నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు [మరణానంతర జీవితం – పార్ట్ 55] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.

మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:

  • అన్నార్ (النَّار) – అగ్ని
  • జహన్నమ్ (جَهَنَّم) – నరకం (అత్యంత ప్రసిద్ధమైన పేరు)
  • జహీమ్ (جَحِيم) – ప్రజ్వలించే అగ్ని
  • సఈర్ (سَعِير) – మండుతున్న జ్వాల
  • లజా (لَظَىٰ) – భగభగమండే అగ్ని
  • సఖర్ (سَقَر) – కాల్చివేసేది
  • హుతమా (حُطَمَة) – ముక్కలు ముక్కలుగా నలిపివేసేది
  • హావియా (هَاوِيَة) – అగాధం, పాతాళం

ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 2 – [మరణానంతర జీవితం – పార్ట్ 52] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 2
[మరణానంతర జీవితం – పార్ట్ 52] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=ADuGX4TjS2o
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
(అల్-హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్) [సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…]

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన.

మహాశయులారా, ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు. ముస్తదరక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీ అని అన్నారు. ఆ హదీథ్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ప్రళయ దినాన అల్లాహు తఆలా పూర్వీకులను, వెనుకటి వారిని, ప్రజలందరినీ సమీకరిస్తాడు. ఆ పొడవైన హదీథ్ లో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియపరుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది. నూర్ ఇవ్వడం జరుగుతుంది.

فَمِنْهُمْ مَنْ يُؤْتَى نُورُهُ مِثْلَ الْجَبَلِ
(ఫమిన్‌హుమ్ మన్ యూ’తా నూరుహు మిథ్లల్ జబల్)
[వారిలో కొందరికి పర్వతమంత కాంతి ఇవ్వబడుతుంది.]

కొందరికి కొండంత పరిమాణంలో, కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు. మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది. మరికొందరికి వారు ఒక ఖర్జూరపు కర్ర తమ కుడిచేతిలో తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది. మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో. చివరి వ్యక్తి లేక చివరి రకం వారు, చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని, వారి పాదములోని బొటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్) – [మరణానంతర జీవితం – పార్ట్ 51] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన)
[మరణానంతర జీవితం – పార్ట్ 51] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kjbs6O5YVHI
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వసలామున్ అలా ఇబాదిల్లజీనస్తఫా అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.

మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.

వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా.
(وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا)
అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.

మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.

మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్‌లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:

బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్.
(بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ)
అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.

ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.

స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది – కలామే హిక్మత్

అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)

పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :

అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)

“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.

“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.

పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)

ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :

“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)

మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :

ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.

పోతే – మద్యపానం, జూదం, వ్యభిచారం, అపసవ్యమైన అనర్థదాయకమయిన విషయాలు, అసత్యం, చాడీలు, మనోవాంఛల దాస్యం, పదార్థపూజ, వంశం, కులం గోత్రాల ప్రాతిపదికపై అహంకారాన్ని ప్రదర్శించడం, దురాచారాలు, దుస్సంప్రదాయాలు — ఇవన్నీ సరకానికి గొనిపోయేవే.

అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.

అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.

హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :

وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)

పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

2.24 – స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1797 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 28 باب حجبت النار بالشهوات

1797. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మనో వాంఛలతో కప్పి వేయబడింది. స్వర్గం కష్టాలు కడగండ్లతో కప్పివేయబడింది.” *

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 28వ అధ్యాయం – హుజిబతిన్నారు బిషహవాత్)

* అంటే స్వర్గంలో ప్రవేశించే మార్గం కష్టాలు, కడగండ్లతో నిండి ఉంది. మరో మాటలో చెప్పాలంటే స్వర్గప్రవేశం చేయాలంటే కష్టాలు, బాధలు సహించవలసి ఉంటుందన్నమాట. అలాగే నరకానికి దారితీసే మార్గం మనోవాంఛలతో నిండి ఉంది. అంటే మనస్సుకు తోచిన విధంగా ప్రాపంచిక వ్యా మోహంతో విశృంఖల జీవితం గడిపితే అది మనిషిని నరకానికి గొని పోతుందన్నమాట. ఈ హదీసు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాటల్లోని మర్మానికి, సమగ్రతకు ఒక మచ్చుతునకని, ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అన్నారు. (సంకలనకర్త)

1798 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَالَ اللهُ: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ فَاقْرَءُوا إِنْ شِئْتُمْ (فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنِ)
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1798. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- అల్లాహ్ ఈ విధంగా అన్నాడు – “నేను నా పుణ్య దాసుల కోసం (స్వర్గంలో) ఎవరి కళ్ళూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి మనస్సుకూ అందనటువంటి సామగ్రిని సిద్ధం చేసి ఉంచాను.”

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు తెలిపిన తరువాత, “దీనికి ఆధారం కావాలంటే ఖారీ ఖుర్ఆన్ సూక్తిని చదువుకోండ”ని ఈ క్రింది సూక్తిని వినిపించారు – “వారి కర్మలకు ప్రతిఫలంగా వారి కండ్ల చలువ కోసం అల్లాహ్ ఏ ప్రాణికీ తెలియని అపూర్వ సామగ్రిని సిద్ధపరచి ఉంచాడు.” (అస్సజ్జా : 17)

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్క్ , 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1799 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، يَبْلُغُ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ شَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 56 سورة الواقعة: 1 باب قوله (وظل ممدود)

1799. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించిన ఒక ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :- స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు. (సహీహ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 58వ సూరా – వాఖియా, 1వ అధ్యాయం – ఖౌలిహీ తఆలా వజిల్లిన్ మమ్ దూద్)

