యొక్క తిలావత్ చేయడం ఎలా పుణ్య కార్యమో, పూర్తి శ్రద్ధాభక్తులతో ఖురాన్‌ను వినడం కూడా అంతే పుణ్యం. ఒక్కో అక్షరానికి పదేసి పుణ్యాలు, ఇంకా ఎన్నో రకాల లాభాలు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ.
(అవూదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
(శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ.
(యా అయ్యుహల్లజీన ఆమనూ ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅతి ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహి వ జరుల్ బైఅ, జాలికుమ్ ఖైరుల్లకుమ్ ఇన్ కున్తుమ్ తలమూన్)

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ.
(ఫఇదా ఖుదియతిస్సలాతు ఫన్తషిరూ ఫిల్ అర్ది వబ్తగూ మిన్ ఫద్లిల్లాహి వజ్కురుల్లాహ కసీరన్ లఅల్లకుమ్ తుఫ్లిహూన్)

وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ.
(వ ఇదా రఅవ్ తిజారతన్ అవ్ లహ్వనిన్ఫద్దూ ఇలైహా వ తరకూక ఖాయిమా, ఖుల్ మా ఇందల్లాహి ఖైరుమ్ మినల్లహ్వి వ మినత్తిజారతి, వల్లహు ఖైరుర్రాజిఖీన్)


ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.

జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కనవచ్చినా, వారు దాని వైపుకు పరుగెడుతున్నారు, నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.

అల్హందులిల్లాహ్, మీరు సూరతుల్ జుముఆ, సూరా నంబర్ 62, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి 11 వరకు మూడు ఆయతుల తిలావత్ మరియు ఈ మూడు ఆయతుల అనువాదం కూడా విన్నారు. ఇక రండి, ఈ ఆయతులలో మనకు బోధపడుతున్న విషయాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం.

సోదర మహాశయులారా, తఫ్సీర్ ఇబ్ను కసీర్, ఖురాన్ యొక్క తఫ్సీర్‌లలో చాలా ప్రఖ్యాతి గాంచిన తఫ్సీర్. ఈ తఫ్సీర్ ధర్మవేత్తలందరూ కూడా ఏకీభవించిన మరియు ఎలాంటి విభేదం లేకుండా దీని యొక్క విషయాలను ఇందులో ఖురాన్ యొక్క వ్యాఖ్యానం ఖురాన్‌తో మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులతో ఏదైతే చేయబడినదో దానిని ఏకీభవిస్తారు.

ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మనం చూశామంటే, అందులో ఇప్పుడు మనకు ఉపయోగపడే ప్రయోజనకరమైన విషయాలలో, ఈ ఆయతులో అల్లాహు తాలా విశ్వాసులను సంబోధించాడు. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا (యా అయ్యుహల్లజీన ఆమనూ – ఓ విశ్వాసులారా). ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి గురించి కూడా చెప్పడం జరిగింది.

అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) చెబుతున్నారు, ఖురాన్‌లో ఎప్పుడు మీరు “యా అయ్యుహల్లజీన ఆమనూ, ఓ విశ్వాసులారా” అని చదివితే, చెవి మాత్రమే కాదు, మీ హృదయంలో ఉన్నటువంటి వినే శక్తిని కూడా ఉపయోగించి పూర్తి శ్రద్ధాభక్తులతో మీరు వినండి. అల్లాహ్ విశ్వాసులకు ఏదైనా ఆదేశం ఇస్తున్నాడు లేదా అల్లాహు తాలా ఏదైనా పాప కార్యం నుండి వారిని ఆపుతున్నాడు. ఈ విధంగా సోదర మహాశయులారా, మనం “యా అయ్యుహల్లజీన ఆమనూ” అని ఎక్కడ చదివినా గానీ అబ్దుల్లా ఇబ్ను మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క ఈ మాటను గుర్తించుకోవాలి మరియు వెంటనే అల్లాహ్ నాకు ఇస్తున్న ఆదేశం ఏమిటి అన్న యొక్క మాటపై శ్రద్ధ వహించాలి.

ఇందులో అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఏంటి? إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ (ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅహ్ – శుక్రవారం నాడు నమాజు కొరకు పిలువబడినప్పుడు). జుమా నమాజుకు మిమ్మల్ని పిలువబడినప్పుడు, దీని ద్వారా ఈ ఆయత్ యొక్క ఆరంభంలోనే విశ్వాసానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన గొప్ప విషయం మనకు తెలుస్తుంది. అదేమిటండీ?

ఇక ఈ ఆయతులలో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఆ ఆదేశాల వివరాల్లోకి, జుమాకు సంబంధించిన మసలే మసాయిల్, ఆదేశాలు, అవన్నీ వివరాల్లోకి నేను ఈ రోజు వెళ్ళడం లేదు. ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈ సూరా పేరు సూరతుల్ జుముఆ. ఇందులో కేవలం రెండే రెండు రుకూలు ఉన్నాయి. మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. నేను తొమ్మిదవ ఆయత్ ఏదైతే మొదలు పెట్టానో, ఇది రెండవ రుకూ. మొదటి రుకూలో యూదుల ప్రస్తావన ఉంది. అయితే, మొదటి రుకూలో యూదుల ప్రస్తావన తర్వాత, మిగతా చివరి మూడు ఆయతుల్లో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడంటే, ఇక్కడ ఏదో గొప్ప మర్మం ఉంది. ఇక్కడ ఏదో గొప్ప విషయం ఉంటుంది, దానిని మనం చాలా గ్రహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? నాతో పాటు మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా? నేను ఏమంటున్నాను? శ్రద్ధ వహించండి. సూరా పేరు సూరతుల్ జుముఆ. అయితే ఈ సూరా మొత్తం జుమా ఆదేశాలు ఇందులో లేవు. చివరి మూడు ఆయతుల్లోనే ఉన్నాయి. ముందు ఎనిమిది ఆయతుల్లో యూదుల ప్రస్తావన ఉంది. అయితే యూదుల ప్రస్తావన తర్వాత జుమా యొక్క ఆదేశాల ప్రస్తావన, జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇందులో మర్మం ఏమిటి అని మీరు ఏదైనా గ్రహించే ప్రయత్నం చేశారా అని నేను అడుగుతున్నాను.

