రమజాన్ మాసపు ఆఖరి పది రోజులు – జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం)

[డౌన్ లోడ్ PDF]

1) ఆఖరి పది రోజులలో వీలైనంత ఎక్కువగా ఆరాధన చేయాలి.
2) ఏతెకాఫ్.
3) రాత్రి నమాజ్ (ఖియాముల్లైల్)
4) లైలతుల్ ఖద్ర్.
5) సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం)
6) పండుగ మర్యాదలు

ఇస్లామీయ సోదరులారా!

రమజాన్ మాసపు ఆఖరి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే వీటిలో వెయ్యి నెలల ఆరాధన కన్నా శ్రేష్టమైన ఒక రాత్రి కూడా వుంది. అందుకే ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి ప్రయత్నించాలి, వీలైనంత ఎక్కువగా దుఆ చేయాలి మరియు తమ పాపాలకు గాను వీలైనంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి.

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: “(రమజాన్ మాసపు) ఆఖరి పది రోజులు ఆరంభం కాగానే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాత్రంతా జాగారం చేసేవారు, తన ఇంటి వారిని కూడా మేల్కొలిపే వారు, ప్రత్యేకంగా నడుం బిగించి ఎంతో ఎక్కువగా ఆరాధించేవారు”. (బుఖారీ: 2024, ముస్లిం: 1174)

అలాగే, ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా కూడా సెలవిచ్చారు. “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆఖరి పది రోజుల్లో ఆరాధించినట్లు మరెప్పుడూ ఆరాధించేవారు కారు”. (ముస్లిం: 1175)

కనుక, మనం కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణను ముందుంచి ప్రత్యేకంగా నడుంబిగించి వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి. ఎంతో శుభకరమైన ఈ వ్యవధిని ఏ మాత్రం వ్యర్థం చేయకుండా, దీని ప్రతిక్షణం ప్రయోజనం పొందటానికి ప్రయత్నించాలి.

ఆఖరి పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధించడానికి ఉత్తమమైన స్వరూపం ఏమిటంటే, వీటిని ఏతెకాఫ్ లో గడపడం. ఎందుకంటే, ఏతెకాఫ్ ఉద్దేశ్యం ప్రాపంచిక వ్యవహారాల నుండి తెగతెంపులు చేసుకొని, పూర్తిగా అల్లాహ్ వైపునకు మరలి, ఆయనను సంతృప్తి పరచి, ఆయన సాన్నిధ్యం పొందటానికి మనస్సును కేంద్రీకరించడం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఈ పది రోజుల్లో ఏతెకాఫ్ లో గడిపేవారు.

ఆయేషా (రదియల్లాహు అన్హా) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను మరణించే వరకు రమజాన్ మాసపు పది రోజులు ఏతెకాఫ్ లో గడిపేవారు. ఆ తర్వాత ఆయన సతీమణులు ఏతెకాఫ్ లో కూర్చునేవారు”. (బుఖారీ: 2026, ముస్లిం: 1172)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతి రమజాన్ లో 10 రోజులు ఏతెకాఫ్ లో గడిపేవారు. కానీ, తాను మరణించిన సంవత్సరంలో 20 రోజులు ఏతెకాఫ్ లో గడిపారు”. (బుఖారీ: 2044)

అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ను అనుసరిస్తూ ముస్లిములు కూడా ఆఖరి పది రోజులు ఏతెకాఫ్ లో గడపాలి. తద్వారా ప్రాపంచిక వ్యవహారాల నుండి దూరంగా వుంటూ కేవలం అల్లాహ్ వైపునకు మనస్సును కేంద్రీకరించవచ్చు. ఎల్లప్పుడూ ఆయన స్మరణలో గడపవచ్చు, దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తూ దాని గురించి ఆలోచించి హితబోధను స్వీకరించవచ్చు, తమ పాపాలకు గాను మనస్ఫూర్తిగా తౌబా చేయవచ్చు. మాటిమాటికీ అల్లాహ్ ముందు ఏడుస్తూ, కన్నీళ్ళు పెట్టుకొని ఇహపరలోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ ను అర్థించవచ్చు.

ఏతెకాఫ్ లో వున్న వ్యక్తి ప్రాపంచిక విషయాలు అటుంచి, ధార్మిక వ్యవహారాల నిమిత్తం కూడా బయటకు వెళ్ళకుండా వుండాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప. ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: “ఏతెకాఫ్ లో వున్న వ్యక్తికి సున్నత్ ఏమటంటే, అతను రోగులను పరామర్శించడానికి వెళ్ళకూడదు. జనాజా కోసం వెళ్ళకూడదు, భార్యను ముట్టుకోకూడదు మరియు సంభోగించకూడదు. కేవలం గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప ఏ పని కోసం వెళ్ళకూడదు”. (అబూ దావూద్ : 2473, సహీ అల్బానీ)

ఏతెకాఫ్ లో వున్నప్పుడు ఫర్జ్ ఆచరణలతో పాటు నఫిల్ ఆరాధనలు కూడా వీలైనంత ఎక్కువగా చేస్తూ వుండాలి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు – ఏ వ్యక్తి అయినా నా మిత్రునితో శతృత్వం కలిగి వుంటాడో నేనతనితో యుద్ధ ప్రకటన చేస్తాను. నా దాసుడు తనపై విధి (ఫర్జ్) గా విధించబడిన వాటిని ఆచరిస్తూ నా సాన్నిధ్యాన్ని ఎక్కువగా పొందగలుగుతాడు. (అంటే ఫర్జ్ ద్వారా నా సాన్నిధ్యాన్ని పొందడం నాకెంతో ఇష్టం). ఇంకా ఐచ్ఛిక (నఫిల్) ఆరాధనల ద్వారా కూడా నా సాన్నిధ్యాన్ని పొందుతూ వుంటాడు. చివరికి నేను అతన్ని ప్రేమిస్తాను. నేనతన్ని ప్రేమించడం మొదలు పెట్టాక, అతను వినే చెవినై పోతాను, అతను చూసే కళ్ళయిపోతాను, అతను పట్టుకొనే చెయ్యినైపోతాను, అతను నడిచే కాళ్ళయి పోతాను (అంటే అతని శరీర అవయవాలన్నిటినీ నా విధేయతకు అనుగుణంగా మార్చుతాను). తదుపరి అతను ఏ విషయం గురించి అయినా అర్థిస్తే నేనతనికి అనుగ్రహిస్తాను. ఒకవేళ అతను నా శరణు కోరుకుంటే నేనతనికి నా శరణు ప్రసాదిస్తాను.” (బుఖారీ: 6502)

అందుకే ఏతెకాఫ్ లో వున్నప్పుడు ఫర్జ్ నమాజులతో పాటు ప్రత్యేకించి నఫిల్ నమాజులు కూడా చదవాలి. అంతేకాక, ఏతెకాఫ్ లో లేని వ్యక్తులు కూడా ఈ పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా నఫిల్ ఆరాధనలు చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – నఫిల్ నమాజులు కూడా స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా నిరూపించ బడిన వాటిని, ఉదా॥కు ఫర్జ్ నమాజుకు ముందు దాని తర్వాతి సున్నతులు, చాప్త్ నమాజు మరియు రాత్రి నమాజు వగైరాలను చేయాలి.

ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఒక ముస్లిం దాసుడు ప్రతి రోజు అల్లాహ్ సంతృప్తి కొరకు 12 రకాతులు నఫిల్ (ఫర్జ్ కాదు) ఆచరిస్తాడో అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు లేదా అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించబడుతుంది”.

ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఇలా సెలవిచ్చారు- ‘నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటి నుండి ఈ 12 రకాతుల గురించి విన్నప్పట్నుండి ఎప్పుడూ వాటిని వదలలేదు’. (ముస్లిం: 728)

ఈ 12 రకాతుల వివరణ సునన్ తిర్మిజీలో వుంది. ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా రేయింబవళ్ళలో 12 రకాతులు గనక చదివితే అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించ బడుతుంది. జొహర్కు ముందు 4 మరియు తర్వాత 2, అలాగే మగ్రిబ్ తర్వాత 2, ఇషా తర్వాత 2 మరియు ఫజర్ కు ముందు 2 రకాతులు”. (తిర్మిజి: 415, సహీహ్ – అల్బానీ)

ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: ‘ఏ వ్యక్తి అయినా జొహర్కు ముందు 4 రకాతులు మరియు తర్వాత 4 రకాతులు ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా చేస్తూ వుంటాడో అల్లాహ్ అతనికి నరకాగ్నిని నిషేధం చేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ : 6/326, అబూ దావూద్ : 1269, తిర్మిజి: 427, నసాయి: 1814 ఇబ్నె మాజా : 1160, సహీహ్ -అల్బానీ)

అలాగే, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “అసర్ కు ముందునాలుగు రకాతులు చదివే వ్యక్తిపై అల్లాహ్ కరుణించుగాక!”.(అబూ దావూద్: 1271, తిర్మిజి: 430, సహీహ్ -అల్బానీ)