1800 – حديث سَهْلِ بْنِ سَعْدِ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1800. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1801 – حديث أَبِي سَعِيدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ الْجَوَادَ الْمُضَمَّرَ السَّرِيعَ مِائَةَ عَامٍ مَا يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1801. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : “స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడ క్రింద ఒక రౌతు వేగంగా పరుగెత్తే గుర్రమెక్కి వందేండ్లు పయనించినా అతనా నీడ అంచుకు చేరుకోలేడు.” (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1802 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ يَقُولُ لأَهْلِ الْجَنَّةِ: يَا أَهْلَ الْجَنَّةِ يَقُولُونَ: لَبَّيْكَ، رَبَّنَا وَسَعْدَيْكَ فَيَقُولُ: هَلْ رَضِيتُمْ فَيَقُولُونَ: وَمَا لَنَا لاَ نَرْضى وَقَدْ أَعْطَيْتَنَا مَا لَمْ تُعْطِ أَحَدًا مِنْ خَلْقِكَ فَيَقُولُ: أَنَا أُعْطِيكُمْ أَفْضَلَ مِنْ ذلِكَ قَالُوا: يَا رَبِّ وَأَيُّ شَيْءٍ أَفْضَلُ مِنْ ذَلِكَ فَيَقُولُ: أُحِلُّ عَلَيْكُمْ رِضْوَانِي، فَلاَ أَسْخَطُ عَلَيْكُمْ بَعْدَهُ أَبَدًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1802. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు :- అల్లాహ్ స్వర్గవాసుల్ని “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. దానికి స్వర్గవాసులు “మేము నీ సమక్షంలో హాజరయ్యాము ప్రభూ!” అనంటారు. “మీరు సంతోషంగా ఉన్నారా?” అని అడుగుతాడు అల్లాహ్. “మేమిక సంతోషంగా ఎందుకు ఉండము? నీవు నీ సృష్టిరాసుల్లో ఎవరికీ ప్రసాదించని మహాభాగ్యాలు మాకు ప్రసాదించావు” అంటారు స్వర్గవాసులు. “నేను మీకు ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ప్రసాదిస్తాను” అంటాడు అల్లాహ్. “ప్రభూ! ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ఇంకేముంటుంది?” అంటారు స్వర్గవాసులు. అప్పుడు అల్లాహ్ “నేను మీకు నా ప్రసన్నతా మహాభాగ్యం అనుగ్రహిస్తాను. ఇక నుండి నేను ఎన్నడూ మీ మీద ఆగ్రహించను” అని అంటాడు. (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1803 – حديث سَهْلِ بْنِ سَعْدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ لَيَتَرَاءَوْنَ الْغُرَفَ فِي الْجَنَّةِ، كَمَا تَتَرَاءَوْنَ الْكَوْكَبَ فِي السَّمَاءِ قَالَ: فَحَدَّثْتُ النُّعْمَانَ ابْنَ أَبِي عَيَّاشٍ فَقَالَ: أَشْهَدُ لَسَمِعْتُ أَبَا سَعِيدٍ يُحَدِّثُ وَيَزِيدُ فِيهِ كَمَا تَرَاءَوْنَ الْكَوْكَبَ الْغَارِبَ فِي الأفُقِ الشَّرْقِيِّ وَالْغَرْبِيِّ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق 51 باب صفة الجنة والنار

1803. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో స్వర్గవాసులు ఒకరి మేడలను మరొకరు మీరిక్కడ ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు.”

హదీసు ఉల్లేఖకుని ఉవాచ :- నేనీ హదీసుని నూమాన్ బిన్ అయాష్ (రహిమహుల్లాహ్) నుండి గ్రహించాను. ఆయన ఈ హదీసు గురించి చెబుతూ “నేనీ హదీసుని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) నోట విన్నానని సాక్ష్యమిస్తున్నాను” అని అన్నారు. అయితే ఆయన ఈ హదీసులో అదనంగా “మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై అస్తమిస్తుండే నక్షత్రాలను చూస్తున్నట్లు” అని అనేవారు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1804 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ يَتَرَاءَيُونَ أَهْلَ الْغُرَفِ مِنْ فَوْقِهِم كَمَا يَتَرَاءَيُونَ الْكَوْكَبَ الدُّرِّيَّ الْغَابِرَ فِي الأُفُقِ مِنَ الْمَشْرِقِ أَوِ الْمَغْرِبِ، لِتَفَاضُلِ مَا بَيْنَهُمْ قَالُوا: يَا رَسُولَ اللهِ تِلْكَ مَنَازِلُ الأَنْبِيَاءِ، لاَ يَبْلُغُهَا غَيْرُهُمْ قَالَ: بَلَى، وَالَّذِي نَفْسِي بِيَدِهِ رِجَالٌ آَمَنوا بِاللهِ، وَصَدَّقُوا الْمُرْسَلِينَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1804. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉద్బోధిస్తూ “స్వర్గవాసులు తమ పైనుండే మేడలలోని వారిని, మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై దేదీప్యమానంగా మెరిసే నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు. దీనిక్కారణం స్వర్గవాసుల్లో కూడా అంతస్తులు, తరగతులు ఉంటాయి” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! ఈ మేడలు దైవప్రవక్తల గృహాలయి ఉంటాయా? అక్కడకు వారు తప్ప మరెవరూ చేరుకోలేరు కాబోలు” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఎందుకు చేరుకోలేరు! నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ దేవుని సాక్షి! వీరసలు అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తలను సమర్ధించిన వారయి ఉంటారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఆ ఫీ సిఫతిల్ జన్నతి వ అన్నహామఖూఖతున్)

1805 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُونَ الْجَنَّةَ عَلَى صُورَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، عَلَى أَشَدِّ كَوْكَبٍ دُرِّيٍّ فِي السَّمَاءِ إِضَاءَةً؛ لاَ يَبُولُونَ، وَلاَ يَتَغَوَّطُونَ، وَلاَ يَتْفِلُونَ، وَلاَ يَمْتَخِطُونَ أَمْشَاطُهُمُ الذَّهَبُ، وَرَشْحُهُمُ الْمِسْكُ، وَمَجَامِرُهُمُ الأَلُوَّةُ الأَنجُوجُ عُودُ الطِّيبِ وَأَزْوَاجُهُمُ الْحُورُ الْعِينُ عَلَى خَلْقِ رَجُلٍ وَاحِدٍ عَلَى صُورَةِ أَبِيهِمْ آدَمَ سِتُّونَ ذِرَاعًا فِي السَّمَاءِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1805. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి సమూహంలోని ప్రజల ముఖాలు పున్నమి రాత్రి చంద్రునిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వారి తరువాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు మెరిసిపోయే ముత్యాల్లాంటి ప్రకాశవంతమైన నక్షత్రాల్లా ధగధగ మెరిసిపోతూ ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆకాశంలో ఇతర నక్షత్రాల కన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. స్వర్గవాసులు మల మూత్ర విసర్జన చేయరు. అదీగాక వారు ఉమ్మరూ, చీదరు కూడా. వారి దువ్వెనలు బంగారంతో చేసినవయి ఉంటాయి. వారి చెమట నుండి కస్తూరి సువాసన గుబాళిస్తుంది. వారి ఉంగరాలపై సుగంధ పరిమళంతో కూడిన సామ్రాణి జ్వలిస్తూ ఉంటుంది. వారి భార్యలు విశాలమైన నల్లటి కళ్ళు గల (అందమైన) స్త్రీలయి ఉంటారు. స్వర్గవాసులందరి రూపాలు వారి పితామహుడు హజ్రత్ ఆదం (అలైహి) రూపంలా ఒకే విధంగా ఉంటాయి. వారి ఎత్తు అరవై బారలు ఉంటుంది. (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖళ్ళి ఆదము సలవాతుల్లాహి అలైహి జుర్రియతివీ)