అయితే దీనిని గ్రహించడానికి రండి సహీ బుఖారీలోని హదీస్, సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్ మనం వింటే ఇన్షాఅల్లాహ్ ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క ఔచిత్యాన్ని గ్రహించగలుగుతాం. ఏంటి హదీస్? బుఖారీలోని సహీ హదీస్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

نَحْنُ الآخِرُونَ السَّابِقُونَ يَوْمَ الْقِيَامَةِ
(నహ్నుల్ ఆఖిరూన అస్సాబిఖూన యౌమల్ ఖియామ)
(మనం (కాలంలో) చివరి వాళ్ళం, కానీ ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం)

అనుచర సంఘాల ప్రకారంగా, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రవక్తల అనుయాయుల ప్రకారంగా చూసుకుంటే మనం చిట్టచివరి వాళ్ళం. అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చిట్టచివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, మనం ప్రవక్త వారి అంతిమ సమాజం. కానీ, అస్సాబిఖూన యౌమల్ ఖియామ (ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం). ప్రళయ దినాన అందరికంటే ముందు మనం లేపబడటం, హాజరు చేయబడటం, లెక్క తీర్పు తీసుకోబడటం, స్వర్గంలో ప్రవేశింపబడటం ఇంకా ఎన్నో కార్యాలలో అందరికంటే ముందుగా ఉంటాం. సుబ్ హానల్లాహ్, ఇంత గొప్ప ఘనత అల్లాహ్ ఇచ్చాడు గమనించండి.

అయితే, بَيْدَ أَنَّهُمْ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا (బైద అన్నహుమ్ ఊతుల్ కితాబ మిన్ కబ్లినా – మనకంటే ముందు వారికి గ్రంథం ఇవ్వబడింది). మనకంటే ముందు గ్రంథం పొందిన వారు ఎందరో ఉన్నారు, యూదులు, క్రైస్తవులు, ఇంకా. అయినా వారి కంటే ముందు మనల్ని లేపడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, “సుమ్మ హాదా” ఇక ఈ దినం అంటే ఈ జుమ్మా రోజు – يَوْمُهُمُ الَّذِي فَرَضَ اللَّهُ عَلَيْهِمْ (యౌముహుముల్లజీ ఫరదల్లాహు అలైహిమ్ – అల్లాహ్ వారిపై విధిగావించిన రోజు). ఈ జుమా విషయం, జుమా యొక్క ఘనత మనకంటే ముందు జాతి వారికి కూడా ఇవ్వడం జరిగింది. فَاخْتَلَفُوا فِيهِ (ఫఖ్తలఫూ ఫీహి). వారు అందులో విభేదించుకున్నారు. فَهَدَانَا اللَّهُ لَهُ (ఫహదానల్లాహు లహూ). అల్లాహ్ మనకు దాని సన్మార్గం కల్పించాడు, అల్లాహ్ మనకు ఆ రోజు యొక్క భాగ్యం కల్పించాడు.

ఏమైంది? فَالنَّاسُ لَنَا فِيهِ تَبَعٌ (ఫన్నాసు లనా ఫీహి తబఉన్ – కాబట్టి ప్రజలు ఈ విషయంలో మన అనుచరులు). ఇక ప్రజలు మన వెనక ఉన్నారు. الْيَهُودُ غَدًا وَالنَّصَارَى بَعْدَ غَدٍ (అల్-యహూదు గదన్ వన్నసారా బఅద గద్ – యూదులు రేపు, క్రైస్తవులు ఎల్లుండి). యూదుల వారంలోని ఒక పండుగ రోజు మాదిరిగా శనివారం, మరియు క్రైస్తవులు ఆదివారం. వారందరి కంటే ముందు శుక్రవారంలో మనం ఉన్నాము. ఈ ఘనత అల్లాహు తాలా మనకు ప్రసాదించాడు. ముస్లిం షరీఫ్‌లోని ఉల్లేఖనంలో చూస్తే, అల్లాహ్ మనకంటే ముందు జాతి వారిని వారి దుశ్చేష్టలకు కారణంగా అల్లాహ్ ఈ రోజు నుండి వారిని పెడమార్గంలో పడవేశాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అల్లాహ్ తన ఇష్టంతో వారిని పెడమార్గంలో పడవేశారు అని కాదు. వారి దుశ్చేష్టలకు కారణంగా, వారి అవిధేయతకు కారణంగా. అల్లాహ్ జుమా రోజు వారికి ప్రసాదించాడు, కానీ వారు దానిని విలువ ఇవ్వలేదు, అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు. యూదులకు శనివారం, క్రైస్తవులకు ఆదివారం నిర్ణయించాడు. మరియు మనం వారి కంటే వెనక వచ్చినప్పటికీ, వారి కంటే ముందు రోజు, శుక్రవారం రోజు అల్లాహు తాలా మనకు దాని యొక్క భాగ్యం కలుగజేశాడు.