ఫర్జ్ కు ముందు, దాని తర్వాత సున్నతులతో పాటు చాష్త్ నమాజ్ను కూడా చదవాలి. దీని మహత్యం ఎంతో వుంది. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఏ వ్యక్తి అయినా ఫజర్ నమాజును సామూహికంగా ఆచరించి, ఆపై అక్కడే కూర్చొని సూర్యోదయం అయ్యే వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ తదుపరి రెండు రకాతులు చదివితే అతనికి సంపూర్ణ హజ్ మరియు ఉమ్రాల పుణ్యం దొరుకుతుంది”. (తిర్మిజీ: 586, సహీహ్ అల్బానీ)

అలాగే, అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మీలో ప్రతి ఒక్కరూ, ప్రతి రోజు (మీ శరీరం లోని) కీళ్ళన్నింటికిగాను ఒక్కో దానం చేయడం తప్పనిసరి. ఇలా, ప్రతి ‘సుబహానల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘అల్హమ్దులిల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘లాయిలాహ ఇల్లల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘అల్లాహు అక్బర్’ ఒక దానం. అలాగే మంచిని ఆజ్ఞాపించడం ఒక దానం, చెడు నుండి వారించడం ఒక దానం. ఇక చాష్త్ యొక్క 2 రకాతులు వీటన్నింటి (కీళ్ళు) తరఫు నుండి సరి పోతాయి.” (ముస్లిం: 720)

బరీరా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ప్రతి వ్యక్తికీ 360 కీళ్ళు వున్నాయి. (ప్రతి రోజూ) అతనిపై తప్పనిసరిగా వున్న విషయం ఏమిటంటే, ప్రతి యొక్క కీలుకు గాను ఒక దానం చేయాలి”. దీనిపై సహాబాలు, ఓ దైవ ప్రవక్తా! అంత శక్తి ఎవరికుంది? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “మస్జిద్లో వేయబడిన ఉమ్మిని పూడ్చేయండి, మార్గంలో అడ్డుగా వున్న వస్తువును తొలగించండి. ఒకవేళ మీకిది కుదరకపోతే, చాష్త్ యొక్క 2 రకాతులు వీటికై సరిపోయతాయి”. (అబూ దావూద్: 5242, సహీహ్ – అల్బానీ)

ఫర్జ్ కు ముందు మరియు తర్వాత సున్నత్లు, చాష్త్ నమాజుతో పాటు రాత్రి నమాజు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఇలాగే చేసేవారు.

అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు రమజాన్ మాసపు ఉపవాసాలున్నాం. ఈ వ్యవధిలో కేవలం ఏడు రోజులు మిగిలి వున్నంత వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఖియాం చేయించలేదు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) 23వ రాత్రి ఖియాం చేయగా, మేము కూడా ఆయనతో పాటు ఖియాం చేశాం. దీనితో ఆయన మూడింట ఒక వంతు రాత్రి గడిచే వరకు సుదీర్ఘంగా (ఖురాన్) పారాయణం చేశారు. తదుపరి, 24వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 25వ రాత్రి, అర్థరాత్రి గడిచే వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేశారు. దీనితో నేను- ఓ దైవప్రవక్తా! మీరు ఈ రోజు రాత్రంతా ఖియాం చేస్తే బాగుండేది! అని అన్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ, ‘ఏ వ్యక్తి అయినా, ఇమామ్ తన ఖియాం పూర్తి చేసుకొనే వరకు అతనితో పాటు ఖియాం చేస్తే అతనికి రాత్రంతా ఖియాం చేసినంత పుణ్యఫలం లిఖించబడుతుంది’ అని వివరించారు. తదుపరి 26వ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 27వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో పాటు ఖియాం చేశారు. తన సతీమణులను కూడా (మస్జిద్కు) తీసుకొచ్చారు. (ఆ రాత్రి) ఆయన ఎంత సుదీర్ఘంగా ఖియాం చేసారంటే, సహరీ సమయం గడిచిపోతుందేమోనని మాకు అనుమానం కలిగింది. (తిర్మిజీ: 806, అబూ దావూద్: 1375, నసాయి: 1605, ఇబ్నె మాజ: 1327, సహీహ్ -అల్బానీ)

ఇలాగే, నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కూడా ఇలా ఉల్లేఖించారు: “మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి 23వ రాత్రి మూడింట ఒక వంతు ఖియాం చేశాం. తదుపరి 25వ రాత్రి అర్థరాత్రి వరకు చేశాం. ఇక 27వ రాత్రి ఎంత సుదీర్ఘంగా ఖియాం చేసామంటే- బహుశా ఈ రోజు సహరీ భుజించలేమేమో అని మాకు అనుమానం కలిగింది“. (నసాయి: 1606, సహీహ్ -అల్బానీ)

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాత్రి నమాజ్ (ఖియాములైల్), అంటే ఏదైనా ప్రత్యేక నమాజు కాదు, తరావీహ్ నమాజు కూడా రాత్రి నమాజే. అందుకే ఆఖరి పది రోజులో తరావీహ్ నమాజును సుదీర్ఘంగా చేయాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా సహాబాలకు 23, 25 మరియు 27వ రాత్రులలో సుదీర్ఘంగా నమాజు చేయించారు.

ఖుర్ఆన్ మరియు హదీసులలో రాత్రి నమాజు ఔన్నత్యాన్ని ఎంతగానో వివరించబడింది. దైవభీతి పరుల లక్షణాలను వివరిస్తూ అల్లాహ్ ఖుర్ఆన్ ఇలా సెలవిచ్చాడు:

كَانُوا قَلِيلا مِنَ الَّيْلِ مَا يَهْجَعُونَ وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَO
“వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి గడియలలో క్షమాపణకై (అల్లాహ్ ను) వేడుకునేవారు”. (జారియాత్ : 17, 18)

అలాగే ఇలా సెలవిచ్చాడు:

تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَهُمْ يُنْفِقُونَ
فلا تَعْلَمُ نَفْسٌ مَا اخْفِى لَهُمْ مِنْ قُرَّةٍ أَعْيُنٍ جَزَاء بِمَا كَانُوا يَعْمَلُونَ
“వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా వుంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చు పెడతారు. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్ళకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచి పెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు”. (సజ్దా: 16, 17)

అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా విచ్చేసినప్పుడు, ఆయన నోటి నుంచి నేను విన్న మొట్టమొదటి హదీసు ఇది- “ప్రజలారా! సలామ్ ను వ్యాపింపజేయండి, ఆకలి గొన్న వారికి అన్నం పెట్టండి, బంధుత్వాన్ని కొనసాగించండి, ప్రజలు నిద్రపోయే సమయంలో మీరు నమాజ్ చేయండి. (మీరు గనక ఇలా చేస్తే) ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశించవచ్చు”.(ఇబ్నెమాజ:1334, 3251, తిర్మిజీ: 2485, 1984, అస్సహీహ: 569)

అబూ మాలిక్ అక్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “స్వర్గంలో – బయటి దృశ్యాలు లోపలి నుండి, లోని దృశ్యాలు బయటికి కనబడే ఎంతో ఉన్నతమైన గదులు వున్నాయి. అల్లాహ్ వీటిని అన్నం పెట్టే వాడికి, మృదువుగా మాట్లాడే వాడికి, ఏకధాటిగా ఉపవాసాలు పాటించే వాడికి, ప్రజలు నిద్రపోయే సమయంలో నమాజ్ చదివే వాడికి ప్రసాదిస్తాడు”. (అహ్మద్: 5/343, ఇబ్నె హిబ్బాన్: 641, తిర్మిజీ: 2527, సహీహ్ అల్ జామి 2119)

ఈ ఆయతులు మరియు హదీసులను దృష్టిలో వుంచుకొని ఆఖరి పది రోజుల్లో ప్రత్యేకంగా ఖియాం చెయ్యాలి. అంతేగాక, రాత్రి చివరి ఘడియలలో ప్రత్యేకించి ప్రార్థిస్తూ వుండాలి. ఎందుకంటే ప్రార్థనలు స్వీకరించబడే సమయం అది.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఎంతో శుభవంతుడు, ఉన్నతుడూ అయిన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు భూలోకపు ఆకాశం వైపునకు అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు- నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్ధనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకునేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను“. (బుఖారీ: 1145, 6321, 7494, ముస్లిం: 758)

ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది. ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.

ఇస్లామీయ సోదరులారా!

రమజాన్ మాసపు ఆఖరి 10 రోజుల ప్రాధాన్యతకు గల మరో ముఖ్య కారణమేమిటంటే, వీటిలోనే 1000 నెలల ఆరాధన కన్నా శ్రేష్ఠమైన ఆరాధన గల రాత్రి వస్తుంది. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భువికి) దిగి వస్తారు. ఆ రాత్రి ఆసాంతం శాంతియుతమైనది- తెల్లవారే వరకూ (అది వుంటుంది).” (ఖద్ర్ సూరా)

ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – లైలతుల్ ఖద్ర్ ఆరాధన వెయ్యి నెలలు, అంటే 83 సం॥ల 4 నెలల ఆరాధన కన్నా మేలైనది. ఒక్క రాత్రి ఆరాధనకు గాను 83 సం॥ల 4 నెలల ఆరాధన కన్నా ఎక్కువ పుణ్యఫలాన్ని ప్రసాదించడం అనేది నిస్సందేహంగా అల్లాహ్ ప్రసాదించిన మహానుగ్రహాలలో ఒకటి.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా విశ్వాసి అయివుండి, పుణ్యఫలాన్ని ఆశిస్తూ లైలతుల్ ఖద్ర్ లో ఖియాం చేస్తాడో అతని గత పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ: 2014, ముస్లిం: 760)

ఈ రాత్రి ఎప్పుడొస్తుంది? దీనికి సంబంధించి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. క్లుప్తంగా మేము కొన్నింటిని మీకు వివరిస్తాం.

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసంలో మధ్యలోని పదిరోజులు (11 నుండి 20 వరకు) ఏతెకాఫ్ లో కూర్చునేవారు. ఇలా 21వ తేదీ రాగానే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయనతో పాటు ఏతెకాఫ్ లో కూర్చున్న వారు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇలాగే 21వ రాత్రి వచ్చింది. కానీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏతెకాఫ్ లోనే కూర్చుని, ప్రజలను సంబోధిస్తూ అల్లాహ్ తలచిన ఉపదేశాన్ని, ఆజ్ఞలనువివరించారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. నేను ఈ మధ్యలోని 10 రోజులు ఏతెకాఫ్ లో గడిపాను. కానీ ఆఖరి 10 రోజులు ఏతెకాఫ్ లో గడపడం సరైనదని నా కనిపించింది. అందుకే నాతో పాటు ఏతెకాఫ్ లో కూర్చున్నవారు అలాగే ఏతెకాఫ్ ను పాటించండి. నాకు ఈ రాత్రి (లైలతుల్ ఖద్ర్) కలలో చూపించడం జరిగింది. ఆ తర్వాత మరిపింప జేయడం జరిగింది. అందుకే మీరిక దానిని ఆఖరి పది రోజులలో అన్వేషించండి. వీటి బేసి సంఖ్యల రాత్రులలో దీనిని పొందటానికి ప్రయత్నించండి. నేనింకా (కలలో) – తడిగా వున్న నేలపై నేను సజ్దా చేయడం చూశాను. ఆ రోజు రాత్రి (21వ రాత్రి) ధారాపాతంగా వర్షం కురిసింది. చివరికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసే స్థలం వద్ద కూడా పైకప్పు నుండి చినుకులు రాలిపడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదయం నమాజు ముగించాక ఆయన నుదుటిపై మట్టి వుండడం నేను కళ్ళారా చూశాను.(బుఖారీ: 2016, ముస్లిం: 1161)

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ రాత్రిని గూర్చి వివరించడం జరిగింది, కానీ తదుపరి దానిని మరిపింపజేయడం జరిగింది. దీనికి గల కారణం మరో హదీసులో వివరించబడింది.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి గురించి సహాబాలకు వివరించడానికి వస్తున్నప్పుడు, ఇద్దరు ముస్లిములు (ఏదో విషయంలో గొడవ పడుతున్నారు- ఈ తరుణంలోనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మరిపింపజేయడం జరిగింది. (బుఖారీ: 2023)

బహుశా ఈ రాత్రిని మరిపింపజేయడం వెనుక మరొక మర్మం కూడా దాగి వుండవచ్చు. అదేమిటంటే, అల్లాహ్ దాసులు ఆయన సాన్నిధ్యాన్ని మరియు ఈ రాత్రిని పొందడానికి వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి అని – వాస్తవం అల్లాహ్ కే తెలుసు.

అలాగే, ఈ హదీసు ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే, లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి పది రోజుల్లోని బేసి రాత్రులలో ఒక రాత్రి వస్తుంది. అలాగే, తెలిసిన ఇంకొక విషయమేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఇది ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రులలో వస్తుందని ప్రకటించిన సం॥లో ఇది 21వ రాత్రి వచ్చింది. అలాగే ఈ హదీసు ద్వారా లైలతుల్ ఖద్ర్క సంబంధించిన ఒక సూచన కూడా తెలిసింది. అదేమిటంటే, వర్షం కురవడం.

ఈ సూచన మరో హదీసు ద్వారా కూడా వివరించబడింది. అబ్దుల్లా బిన్ అనీస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు లైలతుల్ ఖద్ర్ ను చూపించడం జరిగింది, తదుపరి మరిపింపజేయడం జరిగింది. దాని ఉదయం నేను తడి నేలలో సజ్దా చేయడం కలలో చూశాను”. (ముస్లిం: 1168)

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలలో కొందరు లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి 7 రోజుల్లో వుండడం కలలో చూశారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మీ కలలన్నీ ఒకేలా వున్నాయని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, ఈ రాత్రి ఆఖరి ఏడు రాత్రుల్లో ఒకటి. అందుకే మీలో ఎవరు ఈ రాత్రిని పొందగోరుతాడో అతను దీనిని ఆఖరి ఏడు రాత్రుల్లో పొందటానికి ప్రయత్నించాలి”. (బుఖారీ: 2015, ముస్లిం: 1165)

ఈ రెండు హదీసులూ మరియు వీటితోపాటు ఇతర ఎన్నో హదీసుల ద్వారా నిరూపించబడేదేమిటంటే, లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రుల్లో వస్తుంది. మరి కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలిసిందేమిటంటే – ఈ బేసి రాత్రులలో, 27వ రాత్రి వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.

జర్ బిన్ హబీష్ కథనం: నేను ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో సంవత్సరమంతా ఖియాం చేసేవారే లైలతుల్ ఖద్ర్ ను పొందగలుగుతారని ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నారని చెప్పాను. దీనిపై ఆయన, అల్లాహ్ ఆయనను కరుణించుగాక! బహుశా ఆయన ఉద్దేశ్యం, కేవలం ఒకే రాత్రిని నమ్ముకొని వుండకపోవడం కావచ్చు. అంతేకానీ, ఈ రాత్రి రమజాన్ మాసంలో వస్తుందని ఆయనకు బాగా తెలుసు. అది కూడా ఆఖరి పది రోజుల్లో, 27వ రాత్రి. తదుపరి ఆయన ఒట్టు పెట్టుకొని మరీ ఇది 27వ రాత్రి వస్తుందని చెప్పారు.

జర్ బిన్ హబీష్ కథనం: నేను ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) తో, మీరు ఇలా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాను. ఆయన జవాబిస్తూ- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు వివరించిన దాని సూచన ఆధారంగానే నేనిది చెపుతున్నాను. ఆ సూచన ఏమిటంటే, ఆ రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయం సూర్యుడు, కిరణాల తీవ్రత లేకుండానే ఉదయిస్తాడు”. (ముస్లిం)

ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లైలతుల్ ఖద్ర్ గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చారు: “లైలతుల్ ఖద్ర్ 27వ రాత్రి వుంటుంది”. (అబూ దావూద్: 1386, సహీహ్-అల్బానీ)

ఏది ఏమైనా, ఈ హదీసులన్నింటినీ పరికించడం ద్వారా తెలిసేదేమి టంటే, లైలతుల్ ఖద్ర్ ను పొందడానికి, ఆఖరి పది రోజుల్లోని బేసి రాత్రులన్నింటి లోనూ ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి 27వ రాత్రి. ఈ రాత్రులలో వీలైనంత ఎక్కువగా ఈ దుఆ చేయాలి: “ఓ అల్లాహ్! నిశ్చయంగా నీవు ఎంతగానో క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడేవాడివి. కనుక నన్ను కూడా క్షమించు”, ఎందుకంటే, అయిషా (రదియల్లాహు అన్హా) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఈ రాత్రి లైలతుల్ ఖద్ర్ రాత్రి అని నాకు గనక తెలిస్తే నేనేమని ప్రార్థించాలి అని అడిగినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఈ దుఆ నే పఠించమని చెప్పారు. (తిర్మిజి: 3513, ఇబ్నెమాజ: 385, సహీహ్ – అల్బానీ)

అల్లాహ్ ను వేడుకొనే దేమిటంటే, ఆయన మనందరికీ ఆఖరి పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధించే మరియు లైలతుల్ ఖద్ర్న పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక!

ఇస్లామీయ సోదరులారా!

ఈ శుభప్రద మాసపు ఆదేశాలలోని ఒక ఆదేశం ఏమిటంటే, ఈ నెల ముగియడానికి ముందు ఫిత్రా దానం చేయాలి. దీనిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫర్జ్ (విధి)గా ఖరారు చేశారు.

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫిత్రా దానాన్ని ఫర్జ్ చేసారు. ఖర్జూరం లేదా యవలు(జౌ) ఒక ‘సా’ అంత. బానిస మీద, స్వతంత్రుని మీద, పురుషుని మీద, స్త్రీ మీద, ముస్లిములలోని ప్రతి చిన్నా పెద్ద- అందరిపై దీనిని ఫర్జ్ ఖరారు చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని, పండుగ నమాజు కోసం ప్రజలు బయలు దేరడానికి ముందుగా చెల్లించాలని ఆజ్ఞాపించారు.(బుఖారీ: 1503, ముస్లిం: 984)

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫర్జ్ చేసిన ఫిత్రా దానం, తినే వస్తువులలో నుండి ఒక ‘సా’ అంత బరువు. ఒక ‘సా’ దాదాపు రెండున్నర కిలో గ్రాములు బరువు వుంటుంది. సహాబాలు కూడా తినే వస్తువులలో నుండే ఫిత్రా దానాన్ని చెల్లించే వారు. దీని గురించి అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “మేము ఫిత్రా దానం (ఇలా) చేసే వాళ్ళం – ఆహార ధాన్యాల ఒక సా లేదా యవలు(జౌ) ఒక ‘సా’ లేదా ఖర్జూరపు ‘సా’ లేదా పనీర్ ‘సా’ లేక కిస్మిస్ యొక్క ఒక ‘సా’ ” (బుఖారీ : 1506, ముస్లిం: 985)

మరో ఉల్లేఖనంలో, అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) పదాలు ఇలా వున్నాయి: “మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ‘ఈదుల్ ఫిత్’ నాడు తినే వస్తువుల నుండి ఒక ‘సా’, ఫిత్రా దానం చెల్లించేవాళ్ళం. ఆ సమయంలో మా భోజనం యవలు(జౌ), కిస్మిస్, పనీర్ మరియు ఖర్జూరంతో కూడుకుని వుండేది”, (బుఖారీ: 1510)

అందుకే, ఫిత్రా దానం కేవలం తినే వస్తువులలో నుంచే చెల్లించాలి. ఉదా॥కు గోధుమలు మరియు బియ్యం వగైరా….

ఫిత్రా దానం వెనుక గల మర్మం ఏమిటంటే, దీని కారణంగా బీద వారికి సైతం తినడానికి ఎంతో కొంత దొరుకుతుంది. అంతేకాక, ఉపవాస వ్యవధిలో తెలిసీ తెలియకుండా ఏవైనా అనవసర, చెడు విషయాల జోలికి పోయివున్నట్లయితే ఈ దానం దానికి పరిహారం (కఫ్ఫారా)గా మారుతుంది.

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫిత్రా దానాన్ని ఫర్జ్ గా ఖరారు చేశారు. దీని ద్వారా ఉపవాసం పాటించిన వ్యక్తి – తాను ఈ వ్యవధిలో తెలిసీ తెలియకుండా చేసిన చెడు కార్యాల పాపఫలం నుంచి పరిశుద్ధుడవుతాడు. దీనితో పాటు బీదవారికి భోజనం కూడా దొరుకుతుంది.”(అబూ దావూద్: 1609, హసన్ – అల్బానీ)

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటటే, ఫిత్రా దానం పండుగ నమాజుకు ముందుగా చెల్లించాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయం గురించి ఆజ్ఞాపించి వున్నారు. దీనికి సంబంధించిన ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని మేము ఇంతకు ముందే వివరించాం. దీనితో పాటు, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా పండుగ నమాజుకు ముందుగా గనక చెల్లిస్తే అది స్వీకార యోగ్యమైన జకాత్ (ఫిత్రా దానం) అవుతుంది. అలా కాక, పండుగ నమాజు తర్వాత గనక దానిని చెల్లిస్తే, అది సాధారణ దానధర్మాలలో ఒకటవుతుంది.” (అబూ దావూద్: 1609, హసన్ – అల్బానీ)

ఈ శుభప్రద మాసం ముగింపు సందర్భంగా ఫిత్రాదానం చెల్లించడంతో పాటు వేరే ఇతర మర్యాదలను కూడా ముస్లిములు దృష్టిలో వుంచుకోవాలి.

ఈ తక్బీర్ల ద్వారా వాస్తవానికి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపబడతాయి. ఎందుకంటే, ఆయన ప్రసాదించిన సద్బుద్ధి కారణంగానే ఈ మాసమంతా ఉపవాసాలుండి, ఖుర్ఆన్ పారాయణం చేయగలిగాం. దుఆలు చేయగలిగాం. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందగలిగాం మరియు ఇతర ఆరాధనలు చేయగలిగాం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يُرِيدُ اللهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَالتَّكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِرُوا اللهَ عَلَى مَا هَدْبَكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
“అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చ దలుస్తున్నాడేగానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నిది అల్లాహ్ అభిలాష”.(బఖర: 185)

(పరిశుభ్రమైన) ఉత్తమమైన దుస్తులు ధరించి, సువాసన పూసుకొని ఇంటి నుండి బయలుదేరాలి. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) (పండుగ నమాజు నిమిత్తం) ఈద్ గాహ్ కు వెళ్లడానికి ముందు స్నానం చేసేవారు.(ముఅత్తా)

3) ఇంటినుండి బయలుదేరే ముందు బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లను తినడం సున్నత్.

అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫితర్ పండుగ రోజు బేసి సంఖ్యలో కొన్ని ఖర్జూర పండ్లను తిన్న తర్వాతే (నమాజ్ కోసం) బయటికొచ్చేవారు”. (బుఖారీ: 953)

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు సాద్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ (నమాజ్) కోసం నడిచి వెళ్ళేవారు, మళ్ళీ నడుచుకుంటూనే తిరిగొచ్చేవారు”. (ఇబ్నెమాజ : 1294,1295, హసన్ – అల్బానీ)

ఎందుకంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీలను కూడా ఈద్ గాహ్ కు వెళ్ళమని ఆజ్ఞాపించి ఉన్నారు. ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసులో వుంది. చివరికి, రుతుస్రావంలో వున్న స్త్రీలకు కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఇంటి నుండి బయలుదేరి, ఈద్ గాహ్ కు వెళ్ళి ప్రక్కన కూర్చోమని, ముస్లిముల దుఆ లలో పాలుపంచుకోమని ఆజ్ఞాపించారు.(బుఖారీ: 974, ముస్లిం: 890)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్ హా నాడు ఈద్ గాహ్ కు వెళ్ళేవారు. అన్నింటి కన్నా ముందుగా ఆయన పండుగ నమాజ్ చేయించేవారు. తదుపరి, తమ తమ స్థానాల్లో అలాగే కూర్చొని వున్న ప్రజల ముందుకు వచ్చేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి హితబోధ చేసేవారు, వసీయతు చేసేవారు, ఆదేశించేవారు, ఒకవేళ ఏదైనా బృందాన్ని సాగనంపాల్సి వుంటే దానిపై నిర్ణయం తీసుకునేవారు. ఒకవేళ మరేదైనా ఆదేశాన్ని జారీ చేయాల్సి వస్తే దానిని జారీ చేసి తిరిగి వచ్చేవారు. (బుఖారీ: 956, ముస్లిం: 889)

“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫిత్ర్ రోజు ఈద్గాహ్ కు వెళ్ళేటప్పుడు తక్బీర్లను పఠిస్తూ వెళ్ళేవారు. పండుగ నమాజు ముగించాక తక్బీర్లను పఠించేవారు కాదు. ఇలాగే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇంటి నుండి బయలుదేరి ఈద్గాహ్ కు వెళుతున్నప్పుడు తక్బీర్లను పఠిస్తూ వెళ్ళేవారు. (అస్సహీహ : 171)

ఈద్ గాహ్ కు చేరుకున్నాక, నమాజు కోసం ఇమామ్ పంక్తులను తిన్నగా చేసుకోమని ఆజ్ఞాపించనంత వరకు, తక్బీర్లను మాటిమాటికీ పఠిస్తూనే వుండాలి.

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: “నిశ్చయంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈదుల్ ఫిత్ర్ నాడు బయలుదేరి రెండు రకాతులు చేయించారు. దీనికి ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి నమాజ్ చేయలేదు”. (బుఖారీ:989, ముస్లిం: 884)

జాబిర్ బిన్ సమ్రా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలసి ఎన్నోసార్లు పండుగల నమాజును అజాన్ మరియు ఇఖామత్లు లేకుండా చదివాను. (ముస్లిం: 887)

ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే, ఆయన మనందరినీ ఈ శుభప్రద మాసపు ఉపవాసాలను పూర్తిచేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు వాటిని స్వీకరించుగాక! ఆమీన్!!

ఈ ఖుత్బా క్రింద పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

జకాత్ | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

[డౌన్లోడ్ PDF]

عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَ مُعَاذًا ‏- رضى الله عنه ‏- إِلَى اَلْيَمَنِ.‏.‏.‏ } فَذَكَرَ اَلْحَدِيثَ, وَفِيهِ: { أَنَّ اَللَّهَ قَدِ اِفْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ, تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ, فَتُرَدُّ فِ ي 1‏ فُقَرَائِهِمْ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ 2‏ .‏


‏1 ‏- كذا في الأصلين، وهي رواية مسلم، وأشار في هامش “أ” أن في نسخة “على” وهي رواية البخاري ومسلم.‏
‏2 ‏- صحيح.‏ رواه البخاري ( 1395 )‏، ومسلم ( 19 )‏، ولفظه: أن رسول الله صلى الله عليه وسلم بعث معاذا إلى اليمن، فقال له: “إنك تأتي قوما أهل كتاب، فادعهم إلى شهادة أن لا إله إلا الله وأني رسول الله، فإن هم أطاعوا لذلك، فأعلمهم أن الله افترض عليهم صدقة في أموالهم، تؤخذ من أغنيائهم وترد على فقرائهم، فإن هم أطاعوا لذلك، فإياك وكرائن أمولهم، واتق دعوة المظلوم؛ فإنها ليس بينها وبين الله حجاب”.‏

483. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను యమన్ వైపునకు సాగ నంపారు. తరువాత హదీసునంతటినీ వివరించారు. అందులో ఇలా వుంది: “అల్లాహ్ తరఫున వారి సంపదలపై ‘జకాత్’ విధించబడింది. అది వారి స్థితిమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని అగత్యపరులలో, పేదలలో పంచి పెట్టబడాలి.” (బుఖారీ)

సారాంశం:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ధనవంతుల నుండి జకాత్ ను వసూలు చేసి అధికార స్థాయిలో హక్కుదారులకు (అగత్యపరులకు) పంపిణీ చేసే వ్యవస్థ ఏర్పడిందని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఏ ప్రాంతంలో జకాత్ వసూలు చేయబడుతుందో ఆ ప్రాంతంలోని పేదలకు, నిరాధార జీవులకే అది పంచిపెట్టబడటం న్యాయం అన్న విషయం కూడా దీనిద్వారా అవగతమవుతున్నది. ఒకవేళ అక్కడ జకాత్ పంపిణీ అయ్యాక కూడా మిగిలి ఉంటే అప్పుడు ఇతర ప్రాంతాలలోని హక్కు దారులకు ఇవ్వవచ్చు. ‘జకాత్’ అనేది పేదల హక్కు. దాన్ని చెల్లించటం శ్రీమంతుల బాధ్యత. జకాత్ ను చెల్లించి వారు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారే తప్ప ఒకరిపై ఉపకారం ఏమీ చేయటం లేదని గ్రహించాలి.

ఉపవాసాల నియమాలు | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

527. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్ కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాస వ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

528. హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత చూపాడు.”

(బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఇస్లామీయ షరియత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరియత్ పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరియత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ] 2‏ .‏ ثَلَاثِينَ } 3‏ .‏ وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ } 4‏ .‏

وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ } 1‏ .‏

529. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహ్).

‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజాల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: ‘మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.’

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) [పుస్తకం]

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్)
ఉర్దూ సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

[డౌన్లోడ్ బుక్]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్

[డౌన్లోడ్ PDF]

కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో

మహాశయులారా !

ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.

అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.

అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.

అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.

అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.

అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”

ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !

ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.

అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/VqNlWM-JI88

అల్లాహ్ ఆదేశం: 

وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا
మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6). 

ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:

ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం). 

  • 1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది. 
  • 2. అది షిర్క్ అని తెలిసింది. 
  • 3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్. 
  • 4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది. 
  • 5. ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి). 

ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

తలాఖ్ (విడాకుల) ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు 1.20

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

تحريم طلاق الحائض بغير رضاها وأنه لو خالف وقع الطلاق ويؤمر برجعتها

936 – حديث ابْنِ عُمَرَ، أَنَّهُ طَلَّقَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذلِكَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مُرْه فَلْيُرَاجِعْهَا ثُمَّ لِيُمْسِكْهَا حَتَّى تَطْهُرَ، ثُمَّ تَحِيضَ، ثُمَّ تَطْهُرَ، ثُمَّ إِنْ شَاءَ أَمْسَكَ بَعْدُ، وَإِنْ شَاءَ طَلَّقَ قَبْلَ أَنْ يَمَسَّ؛ فَتِلْكَ الْعِدَّةُ الَّتِي أَمَرَ اللهُ أَنْ تُطَلَّقَ لَهَا النِّسَاءُ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 1 باب قول الله تعالى (يأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة)

936. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో నేను నా భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాను. ఆ విషయంలో (నా తండ్రి) హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే ఆయన ఇలా అన్నారు: అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)కు ఆ విడాకుల్ని ఉపసంహరించుకోమని చెప్పేయి. అతని భార్య బహిష్టు ఆగిపోయి పరిశుద్ధం అయ్యేవరకు ఆమెను తన దగ్గర ఆపి ఉంచాలి. తిరిగి ఆమె బహిష్టు అయి, తిరిగి పరిశుద్ధమయిన తర్వాత అతను కావాలనుకుంటే ఆమెను (తన దాంపత్యంలో) ఆపి ఉంచవచ్చు లేదా విడాకులివ్వవచ్చు. అయితే అప్పటిదాకా అతను ఆమెను తాకరాదు. ఇదే విడాకుల గడువు. దీని ప్రకారమే అల్లాహ్ స్త్రీలకు విడాకులివ్వాలని ఆజ్ఞాపించాడు.

[సహీహ్ బుఖారీ: 68వ ప్రకరణం – తలాఖ్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహి యా అయ్యుహన్నబియ్యు ఇజాతల్లఖ్ తుమ్)

937 – حديث ابْنِ عُمَرَ عَنْ يُونُسَ بْنِ جُبَيْرٍ، قَالَ: سَأَلْتُ ابْنَ عُمَرَ؛ فَقَالَ طَلَّقَ ابْنُ عُمَرَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ، فَسَأَلَ عُمَرُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَمَرَهُ أَنْ يُرَاجِعَهَا، ثُمَّ يُطَلِّقَ مِنْ قُبُلِ عِدَّتِهَا؛ قُلْتُ: فَتَعْتَدُّ بِتِلْكَ التَّطْلِيقَةِ قَالَ: أَرَأَيْتَ إِنْ عَجَزَ وَاسْتَحْمَقَ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 45 باب مراجعة الحائض

937. హజ్రత్ యూనుస్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని బహిష్టు స్థితిలో విడాకులిచ్చేయడం గురించి అడిగితే ఆయన ఇలా అన్నారు – ఉమర్ కొడుకు కూడా తన భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాడు. దాని గురించి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే “అబ్దుల్లా బిన్ ఉమర్ కు విడాకుల్ని ఉపసంహరించుకోమని ఆజ్ఞాపించు” అని చెప్పారు. అంతేకాకుండా ఇద్దత్ (గడువు) ప్రారంభమైనపుడు ఆమెకు తిరిగి విడాకులివ్వాలని ఆయన తెలియజేశారు.

అప్పుడు నేను హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)ని “మరి ఆ (బహిష్టు లో ఇచ్చిన) విడాకులు విడాకుల క్రిందికి వస్తాయా?” అని అడిగాను. దానికి ఆయన “ఎందుకు రావు? ఒకవేళ ఎవరైనా గత్యంతరం లేని స్థితిలో లేదా బుద్ధి గడ్డి తినడం వల్ల విడాకులిస్తే అవి విడాకులుగా పరిగణించబడవా?” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 45వ అధ్యాయం – మురాజాతిల్ హాయిజ్]

وجوب الكفارة على من حرّم امرأته ولم ينو الطلاق

దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

దుఆ ఇలా చేయండి - తప్పక ఫలిస్తుంది [పుస్తకం]
దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

సులువైన, సంక్షిప్తమైన, సమగ్రమైన – దుఆ చేసే విధానం
దుఆ ఇలా చేయండి తప్పక ఫలిస్తుంది
[డౌన్లోడ్ బుక్] [PDF] [16 పేజీలు ]

దుఆ(ప్రార్థన) చేయవలసింది ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే. ఎందుకంటే, ప్రతిరోజూ మనం నమాజులో-

“ఓ అల్లాహ్ ! మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము” అని వాగ్దానం చేస్తున్నాం.(ఫాతిహా సూరా : 5)

కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహ్ కు మాత్రమే దుఆ చేసుకోవాలి. ప్రార్థన (దుఆ) విషయంలో ఇతర మధ్యవర్తులను (అనగా ఉదాహరణకు పుణ్యాత్ములను, వలీలను) ఆశ్రయించటాన్ని కూడా అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. తన తరఫున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దివ్యఖుర్ఆన్లో ఈ విధంగాచెప్పాడు:

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవువారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గభాగ్యం పొందగల్గుతారు.” (ఖుర్ఆన్ 2: 186)

మరోచోట ఆయన స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు:

“మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన (ఇబాదత్) పట్ల గర్వాహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులైనరకంలో ప్రవేశించటం ఖాయం.” (ఖుర్ఆన్ 40: 60)

మానవులందరూ-వారు మంచివారైనా, పాపాత్ములైనా అందరూ నేరుగా అల్లాహ్ ప్రార్థిస్తూఉండాలి. ‘మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా?’ అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే, పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో పుణ్యాత్ముల ప్రతి వేడుకోలునూ అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహ్, ఇబ్రాహీమ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతటి గొప్ప దైవప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయీల్కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా! దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ప్రతిఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహ్ ను ప్రార్థిస్తూఉండాలి. దాసులు కనబరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక తోసిపుచ్చుతాడు. అంతేగాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా? పాపాత్ముడా? అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడోచూడండి:

“ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యంపట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగాక్షమించేవాడు. అపారంగా కరుణించేవాడు.” (ఖుర్ఆన్ 39 : 53)

మీ దుఆలు స్వీకరించ బడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే, మీ దుఆలు క్రింది మూడు రూపాల్లోని బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు.

(1) ప్రార్థన చేసిన వెంటనే (అంటే ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, సమీప కాలంలోనో, సుదీర్ఘకాలంలోనో ఎప్పుడైనా) అది తప్పక నెరవేరవచ్చు.

(2) లేక అల్లాహ్ ఆ ప్రార్థనను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు.

(3) లేక ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు.

ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్ధన చేస్తే అల్లాహ్ అతని కోసం పై మూడు వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు. (అహ్మద్)

(1) చిత్తశుద్ధి: ఒక్క అల్లాహ్ నే ప్రార్థించాలి. ఖుర్ఆన్ ఇలా అనబడింది: మీరు మీధర్మాన్ని (ఆరాధనను) అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి.(ఖుర్ఆన్ 40: 65)

(2) ఏకాగ్రత: పూర్తి ఏకాగ్రతతో, మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకొని ప్రార్థించాలి. “పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు.”(బుఖారీ గ్రంథం)

(3) వినమ్రత, అణకువ: అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణకువ భావాలు ఉట్టిపడాలి. దివ్యఖుర్ఆన్ ప్రబోధనం:“మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, గోప్యంగానూ.” (ఖుర్ఆన్ 7: 55)

ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

“పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను”.(ఖుర్ఆన్ 20: 82)

అంటే,

(1) మనిషి గతంలో తనవల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. క్షమాభిక్షకై వేడుకోవాలి.
(2) అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, దైవగ్రంథాలను, పరలోక దినాన్ని హృదయ పూర్వకంగా విశ్వసించాలి.
(3) ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి.
(4) సత్కార్యాల మార్గంలో స్థయిర్యాన్ని,నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థనస్వీకరించబడటానికి అవకాశం వుంటుంది.

(1) దుఆ చేసే వ్యక్తి వుజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దుఆ చేసే చోటు కూడా పరిశుభ్రంగాఉంటే మంచిది.

(2) చేతులెత్తకుండా నయినా దుఆ చేయవచ్చు (ముస్లిం). కాని చేతులెత్తి దుఆ చెయ్యడం సున్నత్ (బుఖారి గ్రంథం).

(3) ఒకవేళ చేతులు ఎత్తి దుఆ చేస్తున్నట్లైతే భుజాలవరకు పైకెత్తి దుఆ చేయాలి. (తిర్మిజీ గ్రంథం)

(4) దుఆ చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపుఉండాలి.(అబూదావూద్)

[1] ముందుగా అల్లాహ్ ను స్తుతించండి. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించండి. (తిర్మిజీ)

[2] అంతకు ముందు మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి (హాకిమ్ గ్రంథం) (అయితే క్రైస్తవుల్లో మాదిరిగా మత గురువుల ముందు మీ పాపాలను బయటపెట్టుకొని అవమానం పాలుకావలసిన అవసరం లేదు.)

[3] పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. (బుఖారి గ్రంథం)

[4] పరిపూర్ణ ఏకాగ్రతతో (అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకొని) ప్రార్థించండి. (తిర్మిజీ)

[5] అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయంమీకు చాలా ముఖ్యమైనదయితే ప్రార్థనా వచనాలను మూడేసి సార్లు పలకండి. (ముస్లిం)

[6] ముందు మీ కోసం ప్రార్ధించుకోండి. తర్వాతమీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం,ముస్లిం సమాజం కోసం ప్రార్థించండి. (ముస్లిం)

[7] ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండాపరులకోసం కూడా ప్రార్థించండి.(బుఖారి)

[8] సమగ్రమైన, మంచి భావం కలిగిన ప్రార్థనలుచేయండి. (అబూదావూద్ గ్రంథం) (అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైన వేడుకోలు వచనాల ద్వారా ప్రార్థించటం ఎంతోఉత్తమం.)

[9] మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా!అని అనుకోకండి. (ఎంత చిన్న అవసరమైనా అంతిమంగా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ యే కనుక) ప్రతి అవసరం కోసం ఆయన్నే వేడుకోండి.(తిర్మిజీ)

[10] ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ పలకటం మర్చిపోకండి.(ముస్లిం)

[11] చివర్లో కూడా మరో మారు దరూద్ పఠించండి.ఆ తర్వాత అల్లాహ్ ను మళ్ళీ స్తుతిస్తూ ప్రార్థన(దుఆ) ముగించండి. (ముస్లిం)

వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం (ఇస్మె ఆజం) కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలుపెట్టండి. ‘ఇస్మె ఆజం’ కలిగివుండే ప్రార్థనా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.

“అల్లాహుమ్మ! ఇన్నీ అలుక బిఅన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్సమదుల్లజీ లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.”

(ఓ అల్లాహ్! అల్లాహ్ వు నీవే. కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరో అరాధ్యుడు లేనేలేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరి సమానులు ఎవరూ లేరు అటువంటి మహోన్నత అస్తిత్వం నీది.)-(ఇబ్నెమాజా – సహీహ్)

“లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”(అహ్మద్, తిర్మిజీ – సహీహ్)

”యా జల్(zal) జలాలి వల్ ఇక్రామ్! యా హయ్యు! యా ఖయ్యూమ్!” (తిర్మిజీ)

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలిముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలాఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్ అల్లాహుమ్మబారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్

ఉదాహరణకు ఒక ప్రార్థన:

అల్లాహుమ్మ ఇన్నక అ’ఫువ్వున్ తుహిబ్బుల్ అ’ఫ్వ’ఫా’ఫు (fafu) అన్నీ
(అల్లాహ్ ! నువ్వు క్షమించేవాడవు. క్షమను ఇష్టపడతావు. నన్ను క్షమించు.)

“రబ్బనా ఆతినా ‘ఫిద్దున్యా హసనతన్ వ’ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.”
ప్రభూ! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుండి రక్షించు.(ఖుర్ఆన్ 2 : 201)

‘రబ్బిరమ్ హుమా కమా రబ్బయానీ స’గీరా’
ఓ అల్లాహ్! వారిద్దరూ (నా తల్లిదండ్రులు) నన్నుఏ విధంగా ప్రేమగా పెంచారో అదే విధంగా నువ్వుకూడా వారిపై దయజూపు.

‘రబ్బి జిద్నీ ఇల్మ (ఖుర్ఆన్ 17:24)
ప్రభూ! నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు.(ఖుర్ఆన్ 20:114)

‘రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్ అల్నా లిల్ ముత్తఖీన ఇమామా’

ఓ మా ప్రభూ! నీవు మా భాగస్వాముల (నా భర్త లేక నా భార్య) ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని దైవభక్తిపరుల (ముత్తఖీన్) నాయకునిగా చేయి.(ఖుర్ఆన్ 25:74)

“అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుఖా వల్ అ’ఫా’ఫ వల్ ‘గినా”
అల్లాహ్! నాకు సన్మార్గాన్నీ, దైవభీతినీ, శీలాన్నీ,నిరపేక్షా భావాన్నీ ప్రసాదించమని వేడుకుంటున్నాను.(ముస్లిం)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ అర్బయి మిన్ యిల్మిన్ లా యన్ఫా, వ మిన్ ఖల్బిన్ ల యఖ్షా, వ మిన్ నఫ్సిన్ లా తష్బా, వమిన్ దుఆయిన్ లా యుస్మా.”

అల్లాహ్ ! నేను నాలుగు విషయాల నుండి నీ శరణు వేడుతున్నాను. (1) నిష్ప్రయోజనకరమైన విద్యనుండి (అంటే ఆచరణలేని విద్య) (2) దైవ భీతి లేని హృదయం నుండి (3) ఆత్రం తీరని మనస్సు నుండి (4) అంగీకరించబడని ప్రార్ధన నుండి (అహ్మద్)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ హమ్మి వల్ హుజిని వల్ అజిజి వల్ కస్ లి వల్ బుఖ్ లి వల్ జుబ్ ని వ జలయిద్దయిని వ ‘గలబతిర్రిజాలి.”

అల్లాహ్! నేను దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణ భారం, ఇంకా ప్రజలు నాపై ఆధిక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుతున్నాను. (నసాయి గ్రంథం)

ఇంకా మీకు ఏం ఏం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్ధించుకోండి. మీ ఇష్టం. కాని జాగ్రత్త! మీరు చనిపోవాలనిగాని లేక పరులకు హాని జరగాలని గాని శాపనార్ధాలు పెట్టకండి. అలా చేయటం పాపం.

ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ అని పలకండి.

దరూద్ 11వ పేజీలో వుంది.

ఇలాగా: సుబహానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్.

దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించ బడటానికి అవకాశం ఉంటుంది.

[1] అజాన్, ఇఖామత్ ల మధ్య సమయంలో (తిర్మిజీ)

[2] అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి (సజ్దాలో) ఉన్న స్థితిలో (ముస్లిం)

[3] ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది.(తిర్మిజీ గ్రంథం)

[4] ఉపన్యాసకుడు (ఖతీబ్) వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి (జుమా) నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియలో దుఆ స్వీకరించబడుతుంది.(ముస్లిం గ్రంథం) అంటే రెండు ఖుత్బాల మధ్యన.

[5] జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థనస్వీకరించబడుతుంది.(బుఖారి గ్రంథం)

[6] ఉపవాస విరమణ (ఇఫ్తార్) సమయంలో (ముస్లిం)

[7] రమదాన్ నెలలోని ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్)లో చేసే ప్రార్థన (తిర్మిజీ గ్రంథం)

[8] రాత్రి ఆఖరి జాము (తహజ్జుద్ సమయం)లో ప్రార్థన స్వీకరించ బడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. (బుఖారి గ్రంథం)

[9] వర్షం కురిసేటప్పుడు.(హాకిమ్ గ్రంథం)

మీ దుఆల్లో మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ…

తౌహీదె ఉలూహియత్ : ఆరాధనలో ఏకత్వాన్ని పాటించడం విధి – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి, ఆయనకే విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడకండి మరియు అల్లాహ్ యొక్క గొప్ప ఆజ్ఞ తౌహీద్ అని గుర్తుంచుకోండి. తౌహీద్ అంటే ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని నమ్మడం, ఆయన్నే ఆరాధించడం, ఆయనకు ఎవరిని సాటి కల్పించకుండా ఉండటం. అల్లాహ్ ఈ తౌహీద్ కోసమే మానవులను, జిన్నాతులను సృష్టించాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే) (జారియాత్:56)

ఆరాధన: అల్లాహ్ ప్రేమించే, ఇష్టపడే ప్రతీ ఆచరణ ఆరాధనలోకే వస్తుంది. అది నోటి ద్వారా చేసేదైనా లేక మనిషి తన ఆవయవాలతో చేసేదైనా సరే.

ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: నమాజ్, జకాత్, రోజా (ఉపవాసం), హజ్, సత్యం పలకడం, అమానతును అప్పగించడం, తల్లిదండ్రుల విధేయత, బందుత్వాలను కలుపుకోవడం, ఒప్పందాలను నెరవేర్చడం, మంచిని బోధించడం, చెడును నిర్మూలించడం, కుఫ్ఫార్ (అవిశ్వాసులు) మరియు మునాఫిఖుల(కపట విశ్వాసుల)తో పోరాడటం, మరియు ఇరుగుపొరుగు, అనాధలు, అభాగ్యులు, బాటసారులు, బానిసలతో ఉత్తమంగా వ్యవహరించడం, పశుపక్షాదుల పట్ల మేలు చేయడం, దుఆ, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు ఇలాంటి ఆచరణలన్నీ ఆరాధనలోనే లెక్కించబడతాయి.

అదేవిదంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించడం, అల్లాహ్ యొక్క ధైవభీతి కలిగి ఉండటం, అల్లాహ్ వైపునకు మరలడం మరియు అల్లాహ్ కొరకు ధర్మాన్ని ప్రత్యేకించడం, ఆయన ఆజ్ఞలను సహనంతో శిరసావహించడం, ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపడం, ఆయన నిర్ణయాలపై సంతృప్తి చెందడం, ఆయనపై భరోసా ఉంచడం, ఆయన కారుణ్యం పట్ల ఆశ ఉంచడం, ఆయన శిక్షల పట్ల భయ పడటం మరియు ఇలాంటివన్నీ ఆరాధనలో భాగమే. [వారి మాట పూర్తయింది].

ఓ అల్లాహ్ దాసులరా! నిశ్చయంగా ప్రవక్తల దావత్ (ప్రచారం) ప్రధానంగా ఏకదైవారాధన (తౌహీదె ఉలూహియత్) పై కేంద్రీకృతమై ఉండేది. అల్లాహ్ సూర అంబియా:25లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.)

ప్రవక్తలందరూ తమ జాతివారికి ఈ విషయాన్నేచాటి చెప్పేవారు:

يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَهٍ غَيْرُهُ
(“నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో సత్య ఆరాధ్యుడు లేడు) (ఆరాఫ్:59).

ఓ విశ్వాసులారా! వేరే ఎవరు కాకుండా కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు అనడానికి గొప్ప నిదర్శన (దలీల్); ఏ భాగస్వామి లేకుండా, ఏ సహాయకుడు లేకుండా ఆయన ఒక్కడే ఈ మొత్తం విశ్వానికి ‘రబ్’ అవడం. రబ్ అంటే సృష్టికర్త, యజమాని, నిర్వాహకుడు, పోషకుడు. అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప యజమాని (అదికారి) ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప పోషకుడు (ఉపాధి ప్రధాత) ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప విశ్వ నిర్వాహకుడు మరియు ఆదేశించేవాడు ఎవడూ లేడు.

సృష్టించడంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيلٌ
(అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే. అన్ని వస్తువులకూ సంరక్షకుడు కూడా ఆయనే.) (జుమర్:62)

యజమాన్యం, అధికారంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:

ذَلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు.) (ఫాతిర్ :13)

విశ్వనిర్వాహకుడు, తనిష్టానుసారం అందులో ఆదేశాలు జారీ చేయడంలో అల్లాహ్ యే అద్వితీయుడని చాలా స్పష్టంగా తెలిపాడు:

وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ
(సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి.) (హూద్:123)

చావు, బ్రతుకులు, ఆరోగ్యం, అనారోగ్యం, వర్షాలు, కరువులు, ధనరికం, పేదరికం, శాంతిభద్రతలు, భయాందోలనలు, ఇంకా విశ్వంలో జరిగేదంతా అల్లాహ్ ఆజ్ఞ ద్వారానే జరుగుతాయి.

ఉపాది ప్రసాదించడంలో అల్లాహ్ అద్వితీయుడని ఆధారం:

إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
(అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.) (జారియాత్:58)

ఓ ముస్లింలారా! తౌహీదె ఉలూహియత్ (ఏకదైవారాధన)కు విరుద్దం షిర్క్ (బహుదైవారాధన). షిర్క్ అనగా: ఏ ఆరాధన అయినా అల్లాహ్ యేతరుల కొరకు చేయడం. అంటే: మనిషి అల్లాహ్ కు ఓ భాగస్వామిని నిలబెట్టి అల్లాహ్ ను ఆరాధించినట్లుగా ఆ భాగస్వామిని ఆరాధించడం, అల్లాహ్ కు భయపడినట్లుగా అతనికి భయపడటం, ఏదైనా ఆరాధన ద్వారా అల్లాహ్ ప్రసన్నత పొందినట్లు అతని ప్రసన్నత పొందడం. ఉదాహరణకి సమాధుల పూజ చేసేవారు, అక్కడ బలి ఇచ్చేవారు, దాని కొరకు మ్రొక్కుకునేవారు, వాటి ప్రదక్షిణలు చేసేవారు, వాటికి సాష్టాంగ పడేవారు, వాటి మూల మూలన తాకి బర్కత్ లభిస్తుందని నమ్మేవారు. ఇలా చేయడం ద్వారా ఆ సమాధిలో ఉన్నవారే  ఉపాధి ప్రసాదిస్తారు, లాభనష్టాలు చేకూర్చుతారు అని నమ్ముతూ ఇంకా ఇలాంటి ఎన్నో షిర్క్ పనులకు పాల్పడతారు. వాస్తవానికి ఇవన్నీ షిర్క్ పనులు మరియు అల్లాహ్ ఏకైకుడే ఆరాధనలకు నిజ అర్హుడు, ఆయన తప్ప వేరే ఎవరూ కారు అన్న విశ్వాసానికి బద్ధ విరుద్ధం.

ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ వారించినవాటిలో అత్యంత ఘోరమైనది షిర్క్. అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా తెలిపాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ (65) بَلِ اللَّهَ فَاعْبُدْ وَكُنْ مِنَ الشَّاكِرِينَ

(నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది: “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధన (షిర్క్)కు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.”) (జుమర్:65)

నిశ్చయంగా అల్లాహు తఆలా షిర్క్ చేసే వారి కొరకు కఠినమైన శిక్షను తయారు చేసి ఉంచాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ

(ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు, అతని నివాసం నరకం. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.) (మాయిదా:72)

ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా షరియత్ పరమైన మరియు హేతు బద్ధమైన ఎన్నో ఆధారాల ద్వారా షిర్క్ ను ఖండించాడు.

షిర్క్ ఖండనలో షరియత్ పరమైన ఆధారం:

إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ

(ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు, అతని నివాసం నరకం. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.) (మాయిదా:72)

షిర్క్ ఖండనలో హేతుబద్ధమైన ఆధారాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ రెండు విషయాలు:

మొదటిది: ముష్రికులు (బహుదైవారాధకులు) ఆరాధించేవాటిలో ఉలూహియత్ ప్రత్యేకతలు ఏమీ లేవు. వారు సృష్టితాలే తప్ప, సృష్టించలేరు, వారిని ఆరాధించేవారికి ఏ లాభము చేకూర్చలేరు, వారి నుండి ఏ నష్టాన్ని తొలగించలేరు, వారి చావు బ్రతుకుల ఏ అధికారం కలిగి లేరు, భూమ్యాకాశాల్లో వారికి ఏ కొంచెం కూడా అధికారం మరియు వాటి అధికారంలో వారికి అల్లాహ్ తో పాటు ఏ కొంచెం పొత్తు (పాట్నర్ షిప్, భాగస్వామ్యం) లేదు. అల్లాహ్ ఆదేశాలు శ్రద్ధగా చదవండి:

وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا

(వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే/పే శక్తి కూడా వారివద్ద లేదు.) (అల్ ఫుర్ఖాన్:3) 

మరో చోట ఇలా సెలవిస్తున్నాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ * وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ

వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏమాత్రం ఉపకరించదు. (సబా:22-23)

ఈ బూటకపు దేవుళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అలాంటి వారిని ఆరాధించడం, పూజలు పురస్కారాలు చేయడం కంటే తెలివితక్కువ పని ఇంకేముంటుంది.

రెండవది: ఓ అల్లాహ్ దాసులారా! ముష్రిక్ లు ఇలా అంగీకరించేవారు – ఏకైకుడైన అల్లాహ్ యే మా రబ్ అని, ఆయనే సృష్టికర్త అని, ఆయన చేతిలోనే సర్వాధికారం ఉన్నదీ అని, ఆయనే శరణు (రక్షణ) ఇచ్చేవాడు, ఆయన శిక్ష నుండి రక్షణ ఇచ్చేవాడెవడూ లేడు. వారు రుబూబియత్ లో అల్లాహ్ ఏకైకుడని నమ్మినట్లుగా ఉలూహియత్ లో కూడా అల్లాహ్ ఏకైకుడని నమ్మడం విధిగా ఉంది. ఈ క్రింది ఆయతుల పై శ్రద్ధ వహించండి:

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ * الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

(ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి, తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.) (బఖర:21-22)

ఈ ఆధారంగానే అల్లాహ్ ను వదలి లేదా అల్లాహ్ తో పాటు ఎవరినైనా నియమించుకొని వారిని ఆరాధించడం తప్పు, తుచ్ఛము.

 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ

(ఇంకా అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం. ముమ్మాటికీ అల్లాహ్‌యే సర్వోన్నతుడు, గొప్పవాడు.) (లుఖ్మాన్:30)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింపజేయుగాక, వివేకంతో కూడిన ఆయన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.      

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు గుర్తుంచుకోండి అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఆరాధనలలో అతి ఎక్కువగా ప్రజలు అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించే ఆరాధన దుఆ. ఖురాన్ మరియు హదీస్ లలో దుఆని కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించి చేయమని చెప్పబడింది. ఇతరులతో దుఆ చేయడాన్ని కఠినంగా వారించడం జరిగింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:

ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ
(మీరు మీ ప్రభువును కడుదీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి.) (ఆరాఫ్:55)

అల్లాహ్ మరో చోట ఇలా సెలవిచ్చాడు:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ
(కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? (అంటే అల్లాహ్ తప్ప ఎవడూ లేడు).  (నమ్ల్:62)

అల్లాహ్ మరో చోట ఇలాసెలవిచ్చాడు:

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ 
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు) (బఖర:186)

మరో చోట ఇలాఉంది:

وَاسْأَلُوا اللَّهَ مِن فَضْلِهِ ۗ
(మీరు అల్లాహ్‌ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి.) (నిసా:32)

ఖురాన్ లో దాదాపు మూడువందల చోట్ల అల్లాహ్ దుఆ గురించి ప్రస్తావిస్తూ, ఏకైకుడైన అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలని నొక్కి చెప్పాడు.ఓ అల్లాహ్ దాసులరా! దుఆలో షిర్క్ కు దూరంగా ఉండి, ఏకైకుడైన అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయండి సాఫల్యం పొందుతారు.

ప్రవక్త  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలిపారు:

مَنْ مَاتَ وَهُوَ يَدْعُو لِلَّهِ نِدًّا، دَخَلَ النَّارَ
“ఏవ్యక్తి అయితే ఇతరులను అల్లాహ్ కు సాటికల్పించి, అతనితో దుఆ చేసే స్థితిలో మరనిస్తాడో అతడు నరకంలోకి వెళ్తాడు.”(బుఖారి:4497)

మరో హదీస్ లో ఉంది: అల్లాహ్ దగ్గర అన్నిటి కంటే పెద్ద ఘోరమైన పాపం ఏది అని ప్రవక్తను అడిగినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు:

أَنْ تَدْعُوَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ
“మిమ్మల్ని పుట్టించింది అల్లాహ్ యే అయినప్పటికీ మీరు ఆయనతో పాటు ఇతరులను సాటికల్పించి, వారితో దుఆ చేయడం.” (ముస్లిం:86, బుఖారి:4761).

ఎవరైతే అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేస్తాడో, మొరపెట్టుకుంటాడో, అతని కొరకు మొక్కుబడి, జిబహ్ (జంతుబలి) చేస్తాడో లేదా ఆరాధనల్లో ఏ కొంచమైనా అతని కొరకు చేస్తాడో, అలాంటివాడు అతడ్ని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడవుతాడు, అతడు ఎవరైనా సరే; ప్రవక్త అయినా, వలీ అయినా, దైవదూత అయినా, జిన్ అయినా, విగ్రహమైనా మరియు ఇంకేమైనా సరే. అది షిర్కే అవుతుంది. అల్లాహ్ వీటన్నింటికీ ఎంతో అతీతుడు, పవిత్రుడు.

అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ముఖ్యంగా రెండు చోట్ల ఇతరులతో దుఆ చేయడాన్ని తప్పుగా మరియు నిరాధారమైనదిగా పేర్కొన్నాడు:

మొదటి చోట సూరె హజ్:62లో :

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ
(అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం).

రెండవ చోట సూరె లుఖ్మాన్:30లో:

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం).

ఓ ముస్లింలారా! దుఆలో షిర్క్ ఈ కాలంలోనే కాదు పూర్వకాలంలో కూడా ఉండినది. బహుదైవారాధకులైన క్రైస్తవుల్లో; వీరు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కు సాటి కల్పించారు. అదేవిధంగా ఆవుని ఆరాధించేవారు మరియు స్వయానా తమ చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజించేవారు, అనేక రకాల దురాచారాలకు పాల్పడేవారున్నారు. వీరందరూ ఆరాధనలో షిర్క్ కు పాల్పడ్డారు.

అదేవిధంగా తమకు తాము ముస్లిములగా భావించే కొన్ని వర్గాలు కూడా దుఆలో షిర్క్ కు పాల్పడ్డారు. ఉదాహరణకు: తమ పీర్లతో దుఆ చేసే సూఫీలు, ఆలె బైత్ తో దుఆ చేసే రాఫిజీలు. సమాధుల్లో ఉన్నవారితో దుఆ చేసే సమాధి పూజారులు. ఇలాంటి వారు ఎందరో ఇంత దుర్మార్గమైన షిర్క్ కి పాల్పడుతూ కూడా మేము ముస్లింలమే, మేము ప్రవక్తను ప్రేమించేవాళ్ళమే అనే ఆరోపణ చేస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇస్లాంకు, వారి షిర్క్ కు ఏ సంబంధం లేదు.

మేము అల్లాహ్ తో ప్రార్దిస్తున్నాము, ఓ అల్లాహ్! ఈ అంధవిశ్వాసాల నుండి మా అందరినీ కాపాడు, తౌహీద్ మరియు సున్నత్ పై చివరి శ్వాస వరకు స్థిరంగా ఉంచు.

అల్లాహ్ మీపై కరుణించుగాక, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి, రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డ గొప్ప హదీసు – కలామే హిక్మత్

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు :

“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”

”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”

“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”

”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”

“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”

”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”

“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)

(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.

దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.

(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.

(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”

ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “

(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ

”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)

(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:

 قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ

“వారితో అనండి, తెలిసినవారు, తెలియనివారు ఇద్దరూ సమానులు అవగలరా? హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు.” (అజ్జుమర్ 39 : 9)

(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.

(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “

ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “

(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –

وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ

“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)

తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్