1806 – حديث أَبِي مُوسى الأَشْعَرِيِّ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْخَيْمَةُ دُرَّةٌ مُجَوَّفَةٌ، طُولُهَا فِي السَّمَاءِ ثَلاَثُونَ مِيلاً فِي كُلِّ زَاوِيَةٍ مِنْهَا لِلْمُؤْمِنِ أَهْلٌ، لاَ يَرَاهُمُ الآخَرُونَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1806. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: (స్వర్గవాసి) కుటీరం ఒక ముత్యమయి ఉంటుంది (అది ఏక ముత్య కుటీరం). దాని లోపలి భాగం మెరుగుదిద్దబడి ఉంటుంది. దాని ఎత్తు 30 మైళ్ళు (48 కిలో మీటర్లు) ఉంటుంది. అందులోని ప్రతి గదిలో విశ్వాసుల కోసం భార్యలు ఉంటారు. వారిని ఇతరులెవరూ చూడలేరు. (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1807 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: خَلَقَ اللهُ آدَمَ، وَطُولُهُ سِتُّونَ ذِرَاعًا، ثُمَّ قَالَ: اذْهَبْ فَسَلِّمْ عَلَى أُولَئِكَ مِنَ الْمَلاَئِكَةِ، فَاسْتَمِعْ مَا يُحَيُّونَكَ [ص:290] تَحِيَّتُكَ وَتَحِيَّةُ ذُرِّيَّتِكِ فَقَالَ: السَّلاَمُ عَلَيْكُمْ فَقَالُوا: السَّلاَمُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ فَزَادُوهُ، وَرَحْمَةُ اللهِ فَكُلُّ مَنْ يَدْخُلُ الْجَنَّةَ عَلَى صُورَةِ آدَمَ، فَلَمْ يَزَلِ الْخَلْقُ يَنْقُصُ حَتَّى الآنَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1807. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “అల్లాహ్ (తొలి మానవుడైన) హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ను సృష్టించాడు – అప్పుడాయన ఎత్తు అరవై బారలు ఉండింది – అల్లాహ్ ఆయనతో “దైవదూతల దగ్గరికెళ్ళి వారికి సలాం చెయ్యి, దానికి వారేమి సమాధానమిస్తారో విను. వారు పలికిన సలామే నీ, నీ సంతానం సలాం, ప్రతి సలాం అవుతుంది” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఆదం (అలైహి) వెళ్ళి వారికి ‘అస్సలాము అలైకుం’ అనిసలాం చేశారు. దానికి వారు “అస్సలాము అలైక వ రహ్మతుల్లాహ్” అని ప్రతి సలాం చేశారు. వారు రహ్మతుల్లాహ్ అనే పదాన్ని అదనంగా పలికారు – స్వర్గంలో ప్రవేశించే ప్రతి మానవుని రూపం ఆదం (అలైహి) రూపంలా ఉంటుంది – ఆ (తొలి మానవుని సృష్టి) తరువాత ఈనాటి వరకూ మానవుల ఎత్తు నిరంతరాయంగా తగ్గుతూ వస్తోంది“.* (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖల్ఖి ఆదమ సలవాతుల్లాహి అలైహి వజుర్రియతిహీ)

* ఈ హదీసు శీర్షికకు అనుగుణమైన హదీసు కాదు. దానిక్కారణం విషయసూచిక సహీహ్ ముస్లిం నుండి గ్రహించబడింది. సహీహ్ ముస్లిం విషయసూచిక ఈ అధ్యాయం క్రింద దీంతో పాటు మరో హదీసు కూడా ఉంది. అది సహీహ్ బుఖారీలో లేదు. అందువల్ల మూలంలో పక్షుల్లాంటి హృదయాలన్న ప్రస్తావన లేదు. (అనువాదకుడు)

1808 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نارُكمْ جُزْءٌ مِنْ سَبْعِينَ جُزْءًا مِنْ نَارِ جَهَنَّمَ قِيلَ يَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنْ كَانَتْ لَكَافِيَةً قَالَ: فُضِّلَتْ عَلَيْهِنَّ بِتِسْعَةٍ وَسِتِّينَّ جُزْءًا، كلُّهُنَّ مِثْلُ حَرِّهَا
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 10 باب صفة النار وأنها مخلوقة

1808. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉద్బోధించారు – “నరకాగ్ని మీ (ఇహలోక) అగ్నికి 70 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుంది.” అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! (కాల్చడానికి) ఈ అగ్ని కూడా సరిపోతుంది కదా!” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై 69 రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బె భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు.
– (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 10వ అధ్యాయం – సిఫతిన్నారి వ అన్నహా మఖూఖహ్)

1809 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تَحَاجَّتِ الْجَنَّةُ وَالنَّارُ [ص:291] فَقَالَتِ النَّارُ: أُوثِرْتُ بِالْمُتَكَبِّرِينَ وَالْمُتَجَبِّرِينَ وَقَالَتِ الْجَنَّةُ: مَا لِي لاَ يَدْخُلُنِي إِلاَّ ضُعَفَاءُ النَّاسِ وَسَقَطُهُمْ قَالَ اللهُ، تَبَارَكَ وَتَعَالَى، لِلْجنَّةِ: أَنْتِ رَحْمَتِي أَرْحَمُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَقَالَ لِلنَّارِ: إِنَّمَا أَنْتِ عَذَابٌ أُعَذِّبُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَلِكُلِّ وَاحِدَةٍ مِنْهُمَا مِلْؤُهَا فَأَمَّا النَّارُ فَلاَ تَمْتَلِىءُ حَتَّى يَضَعَ رِجْلَهُ فَتَقُولُ قَطٍ قَطٍ قَطٍ فَهُنَالِكَ تَمْتَلِىءُ، وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْضٍ وَلاَ يَظْلِمُ اللهُ، عَزَّ وَجَلَّ، مِنْ خَلْقِهِ أَحَدًا وَأَمَّا الْجَنَّةُ، فَإِنَّ اللهَ، عَزَّ وَجَلَّ، يُنْشِىءُ لَهَا خَلْقًا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 50 سورة ق: 1 باب قوله وتقول هل من مزيد