అయితే, ఈ విధంగా రోజుల్లో వారు ఇహలోకంలో మనకు వెనక ఏదైతే ఉన్నారో, అలాగే పరలోకంలో కూడా మనం వారి కంటే ముందుగా ఉంటాము. అందరికంటే ముందు, సర్వ సృష్టిలో అందరికంటే ముందు మన యొక్క తీర్పు జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీసులో మనకు తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు మీకు ఈ రెండు హదీసులు విన్న తర్వాత అర్థమైందా? యూదుల ప్రస్తావన ముందు ఉంది ఈ సూరతుల్ జుముఆలో, తర్వాత జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేమిటి? వారు ఎలాగైతే విభేదాల్లో పడ్డారో, అల్లాహ్ ఆదేశాలను త్యజించారో, తిరస్కరించారో, అలాంటి పరిస్థితి మీది రాకూడదు, మీరు చాలా శ్రద్ధగా మరియు అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించే వారిగా మీరు ఉండండి.

ఆ తర్వాత ఆయతులను మనం గమనిస్తే, ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) ఇక్కడ కొన్ని జుమాకు సంబంధించిన ఆయత్ యొక్క వివరణ, వ్యాఖ్యానంలో కొన్ని విషయాలు తెలిపారు. మొదటి విషయం నేను ఇంతకు ముందు తెలిపినట్లు, అల్లాహ్ ఏమంటున్నాడు? فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ (ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్). అల్లాహ్ యొక్క ధ్యానం, స్మరణ వైపునకు మీరు పరుగెత్తండి. అయితే వాస్తవానికి ఇక్కడ ‘పరుగెత్తండి’ అనువాదం సరియైనది కాదు. ఇక్కడ ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) చెప్పినట్లు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ నమాజుకైనా గానీ పరుగెత్తి రావడం నుండి వారించారు. సహీ బుఖారీలోని హదీస్: إِذَا سَمِعْتُمُ الإِقَامَةَ فَامْشُوا إِلَى الصَّلاَةِ وَعَلَيْكُمُ السَّكِينَةُ وَالْوَقَارُ وَلاَ تُسْرِعُوا (ఇదా సమిఅతుముల్ ఇఖామత ఫమ్షూ ఇలస్సలాతి వ అలైకుముస్సకీనతు వల్ వఖారు వలా తుస్రిఊ – మీరు ఇఖామత్ విన్నప్పుడు, నమాజుకు నడిచి రండి, మీపై నిదానం మరియు గంభీరత ఉండాలి, తొందరపడకండి). మీరు ఇఖామత్ విన్నప్పుడు నమాజుకు నడిచి రండి. మీరు ఎలా నడిచి రావాలంటే, మీపై నిదానం, నింపాది మరియు ఒక వఖార్, ఒక మర్యాద అనేది స్పష్టంగా కనబడాలి. “వలా తుస్రిఊ” (తొందరపడకండి) – మీరు పరుగెత్తుకుంటూ రాకండి. మరొక ఉల్లేఖనంలో, మీరు పరుగెత్తుకుంటూ రాకండి, నిదానంగా రండి. ఎన్ని రకాతులు ఇమాంతో పొందుతారో చదవండి, తప్పిపోయిన రకాతులు తర్వాత చేసుకోండి.

కానీ ఇక్కడ ఈ ఆయతులో అల్లాహు తాలా “ఫస్అవ్” అని ఏదైతే చెప్పాడో, దాని భావం ఏంటి? ఇమాం హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) చెప్పారు, “అమా వల్లాహి మా హువ బిస్సఅయి అలల్ అఖ్దామ్” (అల్లాహ్ సాక్షిగా, ఇది కాళ్ళపై పరుగెత్తడం కాదు). ఇక్కడ ‘సయీ’ అంటే కాళ్ళ మీద పరుగెడుకుంటూ రావడం కాదు. వారు ఇలా రావడం నుండి వారించడం జరిగింది. వలాకిన్ బిల్ ఖులూబి వన్నియ్యతి వల్ ఖుషూఅ (కానీ హృదయాలతో, సంకల్పంతో మరియు వినమ్రతతో). ఏంటి? వారి యొక్క నియత్‌, సంకల్పం, వారి హృదయం, సంపూర్ణ ఖుషూ, వినయ వినమ్రతతో రావాలి. కానీ ఇక్కడ భావం ఏంటి? దీనికి సంబంధించి మరొక ఇమాం ఖతాదా (రహిమహుల్లాహ్) వారు తెలిపినట్లు, దాని భావం ఏంటంటే, “అన్ తస్ఆ బిఖల్బిక వ అమలిక” (నీ హృదయంతో మరియు నీ ఆచరణతో ప్రయాసపడు). నీవు జుమా రోజున, జుమా నమాజు కొరకు ముందు నుండే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ, సంసిద్ధత అనేది పాటిస్తూ, నీవు ముందుకు వచ్చేసేయ్.

ఈ విధంగా సోదర మహాశయులారా, ఇక్కడ మరో విషయం కూడా మీకు అర్థమైంది కదా? ఖురాన్‌ను మనం హదీసు లేకుండా సరియైన రీతిలో అర్థం చేసుకోలేము.

అయితే సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా యొక్క ఘనతలో ఎన్నో విషయాలు తెలిపారు. సహీ బుఖారీలో వచ్చిన హదీస్, నిశ్చయంగా జుమా రోజు చాలా గొప్ప ఘనత గల రోజు. అదే రోజు అల్లాహు తాలా ఆదం (అలైహిస్సలాం)ని పుట్టించాడు, ఆదం (అలైహిస్సలాం)ని స్వర్గంలో పంపాడు, ఆదం (అలైహిస్సలాం) అదే రోజు స్వర్గం నుండి తీయబడ్డారు, అదే రోజు ఆయన మరణించారు, అదే రోజు ప్రళయం సంభవిస్తుంది మరియు అదే రోజున ఒక ఘడియ ఉంది, ఎవరైతే ఆ ఘడియను పొంది దుఆ చేసుకుంటారో, అల్లాహ్ ఆ ఘడియలో చేసిన దుఆని తప్పకుండా స్వీకరిస్తాడు.

మరియు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), శుక్రవారం రోజున మంచి రీతిలో తలంటు స్నానం చేయాలి అని, మంచి దుస్తులు ధరించాలి అని, సాధ్యమైతే సువాసన పూసుకోవాలి అని, మరియు ఎంత తొందరగా ఇంటి నుండి బయలుదేరి మస్జిద్‌కు రాగలుగుతారో, హాజరై మౌనంగా ఉండాలి. ప్రత్యేకంగా ఖుత్బా జరుగుతున్న సందర్భంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు, మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఖుత్బా వింటూ ఉండాలి. ఒకవేళ ఖుత్బా మన భాషలో కాకపోయినప్పటికీ శ్రద్ధగా ఖుత్బా వినాలి. ఈ విధంగా అల్లాహు తాలా వారం రోజే కాదు, ఇంకా మూడు రోజులు అదనంగా మన పాపాలను మన్నిస్తాడు. అంతే కాదు, ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడని సహీ హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ దావూద్ మరియు తిర్మిజీ, ఇబ్ను మాజాలో వచ్చినటువంటి హదీస్, ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు:

مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ وَغَسَّلَ، وَبَكَّرَ وَابْتَكَرَ، وَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطْوَةٍ يَخْطُوهَا أَجْرُ سَنَةٍ صِيَامُهَا وَقِيَامُهَا
(ఎవరైతే శుక్రవారం రోజున (జనాబత్ నుండి) స్నానం చేసి, త్వరగా బయలుదేరి, (మస్జిద్ కు) దగ్గరగా కూర్చుని, (ఖుత్బాను) శ్రద్ధగా విని, నిశ్శబ్దంగా ఉంటారో, అతను వేసే ప్రతి అడుగుకు ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు (రాత్రి) నమాజులు చేసిన పుణ్యం లభిస్తుంది)

ఎవరైతే ఉత్తమ రీతిలో జుమా రోజు స్నానం చేస్తారో, అతి త్వరగా బయలుదేరుతారో, సాధ్యమై నడిచి వెళ్తారో, వాహనం ఎక్కి వెళ్ళరో, మరియు ఇమామ్‌కు దగ్గరగా కూర్చుంటారో, శ్రద్ధగా ఖుత్బా వింటారో, ఎలాంటి వృధా కార్యకలాపాలకు పాల్పడరో, ఏమిటి లాభం? సుబ్ హానల్లాహ్. శ్రద్ధ వహించండి, వారి ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు ఒక సంవత్సరం తహజ్జుద్‌లు చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. సుబ్ హానల్లాహ్, ఎంత గొప్ప పుణ్యం చూడండి. సహీ హదీసులో వచ్చిన ఈ శుభవార్త, అందుకొరకు ఎవరూ కూడా జుమా రోజు ఆలస్యం చేయకుండా, జుమా రోజు ఎలాంటి అశ్రద్ధలో ఉండకుండా, ఆటపాటల్లో సమయాలు వృధా చేయకుండా త్వరగా మస్జిద్‌కు వచ్చే ప్రయత్నం చేయాలి. మరియు ఎంతోమంది మస్జిద్‌లో హాజరవుతారు. ఒకవేళ ఖుత్బా వారి భాషలో కాకుంటే వెనక మాట్లాడుకుంటూ ఉంటారు, మొబైల్‌లలో ఆడుకుంటూ ఉంటారు, ఇంకా వేరే వృధా కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసే వారికి ఈ గొప్ప పుణ్యం అనేది లభించదు.

మరియు ఎవరైతే ఎంత ముందుగా నమాజుకు హాజరవుతారో జుమా రోజు, సహీ బుఖారీలోని హదీసులో వారికి మరొక గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగింది. దాని యొక్క సారాంశం నేను తెలియజేస్తున్నాను, ఎవరైతే మొదటి ఘడియలో వస్తారో వారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం, ఎవరైతే రెండవ ఘడియలో వస్తారో వారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఎవరైతే మూడవ ఘడియలో వస్తారో వారికి ఒక మేక ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే నాలుగో ఘడియలో వస్తారో ఒక కోడి అల్లాహ్ మార్గంలో దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే ఐదవ ఘడియలో వస్తారో వారికి ఒక కోడి గుడ్డు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమాం వచ్చేస్తారో ఖుత్బా ఇవ్వడానికి, ప్రత్యేకంగా ఎవరైతే దైవదూతలు హాజరవుతారో ఈ ఐదు ఘడియల్లో వచ్చిన వారి పేరు నమోదు చేసుకోవడానికి, ఈ ప్రత్యేక రిజిస్టర్లలో, తర్వాత వచ్చిన వారి యొక్క పేర్లు నమోదు కావు. అందుకొరకు ఎలాంటి ఆలస్యం చేయకూడదు. జుమా రోజున మిస్వాక్ చేయడం, సువాసన పూసుకోవడం, ఎంతో పరిశుభ్రంగా రావడం, ఇది చాలా ఉత్తమ విషయం అని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క హదీసులో కూడా మనకు ఈ విషయాలు బోధపడుతున్నాయి.

ఇంకా సోదర మహాశయులారా, మీరు గనక ఆయతును గమనిస్తే అక్కడ అల్లాహు తాలా చెబుతున్నాడు, “ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్“. అల్లాహ్ యొక్క జిక్ర్, ధ్యానం వైపునకు హాజరవ్వండి. ఇక్కడ అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఇక్కడ ఖుత్బా. ఇమాం ఏదైతే ఖుత్బా ఇస్తారో ఆ ఖుత్బాలో కూడా రావాలి. అంటే ఏమిటి? ఇమాం మెంబర్ పై వచ్చేకి ముందు వచ్చేస్తే, కనీసం ఒక చాలా గొప్ప పుణ్యం మనం పొందుతాము, ప్రత్యేకంగా దైవదూతలు ఎవరైతే హాజరవుతారో వారి యొక్క రిజిస్టర్లలో కూడా మన పేరు వచ్చేస్తుంది.

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే చాలా చాలా అనారోగ్యంగా ఉన్నారో, మస్జిద్ కు హాజరయ్యే అంతటువంటి శక్తి లేదో, మరియు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకా చిన్న పిల్లలు మరియు స్త్రీలు, ఇలాంటి వారిపై జుమాలో హాజరు కావడం విధిగా లేదు. కాకపోతే వారిలో ఎవరైనా జుమాలో వచ్చారంటే, జుమాలో వచ్చినటువంటి గొప్ప పుణ్యాలు తప్పకుండా పొందుతారు. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆ తర్వాత సహాబాలు, తాబియీన్, తబే తాబియీన్, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా అల్హందులిల్లాహ్ సహీ హదీసుల్లో వచ్చిన దాని ప్రకారం, స్త్రీలకు కూడా మస్జిద్‌లలో వచ్చేటువంటి అవకాశం కలుగజేయాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కారణంగా అలాంటి సౌకర్యం లేకుంటే అది వేరు విషయం. కానీ వారి కొరకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఇది ప్రవక్త వారి సాంప్రదాయం, హదీసుల్లో దీనికి నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చి ఉన్నాయి.

ఆ తర్వాత అల్లాహు తాలా తెలిపాడు, “వ జరుల్ బైఅ” (క్రయవిక్రయాలను వదిలిపెట్టండి). ప్రత్యేకంగా ఈ జుమాకు సంబంధించి ఒక గొప్ప అనుగ్రహం అల్లాహ్ మనపై చేసినది గుర్తు చేసుకోవాలి. అదేమిటి? అల్లాహు తాలా ఇంతకు ముందు జాతులపై కాకుండా ప్రత్యేకంగా మనపై అనుగ్రహించిన ఒక గొప్ప అనుగ్రహం జుమా రోజున ఏమిటంటే, జుమా నమాజు యొక్క మొదటి ఖుత్బా ఆరంభం అయ్యేకి కొంచెం ముందు వరకు మనం వ్యాపారంలో ఉండవచ్చు. జుమా నమాజు పూర్తి అయిపోయిన తర్వాత కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. కేవలం ఇంత సమయం మాత్రమే అల్లాహు తాలా “వ జరుల్ బైఅ” అని ఆదేశించాడు, కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు అన్నీ కూడా వదులుకోండి అని. కానీ ఇంతకు ముందు జాతులపై ఎలా ఉండినది? పూర్తి వారి ఆ వారంలో ఒక్క రోజు అన్ని కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు వదిలేసి అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నులై ఉండటం. ఇది కూడా గమనించండి, అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై. అయితే ఎవరైతే ఇమాం వచ్చి మెంబర్ పై ఏదైతే ఎక్కుతాడో మరియు ముఅజ్జిన్ అజాన్ ఇస్తాడో, దాని తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తే, అతడు ఒక హరాం పని చేసిన వాడు అవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది, అటు ఖుత్బా జరుగుతూ ఉంటుంది, ఇటు బయట మస్జిద్ ముంగట ఇత్తర్లు, సుర్మాలు, టోపీలు, మిస్వాకులు, ఇంకా వేరే కొన్ని, ఎవరైతే మస్జిద్ కు దగ్గర దగ్గరగా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారో, వారు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు విషయం, పొరపాటు.

అల్లాహు తాలా వెంటనే ఏం గుర్తు చేస్తున్నాడు గమనించండి, “జాలికుమ్ ఖైరుల్లకుమ్ ఇన్ కున్తుమ్ తలమూన్” (మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది). అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం, ఖురాన్‌ను మనం చదువుతూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఏంటి? వర్తకాన్ని వదిలేసి నమాజు కొరకు హాజరవ్వడం. అయ్యో, నేను డ్యూటీ చేసుకోకుంటే నాకు కూడు ఎక్కడ వస్తది? నేను నా భార్యా పిల్లలకు ఏం తినబెట్టాలి? ఈ విధంగా మనం ఆలోచిస్తాము. కానీ అల్లాహు తాలా పూర్తి జుమ్మా రోజు మొత్తం 12 గంటలు పగలంతా కూడా మీరు వదిలేసుకోండి వ్యాపారాన్ని అనట్లేదు. కనీసం ఈ జుమా యొక్క సమయం ఏదైతే ఉంటుందో, ఎందులోనైతే మనం అల్లాహ్‌ను ఆరాధిస్తామో ఆ కొన్ని నిమిషాలు మాత్రమే. ఇది కూడా అల్లాహ్ కొరకు పాటించని వాడు, అల్లాహ్ కొరకు ఈ నమాజ్ చేయడానికి తన వ్యాపారాన్ని, తన వర్తకాన్ని, తన పనులను, డ్యూటీని, జాబ్‌ని వదులుకొని వాడు, తాను అనుకుంటున్నాడు కావచ్చు, నమాజుకు పోయి ఏం సంపాదిస్తారు, నేను ఇంత మంచి జీతం తీసుకుంటున్నా, ఎంత మంచి పని చేసుకుంటున్నా. కానీ అల్లాహ్ అంటున్నాడు, కాదు, ఎవరైతే తమ యొక్క డ్యూటీని, తమ యొక్క ఉద్యోగాన్ని, తమ యొక్క వ్యాపారాన్ని, తమ యొక్క వర్తకాన్ని వదిలి నమాజు జుమ్మాకు హాజరయ్యారో, “జాలికుమ్ ఖైరుల్లకుమ్”, ఇది మీ కొరకు మంచిది. తెలియకుంటే ధర్మ ఆధారంగా తెలుసుకోండి, “తఅలమూన్”.

ఆ వెంటనే ఏమంటున్నాడో చూడండి అల్లాహు తాలా, “ఫఇదా ఖుదియతిస్సలాహ్“. ఎప్పుడైతే నమాజు పూర్తి అయిపోతుందో, “ఫన్తషిరూ ఫిల్ అర్ద్“. వెళ్ళండి, భూమిలో సంచరించండి. “వబ్తగూ మిన్ ఫద్లిల్లాహ్“. అల్లాహ్ యొక్క ఈ ఫద్ల్, అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క దయ, దాన్ని అన్వేషించండి.

ఇరాఖ్ ఇబ్ను మాలిక్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖనం వచ్చింది. ఆయన జుమా నమాజు చేసుకున్న తర్వాత వెళ్ళేవారు బయటికి. “అల్లాహుమ్మ ఇన్నీ అజబ్తు దఅవతక” (ఓ అల్లాహ్, నేను నీ పిలుపుకు స్పందించాను). ఓ అల్లాహ్ నీవు పిలిచావు, జుమాలో హాజరవ్వని, నేను వచ్చాను. “వ సల్లైతు ఫరీదతక” (మరియు నీవు విధిగావించిన నమాజును నెరవేర్చాను). నేను ఈ ఫర్జ్‌ను నెరవేర్చాను, చదివాను. “వన్తషర్తు కమా అమర్తనీ” (మరియు నీవు ఆదేశించినట్లే విస్తరించాను). నీవు చెప్పావు కదా అల్లాహ్, “ఫన్తషిరూ”, సంచరించండి, బయటికి వెళ్ళండి, బయటికి వచ్చేసాను. “ఫర్జుఖ్నీ మిన్ ఫద్లిక” (కాబట్టి నీ అనుగ్రహంతో నాకు ఉపాధిని ప్రసాదించు). ఓ అల్లాహ్, నీ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు. “వ అన్త ఖైరుర్రాజిఖీన్” (నీవే ఉత్తమ ప్రదాతవు). నీవే అతి ఉత్తమ ప్రదాతవు. ఇబ్ను అబీ హాతింలో ఈ ఉల్లేఖనం ఉంది.

మరికొందరు ధర్మవేత్తలు, సలఫే సాలెహీన్ చెప్పారు, ఎవరైతే జుమా నమాజు తర్వాత వ్యాపారంలో నిమగ్నులవుతారో, అల్లాహు తాలా వారికి ఎంతో అనుగ్రహం, ఎంతో శుభం కలుగజేస్తాడు. అయితే ఇక్కడ భావం ఏంటి? నమాజు సమయం ఎంతనైతే ఉందో, అందులో పూర్తి శ్రద్ధాభక్తులతో నమాజ్ చదవాలి.

కానీ మళ్ళీ ఇక్కడ గమనించండి మీరు, వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا (వజ్కురుల్లాహ కసీరన్). అల్లాహ్‌ను మీరు అధికంగా స్మరించండి, అల్లాహ్ యొక్క జికర్ ఎక్కువగా చేయండి. لَّعَلَّكُمْ تُفْلِحُونَ (లఅల్లకుమ్ తుఫ్లిహూన్). అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు. గమనిస్తున్నారా? మీరు నమాజ్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, వ్యాపారంలో నిమగ్నులయ్యారు. కానీ ఆ వ్యాపార సమయంలో కూడా మీరు అల్లాహ్‌ను ధ్యానించండి. మీరు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు, మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు, ఎవరి నుండి ఏదైనా తీసుకుంటున్నప్పుడు, అల్లాహ్‌ను అధికంగా స్మరించండి. పరలోక దినాన మీకు లాభం చేకూర్చేది ఏదైతే ఉందో, దాని నుండి మీ ప్రపంచ వ్యామోహం మిమ్మల్ని దూరం చేయకూడదు..

అల్లాహు అక్బర్. ఇక్కడ స్మరించండి, అల్లాహ్‌ను గుర్తుంచుకోండి, “ఉజ్కురూ” – అల్లాహ్‌ను ధ్యానించండి అంటే రెండు భావాలు. ఒకటేమిటి? ఆ వ్యాపారంలో ఉన్నా, మీరు వ్యవసాయంలో ఉన్నా, వేరే ఏదైనా మీ ఉద్యోగంలో వెళ్ళినా, మీరు ఇంకా ఎవరితోనైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తూ, పరస్పరం ఏదైనా సంప్రదింపులు చేసుకుంటూ ఉన్నా, అక్కడ అల్లాహ్ ఆదేశం ఏంటి? దానిని మీరు గుర్తుంచుకొని ఆ ప్రకారంగా జీవించండి. ఇదొక భావం. రెండవ భావం, మీరు వ్యాపారంలో ఉన్నప్పటికీ, అల్హందులిల్లాహ్, సుబ్ హానల్లాహ్. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఇచ్చు పుచ్చుకుంటున్నప్పుడు, ఇన్షాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణ అనేది మీ యొక్క నోటిపై రావాలి. అల్లాహ్ యొక్క స్తోత్రం అనేది రావాలి. అల్లాహ్‌ను మీరు గుర్తిస్తూ ఉండాలి. అందుకొరకే ఒక సహీ హదీసులో వచ్చి ఉంది కదా? ఎవరైతే బజార్లో వచ్చినప్పుడు, గుర్తుంచుకోండి ఇది దుఆ, తర్వాత యూట్యూబ్ లోకి, ఫేస్బుక్ లోకి వెళ్లి మళ్ళీ ఈ దుఆను మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసుకోండి, మరోసారి వినండి.

ఎవరైతే బజార్లో వెళ్లి ఈ దుఆ చదువుతారో, అల్లాహు తాలా వారికి పది లక్షల పుణ్యాలు ప్రసాదిస్తాడు, పది లక్షల పాపాలు వారి నుండి మన్నింపజేస్తాడు, మరో ఉల్లేఖనంలో ఉంది, పది లక్షల స్థానాలు వారివి పెంచుతాడు. ఏంటి దుఆ?

لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
(లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్)
(అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు. సార్వభౌమత్వం ఆయనదే, స్తోత్రం ఆయనకే చెల్లును, మరియు ఆయన ప్రతి దానిపై శక్తిమంతుడు)

సాధారణంగా ఫర్జ్ నమాజుల తర్వాత అట్లా మనం చదువుతూ ఉంటాము కదా? గుర్తుంచుకోండి.

ఇమాం ముజాహిద్ (రహిమహుల్లాహ్) చెప్పారు, لا يكون العبد من الذاكرين الله كثيرا حتى يذكر الله قائما وقاعدا ومضطجعا (లా యకూనుల్ అబ్దు మినజ్-జాకిరీనల్లాహ కసీరన్ హత్తా యజ్కురల్లాహ ఖాయిమన్ వ ఖాయిదన్ వ ముద్-తజిఆ) “మనిషి నిలబడుతూ, కూర్చుంటూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”

సూరతుల్ అహ్‌జాబ్‌లో అల్లాహు తాలా ఒక శుభవార్త ఇచ్చాడు ఇక్కడ, “అజ్-జాకిరీనల్లాహ కసీరన్ వజ్-జాకిరాత్” (అల్లాహ్‌ను అధికంగా స్మరించే పురుషులు మరియు స్త్రీలు). అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసే వారు అంటే ఎవరు? ఇమాం ముజాహిద్ చెబుతున్నారు, “నడుచుకుంటూ, నిలబడుతూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”

ఆ తర్వాత సోదరులారా, చివరి ఆయత్ ఏదైతే ఉందో ఈరోజు మన పాఠంలో, సంక్షిప్తంగా దీని యొక్క భావం తెలియజేసి నేను ఈనాటి తఫ్సీర్ క్లాస్‌ను ముగించేస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చేరుకున్న ఐదు రోజుల తర్వాతనే జుమా నమాజ్ ప్రారంభం చేసేశారు. మక్కా నుండి వలస వచ్చారు కదా మదీనాకు, సోమవారం వచ్చారు మదీనాలో. ఆ తర్వాత మంగళ, బుధ, గురు, శుక్ర. శుక్రవారం వచ్చింది, ఖుబా నుండి బయలుదేరారు, మధ్యలో బనీ సాలిం బిన్ ఔఫ్ యొక్క ఇళ్ళు వచ్చాయి, అక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా చేశారు. మస్జిదుల్ జుముఆ అని ఈరోజు కూడా ఉంది, ఖుబా మరియు మస్జిదున్నబవి మధ్యలో.

అయితే, కొన్ని రోజుల తర్వాత సంఘటన ఇది. మీకు తెలిసిన విషయమే, మదీనాలో వచ్చిన తర్వాత సామూహిక పరంగా నమాజుకు సంబంధించి ఇంకా ఎన్నో రకాల ఆదేశాలు అల్లాహు తాలా కొన్ని కొన్ని సందర్భాల్లో అవతరింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మరియు మక్కా నుండి వచ్చిన వారు మదీనాలో ఆరంభంలో కొన్ని సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యారు, అనారోగ్యం పాలయ్యారు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల. అయితే ఒక జుమా రోజు ఏం జరిగింది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారు. ఆ సందర్భంలో బయట దేశం నుండి ఒక వ్యాపార బృందం వచ్చింది. వ్యాపార బృందం ఒక ఊరిలో వచ్చిన తర్వాత వారు డప్పు లాంటిది కొట్టేవారు ప్రజలకు తెలియాలని. అయితే, ఎప్పుడైతే ఇటు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారో అదే సందర్భంలో వ్యాపార బృందం వచ్చింది. వారికి తెలియదు ఖుత్బా యొక్క ఆదేశాలు, జుమ్మా నమాజుకు సంబంధించిన పద్ధతులు. అయితే ఇక్కడ ప్రవక్త ముందు ఉన్నటువంటి వారిలో కొంతమంది ఆ సరుకులు తీసుకోవడానికి వెంటనే ప్రవక్తను ఖుత్బా ఇస్తుండగా వదిలి వెళ్ళిపోయారు. కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, 12 మంది మిగిలి ఉన్నారు ప్రవక్త ముందు. ప్రవక్త ఖుత్బా ఇస్తున్నప్పుడు, చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు అల్లాహు తాలా ఈ ఆయత్ అవతరింపజేశాడు. చివరి ఆయత్ ఏంటి? “وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا”. వారు ఏదైనా వ్యాపారాన్ని లేదా ఆటపాటలను చూసినప్పుడు, నిన్ను ఖుత్బా ఇస్తుండగా నిలబడి వదిలి వెళ్తారు, వాటిలో పాలు పంచుకుంటారు. “ఖుల్” (వారికి తెలపండి), “మా ఇందల్లాహి ఖైర్” (అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది).

అల్లాహ్ వద్ద ఉన్నది అది ఎంతో మేలైనది. అల్లాహు అక్బర్. ఇక్కడ ఈ ఆయతులో గమనించండి ఇప్పుడు, ముందు అల్లాహ్ ఏమన్నాడు? “వ ఇదా రఅవ్ తిజారతన్ అవ్ లహ్వన్” (వారు వ్యాపారాన్ని లేదా వినోదాన్ని చూసినప్పుడు). వ్యాపారం ముందు ప్రస్తావించాడు, లహ్వ్ (ఆట, పాటలు, వినోదాలు) తర్వాత. మళ్ళీ ఏమంటున్నాడు అల్లాహు తాలా, అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది “మినల్లహ్వి వ మినత్తిజార” (వినోదం కన్నా మరియు వర్తకం కన్నా). దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి టీవీలు చూసుకుంటూ కూర్చుంటారో, ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి పబ్జీ ఇంకా వేరే ఆటలు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారో, ఎవరైతే నమాజు వదిలి క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, వారికి ఇష్టమైన మ్యాచ్‌లు చూసుకుంటూ ఉంటారో, ఇదంతా కూడా ఆట, వినోదం. ఇందులో మేలు లేదు. అల్లాహ్ ఎప్పుడైతే పిలిచాడో, నమాజు కొరకు రమ్మని చెప్పాడో, అందులో హాజరవ్వడం, అందులో మేలు ఉన్నది. “వల్లాహు ఖైరుర్రాజిఖీన్”. అల్లాహ్ అతి ఉత్తమ ఉపాధి ప్రదాత. అతని కంటే మేలైన ఉపాధిని ప్రసాదించేవాడు ఇంకా ఎవరూ కూడా లేరు.

సోదర మహాశయులారా, చెప్పుకుంటే విషయాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ అల్లాహు తాలా ఇందులో మనకు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. జుమా నమాజు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మొన్న కూడా ఒక మిత్రుడు అడుగుతున్నాడు, ఏమని? ఎంతోమంది ముస్లిములను మనం చూస్తాము, జుమాకు హాజరవుతారు కానీ ఐదు పూటల నమాజులు చేయరు. ఎందుకు ఇలా చేస్తారు? ఇది వారి యొక్క బద్ధకం, అశ్రద్ధత. వాస్తవానికి ఇది ఇలా చేస్తున్నది వారు చాలా తప్పు చేస్తున్నారు. అల్లాహ్‌తో భయపడాలి. అల్లాహ్ ఎలాగైతే జుమా నమాజు మనపై విధిగావించాడో, ఐదు పూటల నమాజు ప్రతి రోజు విధి గావించాడు. ఐదు పూటల నమాజు చేసుకుంటూ ఉండాలి, అల్లాహ్ యొక్క ఆదేశం పాటిస్తూ ఉండాలి.

ఈ రోజుల్లో మనం ఏమంటాము? కూడు లేకుంటే ఏ నమాజులు, ఏం పనికొస్తాయి? ఈ విధంగా అంటారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇక్కడ కూడా అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి, మీకు తిండి ప్రసాదించేవాడు అల్లాహ్, సంపాదన అనేది, కష్టం అనేది మీరు పడాలి కానీ ఇచ్చేది అల్లాహు తాలా. అందుకొరకు అల్లాహ్ యొక్క ఆదేశాలను ధిక్కరించి మీరు కేవలం ప్రపంచ వ్యామోహంలో పడకండి.

అల్లాహు తాలా మనందరికీ ఇహపరలోకాల మేలు ప్రసాదించుగాక. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేయుగాక. ఈ రోజుల్లో మనలో అనేకమంది ఏదైతే నమాజ్ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో, అల్లాహు తాలా ఈ అశ్రద్ధతను దూరం చేయుగాక.

జజాకుముల్లాహు ఖైరన్ వ అహసనల్ జజా. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఇమాం వెనుక జుహ్ర్, అస్ర్ నమాజు చివరి రెండు రకాతులలో సూరహ్ ఫాతిహా తో పాటు ఇంకొక సూరా కూడా చదవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

వీడియో పాఠాలు

ధర్మపరమైన నిషేధాలు – 19: ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 19

19- ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు. 1. మక్కాలో ఉన్న మస్జిదుల్ హరాం. 2. మదీనలో ఉన్న మస్జిదె నబవి [1]. 3. ఫాలస్తీనలోని ఖుద్స్ లో ఉన్న మస్జిదె అఖ్సా. ఇవి గాకుండా వేరే మస్జిదుల వైపునకు వాటిని ఉద్దేశించి ప్రయాణం చేయరాదు.

عَنْ أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ قَالَ: (لَا تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلَاثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ @ وَمَسْجِدِ الْأَقْصَى)

“మస్జిదె హరాం, మస్జిదె నబవి మరియు మస్జిదె అఖ్సా. ఈ మూడు మస్జిదులు తప్ప మరే చోట (పుణ్యాన్ని ఆశించి) ప్రయాణించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు

(బుఖారి/ బాబు ఫజ్లిస్ సలాతి ఫీ మస్జిది మక్కా వ మదీన/ 1189, ముస్లిం/ బాబు లా తుషద్దుర్ రిహాలు ఇల్లా…/ 1397).


[1] ప్రవక్త సమాధినుద్దేశించి మదీన ప్రయాణం చేయుట నిషిద్ధము. స్వయంగా ప్రవక్తయే దీనిని నిషేధించారు, హెచ్చరించారు. ఇలా చేయుట ఒక పండుగగా, ఉత్సవంగా అయిపోతుంది. ఇలా చేయువాడు హదీసు ఆధారంగా శాపగ్రస్తుడవుతాడు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు