ధర్మపరమైన నిషేధాలు – 9 : దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 9

9- దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు [1].

عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ قَالَ: خَرَجْنَا مَعَ رَسُولِ الله إِلَى حُنَيْنٍ وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ، ولِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا، ويَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ يُقَالُ لَهَا : ذَاتُ أَنْوَاطٍ ، قَالَ : فَمَرَرْنَا بِالسِّدْرَةِ ، فَقُلْنَا : يَا رَسُولَ الله! اجْعَلْ لَنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَهُمْ ذَاتُ أَنْوَاطٍ ، فَقَالَ رَسُولُ الله : (اللهُ أَكْبَرُ ، إِنَّهَا السُّنَنُ ، قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَتْ بنو إِسْرَائِيلَ: [اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ] {الأعراف 138} ، لَتَرْكَبُنَّ سُنَنَ مَنْ كَانَ قَبْلَكُمْ).

అబూ వాఖిద్ లైసి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైన్ యుద్ధానికి బయ- లుదేరాము. అప్పుడు మేము కొత్తగా ఇస్లాంలో చేరియుంటిమి. దారిలో ముష్రికులది ఒక రేగు చెట్టు ఉండింది. వారు శుభం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో దాని క్రింద కూర్చుండేవారు, తమ ఆయుధాలు దానికి తగిలించేవారు. దానిని ‘జాతు అన్వాత్’ అనేబడేది. మేము ఆ చెట్టు నుండి దాటుతూ, ‘ప్రవక్తా! వారికి ఉన్నటువంటి జాతు అన్వాత్ మాకు కూడా ఒక్కటి నిర్ణయించండి అని అన్నాము. ప్రవక్త చెప్పారు:

“అల్లాహు అక్బర్! ఇవే పద్ధతులు. నా ప్రాణం ఎవ్వని చేతులో ఉందో ఆయన సాక్షి! బనీ ఇస్రాఈల్ వారు ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్నటువంటి మాటే మీర-న్నారుః “మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు”. మూసా ఇలా అన్నాడు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు[. మీకు పూర్వికులు అవలంభించిన పద్ధతులు మీరూ అవలంభిస్తారు”. (అల్ మొఅజముల్ కబీర్ లిత్తబ్రానీ, సహీహ్ సునన్ తిర్మిజి 1771, ముస్నద్ అహ్మద్ 2/285).


[1]  శుభం పొందే రకాలు:

1- ధార్మిక ఆధారం మూలంగా శుభం కోరడం. ఉదాః అల్లాహ్ యొక్క గ్రంథ (పారాయణం చేసి). అందులో అభ్యంతరం లేదు.

2- స్పృహగల విషయాల ద్వారా. ఉదాః ధార్మిక విద్య. స్వయం తమ కొరకు లేదా ఇతరులకు దుఆ. విద్యగల పుణ్యపురుషుని విద్య ద్వారా, అతని వద్ద కూర్చుండి, లేదా అతని దుఆ ద్వారా. అంతేకాని అతని వ్యక్తిత్వం వల్ల అని కాదు.

3- షిర్క్ సంబంధమైన శుభం. ఇది సమాధులతో, మజారులతో కోరడం. వాటిలో ఏలాంటి శుభం లేదు. దానికి ధార్మిక, లౌకిక ఏ ఆధారము లేదు. ఇందులో కొన్ని రకాలు గలవుః

A.  ఆరాధనలో ఏ ఒక్క భాగమైన సమాధుల కోసం చేస్తే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ అవుతుంది.

B.  ఆ సమాధులు అతని మరియు అల్లాహ్ మధ్యలో మధ్యవర్తిగా అని నమ్ముతే ఇది కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్.

C.  అవి మధ్యవర్తిగా కావు, కేవలం శుభం ఉద్దేశం ఉంటే ఇది షిర్క్ సంబంధమైన బిద్అత్. ఇది విధిగా ఉన్న సంపూర్ణ తౌహీద్ కు వ్యతిరేకమైనది.  


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 15 : ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు [వీడియో]

బిస్మిల్లాహ్

[6:30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 15

15ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు.

عن عَبْدِ الله بْنِ عُكَيْمٍ أَبِي مَعْبَدِ الْجُهَنِيِّ قَال: قَالَ النَّبِيُّ : (مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيْهِ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ అబూ మఅబద్ అల్ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“ఏదైనా వస్తువు తగిలేసుకున్న వారు దాని వైపే అప్పగించబడుతారు”. (అంటే వారికి అల్లాహ్ రక్షణ, సహాయం ఉండదు).

(తిర్మిజి/ మా జాఅ ఫీ కరాహియతిత్ తాలీఖ్/ 2072, నిసాయి/ బాబుల్ హుక్ మి ఫిస్సహర/ 4011).

మరో ఉల్లేఖనంలో ఉంది:

(إِِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ )

“మంత్రం, తావీజులు, మరియు ‘తివల’ ఇవన్నియు షిర్క్”. ‘తివల’ అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం.

(అబూ దావూద్/ బాబు ఫీ తాలీఖిత్ తమాయిమ్/ 3883, ఇబ్ను మాజ/ బాబు తాలీఖిత్ తమాయిమ్/ 3530, అహ్మద్).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 20 : అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు [వీడియో]

బిస్మిల్లాహ్

[8:30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 20

20అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు. అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.

[ذَلِكُمُ اللهُ رَبُّكُمْ لَهُ المُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ، إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ وَيَوْمَ القِيَامَةِ  يَكْفُرُونَ بِشِرْكِكُمْ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ] {فاطر:13، 14}

ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయ- నను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు[. (ఫాతిర్ 35: 13,14).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 17 : బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు, దుఆ, ఇతర ఆరాధనలు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[7:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 17

17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُولُ الله : (لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని ఆయిష (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం కురువుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనస్థలం(మస్జిదులు)గా చేసుకున్నారు”. (బుఖారి/ అస్సలాతు ఫిల్ బీఅతి/ 436, ముస్లిం/ అన్నహ్ యు అన్ బినాఇల్ మసాజిద్ అలల్ ఖుబూర్…/ 531).

మరో ఉల్లేఖనంలో ఉంది:

(أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ).

“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).


[1]  సమాధి వద్ద నమాజు స్థితులు:

1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.

2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.

3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

మరణాంతరం జీవితం – పార్ట్ 02: మరణ యాతన, సమాధిలో ప్రశ్నోత్తరాలు, సమాధి శిక్షలు అనుగ్రహాలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతరం జీవితం – పార్ట్ 02 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 02. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:21 నిముషాలు]

ఋజుమార్గం టీవి  ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. “ఎవరికి చావు ఎలా వస్తుంది? “అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము.

అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే చావు ఎప్పుడైతే వస్తుందో, మరణదూతను మన కళ్లారా మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది. చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టం అవుతాయి. అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి. చనిపోయే ఏ మనిషి కూడా “నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను. ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి. విశ్వాస మార్గాన్ని అవలంబించండి. సత్కార్యాలు చేస్తూ పోండి మీరు” అని ఎవరూ కూడా చెప్పలేరు. తాను ఏ కష్టాలను భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించు కోవటానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల ఉన్న అతని బంధువులకు, మిత్రులకు ఏది చెప్పలేక పోతాడు. కానీ అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి, ఆ వివరాలు మనకు అల్లాహ్ ముందే మనకు ఎందుకు తెలియజేశాడు? ఎందుకంటే ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్క దిద్దుకోవాలి.

ఒకసారి సూరతుల్ మూమినూన్ లోని ఆయతును గమనించండి

حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా తిరిగి నన్ను ఇహలోకానికి మరోసారి పంపు.ఏ సత్కార్యాలు అయితే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను ఆ తిరిగి సత్కార్యాలు చేసుకుంటాను. తిరిగి నన్ను ఇహలోకంలోకి పంపు. అప్పుడు ఏమి సమాధానం వస్తుంది? కల్లా ముమ్మాటికి అలా జరగదు.ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు. కానీ అతని కోరిక ఎన్నటికీ పూర్తి కాదు. పునరుత్థాన దినం మరోసారి వారిని సజీవులుగా లేపబడేది. ఆరోజు వరకు వారి వెనక ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తెరలో వారు అక్కడే ఉంటారు. (సూరతుల్ మూమినూన్ 23:99-100)

చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది. ఆ విషయాలని అల్లాహ్ తెలిపాడు. మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

సూరత్ అష్షూరా ఆయత్ నెంబర్ 44 లో కూడా అల్లాహ్ తఆలా విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి.

 وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ

“దుర్మార్గులు, అవిశ్వాసులు, షిర్క్ చేసేవాళ్ళు, పాపాలు లో మునిగి ఉన్న వాళ్ళు శిక్షను చూసినప్పుడు వారు ఏమంటారో అప్పుడు మీరు చూసెదరు. ఏమి ఇహలోకానికి తిరిగి పోవడానికి ఏదైనా అవకాశం ఉందా? అనివారు అప్పుడు అడుగుతారు” (సూరత్ అష్షూరా 42:44)

కానీ ఎలాంటి అవకాశం ఏమి ఇవ్వడం జరగదు. ఈ సందర్భంలో చావు సమీపించిన సందర్భములో అల్లాహ్ కరుణలో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్  చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలియపరిచారు. సునన్ అబీ దావూద్ లోని హదీద్ లో ఇలా ఉంది: ఇహలోకంలో ఎవరి చివరి మాట “లా ఇలాహ ఇల్లల్లాహ్”అల్లాహ్ తప్ప వేరే సత్యఆరాధ్యుడు మరి ఎవ్వడు లేడు. ఈ సద్వచనం తన చివరి మాటలు అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితులు, బాధకరమైన సమయంలో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎవరికి గుర్తొస్తుందో అల్లాహ్ కే బాగా తెలుసు. కానీ ఇహ లోకంలో దాని గురించి కాంక్ష ఉంచిన వారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, అలాంటి వారికి అల్లాహ్ తఆలా ఆ సత్భాగ్యం ప్రసాదించగలడు.

ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో  సామాన్యంగా తీసుకెళ్ళి అంత క్రియలు అన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో ఎవరికి, ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం.

సమాధిలో పెట్టడం జరిగిన తరువాత ఒకవేళ అతను విశ్వాసుడు అయితే, పుణ్యాత్ముడు అయితే, సత్కార్యాలు చేసే వాడు అయితే, అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది. అతను లేచి కూర్చుంటాడు. అదే సమయంలో ఎప్పుడైతే అతను కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అప్పుడే ఇద్దరు దైవ దూతలు అతని వద్దకు వస్తారు. అతను అంటాడు పక్కకు జరగండి. నా అసర్ నమాజ్ నాకు ఆలస్యం అయిపోయింది నేను అసర్ నమాజ్ చేసుకుంటాను. వారు అంటారు, ఇది నమాజ్ చేసే సమయం కాదు. నమాజ్లు చేసే సమయం ఇహలోకంలో సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు మీరు సిద్దం కావాలి. నీ ప్రభువు ఎవరు? నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవాడివి? అని అంటే అతను విశ్వాసి కనుక రబ్బీ అల్లాహ్  నా ప్రభువు అల్లాహ్, నేను ఆయన్నే ఆరాధిస్తూ ఉంటిని అని అంటాడు. రెండవ ప్రశ్న అడుగుతాడు. నీ ధర్మం ఏది? ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటివి? అతడు అంటాడు, నా ధర్మం ఇస్లాం ధర్మం అని. తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది. మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని? అప్పుడు అతను అంటాడు: ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని. అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు. సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకి బహుశా ఈ మూడు ప్రశ్నలు తెలిసి ఉన్నాయి. కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ముస్నద్అ హ్మద్ ఇంకా వేరే హాదీస్ గ్రంధాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీద్ లతో రుజువైన విషయం. ఏంటి నాలుగో ప్రశ్న? నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానం నీకు ఎలా ప్రాప్తం అయింది? ఈ సరైన సమాధానం నువ్వు ఎలా తెలుసుకున్నావు? అప్పుడు అతడు అంటాడు, నేను అల్లాహ్ గ్రంధాన్ని చదివాను. దానిని విశ్వసించాను. అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్యరూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను. అందుగురించి నాకు జ్ఞానం ప్రాప్తం అయ్యింది అని అంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజు మనకు మనం ముస్లింలమని ఎంత సంతోషించినా ఖురాన్ జ్ఞానం పొందక ఉంటే, ఖురాన్ యొక్క విద్యనేర్చుకోకుండా ఉంటే, ఇస్లాం ధర్మజ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుండా ఉంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరైన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు. అల్లాహ్ అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక.

ప్రస్తుతం ఇప్పుడు నేను మీముందు విశ్వాసులు అయితే సత్కార్యం చేసే వారు అయితే ఏ మంచి సమాధానం ఇస్తారు అని వివరించాను. ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు, దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియ పరుస్తున్నాను. ఆ తరువాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి. ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు. అది తర్వాత మనం తెలుసుకుందాం ఇన్షాఅల్లాహ్. 

విశ్వాసికి ఏ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందో, అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా? ఇక రండి అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దుర్మార్గులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతి మానవుడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు? అనే విషయం తెలుసుకుందాం.

అవిశ్వాసి, కపట విశ్వాసులు, దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది. అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు. ఇద్దరు దేవదూతలు వస్తారు. “నీ ప్రభువు ఎవరు?” అని అతని అడుగుతారు. అయ్యో, అయ్యో, నాకు తెలియదు అని అంటాడు. “మీ ధర్మం ఏది?” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. “మీలో పంపబడిన ప్రవక్త ఎవరు” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత విషయం సహీహ్ బుఖారీ లో కూడా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? “నీవు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు? ఖురాన్ గ్రంధాన్ని పారాయణం ఎందుకు చేయలేదు? విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?” అని ఇనుప గదముతో తల మీద, మరొక హదీస్ లో స్పష్టంగా ఉంది, రెండు చెవుల మధ్యలో వెనుక భాగములో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది. ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద శబ్దంతో అతను అరుస్తాడు అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి అతని అరుపును వింటారు.” ఇక తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి.

సోదరులారా సోదరీమణులారా వింటున్న ఈ విషయాలు, వింటున్న మీరు, “అరే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు” అని ఎగతాళి చేసి విలువ నివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు. కానీ మన అందరం కూడా ఒక రోజు చనిపోయేది ఉంది. మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలుపడం జరుగుతుందో, సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది.

ఇక్కడ ఒక విషయం గమనించండి, సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరైన పద్ధతి. అందు గురుంచే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు, సమాధి శిక్షలు, సమాధిలో ఎలాంటి ప్రశ్నోత్తరాల జరుగుతాయి. సమాధి, సమాధి అని మాటిమాటికీ మనం అంటూ ఉంటాము. కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అయితే, క్రూర జంతువు వారిని తినేస్తే, లేదా సముద్రంలో వారు కొట్టుకుపోయినా లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగలకుండా వారు అలాగే హతమైనా, నాశనమైనా, ఏ విధంగా చనిపోయినా, ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది. ఆ తర్వాత శరీరం మిగిలి ఉండి ఉంటే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది. లేదా అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తన ఇష్టప్రకారం వేరే ఏదైనా ఒక శరీరం ఏర్పాటు చేసి ఆత్మను అందులో వేయవచ్చు, లేదా డైరెక్టుగానే ఆత్మతోనే ఈ ప్రశ్నోత్తరాలు కూడా జరపవచ్చు. ఈ ప్రశ్నోత్తరాలు జరగడం సత్యం. ఇందులో అనుమానానికి ఏ తావులేదు.

ఇక తరువాత సరైన సమాధానం ఇచ్చిన విశ్వాసి మరియు సత్కార్యాలు చేసేవారు, అలాంటి వాళ్లలో అల్లాహ్ మనల్ని కూడా చేర్చుగాక, వారికీ సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయి అంటే ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి. కానీ అల్లాహ్ దయ మీపై కలిగింది. అల్లాహ్ మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. తర్వాత స్వర్గం యొక్క కిటికీ తెరవడం జరుగుతుంది. అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ప్రతి ఒక్కరు స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి.”

ఆ తరువాత అల్లాహ్ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు: “నా ఈ దాసుని  కొరకు స్వర్గపు ద్వారాలు, స్వర్గపు కిటికీలు తెరవండి”. అక్కడి నుండి సువాసన వస్తూ ఉంటుంది. మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది మరియు “ఈ దాసుని కొరకు స్వర్గం యొక్క పడక అతని గురించి వేయండి.” అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి. స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి. అంతలోనే అతను చూస్తాడు, ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తూ ఉన్నాడు. అయ్యా! నీవు ఎవరివి? చాలా అందమైన ముఖముతో దగ్గరికి అవుతున్నావు మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు. అసలు నువ్వు ఎవరివి? అని అంటే ఆ వ్యక్తి అంటాడు, “నేను నీ యొక్క సత్కార్యాల్ని. ఇహలోకంలో నీవు ఏ సత్కార్యాలు అయితే చేశావో నన్ను అల్లాహ్ ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు. హాజరు పరిచాడు. నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రళయం సంభవించే వరకు ఆ తర్వాత మరోసారి అల్లాహ్ తఆలా ఈ సమాధుల నుండి లేపేవరకు నేను నీకు తోడుగా ఉండాలి”. ఇంతే కాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి. ఇన్షా అల్లాహ్ వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత మనం మీ ముందు తెలుపుతామని,

అయితే ఎవరైతే సమాధానం సరియైన విధంగా ఇవ్వరో, అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు గా ఉంటారో వారికి ఏం జరుగుతుంది? స్వర్గం వైపు నుండి ఒక కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగోండి స్వర్గం లో మీ స్థానం ఉండేది, కానీ మీరు సరైన సమాధానం ఇవ్వలేదు కనుక ఈ స్థానం మీకు లేదు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. నరకం నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. అక్కడి నుండి అగ్ని జ్వాలలు, దుర్వాసన, మంట, వేడి వస్తూ ఉంటుంది. మరియు ఆకాశం నుండి ఒక దుర్వార్త ఇచ్చే వారు ఇలా దుర్వార్త ఇస్తాడు, నా దాసునికి నరకం యొక్క పడక వేయండి. నరకం యొక్క కిటికీలు తెరవండి. అంతలోనే అతను చూస్తాడు, భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ చెడ్డ ముఖము కలవాడా, దుర్వాసనతో కూడుకొని ఉన్నవాడా, దూరమైపో ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొని వస్తున్నట్టు ఉన్నది. అతను అంటాడు, అవును నేను నీ దుష్కర్మల్ని. నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధలు ఇంకా పెంచడానికి అల్లాహ్ నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు.

మహాశయులారా ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించరో, దుష్కార్యాలు చేస్తూ ఉంటారో, ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడికడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి. వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి. ఈ విషయాలుఇన్షా అల్లాహ్ ముందు మనం తెలుసుకుందాం.

సమాధి శిక్షలు సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే ఈ సమాధి పరలోకం యొక్క మజిలీలలో మొదటి మజిలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని గురించి తెలిపారు: సమాధి, పరలోక మజిలీల లో మొట్టమొదటి మజిలీ. ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడు అంటే, ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే, దీని తర్వాత ఉన్న మజిలీల లో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది. మరి ఎవరైతే ఈ తొలి మజిలీలో గెలువరో, తొలి మజిలీలో పాస్ అవ్వరో ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో ఆ తరువాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన, కష్టతరమైన సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది.”

అందుగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నో సందర్భాల్లో సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క శరణుకోరండి అని మాటిమాటికీ చెబుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజుల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. వేరే సందర్భాలలో కూడా శరణుకోరుతూ ఉండేవారు. ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పేవారు.

అందుగురించి సోదరులారా సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహ లోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడ శిక్షలనుండి రక్షణ పొందగలుగుతామో వాటిని చేసుకొనే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తఆలా మనందరికీ సత్భాగ్యం  ప్రసాదించుగాక.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో, సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి? మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి? అనే విషయాలు తెలుసుకుందాము.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ  బరకాతుహు

పూర్తి భాగాలు క్రింద వినండి 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 10 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -10

1) సమాధిలో అడిగే 3 ప్రశ్నలు ఏమిటి?

A) నీ పేరు ఏమిటి ? / నీ వంశం ఏమిటి ? /  నీ మతం ఏమిటి  ?
B) నీ నమాజు ఏది? / నీ ఉపవాసం ఏది ? / నీ జకాత్ ఏది ?
C) నీ ప్రభువు ఎవరు ? /నీ ధర్మం ఏమిటి ? / నీ ప్రవక్త ఎవరు ?

2) జిన్నాతులు దేనితో సృష్టించబడ్డాయి ?

A) మట్టితో
B) అగ్ని జ్వాలలతో
C) గాలితో

3) పుట్టే ప్రతీ శిశువు ఏ విశ్వాసంతో  పుడుతుంది?

A) ఏక దైవారాధనా  విశ్వాసం
B) తల్లిదండ్రుల యొక్క విశ్వాసం
C) బహు దైవారాధన యొక్క విశ్వాసం

క్విజ్ 10. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 9:40]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!

బిస్మిల్లాహ్

grave

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!

అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.

ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.

ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్‌లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్‌, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.

ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.

మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!

అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!

శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!

“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)

ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!

మనోమస్తిష్కాలు కలవారలారా!

ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!

వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు, హజ్‌, ఉమ్రా, ఖుర్‌ఆన్‌ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్‌ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.

కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!

బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త  హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!

ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:

“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),

మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…

ఆయన పిలుపుకు హాజరు పలికి…

ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!

వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్‌.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ 
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

మృతునికి అతని అసలు స్థానం స్వర్గం లేక నరకం చూపబడుతుంది

బిస్మిల్లాహ్

1822. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్‌ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్‌, 90వ అధ్యాయం – అల్‌మయ్యతి యూరజు అలైహి మఖ్‌ అదుహు బిల్‌ ఘదాతి వల్‌ అషియ్యి)

[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]