1809. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “స్వర్గ నరకాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నరకం మాట్లాడుతూ “నాలో గర్విష్ఠులు, బలవంతులు ప్రవేశిస్తారు గనక నేను గొప్పదాన్ని” అని అన్నది. స్వర్గం మాట్లాడుతూ “నాలో మటుకు బలహీనులు, నిస్సహాయులు, ప్రజల దృష్టిలో విలువ లేని వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు” అని అన్నది. అప్పుడు అల్లాహ్ జోక్యం చేసుకుంటూ స్వర్గంతో “నీవు నా కారుణ్యానివి. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని కరుణిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత నరకంతో “నీవు ‘యాతనవు మాత్రమే. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని శిక్షిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత స్వర్గ నరకాలు రెండిటినీ నింపడం జరుగుతుందని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అయితే నరకంలో అల్లాహ్ తన కాలు పెట్టే దాకా అది నిండదు. అల్లాహ్ నరకంలో తన కాలు పెట్టినప్పుడు “చాలు చాలు ఇక చాలు” అంటుంది నరకం తన కడుపు నిండిపోయినట్లు. అది తనంతట తాను సంకోచిస్తుంది. అల్లాహ్ తన సృష్టి రాసుల్లో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడు. ఇక స్వర్గం విషయానికొస్తే దాన్ని నింపడానికి అల్లాహ్ కొత్తగా మరికొందరిని సృష్టిస్తాడు” (సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 5వ సూరా – ఖాఫ్, 1వ అధ్యాయం – ఖౌలిహీ వతఖూలు హల్ మిమ్మజీద్)

1810 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَزَالُ جَهَنَّمُ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ، حَتَّى يَضَعَ رَبُّ الْعِزَّةِ فِيهَا قَدَمَهُ فَتَقُولُ قطِ قَطِ وَعِزَّتِكَ وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْض
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 12 باب الحلف بعزة الله وصفاته وكلماته

1810. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మాటి మాటికీ ఇంకేదయినా ఉంటే తెచ్చి పడేయండి” అని అంటుంది. చివరికి అల్లాహ్ తన కాలిని దాని మీద పెడతాడు. అప్పుడు నరకం “నీ గౌరవ ప్రతిష్ఠల సాక్ష్యం! చాలు చాలు” అని అంటుంది. అది తనంతట తాను సంకోచించిపోతుంది.” (సహీహ్ బుఖారీ:- 83వ ప్రకరణం – ఐమాన్ వన్నుజూర్, 11వ అధ్యాయం – అల్ హల్ఫి బిఇజ్జతిల్లాహి వ సిఫాతిహీ వకలిమాతిహీ)

1811 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يُؤْتَى بِالْمَوْتِ كَهَيْئَةِ كَبْشٍ أَمْلَحَ، فَيُنَادِي مُنَادٍ، يَا أَهْلَ الْجَنَّةِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكلُّهُمْ قَدْ رَأَوْهُ ثُمَّ يُنَادِي: يَا أَهْلَ النَّارِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرُونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكُلُّهُمْ قَدْ رَآه فَيُذْبَحُ ثُمَّ يَقُولُ: يَا أَهْلَ الْجَنَّةِ خُلُودٌ، فَلاَ مَوْتَ وَيَا أَهْلَ النَّار خُلُودٌ، فَلاَ مَوْتَ ثُمَّ قَرَأَ (وَأَنْذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ، وَهؤُلاَءِ فِي غَفْلَةٍ، أَهْل الدُّنْيَا، وَهُمْ لاَ يُؤْمِنُونَ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 19 سورة مريم: 1 باب قوله وأنذرهم يوم الحسرة

1811. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :

(ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మికెవరికీ) మరణం రాదు” అని అంటాడు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు దినం గురించి భయ పెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అంజిర్హుమ్ యౌమల్ హస్రా)

1812 – حديث ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا صَارَ أَهْلُ الْجَنَّةِ إِلَى الْجَنَّةِ، وَأَهْلُ النَّارِ إِلَى النَّارِ؛ جِيءَ بِالْمَوْتِ حَتَّى يُجْعَلَ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ ثُمَّ يُذْبَحُ ثُمَّ يُنَادِي مُنَادٍ: يَا أَهْلَ الْجنَّةِ لاَ مَوْتَ، وَيَا أَهْلَ النَّارِ لاَ مَوْتَ فَيَزْدَادُ أَهْلُ الْجَنَّةِ فَرَحًا إِلَى فَرَحِهِمْ، وَيَزْدَادُ أَهْلُ النَّارِ حُزْنًا إِلَى حُزْنِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1812. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని స్వర్గనరకాల మధ్యకు తెచ్చి నిలబెట్టడం జరుగుతుంది. తరువాత దాన్ని కోసివేస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త లేచి “స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసుల ఆనందం అవధులు దాటుతుంది; నరకవాసులు దుఃఖంతో మరింత క్రుంగిపోతారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1813 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا بَيْنَ مَنْكِبَيِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1813. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : సత్యతిరస్కారి రెండు భుజాల మధ్య ఎంత అంతరం ఉంటుందంటే, భుజం మీద వేగంగా నడిచే రౌతు గనక నడిస్తే అతను మూడు రోజుల దాకా నడుస్తూనే ఉంటాడు.* (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

*నరక శిక్ష తీవ్రతను చవిచూడటానికి వీలుగా సత్యతిరస్కారుల శరీరం ఆ మేరకు చాలా పెద్దదిగా ఉంటుంది. సహీహ్ ముస్లిం ఉల్లేఖనంలో సత్య తిరస్కారి దవడ ఉహుద్ పర్వతమంత ఉంటుందని కూడా ఉంది. ఇవన్నీ సత్యాలు, వీటిని ముస్లింలు విధిగా విశ్వసించాలి. (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్)

1814 – حديث حارِثَةَ بْنِ وَهْبٍ الْخُزَاعِيِّ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ الْجَنَّةِ كُلُّ ضَعِيفٍ مَتَضَعِّفٍ، لَوْ أَقْسَمَ عَلَى اللهِ لأَبَرَّهُ أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ النَّارِ كُلُّ عُتُلٍّ جَوَّاظٍ مُسْتَكْبِرٍ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 68 سورة ن والقلم: 1 باب عتُل بعد ذلك زنيم

1814. హజ్రత్ హారిస్ బిన్ వహబ్ ఖుజాయి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“నేను మీకు స్వర్గవాసుల్ని గురించి చెప్పనా? అల్పుడని, నీచుడని లోకులు భావించే ప్రతి బలహీనుడు, నిస్సహాయుడు గనక అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచి ప్రమాణం చేస్తే అల్లాహ్ దాన్ని నిజపరుస్తాడు. నేను మీకు నరకవాసుల్ని గురించి చెప్పనా? జగడాలమారి, పిసినిగొట్టు, అహంకారి, గర్విష్ఠి అయిన ప్రతి వ్యక్తీ (నరకవాసియే). ”

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 68వ సూరా – ఖలమ్, 1వ అధ్యాయం – ఉతుల్లింబాద జాలిక జనీమ్)

1815 – حديث عَبْدِ اللهِ بْنِ زَمْعَةَ، أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، وَذَكَرَ النَّاقَةَ وَالَّذِي عَقَرَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: (إِذِ انْبَعَثَ أَشْقَاهَا) انْبَعَثَ لَهَا رَجُلٌ عَزِيزٌ عَارِمٌ مَنِيعٌ فِي رَهْطِهِ، مِثْلُ أَبِي زَمْعَةَ وَذَكَرَ النِّسَاءَ فَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ، يَجْلِدُ امْرَأَتَهُ جَلْدَ الْعَبْدِ، فَلَعَلَّهُ يُضَاجِعُهَا مِنْ آخِرِ يَوْمِهِ ثُمَّ وَعَظَهُمْ فِي ضَحِكِهِمْ مِنَ الضَّرْطَةِ، [ص:294] وَقَالَ لِمَ يَضْحَكُ أَحَدُكُمْ مِمَّا يَفْعَلُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 91 سورة والشمس: 1 باب حدثنا موسى بن إسماعيل

1815. హజ్రత్ అబ్దుల్లా బిన్ జమా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపన్యాసమిస్తుంటే విన్నాను. ఆయన (హజ్రత్ సాలిహ్ అలైహిస్సలామ్ గారి) ఒంటె సంగతి, దాని పొదుగును కోసి వేసిన వ్యక్తి సంగతి ప్రస్తావించారు. “ఆ జాతిలో అందరికన్నా బలవంతుడు దిగ్గున లేచాడు” (అషమ్స్ : 12) అనే సూక్తి పఠించి, ఆ ఒంటె పొదుగు కోసినవాడు ఆ జాతిలో అందరికన్నా బలాఢ్యుడు, పరమ దుర్మార్గుడు, జగడాలమారి, నోటి దురుసు గలవాడు” అని అన్నారు.

ఆ తరువాత ఆయన స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ “మీలో కొందరు మీ భార్యలను బానిసల్ని కొట్టినట్లు కొడ్తున్నారు. కాని అదే రోజు చివరి భాగం (రాత్రివేళ)లో ఆమెను తమ దగ్గర పడుకోబెట్టుకుంటున్నారు. (ఇది చాలా అనుచితమైన చర్య)” అని అన్నారు.

ఆ తర్వాత ఆయన జనానికి హితోపదేశం చేస్తూ “ఎవరి నుంచయినా (శబ్దంతో) అపానవాయువు వెడలినప్పుడు నవ్వడం చాలా తప్పు. తాను చేసే పనినే ఇతరులు చేస్తే దానికి నవ్వడమెందుకు?” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 91వ సూరా – అష్షమ్స్, 1వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయిల్)

1816 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: رَأَيْتُ عَمْرَو بْنَ عَامِرِ بْنِ لُحَيٍّ الْخُزَاعِيَّ يَجُرُّ قُصْبَهُ فِي النَّارِ، وَكَانَ أَوَّلَ مَنْ سَيَّبَ السَّوَائِبَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 9 باب قصة خزاعة

1816. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

నేను నరకంలో అమ్ర్ బిన్ ఆమిర్ బిన్ లుహయ్యి ఖుజాయీని చూశాను. అతను తన పేగులు లాక్కుంటున్నాడు. ఇతనే అందరికన్నా ముందు (అరేబియాలో) విగ్రహం పేరుతో మొక్కుబడి చేసి ఒంటెను వదిలే దురాచారాన్ని ప్రారంభించినవాడు.”

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 9వ అధ్యాయం – ఖిస్సతిఖుజాఅ)

1817 – حديث عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تُحْشَرُونَ حُفَاةً عُرَاةً غُرْلاً قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ، يَا رَسُولَ اللهِ الرِّجَالُ وَالنِّسَاءُ يَنْظُرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ فَقَالَ: الأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَهِمَّهُمْ ذَاكِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1817. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ “ప్రళయదినాన మానవులు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారిగా లేపబడతారు” అని తెలిపారు. నేనీ మాట విని “దైవప్రవక్తా! (ఆ స్థితిలో) స్త్రీలు పురుషులు ఒకర్నొకరు చూసుకుంటారా?” అని అడిగాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానికి సమాధానమిస్తూ “ఆ సమయంలో వారంతా తీవ్రమైన ఆపదకు లోనయి ఉంటారు. ఒకరివైపు మరొకరు చూసుకునే ఆలోచనే తట్టదు వారికి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1818 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: قَامَ فِينَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، فَقَالَ: إِنَّكُمْ مَحْشُورُونَ حُفَاةً عُرَاةً غُرْلاً (كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ) الآيَةَ وَإِنَّ أَوَّلَ الْخَلاَئِقِ يُكْسى يَوْمَ الْقَيَامَةِ إِبْرَاهِيمُ وَإِنَّهُ سَيُجَاءُ بِرِجَالٍ مَنْ أُمَّتِي فَيُؤْخَذُ بِهِمْ ذَاتَ الشِّمَالِ، فَأَقُولُ: يَا رَبِّ أُصَيْحَابِي فَيَقُولُ: إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ فَأَقُولُ كَمَا قَالَ الْعَبْدُ الصَّالِحُ: (وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ) إِلَى قَوْلِهِ (الْحَكِيمُ) قَالَ: فَيُقَالُ إِنَّهُمْ لَمْ يَزَالُوا مُرْتَدِّينَ عَلَى أَعْقَابِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1818. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లేచి మా ముందు ఉపన్యాసమిస్తూ “మీరు ప్రళయ దినాన లేపబడినప్పుడు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారయి ఉంటారు. దివ్య ఖుర్ఆన్లో – ‘మేము మానవుడ్ని మొదట్లో ఏ విధంగా పుట్టించామో తిరిగి అదే విధంగా చేస్తాము’ అని ఉంది. ప్రళయదినాన అందరికంటే ముందు బట్టలు హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)కు ధరింపజేయడం జరుగుతుంది” అని అన్నారు.

ఆ తరువాతఆయన ఇలా తెలియజేశారు .“ఆ రోజు నా అనుచర సమాజానికి చెందిన కొందరిని తీసుకొచ్చి ఎడమ పక్షం వారిలో చేర్చడం జరుగుతుంది. నేనప్పుడు ‘ప్రభూ! వీరు నా అనుచరులు కదా!’ అనంటాను. దానికి అల్లాహ్ ‘నీ తదనంతరం వీరు (ధర్మంలో లేని) ఎన్ని కొత్త కొత్త విషయాలు సృష్టించారో నీకు తెలియదు’ అనంటాడు. నేనీ మాట విని అల్లాహ్ పుణ్యదాసుడు (హజ్రత్ ఈసా-అలైహి) పలికిన పలుకులే పలుకుతాను”. ఆయన పలుకులు ఈ విధంగా ఉన్నాయి – “(ప్రభూ!) నేను వారి మధ్య ఉన్నంత వరకే నేను వారి మీద పర్యవేక్షకుడిగా ఉన్నాను. తమరు నన్ను వెనక్కి పిలిపించుకున్న తరువాత వారిపై తమరే పర్యవేక్షకులు. ఇప్పుడు తమరు వారిని శిక్షించదలచుకుంటే వారు తమరి దాసులే. ఒకవేళ వారిని క్షమిస్తే తమరు సర్వాధికారి, ఎంతో వివేకవంతులు.” (5:117, 118) ఆ తరువాత నాతో “(నీవు ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత) వీరు మతభ్రష్టులయి జీవితాంతం అదే స్థితిలో ఉండిపోయారు” అని అనబడుతుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1819 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يُحْشَرُ النَّاسُ عَلَى ثَلاَثِ طَرَائِقَ: رَاغِبِينَ رَاهِبِينَ وَاثْنَانِ عَلَى بَعِيرِ، وَثَلاَثَةٌ عَلَى بَعِيرٍ، وأَرْبَعَةٌ عَلَى بَعِير، وَعَشَرَةٌ عَلَى بَعِيرٍ وَيَحْشُرُ بَقِيَّتَهُمُ النَّارُ، تَقِيلُ مَعَهُمْ حَيْثُ قَالُوا، وَتَبِيتُ مَعَهُمْ حَيثُ بَاتُوا، [ص:296] وَتُصْبِحُ مَعَهُمْ حَيْثُ أَصْبَحُوا، وَتُمْسى مَعَهُمْ حَيْثُ أَمْسَوْا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1819. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“పునరుత్థాన దినాన మానవులు మూడు వర్గాలుగా చీలిపోతారు. ఒక వర్గంలో భయం, ఆశ కలిగిన వారు ఉంటారు. (రెండవ వర్గంలో) ఒక ఒంటె మిద ఇద్దరు, మరొక ఒంటె మిద ముగ్గురు, వేరొక ఒంటి మీద నలుగురు చొప్పున ఉంటారు. మిగిలిన (మూడో వర్గం) వారిని అగ్ని ఒక చోట సమీకరిస్తుంది. వారు మధ్యాహ్నం వేళ ఎక్కడయినా నడుం వాల్చితే ఈ అగ్ని కూడా వారితో పాటే ఉంటుంది. రాత్రివేళ వారు ఎక్కడయినా గడిపితే అప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. ఉదయం లేచేటప్పుడు కూడా వారిని వెన్నంటే ఉంటుంది. సాయంత్రం అయినప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. (అంటే వారు ఎక్కడికి పోయినా, ఏ స్థితిలో ఉన్నాసరే అగ్ని వారిని వెన్నాడటం మానదన్నమాట).”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1820 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَوْمَ يَقُومُ النّاسُ لِرَبِّ الْعَالَمِينَ، حَتَّى يَغِيبَ أَحَدُهُمْ فِي رَشْحِهِ إِلَى أَنْصَافِ أُذُنَيْهِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 83 سورة ويل للمطففين

1820. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

“మానవులు విశ్వ ప్రభువు సన్నిధిలో నిలబడే రోజు వారి పరిస్థితి చెమటలతో చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కొందరు తమ చెవుల సగభాగం వరకు తమ సొంత చెమటతోనే మునిగి ఉంటారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 83వ సూరా – వైలుల్లిల్ ముతఫ్ఫిఫీన్)

1821 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَعْرَقُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يَذْهَبَ عَرَقُهُمْ فِي الأَرْضِ سَبْعِينَ ذِرَاعًا، وَيُلْجِمُهُمْ حَتَّى يَبْلُغَ آذَانَهُمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 47 باب قول الله تعالى (ألا يظن أولئك أنهم مبعوثون ليوم عظيم)

1821. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

“ప్రళయదినాన మానవుల శరీరాల నుండి చెమట విపరీతంగా కారుతూ ఉంటుంది. ఆ చెమట నేల మీద డెబ్బె గజాల దాకా ప్రవహిస్తూ ఉంటుంది. వారు తమ నోళ్ళు, చెవుల దాకా చెమటలోనే మునిగి ఉంటారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 47వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అలా యజున్ను ఉలాయిక అన్నహమ్ మబ్ వూసూన లి యౌమిన్ అజీమ్)

1822 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَحَدَكمْ، إِذَا مَاتَ، عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالْعَشِيِّ إِنْ كَانَ مِنْ أَهْلِ الْجَنَّةِ، فَمِنْ أَهْلِ الْجَنَّةِ؛ [ص:297] وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ؛ فَيُقَالُ هذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللهُ يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 90 باب الميت يعرض عليه مقعده بالغداة والعشي

1822. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 90వ అధ్యాయం – అల్ మయ్యతి యూరజు అలైహి మఖ్ అదుహు బిల్ ఘదాతి వల్ అషియ్యి )

1823 – حديث أَبِي أَيُّوبَ رضي الله عنه قَالَ: خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ وَجَبَتِ الشَّمْسُ، فَسَمِعَ صَوْتًا فَقَالَ: يَهُودُ تُعَذَّبُ فِي قُبُورِهَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 88 باب التعوذ من عذاب القبر

1823. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం :-

“సూర్యాస్తమయం అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుంచి బయలుదేరారు. ఒక చోట ఆయన ఒక విధమైన భయంకర) ధ్వని విని “ఇది సమాధిలో ఒక యూదుడి నుండి వస్తున్న ధ్వని. అతను సమాధి యాతనఅనుభవిస్తున్నాడు” అని అన్నారు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 88వ అధ్యాయం – అత్తవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్ర్)

1824 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ الْعَبْدَ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتَوَلَّى عَنْهُ أَصْحَابُهُ، وَإِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ، فَيُقعِدَانِهِ فَيقُولاَنِ: مَا كُنْتَ تَقُولُ فِي هذَا الرَّجُلِ (لِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ) فَأَمَّا الْمُؤْمِنُ [ص:298] فَيَقُولُ: أَشْهَدُ أَنَّهُ عَبْدُ اللهِ وَرَسُولُهُ فَيُقَالُ لَهُ: انْظُرْ إِلَى مَقْعَدِكَ مِنَ النَّارِ، قَدْ أَبْدَلَكَ اللهُ بِهِ مَقْعَدًا مِنَ الْجَنَّةِ فَيَرَاهُمَا جَمِيعًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1824. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“మనిషి (మృతదేహం)ని సమాధిలో పెట్టి (పూడ్చి) అతని బంధుమిత్రులు వెళ్ళిపోతారు. అతనింకా వారి చెప్పుల శబ్దం వింటూ ఉండగానే అతని దగ్గరికి ఇద్దరు దైవదూతలు వస్తారు. వారతడ్ని లేపి కూర్చోబెట్టి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గురించి ప్రశ్నిస్తూ “ఇతడ్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడుగుతారు. అతను విశ్వాసి అయి ఉంటే “ఆయన అల్లాహ్ దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అంటాడు. అప్పుడు వారు అతనితో ఇలా అంటారు. : “ఇదిగో చూడు ఇది నీ (శాశ్వత) స్థానం కావలసిన నరకం. దీనికి బదులు అల్లాహ్ నీకిప్పుడు స్వర్గంలో నివాసస్థానం ప్రసాదించాడు” అని చెబుతారు. ఈ విధంగా అతను తన రెండు స్థానాలను చూసుకుంటాడు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్ )

1825 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أُقْعِدَ الْمُؤْمِنُ فِي قَبْرِهِ أُتِيَ، ثُمَّ شَهِدَ أَنْ لاَ إِله إِلاَّ اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَذلِكَ قَوْلُهُ (يُثَبِّتُ اللهُ الَّذِينَ آمَنُوا بَالْقَوْلِ الثَّابِتِ)
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1825. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు:

“విశ్వాసిని సమాధిలో పెట్టిన తరువాత అతని దగ్గరకు (ఇద్దరు దైవదూతలు) వస్తారు. అప్పుడు విశ్వాసి “అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్” అని అంటాడు. దివ్య ఖుర్ఆన్లోని “విశ్వసించిన వారికి అల్లాహ్ ఒక స్థిర వచనం ఆధారంగా ఇహపర లోకాలలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు” (ఇబ్రాహీమ్ – 27) అనే సూక్తికి వివరణ ఇదే.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్)

1826 – حديث أَبِي طَلْحَةَ، أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَمَرَ يَوْمَ بَدْرٍ بِأَرْبَعَةٍ وَعِشْرِينَ رَجُلاً مِنْ صَنَادِيدِ قُرَيْشٍ، فَقُذِفُوا فِي طَوِيٍّ مِنْ أَطْوَاءِ بَدْرٍ، خَبِيثٍ مُخْبِثٍ وَكَانَ إِذَا ظَهَرَ عَلَى قَوْمٍ أَقَامَ بِالْعَرْصَةِ ثَلاَثَ لَيَالٍ فَلَمَّا كَانَ بِبَدْرٍ، الْيَوْمَ الثَّالِثَ، أَمَرَ بَرَاحِلَتِهِ فَشُدَّ عَلَيْهَا رَحْلُهَا ثُمَّ مَشَى وَاتَّبَعَهُ أَصْحَابُهُ وَقَالُوا مَا نُرَى يَنْطَلِقُ إِلاَّ لِبَعْضِ حَاجَتِهِ حَتَّى قَامَ عَلَى شَفَةِ الرَّكِيِّ فَجَعَلَ يُنَادِيهِمْ بِأَسْمَائِهِمْ وَأَسْمَاءِ آبَائِهِمْ: يَا فُلاَنُ بْنَ فُلاَنٍ وَيَا فُلاَنُ بْنَ فُلاَن أَيَسُرُّكُمْ أنَّكُمْ أَطَعْتُمُ اللهَ وَرَسُولَهُ فَإِنَّا قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا، فَهَلْ وَجَدْتُمْ مَا وَعَدَ رَبُّكُمْ حَقًّا قَالَ: فَقَالَ عُمَرُ: يَا رَسُولَ اللهِ [ص:299] مَا تُكَلِّمُ مِنْ أَجْسَادٍ لاَ أَرْوَاحَ لَهَا فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ مَا أَنْتُمْ بِأَسْمَعَ لِمَا أَقُولُ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 8 باب قتل أبي جهل

1826. హజ్రత్ అబూ తలా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బద్ర్ యుద్ధం నాడు ఖురైష్ నాయకుల్లో ఇరవై నాలుగు మంది వ్యక్తుల (మృతదేహాల)ను బద్ర్ లోని ఒక పాడుబడిన బావిలో పడవేయమని ఆజ్ఞాపించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఏదైనా జాతి పై విజయం సాధించినప్పుడు ఆ ప్రాంతంలో మూడు రాత్రుల పాటు బస చేస్తారు. బద్ర్ యుద్ధం ముగిసిన మూడవ రోజు రాగానే ఆయన తన స్వారీని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. దానిపై జీను కట్టిన తరువాత ఎక్కి బయలుదేరారు అనుచరులు కూడా ఆయన వెంట బయలుదేరారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏదైనా పని మీద ఎక్కడికో వెళ్తున్నారని వారు భావించారు. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ పాడుబడిన బావి ఒడ్డుకు వెళ్ళి నిలబడ్డారు. ఆయన ఆ హతులను వారి, వారి తండ్రుల పేర్లతో సంబోధిస్తూ “ఫలానా కొడుకు ఫలానా! ఫలానా కొడుకు ఫలానా!! మీరు అల్లాహ్ కు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులయి ఉండి ఉంటే బాగుండేదన్న వాస్తవాన్ని మీరు ఇప్పుడైనా బాగా గ్రహించారా? మేము మాత్రం మా ప్రభువు మాకు చేసిన వాగ్దానం నెరవేరిందని గ్రహించాము. మరి మీ ప్రభువు మీకు చేసిన వాగ్దానం నెరవేరిందని మీరు తెలుసుకున్నారా?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని “దైవప్రవక్తా! మీరు ఆత్మలు లేని దేహాలతో మాట్లాడుతున్నారా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నేను చెబుతున్న దానిని ఈ శవాలు నీకంటే బాగా వింటున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 8వ అధ్యాయం – ఖత్ లి అబీజహల్)

1827 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَتْ لاَ تَسْمَعُ شَيْئًا لاَ تَعْرِفُهُ إِلاَّ رَاجَعَتْ فِيهِ حَتَّى تَعْرِفَهُ وَأَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حُوسِبَ عُذِّبَ قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ أَوَلَيْسَ يَقُولُ اللهُ تَعَالَى (فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا) قَالَتْ: فَقَالَ إِنَّمَا ذَلِكَ الْعَرْضُ، وَلكِنْ مَنْ نُوقِشَ الْحِسَابَ يَهْلِكْ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 35 باب من سمع شيئًا فراجع حتى يعرفه

1827. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- నాకు తెలియని విషయం గురించి నేనెప్పుడైనా వింటే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగి పూర్తిగా తెలుసుకుంటాను. (ఓ రోజు) ఆయన “ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే” అని అన్నారు.అప్పుడు నేను “(ఖుర్ఆన్లో) ‘అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది’ అని అల్లాహ్ సెలవిచ్చాడు కదా!” అని అన్నాను.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “దానర్థం లెక్క తీసుకోవడం కాదు. కర్మల పత్రం చూపడం మాత్రమే. దీనికి భిన్నంగా ఎవరిని నిలదీసి లెక్క తీసుకోబడుతుందో అతను సర్వనాశనమవుతాడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 35వ అధ్యాయం – మన్ సమిఆ షై అన్ ఫరాజఆ హత్తా యారిఫహు)

1828 – حديث ابْنِ عُمَرَ رضي الله عنهما، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا أَنْزَلَ اللهُ بِقَوْمٍ عَذَابًا، أَصَابَ الْعَذَابُ مَنْ كَانَ فِيهِمْ، ثُمَّ بُعِثُوا عَلَى أَعْمَالِهِمْ
__________
أخرجه البخاري في: 92 كتاب الفتن: 19 باب إذا أنزل الله بقوم عذابًا

1828. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“అల్లాహ్ ఏ జాతి పైనయినా శిక్ష విధించినపుడు ఆ జాతిలో ఉన్న వారందరిపై ఆ శిక్ష విరుచుకుపడుతుంది. (పుణ్యాత్ములు, పాపాత్ములు అంతా ఆ విపత్తుకు గురి అవుతారు). అయితే ప్రళయదినాన వారు తమ తమ కర్మలను బట్టి లేపబడతారు (వారికి వారి కర్మలను బట్టి పుణ్యఫలమో పాప ఫలమో లభిస్తుంది)”

(సహీహ్ బుఖారీ :- 92వ ప్రకరణం – ‘ఫితన్’, 19వ అధ్యాయం – ఇజా అన్జలల్లాహు బిఖౌమిన్ అజాబన్)

హషర్ మైదానంలో అల్లాహ్ కారుణ్యం | ఖుత్ బాతే నబవీ ﷺ

[డౌన్లోడ్ PDF]

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ
స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు“. (36 : 55) 

ఖుత్బాలో నేను పఠించిన ఆయత్ అర్థాన్ని మీరు విన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంత మంది వృద్ధులు వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “ఓ దైవ ప్రవక్తా! ఇస్లాం స్వీకరించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాని మేము మహా పాపాలు చేశాము. మా కర్మలపత్రాలు వాటివల్ల నలుపై పోయాయి. ఇప్పుడు ఇస్లాం స్వీకరించి ఏమి చేయమంటారు?” అప్పుడు పై ఆయత్ అవతరింపజేయ బడింది. ఇందులో అల్లాహ్ తన దాసులకు ఎంతో ఓదార్పును నమ్మకాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఇస్లాం మానవుని పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది. ఖుర్ఆన్ మజీద్ ఈ అంశానికి సంబంధించిన అనేక ఆయతులున్నాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. పాపాలు చేసి పశ్చాత్తాపంతో మరలే వారికి క్షమాభిక్ష పెట్టటం ఆయన సుగుణం. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు:

وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ

తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు“. (ఆలి ఇమ్రాన్ 3 : 135) 

పాపాల మన్నింపు, దైవ కారుణ్యం గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. పైన పఠించిన ఆయత్తో నేను చెప్పబోయే విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఒక మహోన్నతమైన ప్రవచనాన్ని బోధించ బోతున్నాను. అందులో ప్రళయదిన దృశ్యాలు మన ముందుకొస్తాయి. అల్లాహ్ ప్రళయ దినాన తనదాసుల పాపాలను ఎలా మన్నించి స్వర్గానికి చేరుస్తాడో కూడా మనకు బోధపడుతుంది. దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ దివ్య వచనాన్ని వినేముందు అల్లాహ్ దుఆ చేసుకోవాలి. “ఓ ప్రభూ! ప్రళయదినాన నీ కృపతో మమ్మల్ని మన్నించు” అని వేడుకోవాలి. అల్లాహ్ మనందరి పాపాలను మన్నించి నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపుగాక.. ఆమీన్. 

డెబ్బై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది …

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం: ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటఉండగా ఏదో వస్తువు క్రింద పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడాయన మమ్మల్ని ఉద్దేశించి, "ఇప్పుడు మీకు వినపడిన శబ్దం ఏమిటో తెలుసా?”అని అడిగారు. మేము,“అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు“ అని అన్నాం. “డెబ్బై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది. ఇప్పటివరకూ అది నరకం(కూపం)లో పడుతూనే ఉంది. ఇప్పుడే దాని అడుగు భాగానికి చేరుకుంది. ఇప్పుడు వినపడిన పెద్ద శబ్దం అదే!“ అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం) [రియాదుస్సాలిహీన్ : హదీస్ నెంబర్: 405] ముఖ్యాంశాలు: 1. నరక కూపమే డెబ్బై సంవత్సరాల లోతు ఉందంటే, అక్కడి శిక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి 2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల మహిమ వెల్లడౌతోంది. దైవప్రవక్తతో పాటు వాళ్ళు కూడా నరకంలో రాయి పడిన శబ్దం విన్నారు 3. మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం