శాంతి భద్రతల ప్రాముఖ్యత, ముస్లిం పాలకుల పట్ల విధేయత & సామాజిక ఐక్యత [వీడియో & టెక్స్ట్]

శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా
ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్
https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ كَمَا بَسَطْتَ رِزْقَنَا، وَأَظْهَرْتَ أَمْنَنَا، وَجَمَعْتَ فُرْقَتَنَا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ.
[ఇన్నల్ హమ్దలిల్లాహి కమా బసత్త రిజ్ కనా, వ అజ్ హర్త అమ్ననా, వజమఅ త ఫుర్ ఖతనా. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు సల్లల్లాహు అలైహి వసల్లమ తస్లీమన్ కసీరా, అమ్మ బాద్.]

అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.

ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.

విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.

ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”

అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”

అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.

అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
[యర్ ఫఇల్లా హుల్లజీన ఆమనూ మిన్ కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్]
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు” (58:11)

ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?

مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
[మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్]
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)

విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)

వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا
[రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా]
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. (2:126)

ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا
[రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా]
“నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)

ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.

అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!

ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.

وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ

ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్‌ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు. (8:26)

ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.

అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.

మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِلْإِسْلَامِ وَالسُّنَّةِ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ كَانَتْ بِعْثَتُهُ خَيْرَ مِنَّةٍ، أَمَّا بَعْدُ.
[అల్హమ్దులిల్లాహిల్ లజీ హదానా లిల్ ఇస్లామి వస్సున్న, వస్సలాతు వస్సలాము అల మన్ కానత్ బిఅ సతుహు ఖైర మిన్న, అమ్మ బాద్.]

మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.

ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.

శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.

మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.

సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا

అల్లాహ్‌ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)

 اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ،
ఓ అల్లాహ్‌! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,

اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ.
ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.

• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ.
ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.

 اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ.
ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.

 اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ.
ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!

 اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ.
ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.

اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ.
ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్‌ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.

 اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ.
ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.

 اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ.
ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!

سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42824

హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/pOXV3-6CJEg [20 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు తాలా అన్హు) యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వివరిస్తారు. ప్రవక్త సహచరుల జీవితాలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. అబూబక్ర్ (రది అల్లాహు తాలా అన్హు) ఇస్లాం కోసం చేసిన సేవలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన స్థిరత్వం, విశ్వాసం మరియు ఆయన గొప్పతనాన్ని వివరించే వివిధ సంఘటనలు ఇందులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా, వలస ప్రయాణంలో గుహలో ప్రవక్తతో పాటు ఉండటం, తన సంపదనంతా ఇస్లాం కోసం ఖర్చు చేయడం, మరియు ప్రవక్త మరణం తర్వాత సమాజాన్ని ఏకతాటిపై నిలపడంలో ఆయన పోషించిన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఖలీఫాగా ఆయన సాధించిన విజయాలు, మతభ్రష్టులతో పోరాడటం మరియు ఖురాన్‌ను సంకలనం చేయించడం వంటి చారిత్రాత్మక విజయాలను కూడా వక్త వివరించారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

نَحْمَدُهُ وَنُصَلّي عَلى رَسُولِهِ الكريم، أما بعد!
నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా. షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ హఫిజహుల్లాహ్ జామిఅ అల్-గనాంలో ఇచ్చారు, అక్టోబర్ 31, 2025న.

ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందిన వారు. ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్.”

ఈ రోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు. గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు.

మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతలు మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్‌లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ , అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్-ఖురషీ. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, ఆయన పేరు అబ్దుల్లాహ్. తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్-ఖురషీ రదియల్లాహు తాలా అన్హు.

అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు, ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు, ఆయన సత్య ప్రవక్త అని ధ్రువీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ‘అస్-సిద్దీఖ్’ (సత్యవాది) అని వర్ణించారు (బిరుదునిచ్చారు).

సహీహ్ బుఖారీలో (3675) ఒక సంఘటన గమనించండి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఘనతను గ్రహించండి.

أنَّ رسولَ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ صعِدَ أُحدًا وأبو بَكْرٍ وعمرُ وعثمانُ فرجفَ بِهِم فقالَ رسولُ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ: اثبت أُحُدُ فإنَّما عليكَ نبيٌّ وصدِّيقٌ وشَهيدانِ

ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హుమ్) లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఓ ఉహుద్! స్థిరంగా ఉండు. నీపై ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీద్‌లు (అమరవీరులు) ఉన్నారు.” (బుఖారీ 3675).

ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు. సహాబాలలో అల్లాహ్ వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు (అంటే ప్రవక్త తర్వాత అని భావం). ఆయన ద్వారా హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ జుబైర్, హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సాద్ బిన్ అబీ వక్కాస్ (రదియల్లాహు తాలా అన్హుమ్) వంటి చాలా మంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషర-ఎ-ముబష్షరాలో పరిగణించబడతారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజ్రత్ బిలాల్, హజ్రత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హును ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజ్రత్ అమర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను అడిగారు, “ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆయిషా రదియల్లాహు తాలా అన్హా.” హజ్రత్ అమర్ అంటున్నారు, “నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆమె యొక్క తండ్రి” (అంటే హజ్రత్ ఆయిషా యొక్క తండ్రి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు). (సహీహ్ బుఖారీ, 4358).

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సంపదను తమ సొంత సంపద వలే ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పారు:

«إِنَّ أَمَنَّ النَّاسِ عَلَيَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ أَبُو بَكْرٍ، وَلَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيلًا مِنْ أُمَّتِي لاَتَّخَذْتُ أَبَا بَكْرٍ، وَلَكِنْ أُخُوَّةُ الإِسْلاَمِ وَمَوَدَّتُهُ، لاَ يَبْقَيَنَّ فِي المَسْجِدِ بَابٌ إِلَّا سُدَّ، إِلَّا بَابُ أَبِي بَكْرٍ»

“నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబక్ర్. నా ఉమ్మత్‌లో ఒక స్నేహితుడిని (ఖలీల్) చేసుకోవాలని వస్తే, నేను అబూబక్ర్‌ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజ్రత్ అబూబక్ర్ తలుపు తప్ప మస్జిదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి.” (సహీహ్ బుఖారీ 466, సహీహ్ ముస్లిం 2382).

ఈ హదీసు యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?

إِنَّ أَمَنَّ النَّاسِ عَلَىَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ
(ఇన్న అమన్నన్ నాసి అలయ్య ఫీ సుహబతిహీ వ మాలిహీ)

తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ, ‘అమన్’ – హజ్రత్ అబూబక్ర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకుని ఉంటే, (ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, ‘అల్లాహ్ నన్ను ఖలీల్‌గా చేసుకున్నాడు’) ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్‌గా చేసుకుంటే, అబూబక్ర్‌ని చేసుకునేవానిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబక్ర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబక్ర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్-ఎ-నబవీ ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో, మస్జిద్-ఎ-నబవీకి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇళ్లు కూడా ఉండినవి. అయితే, ఆ మస్జిద్ యొక్క మెయిన్, ముఖ ద్వారం, ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్‌లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు.

ఇంకా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు ఘనతలో, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన మాట వినండి. (సహీహ్ బుఖారీ 3685, సహీహ్ ముస్లిం 2389). అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజ్రత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో, అబూబక్ర్, ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమాను ఏదైతే దూషిస్తారో, వారు ఈ లోకంలో అతి చెడ్డవారు మరియు హజ్రత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు:

إِنِّي كُنْتُ كَثِيرًا أَسْمَعُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «ذَهَبْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَدَخَلْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَخَرَجْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ»

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా చెప్పడం నేను విన్నాను: ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ ప్రవేశించాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ బయలుదేరాము.'” (బుఖారీ 3685, ముస్లిం 2389).

(ఇక్కడ ‘కున్తు అస్మ’ఉ’ అనేది నిరంతరంగా వినేవాడిని అని సూచిస్తుంది). ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో “నేను, అబూబక్ర్, ఉమర్” అని మాటిమాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబక్ర్‌లను, ఉమర్ హజరత్‌లను చాలా ప్రేమించే, గౌరవించేవారు.

అల్లాహ్ దాసులారా, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సత్కార్యాలలో మరియు మంచి పనులలో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు.

ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ఇలా అన్నారు, “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ‘ఈ రోజు నేను అబూబక్ర్‌ను అధిగమిస్తాను.’ ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే… నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?’ నేను చెప్పాను, ‘అంతే మిగిల్చాను’ (అంటే సగం). అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హు తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు?’ ఆయన చెప్పారు, ‘వారికి అల్లాహ్‌ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిల్చి వచ్చాను.’ హజ్రత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, ‘«لَا أُسَابِقُكَ إِلَى شَيْءٍ أَبَدً» నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను.’” (అబూ దావూద్, 1678, షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِلَّا تَنْصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا

మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు.” (తౌబా 9:40).

ఈ ఆయతులో గమనించండి “సానియస్ నైన్” అన్న పదాన్ని, అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి! ఎవరు ఆయన? ఆయనే అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంత గొప్ప బిరుదు, ఘనత! ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి! ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించారు, భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు, తబూక్‌కు ఆయనతో పాటు ప్రయాణించారు, ఆయనతో పాటు హజ్ చేశారు, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశమేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్‌ చేయించారు. మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు.

అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు (సవ్వామ్), రాత్రుల్లో ఎక్కువ ఆరాధన, నమాజ్ చేసేవారు (ఖవ్వామ్), ప్రజలకు చాలా మేలు చేసేవారు (ముహ్సిన్), అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపపడేవారు, మృదు మనస్కుడు (అవ్వాహ్) [1]. ఆయన చాలా ఎక్కువగా ఏడ్చేవారు (బక్కా).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు జనాజాలో (అంత్యక్రియలకు) హాజరయ్యారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు పేదవాడికి తినిపించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَا اجْتَمَعْنَ فِي امْرِئٍ إِلاَّ دَخَلَ الْجَنَّةَ
(మజ్తమ’న ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్నహ్)
ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (సహీహ్ ముస్లిం 1028).

అల్లాహ్, అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు పట్ల సంతోషించు గాక. మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వు గాక. నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు.

أعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ: وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّى (18) وَمَا لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَى (19) إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَى (20) وَلَسَوْفَ يَرْضَى (21)

దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు, (ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు). మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. (లైల్ 92:17-21).

ఈ ఆయతులు అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లాహ్ అవతరింపజేశాడు.

الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمدٍ وعلى آله وصحبه أجمعين أما بعد

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

ఓ ముస్లిములారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రజలను ఓదార్చారు, ఆ తర్వాత నిలబడి అల్లాహ్‌ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, “ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్‌ను పూజిస్తున్నారో, నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించడు.” ఆపై హజ్రత్ అబూబక్ర్ ఈ ఆయత్ పఠించారు:

وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ أَفَإِنْ مَاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلَى أَعْقَابِكُمْ وَمَنْ يَنْقَلِبْ عَلَى عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللَّهَ شَيْئًا وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ

“ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు (ఇస్లాం నుంచి) వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి- పోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3:144).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హును వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది.

ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు, మతభ్రష్టులు (ముర్తద్దీన్‌ల)తో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ ప్రతులను జమా చేయించారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు హిజ్రీ 13వ సంవత్సరంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా, 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ రెండు సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించు గాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక.

చివరగా, ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శప్రాయులు.

كَانَ السَّلَفُ يُعَلِّمُونَ أَوْلَادَهُمْ حُبَّ أَبِي بَكْرٍ وَعُمَرَ كَمَا يُعَلِّمُونَ السُّورَةَ مِنَ الْقُرْآنِ

“సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్‌ల పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు.” (మువత్తా మాలిక్ 1/255. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్నహ్ వల్ జమాఅహ్ 2325. 7/1313).

అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[1] ‘అవ్వాహ్’ అన్న పదంలో ఈ క్రింది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి:

ఎక్కువగా ప్రార్థించేవాడు/ప్రార్థనల్లో మునిగిపోయేవాడు: అల్లాహ్‌ను చాలా ఎక్కువగా స్మరించేవాడు, వినయంతో, దీనంగా ఆయనను ప్రార్థించేవాడు.

ఆయన దయను కోరేవాడు: అల్లాహ్‌ దయ కోసం తీవ్రంగా కోరుకునేవాడు.

పశ్చాత్తాపపడేవాడు: తన పాపాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడి, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకునేవాడు.

దీనంగా, వినయంగా ఉండేవాడు: అల్లాహ్‌ పట్ల అమితమైన భయం, గౌరవం కలిగి, వినయంగా ప్రవర్తించేవాడు.

మంచివాడు/దయాగుణం కలవాడు: ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి, వారికి సహాయం చేసేవాడు.

నిట్టూర్చేవాడు: అల్లాహ్‌ పట్ల తన ప్రేమ, భయం లేదా ఇతరుల పట్ల తన కరుణ వల్ల దీర్ఘంగా నిట్టూర్చేవాడు.

[2] ఖురాన్ సంకలన చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నప్పుడు ఖురాన్ వివిధ పద్ధతులలో వ్రాయబడింది. ఖురాన్ వచనాలు (ఆయత్‌లు) మరియు సూరాలు రాసిన కొన్ని వస్తువులు:

తోలు పత్రాలు (چرم): జంతువుల తోలుపై రాసినవి.
ఎముకలు (كتف): ఒంటె వంటి జంతువుల భుజం ఎముకలు లేదా ఇతర ఎముకలు.
తాటి ఆకులు (سعف النخيل): తాటి చెట్టు ఆకులపై రాసినవి.
రాతి పలకలు (حجارة): సన్నని, చదునైన రాళ్లపై రాసినవి.
కలప పలకలు (ألواح خشبية): చెక్క పలకలపై రాసినవి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత, యమామా యుద్ధంలో చాలా మంది ఖురాన్ హాఫిజ్‌లు (ఖురాన్‌ను కంఠస్థం చేసినవారు) మరణించారు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) అబూబకర్ అస్-సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)కు ఖురాన్‌ను ఒకే గ్రంథంగా సంకలనం చేయాలని సూచించారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ను ఈ పనికి నియమించారు. జైద్, తన బృందంతో కలిసి, పైన పేర్కొన్న వివిధ వస్తువులపై వ్రాయబడిన ఖురాన్ వచనాలను సేకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, కనీసం ఇద్దరు సాక్షులతో ధృవీకరించిన తర్వాత, వాటిని ఒక క్రమంలో సంకలనం చేశారు. ఈ సంకలన పత్రాలను “సుహుఫ్” (పత్రాలు/పేజీలు) అని పిలిచేవారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42537

తౌహీద్ (ఏక దైవారాధన) రక్షణ కవచం – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

జుమా ఖుత్బా: తౌహీద్ రక్షణ కవచం
https://youtu.be/ywb7-3fUjCo [17 నిముషాలు]
ఖతీబ్ (అరబీ): షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ . జుల్ఫీ, సఊది అరేబియ

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క ప్రాముఖ్యతను మరియు షిర్క్ (బహుదైవారాధన) యొక్క ప్రమాదాలను వివరిస్తుంది. తౌహీద్ అత్యున్నత ఆరాధన అని, షిర్క్ అత్యంత ఘోరమైన పాపమని వక్త నొక్కిచెప్పారు. తాయెత్తులు కట్టుకోవడం వంటి షిర్క్‌కు దారితీసే కార్యాలను నివారించాలని, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ సద్భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తౌహీద్‌ను ఎలా కాపాడారో, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారో హుదైబియా చెట్టు ఉదంతం ద్వారా వివరించారు. మనల్ని మరియు మన కుటుంబాలను తౌహీద్‌పై స్థిరంగా ఉంచమని అల్లాహ్‌ను ప్రార్థించాలని, ఇస్లాం మరియు సున్నత్ అనే అనుగ్రహాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

أَلْحَمْدُ لِلَّهِ الْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا
(అల్ హమ్దు’లిల్లాహిల్ ముతవహ్హిది బిల్ జలాలి బికమాలిల్ జమాలి త’అజీమన్ వ తక్బీరా)

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا
(అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ తఖ్దీరన్ వ తద్బీరా)

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
(వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ లియకూన లిల్ ఆలమీన నజీరా)

صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ
(సల్లల్లాహు వ సల్లమ అలైహి తస్లీమన్ కసీరా, అమ్మా బ’అద్)

الْحَمْدُ لِلهِ اَلْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا هُوَ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ؛ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا، صَلَّى اَللهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ:

నేను మీకూ, అలాగే నాకు కూడా అల్లాహ్‌ (సుబహనహు వ త’ఆలా) భయభీతిని కలిగి ఉండాలని బోధిస్తున్నాను. అల్లాహ్‌కు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీద్‌ను (అల్లాహ్‌ ఏకత్వాన్ని) స్థాపించడం, షిర్క్‌ను (ఆయనకు భాగస్వాములను కల్పించడాన్ని) నివారించడం. తౌహీద్‌ అన్ని ఆరాధనలలోకెల్లా గొప్పది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు. షిర్క్‌ అన్ని పాపాలలోకెల్లా అత్యంత అసహ్యకరమైనది,  చెడ్డది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ నుండి అత్యంత దూరంలో ఉంటారు.

అవును, తౌహీద్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇది దాసులపై అల్లాహ్‌కు ఉన్న హక్కు. వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి. కలహాలు, సంక్షోభాలు, రోగాలు వారిని ఆవరించాయి. వారిలో కొందరు తాయెత్తులు, కడియాల మాయలో పడి ఉన్నారు, వాటిని తమకు, తమ పిల్లలకు, తమ వాహనాలకు, తమ ఇళ్లకు కట్టుకుంటారు. అవి కీడును దూరం చేస్తాయని, కంటిదిష్టిని తొలగిస్తాయని, మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు. కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా?

(مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ)
“ఎవరైతే తాయెత్తు కట్టుకుంటారో, వారు షిర్క్‌ చేసినట్లే.” (ముస్నద్ అహ్మద్ 17422. దీని సనద్ బలమైనది).

అల్లాహ్‌ ను కాకుండా వేరొకరిని ఆశ్రయించినా, వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం! విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు, కానీ అతను (షిర్క్ చేసే వాడు) కలుషితమైన దానిని త్రాగాడు. విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు, కానీ అతను పదిమంది ప్రభువులను ఆరాధించాడు:

(ءأَرْبَابٌ مُّتَّفَرّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ)
అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి!)” (యూసుఫ్ 12:39).

ఇక మృతులను పూజించేవాడు ఎక్కడ, ఎన్నటికీ మరణించని జీవించియున్న అల్లాహ్ ని పూజించేవాడు ఎక్కడ?

(هَلْ يَسْتَوِيَانِ مَثَلاً الْحَمْدُ للَّهِ بَلْ أَكْثَرُهُمْ لاَ يَعْلَمُونَ)
మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.” (నహ్ల్ 16:75).

అయినప్పటికీ, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి. అంటే తౌహీద్ ను ప్రేమించడం, ప్రోత్సహించడం, దానిని స్థాపించడం. షిర్క్ ను అసహ్యించుకోవడం, షిర్క్ ను వారించడం. ఇది ప్రాథమిక విషయం. వీటిని మనం మన భార్యా, పిల్లలు, మన బంధువులు, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో నాటాలి. వారిలో అల్లాహ్ పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి. ఆయన గొప్ప ఆజ్ఞ తౌహీద్. ఆయన గొప్ప నిషేధం షిర్క్. అల్లాహ్ జల్ల వ’ఉలా తన ప్రవక్తకు తౌహీద్‌ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు:

{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اَللَّهُ}
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ” (ముహమ్మద్ 47:19).

ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అల్లాహ్ ఇచ్చినప్పుడు, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ.. కాబట్టి, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ. అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం: “మేము తౌహీద్‌ను అర్థం చేసుకున్నాము, అయితే దానిని మన పాఠశాలల్లో, మసీదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి?” అంటారు కదా కొందరు ఇలా. ఇలా అనడం తప్పు విషయం. అల్లాహ్ నేర్చుకోమని ఏ విషయం అయితే చెబుతున్నాడో, దానిని ఇలా విస్మరించడమా?

ఓ విశ్వాసులారా: తౌహీద్‌ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన.

{الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ}
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించేవారు, వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి.” (ఫత్ హ్ 48:6).

ఎంత మంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని, సత్యం బలహీనపడడాన్ని చూసినప్పుడు, అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని, సత్యం క్షీణిస్తుందని భావిస్తారు? ఇది అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఊహ. ఇది ఆయన స్వభావానికి, గుణాలకు తగనిది.

ఎంత మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు, అల్లాహ్‌ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు? ఇది నిస్సందేహంగా తౌహీద్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మీ పరిస్థితిని మీరే చూసుకోండి, మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు, దాన్ని ఎంత ఖండిస్తారు? మీరు ప్రతి లోపానికి అర్హులు, అలాంటిది మీ ప్రభువు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి, దురాలోచన కలిగి ఉంటారు, ఆయన పరిపూర్ణ గుణాలన్నింటికీ అర్హుడు?

ఇమామ్ అల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్‌ రహిమహుల్లాహ్ రచించిన ‘కితాబుత్-తౌహీద్‌’లో ఒక అధ్యాయం ఉంది, దాని శీర్షిక:

حِمَايَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِمَى التَّوْحِيدِ وَسَدِّهِ طُرُقَ الشِّرْكِ
(హిమాయతున్-నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ హిమత్-తౌహీద్ వ సద్దిహీ తురుఖష్-షిర్క్)
తౌహీద్‌ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా రక్షించారు, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారు.”

ఇందులో, ఆ ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) షిర్క్ కు దారి తీసే మార్గాలను మూసివేశారు, స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ, తౌహీద్ ను రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా.

తౌహీద్‌ను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము: హజ్రత్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హుదైబియాలోని చెట్టు కింద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బైఅత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్పారు: “బైఅత్ జరిగిన తర్వాత సంవత్సరం మేము ఆ చెట్టు దగ్గరి నుండి దాటిపోయాము, కాని మేము దానిని మరచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము.” (బుఖారీ 4162, 4163, ముస్లిం 1859).

ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ చెప్పారు, “దాని అదృశ్యం, అంటే అది కనబడకుండా ఉండడం, అల్లాహు త’ఆలా దయలో ఓ భాగం. అది కనిపించి ఉన్నట్లయితే, అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది”. (షర్హ్ ముస్లిం).

తరువాత హజ్రత్ ఉమర్‌ రజియల్లాహు అన్హు కాలంలో, ప్రజలు దాని పట్ల మరొకసారి ఫిత్నాలో పడ్డారు. అప్పుడు ఆయన దానిని నరికివేయమని ఆజ్ఞాపించారు, షిర్క్‌కు దారితీసే మార్గాన్ని మూసివేయడానికి; ఎందుకంటే వారు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు. అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన భయపడ్డారు. (ఫత్హుల్ బారీ 7/448 ثُمَّ وَجَدْتُ عِنْد بن سَعْدٍ بِإِسْنَادٍ صَحِيحٍ عَنْ نَافِعٍ أَنَّ عُمَرَ بَلَغَهُ أَنَّ قَوْمًا يَأْتُونَ الشَّجَرَةَ فَيُصَلُّونَ عِنْدَهَا فَتَوَعَّدَهُمْ ثُمَّ أَمْرَ بِقَطْعِهَا فَقُطِعَتْ).

ఓ అల్లాహ్‌, మమ్మల్ని తౌహీద్‌పై జీవింపజేయి, తౌహీద్‌పై మరణింపజేయి, ప్రళయదినాన మమ్మల్ని తౌహీద్ పై లేపు. అస్తగ్ఫిరుల్లాహ లీ వ’లకుమ్ ఫ’స్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్’రహీం.

الْحَمْدُ لِلهِ الَّذِيْ هَدَانَا لِنِعْمَةِ الْإِسْلَامِ وَالتَّوْحِيدِ وَالسُّنَّةِ الْبَيْضَاءِ، وَالصَلَاَةُ وَالسَلَاَمُ عَلَى إمَامِ الْحُنَفَاءِ، أَمَّا بَعْدُ:
అల్ హమ్దు’లిల్లాహిల్లజీ హదానా లిని’అమతిల్ ఇస్లామి వత్-తౌహీది వస్-సున్నతిల్ బైదా, వస్-సలాతు వస్-సలాము అలా ఇమామిల్ హునఫా, అమ్మా బ’అద్.

ఇస్లాం, తౌహీద్‌, స్పష్టమైన సున్నత్ అనే గొప్ప అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్‌కు స్తోత్రములు. తౌహీద్ పై స్థిరంగా ఉండి, అటూ ఇటూ తొంగని, వంగనివారి నాయకులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి, శుభాలు వర్షించుగాక. ఆమీన్. అమ్మాబాద్!

ఓ షిర్క్‌ను, దానిని పాటించేవారిని వదలి, తౌహీద్‌ను పాటించేవాడా, ఓ బిద్అత్‌ను, దానిని పాటించేవారిని వదలి సున్నత్‌ను పాటించేవాడా: నీవు తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌ మరియు సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా, దాని విలువను గ్రహిస్తున్నావా?

మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా (సౌదీయాలో జరిగిన ఖుత్బా, అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది), ఏంటి అది? అల్లాహ్ దయ వల్ల మనం మస్జిదులు, శ్మశాన వాటికలలోకి, ఖబ్రిస్తాన్ లలోకి ప్రవేశించినప్పుడు, షిర్క్ లేదా బిద్అత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము. విగ్రహాలను పూజించకుండా, సాలిహీన్‌లను, సమాధి చేయబడిన వారిని, ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లాహ్‌ గొప్ప దయను నీవు గుర్తుకు తెచ్చుకున్నావా?

నీ మూడవ తండ్రి ఇబ్రహీం (అలైహిస్సలాం) చేసిన దుఆ నీవు చేస్తూ ఉన్నావా?
(మూడవ తండ్రి ఎందుకు అన్నారండీ? మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కాదా? ధర్మమంతా ప్రేమగా నేర్పారు కదా).

{وَاجْنُبْنِي وَبَنِيَّ أَنْ نَعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِنَ النَّاسِ}
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు, నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి” (ఇబ్రాహీం 14:35-36).

ఇబ్నుల్-ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను – ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు – నేను ఆయనను దాని గురించి అడిగాను, ఆయన అన్నారు: అల్లాహ్ నాకు సున్నత్ ప్రసాదించాడు, దాని జ్ఞానం ప్రసాదించాడు. మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో, ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో, వాటి నుండి విముక్తిని కలిగించాడు. ఇలా కలిగించిన ఆ అల్లాహ్ ను నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను. అది నన్ను సంతోష పెట్టింది, చివరికి నన్ను ఏడ్పించింది”. (మదారిజుస్సాలికీన్ 3/127).

فاللهم لَكَ الحَمْدُ عَلَى نِعْمَةِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ، بِبِلَادِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ.
(అల్లాహుమ్మ లకల్ హమ్దు అలా ని’అమతిత్ తౌహీది వస్-సున్నతి ఫీ బిలాదిత్ తౌహీది వస్-సున్న)
ఓ అల్లాహ్‌, తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌, సున్నత్ అనే గొప్ప అనుగ్రహానికి నీకే ప్రశంసలు, స్తోత్రములు.

اللَّهُمَّ ثَبِّتْنَا عَلَى ذَلِكَ إِلَى يَوْمِ نَلْقَاكَ
(అల్లాహుమ్మ సబ్బిత్నా అలా జాలిక ఇలా యౌమి నల్ఖాక)
ఓ అల్లాహ్! మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు.

وَعُمَّ بِالتَّوْحِيدِ وَالسُّنَّةِ أَوْطَانَ الْمُسْلِمِينَ
(వ’ఉమ్మ బిత్-తౌహీది వస్-సున్నతి అవ్తానల్ ముస్లిమీన్)
ముస్లింల దేశాలను తౌహీద్, సున్నత్ తో నింపు.

اللهم كَمَا هَدَيْتَنا لِلإِسْلاَمِ فلاَ تَنْزِعْهُ مِنّا حَتَّى تَتَوَفَّانا وَنحن مُسْلِمونَ.
(అల్లాహుమ్మ కమా హదైతనా లిల్ ఇస్లామి ఫలా తన్జి’అహు మిన్నా హత్తా తతవఫ్ఫానా వ నహ్ను ముస్లిమూన్)
ఓ అల్లాహ్‌, నీవు మమ్మల్ని ఇస్లాంపై నడిపించినట్లే, మేము ముస్లింలుగా మరణించే వరకు దానిని మమ్మల్నుండి దూరం చేయకు.

اللهم اجْعَلْنَا مِمَّنْ يَلْقَاكَ لَا يُشْرِكُ بِكَ شَيْئَاً.
(అల్లాహుమ్మ జ’అల్నా మిమ్మన్ యల్ఖాక లా యుష్రికు బిక షైఆ)
ఓ అల్లాహ్‌, నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ اجْعَلْنَا أغَنْى خَلْقِكَ بكَ، وأفْقَرَ خَلْقِكَ إليْكَ.
(అల్లాహుమ్మ జ’అల్నా అగ్నా ఖల్ఖిక బిక వ అఫ్ఖర ఖల్ఖిక ఇలైక)
ఓ అల్లాహ్‌, నీ తప్ప నీ సృష్టిలో ఎవరి అవసరం లేకుండా చేయి, మరియు నీ సృష్టిలోకెల్లా నీ సన్నిధిలో అత్యంత పేదవారిగా ఉంచు.

اللَّهُمَّ إِنّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ.
(అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకన్-నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్)
ఓ అల్లాహ్‌, ఎన్నటికీ మారకుండా, తొలగిపోకుండా ఉండే శాశ్వతమైన అనుగ్రహాలు మేము నిన్ను అడుగుతున్నాము.

اللهم وفِّقْ إِمَامَنَا خَادِمَ الحَرَمَينِ الشَّرِيْفَيْنِ، وَوَلِيَّ عَهْدِهِ لِمَا فِيْهِ عِزُّ الإِسْلامِ وَصَلاحُ المُسْلِمِيْنَ. وَارْحَمْ وَالِدَهُمُ الإِمَامَ المُؤَسِّسَ، وَالإِمَامَ المُجَدِّدَ.
(అల్లాహుమ్మ వఫ్ఫిఖ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్-షరీఫైని వ వలియ్య అహదిహీ లిమా ఫీహి ఇజ్జుల్ ఇస్లామి వ సలాహుల్ ముస్లిమీన్, వర్’హమ్ వాలిదహుమల్ ఇమామల్ ముఅస్సిస వల్ ఇమామల్ ముజద్దిద్)
ఓ అల్లాహ్! మా నాయకుడు (అంటే రాజు), రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి, ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి. వారి తండ్రి, వ్యవస్థాపక ఇమామ్ (మలిక్ అబ్దుల్ అజీజ్) మరియు పునరుద్ధరణ చేసిన ఇమామ్ (ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్) రహిమహుముల్లాహ్ పై నీవు దయ చూపు.

اللهم احْفَظْ أَمْنَنَا وَإيْمَانَنَا وَجُنُودَنَا وَحُدُوْدَنَا، وَمُقَدَّسَاتِنَا وَقُدْسَنَا.
(అల్లాహుమ్మ హ్ఫజ్ అమ్ననా వ ఈమాననా వ జునూదనా వ హుదూదనా వ ముఖద్దసాతినా వ ఖుద్సనా)
ఓ అల్లాహ్‌, మా భద్రతను, మా విశ్వాసాన్ని, మా సైనికులను, మా సరిహద్దులను, మా పవిత్ర స్థలాలను, మా బైతుల్ మఖ్దిస్ ను రక్షించు, కాపాడు.

اللهم يَا ذَا النِّعَمِ الَّتِيْ لا تُحْصَى عَدَدًا: نَسْأَلُكَ أَنْ تُصَلِّيَ وَتُسَلِّمَ عَلَى مُحَمَّدٍ أَبَدَاً.
(అల్లాహుమ్మ యా జన్ని’అమిల్లతీ లా తుహ్సా అదదా, నస్అలుక అన్ తుసల్లియ వ తుసల్లిమ అలా ముహమ్మదిన్ అబదా)
ఓ అల్లాహ్‌, లెక్క లేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా: ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎల్లప్పుడూ శాంతిని, శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42249

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

బైతుల్ మఖ్దిస్ (మస్జిద్ అల్ అఖ్సా) యొక్క పది ప్రత్యేకతలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

మొదటి ఖుత్బా :-  

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి. మరియు ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. దైవదూతలలో కొందరికి కొందరిపై మరియు దైవప్రవక్తలలో కొందరికి కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. మరియు సమయాలలో, ప్రదేశాలలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యత ప్రసాదించాడు. అందులో నుండి ఒకటి బైతుల్ మఖ్దిస్. దీనిని (అల్-ఖుద్స్) అని పిలుస్తారు. దీనికి ఇతర ప్రదేశాలపై ఆధిక్యత ఇవ్వబడింది. ఇది అల్లాహ్ యొక్క వివేకము మరియు ఆయన యొక్క గొప్ప ఎంపిక కూడా. అల్లాహ్ ఇలా అంటున్నాడు:  

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)  (28:68)

బైతుల్ మఖ్దిస్ అనగా: షిర్క్ లాంటి దురాచారాల నుండి పవిత్రమైన ఇల్లు. 

ప్రవక్త గారు తెచ్చిన షరియత్ (ధర్మం) లో ఏ ఒక్క భాగాన్నైనా ద్వేషించుట | ఇస్లాం నుండి బహిష్కరించే విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు,మరియు దరూద్ తరువాత

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండి, ఆయనను గౌరవించండి, ఆయన మాటకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడమాకండి.

గుర్తుంచుకోండి “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదూర్ రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన దాసుడు) ప్రవచనము పఠించిన తర్వాత (సాక్ష్యం ఇచ్చిన తర్వాత) అల్లాహ్ ను, ప్రవక్తను మరియు ఇస్లాం ధర్మాన్ని ప్రేమించుటము, గౌరవించటడం ఖచ్చితమవుతుంది. ఈ గౌరవం అనేది (అఖీదా) విశ్వాసాలకు, ఆరాధనకు మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించినదైనా సరే. ఈ కలిమ-ఎ-షహాదత్ ను పఠించడం, గౌరవించటటం అంటే అల్లాహ్ ను, ప్రవక్తను మరియు ఇస్లాం ధర్మాన్ని గౌరవించి దానిని ఆచరించటం మరియు సత్యంగా భావించటంతోనే రుజువు అవుతుంది. అల్లాహ్ ఆయనను, ప్రవక్తను విశ్వసించడంలోనే ఆయన గౌరవం అనీ ప్రవక్త మరియు ఇస్లాం ధర్మంతో తోడుగా ఈ ప్రస్తావన చేశారు. అల్లాహ్ ఈ విధంగా ఆదేశిస్తున్నారు:

దైవదూతల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము:  దైవదూతల పై విశ్వాసం

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا. يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవ భీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ]
(వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము.)

కనుక అల్లాహ్ తో భయపడండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి దూరంగాఉండండి.

తెలుసుకోండి! ఇస్లాంలో దైవదూతలపై విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇస్లాం యొక్క విశ్వాస మూల స్తంభాలలో రెండవది. అల్లాహ్ కు మరియు ఆయన సృష్టికి, ఆయన ప్రవక్తలకు మధ్యవర్తులు వీరే. ఈ దైవదూతలు అదృశ్య సృష్టి, ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉంటారు. వారు  ఎటువంటి దైవత్వ లక్షణాలను కలిగిలేరు, అల్లాహ్ వారిని నూర్ (కాంతి)తో సృష్టించాడు

వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపుతారు, ఆజ్ఞలను   శిరసావహించే శక్తిని అల్లాహ్ వారికి ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

[لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ]
(వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు)

మరొక చోట ఇలా సెలవిస్తున్నాడు:

[وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ]
(మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.)

అదేవిధంగా దైవ దూతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.  

[وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ]
(మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) మేరాజ్ లో జరిగిన సంఘటన గురించి ఇలా తెలియచేస్తున్నారు: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) వారిని బైతె మామూర్ వద్దకు తీసుకు వెళ్ళడం జరిగింది. ప్రవక్త గారు దాని గురించి జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వారిని ప్రశ్నించగా ఆయన ఇలా తెలియ చేశారు – “దీనిని బైతె మామూర్ అంటారు. ఇందులో ప్రతిరోజూ డెబ్బై వేల మంది దైవ దూతలు నమాజ్ చదువుతారు. ఒక సారి చదివిన వారికి మళ్ళీ అవకాశం లభించదు. అదే వారి చివరి ప్రవేశం అవుతుంది“. (బుఖారి:3207- ముస్లిం:164)

[1] వారి ఉనికి పై విశ్వాసం

[2] వారిని ప్రేమించాలి, వారిని ద్వేషించే వారు మరియు వారితో శతృత్వం ఉంచేవారు ఆవిశ్వాసులు (కాఫిర్) అవుతారు.

అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[لِلۡمُؤۡمِنِينَ٩٧ مَن كَانَ عَدُوّٗا لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبۡرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ ٱللَّهَ عَدُوّٞ لِّلۡكَٰفِرِينَ]

(అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు.)

[3] మనకు తెలిసిన దైవదూతలను విశ్వాసించడం. ఉదా: జిబ్రాయిల్ అలైహిస్సలాం. అదేవిధంగా మనకు తెలియని దైవదూతలను కూడా సంపూర్ణంగా విశ్వసించడం.

[4] దైవదూతలు కలిగి ఉన్న సహజసిద్ద లక్షణాలపై (వారు కలిగిఉన్న పోలికపై) విశ్వాసం తేవడం. ఉదా: జిబ్రాయిల్ దైవదూత ఆయన సహజసిద్ద లక్షణాలలో ఒకదాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తెలియచేశారు. నేను జిబ్రాయిల్ దూతను అతని అసలు రూపంలో చూశాను ఆయన ఆరు వందల రెక్కలు కలిగిఉన్నాడు. అవి ఆకాశపు అంచులను సైతం కప్పి ఉన్నాయి. (బుఖారి: 3233,3232 – ముస్లిం: 174,177 )

దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో మానవ రూపంలోకి కూడా మారవచ్చు. ఉదా: అల్లాహ్ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని మర్యమ్ (అలైహస్సలాం) దగ్గరికి పంపినప్పుడు ఆయన మానవరూపం లోనే వచ్చాడు. అదేవిధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చినప్పుడు. ప్రవక్త గారు సహాబాల సమావేశంలో కూర్చొనిఉండగా ఇంతలో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. ఇస్లాం, ఇహ్సాన్, ఖియామత్ మరియు దాని సూచనల గురించి ప్రశ్నించాడు. ప్రవక్త గారు వాటన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అతను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి సహాబాలు ప్రశ్నించగా  అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం “ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (ముస్లిం-9).

మరియు అదేవిధంగా ఇబ్రహీం మరియు లూత్ ప్రవక్తల వద్దకు వచ్చిన దైవదూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు. (షరహ్ సలాసతు ఉసూల్)

దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూతల్లో కెల్లా గొప్పవాడు  అల్లాహ్ తఆలా ఆయన గుణాలను తెలియచేస్తూ ఇలా అంటున్నాడు .

[إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ١٩ ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ]
(నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!)

మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[مُّطَاعٖ ثَمَّ أَمِينٖ]
(అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు)  

మరోకచోట ప్రవక్త గారి ప్రస్తావనతో జిబ్రాయీల్ దూత ప్రస్థావనను చేస్తూ ఆయన ఎంత గొప్పవాడో తెలియ చేయడం జరిగినది.

[ عَلَّمَهُۥ شَدِيدُ ٱلۡقُوَىٰ٥ ذُو مِرَّةٖ فَٱسۡتَوَىٰ]

(అసాధారణ శక్తిగల దైవదూత (జిబ్రాయీల్) అతనికి ఖుర్ఆన్ నేర్పాడు. అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు)

అంటే ప్రవక్త వారికి వహీ నేర్పించినది జిబ్రయీల్ అలైహిస్సలాం వారు. ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞా పాలన చేస్తారు. ప్రవక్తలకు వహీ అందచేస్తారు. ఆ వహీ గురించి షైతానులకు తెలియకుండా కాపాడుతాడు. ఇది అల్లాహ్ వైపునుంచే ఆ వహీ ని శక్తి సంపన్నుడు అయిన దూత ద్వారా పంపాడు.

అల్లాహ్ అంటున్నాడు [ذُو مِرَّةٖ] అంటే అంతర్గతంగా, బహిర్గతంగా  ఏర్పడే ఆపద నుండి రక్షించే శక్తి ఆయనకు ప్రసాదించబడింది. అనగా ఆయన అంత గొప్పగా సృష్టించబడ్డాడు.     

[5] దైవదూతల యొక్క ఏ సుగుణాల గురిచి మనకు తెలుసో వాటిపై విశ్వాసముంచాలి. ఉదా: సిగ్గు , బిడియం దీనికి ఆధారంగా ప్రవక్త గారి హదీస్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి గురించి అనడం జరిగినది “ఏమిటి నేను దైవ దూతలు సైతం సిగ్గు పడేటు వంటి వ్యక్తి తో నేను సిగ్గు పడకూడదా” (ముస్లిం 2401)   

అల్లాహ్ వేటినైతే ద్వేషిస్తాడో దైవ దూతలు కూడా వాటిని ద్వేషిస్తారు. అందకే వారు కుక్క మరియు చిత్ర పటాలు ఉన్న గృహం లోకి ప్రవేశించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియ చేస్తున్నారు : “దైవ దూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించరు, ఏ ఇంట్లోనైతే కుక్క ఉంటుందో మరియు అందులోకి ప్రవేశించరు మరియు ఎందులోనైతే ప్రాణ జీవుల పటాలు ఉంటాయో“. (బుఖారి 3235- ముస్లిం 2106)

ఏ విషయాల నుండి అయితే మనిషికి ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాల నుండి దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉల్లి మరియు వెల్లుల్లి లాంటి దుర్వాసన వచ్చే పదార్థాలు తిన్న వ్యక్తిని మస్జిద్ కి రావడం నుండి వారించారు. మరియు దుర్వాసన కలిగినటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ఆజ్ఞ పరిధిలోకి వస్తుంది ఉదా: సిగరెట్

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు – “ఎవరైతే ఉల్లి మరియు వెల్లుల్లి తిన్నారో వారు మా మస్జిద్ దగ్గరకు రావద్దు. ఎందుకంటే దైవదూతలకు ఆ విషయాల నుండి ఇబ్బంది కలుగుతుంది, ఏ విషయాల నుండి అయితే ఆదం సంతతికి ఇబ్బంది అవుతుందో“. (ముస్లిం 564)

[6] సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞకు అనుగుణంగా వారు ప్రతి సాధారణమైన పనిని మరియు ప్రత్యేకమైన పనిని చేస్తారు. సాధారణమైన పని అనగా ఉదాహరణకు అల్లాహ్ యొక్క పరిశుద్ధతను కొనియాడటం మరియు ఎటువంటి అలసట లేకుండా ఉదయం సాయంత్రం ఆయనను ఆరాధించుటం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[فَٱلتَّٰلِيَٰتِ ذِكۡرًا ]
(మరి అల్లాహ్ ఉపదేశాన్ని పఠించే వారితోడు)

అందులో కొంతమంది దైవదూతలకు కొన్ని ప్రత్యేక పనులు అప్పగించబడ్డాయి. ఉదాహరణకి జిబ్రయీల్ దూత వహీ ని ప్రవక్తల వరకు చేరవేస్తారు. మరియు ఇతర దైవదూతలు కూడా ఈ వహీని అందజేసే పని కూడా చేసి ఉండవచ్చు.  అల్లాహ్ఈ విధంగా అంటున్నాడు.

[فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا٥ عُذۡرًا أَوۡ نُذۡرًا٦ ]
(జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా ! సాకులు లేకుండా చేయడానికి హెచ్చరించడానికి )

ఆ దైవదూతలు ప్రవక్తల పై అల్లాహ్ యొక్క వహీని తీసుకొస్తారు.

ఒక ఉదాహరణ: మీకాయిల్ అలైహిస్సలాం వారికి వర్షం కురిపించే బాధ్యత అప్పగించడం జరిగింది. మరియు అదే విధంగా శంఖం పూరించే దైవ దూత కూడా నియమించబడి ఉన్నాడు ఆయన పేరు ఇస్రాఫీల్. శంఖం పూరించడం అనగా హదీసులో వస్తుంది – శంఖం ఎప్పుడైతే పూరించబడుతుందో ఆరోజున ప్రళయం సంభవిస్తుంది మరియు ప్రజలందరూ సమాధుల నుండి లేచి నిల్చుంటారు

ఈ ముగ్గురు దైవదూతలు గొప్పవారు మరియు వారికి ప్రసాదించబడిన కార్యాలు కూడా గొప్పవే. జీవితానికి సంబంధించినవి  జిబ్రాయిల్ దూతకు వహీ అందజేసే బాధ్యత, అది హృదయ జీవితానికి సంబంధించింది. మీకాయిల్ దూతకు వర్షం కురిపించే బాధ్యత, అది భూజీవితానికి సంబంధించినది. మరియు ఇస్రాఫీల్ దూతకు శంఖం పూరించే బాధ్యత అనగా అప్పుడు మృతదేహాలకు మళ్లీ తిరిగి జీవితం ప్రసాదించబడుతుంది

మరొక దైవదూత పేరు మలకుల్ మౌత్. ఆయనకు ప్రాణం తీసే బాధ్యత అప్పగించడం జరిగింది. అల్లాహ్  ఈ విధంగా అంటున్నాడు.

 [۞قُلۡ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلۡمَوۡتِ ٱلَّذِي وُكِّلَ بِكُمۡ ثُمَّ إِلَىٰ رَبِّكُمۡ تُرۡجَعُونَ]
(వారితో ఇలా అను: “మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.”)

ఈ మలకుల్ మౌత్ దూతను ఇజ్రాయిల్ అని అందరూ పిలుస్తారు. కానీ ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా మనకు ఆధారం లభించదు. కనుక మనం కేవలం ఖుర్ఆన్ లో ఉన్నట్లుగా మలకుల్ మౌత్ అని మాత్రమే పిలవాలి. మరియు ఈ మలకుల్ మౌత్ దూతకు సహాయపడే దైవదూతలు కూడా ఉన్నారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.  

[وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۖ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُنَا وَهُمۡ لَا يُفَرِّطُونَ ]

(ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు)

ఈ వాక్యంలో ఉన్న (رُسُلُنَا) అనే పదానికి అర్థం దైవదూతలు అని. మరియు ఈ దైవదూతలే మలకులు మౌత్ దూతకు సహాయపడతారు. అల్లాహ్  యొక్క ఆజ్ఞలో (لَا يُفَرِّطُونَ) ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే వారికి ప్రసాదించబడినటువంటి బాధ్యతలో వారు ఎలాంటి అశ్రద్ద వహించరు .

అదేవిధంగా కొంతమంది దైవదూతలు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటారు. వారు అల్లాహ్ స్మరణ చేసేటువంటి సభలను మరియు జ్ఞానం నేర్చుకునేటువంటి సభలను వెతుకుతూ ఉంటారు. వాటిలో నుండి ఏదైనా సభ వారికి కనపడితే వారు ఒకరినొకరు పిలుచుకొని ఆ సభలలో కూర్చుని ఆ సభను ఈ ప్రపంచ ఆకాశం వరకు తమ రెక్కలతో కప్పి ఉంచుతారు.

అదేవిధంగా దైవదూతలలో మరికొంతమంది మానవుల కర్మలను భద్రపరచడానికి, వాటిని లిఖించి ఉంచడానికి నియమించబడి ఉన్నారు. ప్రతి వ్యక్తితో పాటు ఇద్దరు దైవదూతలు ఉంటారు, ఒకరు అతని కుడివైపున మరొకరు అతని ఎడమవైపున ఉంటారు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు .

[إِذۡ يَتَلَقَّى ٱلۡمُتَلَقِّيَانِ عَنِ ٱلۡيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٞ١٧ مَّا يَلۡفِظُ مِن قَوۡلٍ إِلَّا لَدَيۡهِ رَقِيبٌ عَتِيدٞ]

((జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి – అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే – అతడు ఏ మాటనూ పలకలేడు.)

మరొకచోట ఇలా తెలియజేస్తున్నాడు .

[وَإِنَّ عَلَيۡكُمۡ لَحَٰفِظِينَ١٠ كِرَامٗا كَٰتِبِينَ١١ يَعۡلَمُونَ مَا تَفۡعَلُون]
(నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు (వారు మీ ఖర్మలను నమోదు చేసే ) గౌరవ నీయులైన లేఖకులు మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా !)

అదేవిధంగా సమాధిలో మనిషిని ప్రశ్నించడానికి కొంతమంది దైవదూతలు నియమించబడి ఉన్నారు. ఎప్పుడైతే మనిషిని సమాధిలో పెట్టడం జరుగుతుందో అప్పుడు వారు వచ్చి మీ ప్రభువు ఎవరు మీ ప్రవక్త ఎవరు మీ ధర్మం ఏది అని ప్రశ్నిస్తారు. (బుఖారి 1374)

మరి కొంతమంది దైవదూతలు స్వర్గవాసుల సేవ కొరకు నియమించబడి ఉన్నారు. అల్లాహ్  స్వర్గవాసుల గురించి తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు

[وَٱلۡمَلَٰٓئِكَةُ يَدۡخُلُونَ عَلَيۡهِم مِّن كُلِّ بَابٖ٢٣ سَلَٰمٌ عَلَيۡكُم بِمَا صَبَرۡتُمۡۚ فَنِعۡمَ عُقۡبَى ٱلدَّارِ٢٤]
(మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు. (దేవదూతలు అంటారు): “మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!”)

మరికొందరు దైవదూతలు నరకం పై నియమించబడి ఉన్నారు. వారి యొక్క నాయకుడి పేరు మాలిక్. అతను నరక పాలకుడు. అల్లాహ్ నరకవాసుల ప్రాధేయతను గురించి ప్రస్తావిస్తున్నాడు.

[وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ ]
(మరియు వారిలా మొరపెట్టుకుంటారు: “ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను.” అతను అంటాడు: “నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు.”)

మరికొందరు దైవదూతలు పర్వతాలపై నియమితులై ఉన్నారు. తాయిఫ్ వారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధించినప్పుడు దేవదూత వచ్చి ప్రవక్తతో ఇలా అన్నారు. “ఒకవేళ మీరే గనుక కోరుకుంటే మేము ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న పర్వతాలను కలిపివేస్తాము”. అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: “వద్దు నాకు నమ్మకం ఉంది అల్లాహ్ వీరి సంతతి నుండి తప్పకుండా ఆయన్ని మాత్రమే ఆరాధించి ఆయనకు ఎవరిని సాటి కల్పించనటువంటి వారిని పుట్టిస్తాడు“.(బుఖారి 3231 – ముస్లిం 1795)

మరి కొంతమంది దైవదూతలు మేఘాల కొరకు నియమితులై ఉన్నారు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు మేఘాలను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నడిపిస్తారు. అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు

[فَٱلزَّٰجِرَٰتِ زَجۡرٗا٢]
(మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!)

దైవదూతలు విశ్వాసులను ప్రేమిస్తారు. వారి కొరకు దువా చేస్తారు మరియు ఇస్తగ్ ఫార్ చేస్తారు. అల్లాహ్ ఆర్ష్ వద్ద నియమితులైన దైవదూతల గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.

 [ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ٧ رَبَّنَا وَأَدۡخِلۡهُمۡ جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدتَّهُمۡ وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۚ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ٨ وَقِهِمُ ٱلسَّيِّ‍َٔاتِۚ وَمَن تَقِ ٱلسَّيِّ‍َٔاتِ يَوۡمَئِذٖ فَقَدۡ رَحِمۡتَهُۥۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ]

(సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: “ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!” ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు. మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి పాప క్షమాపణ గురించి దువా చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్ లో ఒక నమాజ్ ముగించుకొని మరో నమాజ్ కొరకు వేచి చూస్తాడో. దైవ దూతలు ఇలా అంటారు – “ఓ అల్లాహ్ అతనిని క్షమించు. ఓ అల్లాహ్ అతనిని కరుణించు“. (అబూ దావూద్ 469- తిర్మీజీ 330 – నసాయి 733)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి గురించి కూడా క్షమాపణ మరియు కారుణ్యం గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్  లో మొదటి సఫ్ (పంక్తి ) లో నమాజ్ ఆచరిస్తాడో. (అబూ దావూద్ 674- నసాయి 646-ఇబ్నె మాజ 997 )

మరియు దైవదూతలు వారి గురించి కూడా దుఆ చేస్తారు ఎవరైతే ప్రజలకు మంచి గురించి ఆదేశిస్తారో. అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు – “అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ఆకాశంలోని వారు భూమిపై వారు చివరికి పుట్టలలో ఉండే  చీమలు సైతం నీటిలో ఉండే చేపల సైతం ఆ వ్యక్తి శుభాల మేళ్ల గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మంచిని బోధిస్తాడో” .(తిర్మీజీ 2685)

మరియు దైవదూతలు ఆ వ్యక్తిపై శాపాన్ని పంపుతారు, ఏ వ్యక్తి అయితే తన తోటి ముస్లిం సోదరులకు ఏదైనా ఇనుప వస్తువును లేక ఏదైనా పదునైన  ఆయుధం చూపిస్తాడో.. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే తనతోటి సోదరులకు ఆయుధం లేక ఏదైనా పదునైన వస్తువును సూచించి చూపిస్తాడో, అతను ఒకే తల్లి తండ్రి పుట్టిన సోదరుడైన సరే, దైవదూతలు ఆ వస్తువుని విడిచి పెట్టే వరకు అతనిపై  శాపాన్ని పంపుతారు“. (ముస్లిం 2616)

దైవదూతలు ఫజ్ర్ నమాజులో విశ్వాసులతోపాటు హాజరవుతారు.

[وَقُرۡءَانَ ٱلۡفَجۡرِۖ إِنَّ قُرۡءَانَ ٱلۡفَجۡرِ كَانَ مَشۡهُودٗا٧٨]
(మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది)

ఫజ్ర్ లో ఖురాన్ చదవడం అనగా ఫజ్ర్ నమాజులో ఇతర నమాజుల కంటే ఎక్కువగా ఖురాన్ పారాయణం జరుగుతుంది. ఈ నమాజులో చేసేటువంటి ఖురాన్ పారాయణకు ప్రాధాన్యత కూడా ఉంది, ఎందుకంటే ఆ సమయంలో రాత్రి మరియు పగటికి సంబంధించిన దేవదూతలు హాజరవుతారు.( తఫ్సీర్ సాది)

వీటి ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే దైవ దూతలు అల్లాహ్ తఆలా ఏ  ఆదేశాలనైతే వారికి ఇచ్చాడో వారు ఆ ఆదేశాల ప్రకారం తప్పక వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అందుకే అల్లాహ్  దేవదూతలను సందేశం అందజేసే వారిగా పేర్కొన్నాడు. అల్లాహ్ తఆల  సెలవిస్తున్నాడు.

[ٱلۡحَمۡدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ جَاعِلِ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلًا أُوْلِيٓ أَجۡنِحَةٖ]

(సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు ,మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దైవదూతలను సందేశాన్ని అందచేసే వారిగా నియమించాడు. )

అనగా దైవదూతలను వహీ కొరకు మరియు ప్రాణం తీయడం కొరకు, మేఘాలను చేరవేయడం కొరకు మరియు ఆదం సంతతి యొక్క కర్మలు లిఖించడం కొరకు నియమించడం జరిగింది.

ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేస్తున్నారు: దైవదూతల విషయం చాలాగొప్పది. వారు అల్లాహ్ యొక్క ఆదేశాలను, వ్యవహారాలను  నిర్వర్తించడానికి  పంపించబడినటువంటివారు. అల్లాహ్  ఇలా అంటున్నాడు.  

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా)

మరోచోట ఇలా ఉంది

[فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا]
(మరియు అల్లాహ్ ఆజ్ఞ తో (అనుగ్రహాలను)పంచి పెట్టె దేవదూతల సాక్షిగా)

అల్లాహ్ తఆలా తన గ్రంథాలలో దైవదూతల యొక్క ప్రస్తావన అనేకమార్లు చేశాడు. వారి గురించి అనేక విషయాలు తెలియజేశారు అంటే దీని ద్వారా వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది.

మరియు దైవదూతల యొక్క మరో గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా వారి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా )

దైవదూతలలో కొంతమంది ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు: “నిశ్చయంగా ఆకాశం నిండిపోయి ఉంది. అందులో నాలుగు వేళ్ళు పట్టే స్థలం కూడా ఖాళీ లేదు. అయినప్పటికీ సాష్టాంగ పడే దైవదూతలు సాష్టాంగ పడుతూనే ఉన్నారు. ఆకాశం అంత విశాలంగా ఉన్నప్పటికీ దైవదూతల ఆరాధన కొరకు ఇరుకైపోయింది. అల్లాహ్ పరిశుద్దుడు, చాలా గొప్పవాడు“. (తిర్మీజీ 2312 – అహ్మద్ 173/5 – ఇబ్నె మాజా 4190.)

దైవదూతలపై విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షీంప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక,మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పాశ్చయాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! దైవదూతలపై విశ్వాసం ఉంచడం వలన గొప్ప లాభాలు ఉన్నాయి.

1. అల్లాహ్ యొక్క గొప్పదనం, మహిమ మరియు ఆయన యొక్క ఆధిపత్యం గురించి తెలుస్తుంది. ఆయన సృష్టించినటువంటి సృష్టి ఇంత గొప్పగా ఉంటే మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో  అన్నది మనకు అర్థమవుతుంది.

2. ఆదం సంతానం పట్ల అల్లాహ్ చూపినటువంటి అనుగ్రహం మరియు దయ మూలంగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన దైవదూతలలో కొందరిని వారి రక్షణ కొరకు, వారి కర్మలను లిఖించడానికి మరియు వారి ఇతర ప్రయోజనాల కొరకు నియమించి ఉంచాడు.

3. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు వారు చేసినటువంటి ఆరాధన కొరకు వారిని ప్రేమించుట.

కనుక మీరు తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! పుణ్యాత్ములైనటువంటి ఆదం సంతానము దైవదూతల కంటే గొప్పవారు. ఇది అహ్లుస్సున్నహ్ వల్ జమాఅ వారి వాక్యం. ఎందుకంటే ఆదం సంతతిలో సహజ సిద్ధమైన కామ క్రోధములు పెట్టడం జరిగింది. అందువలన అతనిలో ప్రతిఘటించేటువంటి శక్తి, అణచివేసే శక్తి ఉంటుంది. అతని యొక్క మనసు చెడు వైపునకు ప్రేరేపిస్తుంది. అతని రక్తంలో షైతాన్ ప్రవహిస్తుంటాడు, అయినప్పటికీ అతను నిగ్రహంగా ఉంటూ అల్లాహ్ ఆరాధన చేస్తాడు. దీనికి వ్యతిరేకంగా దైవదూతలకు ఇవేమీ ఉండవు మరియు షైతాన్ వారిని తప్పుదారి కూడా పట్టించలేడు. అందుకే ఆదం సంతానానికి  దైవదూతలు కంటే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

తెలుసుకోండి, షాబాన్ మాసం లో ఉపవాసాలు ఉండటం అభిలషణీయమైన ఆచరణ. ఆయేషా (రదియల్లాహు అన్హా) తెలియచేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో నఫీల్ ఉపవాసాలు ఎంత ఎక్కువగా పాటించేవారు అంటే ఇక ప్రవక్త ఉపవాసం వదిలిపెట్టరేమో అన్నంత భయం ఉండేది. మరియు నేను మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశాను రమజాన్ పూర్తి ఉపవాసాల తర్వాత షాబాన్ మాసం లో ఉపవాసాలు పాఠించినంత మరే మాసంలో పాటించలేదు” (అహ్మద్ 201/5)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కారానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ ఇలా అన్నాడు:

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 
(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లిం లకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దేవదూతలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/angels/

దైవ గ్రంధాల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ

వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)

కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)

నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِ‍ۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]

(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)

ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.

 [ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)

గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.

రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్  మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.

మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి  ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం

నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్  మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి,  ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)

ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]

అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)

మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.

 [أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]

అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)

ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ

(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)

మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.

ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్  మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్  2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.

ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]

ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా  పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో  జరిపిన మార్పుల గురించి  మరియు వక్రీకరణల గురించి  అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను  ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)

ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)

[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.

[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై,  ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.

[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.

షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి  ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్  ఇలా అంటున్నాడు :

[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)

మరోచోట ఇలా అంటున్నాడు:

[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]

(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)

ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.

 అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)

[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము  ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)

[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.

[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని,  అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్  మొదలైనవి.

దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.

ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.

ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు  ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక  కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :

[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]

ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)

ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:

 [وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]

ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)

[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.

ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]

నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)

[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]

(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)

మరొకచోట ఇలా అంటున్నాడు.

 [وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]

వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)

[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు

[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]

ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)

[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడంవలన  లాభాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము : ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడం  వలన  లాభాలు                

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేత నుండి జాగ్రత్త వహించండి.

తెలుసుకోండి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారిపై దరూద్ పంపడం ద్వారా పది ప్రయోజనాలు ఉన్నాయి.

1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపమన్న అల్లాహ్ యొక్క ఆజ్ఞ నెరవేరుతూ ఉంటుంది.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)

2. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం ఒక దుఆ లాంటిది. ఇది ఆరాధనలో భాగమే ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి దీని కొరకు పుణ్యఫలం కూడా ఉంది.

3. మహాప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై ఒకసారి దరూద్ పంపడం వలన అల్లాహ్ తఆలా యొక్క పది కారుణ్యాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా తెలియజేశారు: ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తారో అల్లాహ్ వారి పై పదిసార్లు కరుణిస్తాడు. (ముస్లిం)

ప్రతిఫలం అనేది చర్య యొక్క స్వభావం ద్వారా లభిస్తుంది. కనుక ఎవరైతే ప్రవక్త వారిని ప్రశంసిస్తారో అల్లాహ్ దానికి బదులుగా అతడిని ప్రశంసిస్తాడు మరియు అతని స్థానాలను ఉన్నతం చేస్తాడు.

4. దరూద్ పఠించే వ్యక్తి యొక్క పది అంతస్తులు పెరుగుతాయి. అతనికి పది పుణ్యాలు లభిస్తాయి మరియు పది పాపాలు క్షమించబడతాయి.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి)

5. దరూద్ పాపాల మన్నింపుకు, దుఃఖవిచారాలను దూరం చేసుకోవటానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది.

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ) లో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?.” అని అడిగాను. అందుకాయన “నికిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. “సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్ధన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం.కానీ అంతకన్నా ఎక్కువ సేవు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు.నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నాడు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మీజీ)

ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) తెలియచేసారు: ఇతను హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఈయన అల్లాహ్ తో ఒక ప్రత్యేక దుఆ వేడుకునేవారు. కానీ ఎప్పుడైతే ఆయన తన ప్రత్యేక దుఆ దగ్గర దరూద్ పటించడం ప్రారంభించాడో అతని ఇహపరాల ఇబ్బందుల కొరకు అల్లాహ్ సరిపోయాడు. ఆయన దరూద్ పంపినప్పుడల్లా అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలను కురిపించాడు. ఒకవేళ అతను తన సోదరుని కోసం దుఆ చేస్తే దైవదూతలు ఆమీన్ చెప్పడంతో పాటు నీకు కూడా అది లభించుగాక అనేవారు కాబట్టి మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు దుఆ  చేయడం ఎంతో ఉత్తమమైనది.

6. మహా ప్రవక్త మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి మరో ప్రయోజనం ఏమిటంటే ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, స్వర్గంలో ఆయనకు ‘ఉన్నత స్థానం’ లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు లభిస్తుంది.

హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్తుండగా విన్నాను, ఆయన ఈ విధంగా తెలియ చేసారు: “మీరు ఆజాన్ పిలుపు వినగానే దానికి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పండి. ఆ తరువాత నాపై దరూద్ పటించండి. ఎవరు అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో అల్లాహ్ అతన్ని పది సార్లు కరుణిస్తాడు. నా కొరకు వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను”. (ముస్లిం)

7. దుఆ చేసే వ్యక్తి తన దుఆ కి ముందు దరూద్ పఠించినప్పుడు అతనిలో దుఆ స్వీకరించబడుతుంది అనే ఆశ ఉంటుంది. ఎందుకంటే దరూద్ అతని దుఆ ని అల్లాహ్ అంగీకరించేందుకు తోడ్పడుతుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు: “ఆకాశం మరియు భూమి మధ్య దుఆ నిలిపివేయబడుతుంది. మీరు దానిపై ప్రార్థించే వరకు అనగా ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపనంతవరకు దానిలో ఏదీ పైకి వెళ్లదు“. (తిర్మీజీ)

8. మనం పఠించేటువంటి దరూద్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేరవేయబడుతుంది, ప్రవక్త గారు ఇలా తెలియజేశారు: “మీ దరూద్ నాకు అందించబడుతుంది“. (అహ్మద్)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై తన ‘దరూద్’ పంపడం కంటే ఒక వ్యక్తికి గొప్ప గౌరవం ఏముంటుంది?

9. ఏదేని సభలో దూరూద్ పటించడం ఆ సభ యొక్క స్వచ్ఛతకు కారణం. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే దూరూద్ పఠించరో అది వారి కొరకు ప్రళయ దినాన దుఃఖ దాయకంగా పరిణమిస్తుంది.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే.” (అహ్మద్)

10. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ పెరుగుదలకు దరూద్ షరీఫ్ కారణం. ఇది విశ్వాసం యొక్క ఒడంబడికలలో ఒకటి, ఇది ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఒక వ్యక్తి తన ప్రియమైన వ్యక్తిని ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటాడో, అతని సద్గుణాలు మరియు అతని ప్రేమకు దారితీసే లక్షణాలను పునరుద్ధరించుకుంటాడు. దీనివలన అతని ప్రేమ మరింత పెరుగుతుంది మరియు అతను ప్రేమించే ప్రియమైన వ్యక్తిని కలవాలనే కోరిక పూర్తిగా పెరుగుతుంది.

కానీ ఒక వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తిని మర్చిపోయినప్పుడు అతని హృదయంలో నుండి అతని సద్గుణాలన్నీ తొలగిపోతాయి, మరియు అతనిపై ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. ఒక ప్రేమికుడికి తాను ప్రేమించే తన స్నేహితుడిని చూడడం కంటే తన కళ్ళను మరి ఏమి చల్లపరచలేదు.

ఇవి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి పది ప్రయోజనాలు – వీటిని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) వారు (జలా అల్ ఆఫ్ హామ్) అనే పుస్తకంలో పొందుపరిచారు.

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ ముస్లిం లారా! మహా ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొరకు దరూద్ పంపడంతోపాటు, వసీల మరియు ఫజీల (ఔన్నత్యం) కొరకు దుఆ  కూడా చేయాలి. అనగా ఓ అల్లాహ్! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ మఖామే మహమూద్ వరకు చేర్చు.  దీని ఆధారం జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే అజాన్ పిలుపు వింటారో వారు ఈ దుఆ  చదవాలి:

(ఈ సంపూర్ణ పిలుపుకు స్థిరముగా స్థాపించబడు నమాజుకు ప్రభువైన అల్లాహ్! హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి వసీల అనే ఆశ్రయం ప్రసాదించు. మహిమ కలిగిన ఔన్నత్యమును ప్రసాదించు. మరియు నీవు వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు) (బుఖారి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. (ముస్లిం)

వసీల” అనగా స్వర్గంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము. “ఫజీల” అనగా మహిమ కలిగినటువంటి ఔన్నత్యము. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియచేసినటువంటి దాంట్లో మఖామే మహమూద్ లో “మహమూద్” అనగా ఒక ప్రదేశము అక్కడ నిల్చున్న వ్యక్తి ప్రశంసించబడతాడు. “అల్ మఖాం” అనగా లెక్క తీసుకునేటువంటి సందర్భంలో సిఫారసు కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిల్చోనేటువంటి ప్రదేశము. దీని ఆధారం అబూరైన కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: “మఖామే మహమూద్ అనగా సిఫారసు

మరియు హదీస్ యొక్క చివరిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అన్నారు: “అనగా ఆచరణ ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు మఖామే మహమూద్ గురించి అల్లాహ్ ను ప్రార్ధిస్తాడో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు కు అతను అర్హుడు అవుతాడు. మరియు ఆ వ్యక్తి పాపాలు క్షమించబడి, స్థానాలు ఉన్నతం చేయబడే వారిలో చేర్చబడతాడు”.

అల్లాహ్ మనందరికీ మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)

మరియు ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.   

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.  

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

కహానహ్ (జ్యోతిష్యం) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

అంశము : ఇస్లాం నుంచి బహిష్కరించే ఏడవ  విషయము: కహానహ్ (జ్యోతిష్యం)

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత

అల్లాహ్ దాసులారా! ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయన భీతి కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి,  అవిధేయతకు పాల్పడకండి. గుర్తుంచుకోండి!  తౌహీద్లో భాగమైన ఓ విషయం ఏమిటంటే: నామాలలో గుణగణాలలో అల్లాహ్ ను ఏకంగా భావించటం. అందులో అగోచర జ్ఞానం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన గుణం,  అది అల్లాహ్ కు  అంకితం అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మరియు ఈ ఉమ్మత్ యొక్క ఉలమాలు అందరూ ఏకీభవించి ఉన్న స్పష్టమైన విషయం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చెప్పు. (సూరా అన్ నమ్ల్ 27 : 65)

ఓ హాదీస్ లో ఖాలిద్ బిన్ జక్వాన్ వారు రబీ బింతే ముఅవ్వీజ్ తో ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బాలికను ఈ విధంగా గీతం పాడుతుండగా విన్నారు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు“. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  “ఆ విషయాన్ని విడిచి మిగతాది పాడండి” అని వారించారు మరియు రేపు ఏం జరగనున్నది అనేది అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియదు అని బోధించారు. (ఇబ్ను మాజహ్, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు).

ఇబ్నె ఉమర్ వారి ఉల్లేఖనము: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: అగోచరజ్ఞానం ఖజానా కు ఐదు తాళం చెవులు ఉన్నాయి , దాని జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి లేదు, అందులో :  (1) రేపు ఏం జరగనున్నదో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు, (2) మాతృ గర్భాలలో  ఏముందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు (*), (3) వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు, (4) ఎవరు ఏ గడ్డపై మరణిస్తారో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు మరియు (5) ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు. (సహీ బుఖారి).

తెలిసిన విషయమేమిటంటే అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితము. ఇది అల్లాహ్ యొక్క గుణము.  ఇందులో ఎవరు కూడా ఆయనకి సాటిలేరు,  వాళ్ళు అల్లాహ్ సమీపంలో ఉన్న దైవదూతులైనా కావచ్చు, పంపించబడ్డ ప్రవక్తలైనా కావచ్చు. కనుక ఎవరైతే తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రకటిస్తాడో అతను అల్లాహ్ కి ప్రత్యేకమైన గుణంలో అల్లాహ్ దాసులను భాగ్యస్వామ్యం చేసినట్టు. దాసుడ్ని అల్లాహ్ కు సమానము చేశాడు, మరియు ఘోరాతి ఘోరమైన పాపానికి (షిర్క్ ఎ అక్బర్) కి పాల్పడ్డాడు. తమ కాలానికి  ఇమామ్ అయిన ఇమామ్ అహ్లుస్ సున్నహ్: నుఐమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ వారు అన్నారు: “ఎవరైతే సృష్టికర్తను సృష్టిరాశులతో  సమానం చేశాడో అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్టు.”

అల్లాహ్ దాసులారా! ప్రజలలో కొందరు అగోచర జ్ఞాన విషయంలో అల్లాహ్ కు సాటిగా సమానులని ప్రకటిస్తున్నారు. అల్లాహ్ కు ఈ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు “కాహిన్” మరియు “అర్రాఫ్ “. కాహిన్ అంటే: భవిష్య జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రచారం చేసుకునేవాడు, జ్యోతిష్యుడు. అర్రాఫ్ ( షోబదబాజ్) అంటే ఇందులో జ్యోతిష్యుడు, గుప్త విద్య కలిగిన వాడు, చేతబడి చేసేవాడు  అనే అన్ని అర్ధాలు వస్తాయి. అరబీ భాషలో ఇతన్ని “అర్రాఫ్” అంటారు.

షేక్ సాలేహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) అన్నారు: కాహిన్ అనే పదానికి అర్ధం “అంచనా” ఆధారం లేని విషయాల ద్వారా వాస్తవాలు సేకరించడం. ఆజ్ఞాన కాలంలో ఎవరి వద్దకు అయితే షైతానులు వచ్చేవో వాళ్ళు ఇదే పని చేసేవారు, షైతానులు ఆకాశం నుంచి సమాచారాలను అందించే వారు. ఈ జ్యోతిష్యులు షైతానులు నుంచి అందిన సమాచారంతో స్వంత మాటలు కలిపి ప్రజలకు చెప్పేవారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ప్రజలు వీళ్ళకు దగ్గరై ప్రతీ సమస్యకు పరిష్కారం కొరకు వీళ్ళని ఆశ్రయించే  వారు మరియు భవిష్యవాణులు తెలుసుకునే వారు.  అందుకే మనం (సాలేహ్ అల్ఉసైమీన్ వారు) అంటున్నాం,  కాహిన్ అంటే: భవిష్యత్తులో జరిగే అగోచార  విషయాల్ని తెలియజేసేవాడు .(ఇలా ప్రజల్లో ప్రచారం వుంది)

ఓ విశ్వాసులారా! జ్యోతిష్యుడు అగోచర జ్ఞానం నిరూపించడానికి రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు,

మొదటిది: దైవదూతల నుంచి సమాచారాన్ని దొంగలిచే షైతాన్ మాటలు వినటం. దీని ఆధారం సహీ బుఖారిలో ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం:

దైవ దూతలు ఆకాశం మబ్బుల్లో వస్తారు మరియు అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు. అక్కడున్న షైతాన్లు రహస్యంగా ఆ మాటలను దైవదూతల నుంచి విని, ఈ చేతబడి చేసే వాళ్ళు,  జ్యోతిష్యాలు చెప్పే వాళ్లకు తెలియజేస్తారు. వాళ్ళు ఆ  విన్న మాటల్లో తమ తరఫునుంచి అబద్ధాలు కలిపి, తమ వద్దకు వచ్చే ప్రజలకు చెప్తారు. (బుఖారి)

అల్లాహ్ దాసులారా! తెలిసిన విషయం ఏంటంటే: జ్యోతిష్యులు ప్రజలకు అబద్ధమైన విషయాలను చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంలో ఏదైనా సత్యం ఉంటే, అది షైతాన్ దొంగిలించిన మాటల్లో నుంచి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెప్పే అగోచర జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రజలు వాళ్ళ చెప్పే విషయాల్లో ఆ ఒక్క సత్యమైన మాట వల్ల వాళ్ళ వలలో చిక్కుకుంటారు. మరియు అందులో కలిసి ఉన్న అబద్ధమైన విషయాలను పట్టించుకోరు.  మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే పూర్తి విషయాలు అబద్ధం అయినప్పటికీ దాన్ని సత్యమే అని భావిస్తారు. (ఇది మొదటి మార్గం)

రెండవ మార్గం: జిన్నులను ఆశ్రయించటం. ఆ జిన్  ప్రతి మానవుడుతో పాటే ఉండేవాడైనా కావచ్చు లేదా వేరే వాడైనా. ఇది ఎలా అంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నిమిత్తమై ఉంటాడు. అతను ఆ మానవుడికి చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు, కనుక ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం లో ఈ విధంగా ఉంది: కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కాహిన్ మరియు  జ్యోతిష్యులు గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు “అది పెద్ద విషయం కాదు”  దానికి వారు ఇలా అడిగారు ” ప్రవక్త కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి కదా”  అంటే దానికి జవాబుగా ప్రవక్త వారు ఇలా అన్నారు ” వాళ్లు చెప్పే మాటల్లో ఏదైతే నిజం అవుతాయో అవి దైవదూతల నుంచి  దొంగలిస్తారు , దానిని ఈ జ్యోతిష్యులు, కాహిన్ లకు  చెవిలో కోడికూత మాదిరిగా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ ఒక్క మాటలో  వంద  అబద్ధాలు కలిపి చెప్తారు. ( బుఖారి, ముస్లిం)

కాహిన్ లకు మానవులతో పాటు ఉండే జిన్నాతులకు సంబంధం ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఆధారం, ఎందుకంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నియమిత ఉంటాడు. అతను మానవుడికి చెడు వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈ జిన్ ఆ వ్యక్తి యొక్క ప్రతి రహస్యాన్ని ఎరిగి ఉంటాడు, ఏదైతే ఇతర ప్రజలకు తెలియవో. ఉదాహరణకు: ఒక వ్యక్తి యొక్క ఏదో ఒక వస్తువు తప్పిపోతే ఆ వ్యక్తితో పాటు ఉండే జిన్ కి ఆ ప్రదేశము తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ వ్యక్తితోనే ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కాహిన్ ను సంప్రదిస్తే ఆ  తప్పిపోయిన వస్తువు గురించి ప్రశ్నిస్తే ఆ జిన్ ఆ కాహిన్ కి ఆ వస్తువు ఒక ప్రదేశం గురించి తెలియజేస్తాడు. తర్వాత కాహిన్ ఆ ఒక్క మాటతో 100 అబద్ధాలు కలిపి ఆ వ్యక్తికి ఆ  ప్రదేశము తెలియజేస్తాడు. చివరికి ఆ వ్యక్తి పోగొట్టుకున్న వస్తువుని పొందిన తర్వాత ఆ కాహిన్ చెప్పిన ప్రతి మాట నిజమే అని భావిస్తాడు,  మరియు అతను అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్ముతాడు. వాస్తవానికి ఆ కాహిన్ ఆ జిన్ను నుంచి విన్న విషయాన్ని అతనికి చెప్పి ఉంటాడు, ఉదాహరణకు: ఒక వ్యక్తి తన భార్యతో చెప్పుకున్న విషయాలు, వాళ్ల తల్లి పేరు, ఊరు పేరు, ఇంటి అడ్రస్సు,  వాళ్ళు చేసే పని,  ఇంకా ఆ జిన్ కి , ఆ వ్యక్తికి సంబంధించి తెలిసిన విషయాలన్నీ కూడా మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! కాహిన్ ఏ షైతాన్ని అయితే సంప్రదిస్తాడో అతను షైతాన్ నుంచి సేవలు తీసుకుంటాడు. దానికి బదులు ఆ కాహిన్ అతన్ని ఆరాధిస్తాడు. షైతాన్ లక్ష్యం కూడా ఇదే. షైతాన్ పూర్తి ఆదం సంతతిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికి లక్ష్యం చేసుకున్నాడు. ఇంకా ఇదే అతని పని మరియు ఇదే అతని సందేశము. అతని వలలో జ్యోతిష్యులు,  చేతబడి చేసే వాళ్ళు  కాహిన్ అందరూ చిక్కుకుంటారు,  వీళ్ళు మానవుల్లో ఉన్న షైతానులు అయితే అతను జిన్నాతుల నుంచి షైతాన్.  ఈ షైతాన్లు అందరు కలిసి మానవాళిని అపమార్గం పట్టిస్తారు.  (అల్లాహ్ మనందరినీ ఈ షైతాన్లు నుంచి కాపాడుగాక)

అల్లాహ్ దాసులారా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే షరియత్ లో చెప్పిన రుఖ్యా ద్వారా వ్యాధులను నిర్మూలిస్తారో వాళ్లకు ఆ కాహిన్ చేసే నాటకాలు తెలిసికొని ఉంటారు. వాళ్ళల్లో ఒక్కరు చెప్పిన విషయం ఏమిటంటే: మీరు కాహిన్ రహస్యాన్ని ఛేదించడం అనుకుంటున్నారు అయితే: “మీకు కూడా తెలియని ఒక విషయము ఆ కాహిన్ ని అడగండి, ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  కనుక ఆ కాహిన్ కి కూడా తెలియకుండా పోతుంది. ఉదాహరణకు నేలపై నుంచి కొన్ని కంకర రాళ్లు తీసుకోండి, మీ పిడికిలను మూసేసి, తర్వాత కాహిన్ను ప్రశ్నించండి,  నా చేతిలో ఎన్ని రాళ్లు ఉన్నాయని, అతను దానికి సమాధానం ఇవ్వలేడు, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే ఈ విషయము, ఈ సమాధానము మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  అలాంటప్పుడు ఆ కాహిన్ ఏం సమాధానం ఇస్తాడు? .

సారాంశం ఏమిటంటే: కాహిన్ తమ అన్ని వ్యవహారాలలో జిన్నాతులను ఆశ్రయిస్తాడు,సహాయం తీసుకుంటాడు. అన్ని సంఘటనలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి షైతాన్ ను ఆశ్రయిస్తాడు. షైతాన్ ఆ కాహిన్ చెవిలో కొన్ని విషయాలు ఊదుతాడు,  దానినీ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు కలిపి  ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ చెప్పిన మాట నిజమైతే ప్రజలు ఆ కాహిన్ ని అగోచర జ్ఞాని అనుకుంటారు,  ఇలా అతని వలలో చిక్కుకుంటారు. ప్రజలు అజ్ఞానంలో దాన్ని మహిమలు (కరామాత్) అనుకొని వీళ్ళు ఔలియా అల్లాహ్ (అల్లాహ్ స్నేహితులు) అనుకుంటున్నారు.  వాస్తవానికి వాళ్ళు ఔలియా ఉష్ షైతాన్ (షైతాన్ స్నేహితులు), ఎలాగైతే అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరతుష్ షుఅరా లో  ఇలా తెలియజేశారు:

(هَلْ أُنَبِّئُكُمْ عَلَى مَنْ تَنـزلُ الشَّيَاطِين * تَنـزلُ عَلَى كُلِّ أَفَّاكٍ أَثِيم * يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُون).

(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్దాలకోరు, పాపాత్ములైన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటలు చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే (26: 221,-226)

తౌహీద్ ప్రజలారా: నుజూమి కూడా అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రకటిస్తాడు. నుజూమి అంటే: నక్షత్రాలను చూసి భవిష్యతులొ సంభవించే సంఘటనాల జ్ఞానాన్ని సేకరించేవాడు. ఉదాహరణకు: గాలి వీచే సమయము , వర్షం కురిసే సమయం, చలికాలం, వేసవి కాలము మరియు ధరలు మారే జ్ఞానము. వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే : ఆకాశంలో నక్షత్రాలు తిరిగే , కలిసే సమయాల్లో దానిని చూసి వీళ్ళు ఈ విషయాలు తెలియజేస్తారు. మరియు నక్షత్రాలు భూమండలంపై ప్రభావితమై ఉంటాయి అంటారు,  దీనిని “ఇల్మె తాసీర్”  అంటారు , మరియు దీని గురించి ప్రచారం  చేసుకునే వాడ్ని ‘జ్యోతిషి” అని అంటారు. వాళ్లు నక్షత్రాలను చూసి, వాళ్లతో మాట్లాడేటప్పుడు షైతాన్ వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చిత్ర రూపంలో చూపిస్తాడు, దాని ద్వారా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. (ఇవన్నీ వ్యర్థమైన విషయాలు)

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ లో ఓ భాగం: ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు అబ్జద్ అక్షరాల (అరబీ ఆల్ఫాబెట్స్) ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలియజేయడం కూడా ఉంది, ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు చెప్పిన మాటకు ఇదే అర్థము: ఒక జాతి వారు అబూజాద్  (అరబీ ఆల్ఫాబెట్స్) లను ఉపయోగించి , నక్షత్రాలను చూసి ఇలా భవిష్యవాణిలను చెప్పేవాళ్లు  నా ఉద్దేశ ప్రకారం వాళ్లు పరలోకంలో ఏం భాగాన్ని పొందలేరు. (ఏ ప్రతిఫలం దక్కడు) .

( దీనినీ అబ్దూర్రజ్జాక్ వారు ముసన్నఫ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు , ఇమామ్ బైహకిఖీ వారు కూడా పేర్కొన్నారు)

ఇల్మే నుజూమ్ లోని ప్రదర్శనలో ఇంకో భాగం జ్యోతిష్య శాస్త్రవేత్తలు (Astrologers), వీళ్ళు మానవ భవిష్యత్తులో సంభవించే విషయాలను తెలుసుకున్నారని మరియు దానిని వార్తల్లో , మ్యాగజైన్స్ లోప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాదన ఏమిటంటే : ఎవరైతే  బిర్జ అక్రబ్ నక్షత్రము  మెరిసే సమయంలో  పుడతాడో , జన్మించాడో, అతని తలరాత మంచిది కాదని మరి ఎవరైతే “బిర్జ్ మిజాన్” నక్షత్రము మెరిసే సమయంలో జన్మిస్తాడో వాడు మంచి అదృష్టం గలవాడు అని భావించడం మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ కూడా చేతబడి కిందే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్య సమానమైన విషయం ఏమిటంటే : షైతాన్  నుండి సంప్రదింపులు,  సంబంధాలు, దాని ఆధారము ఇబ్నె అబ్బాస్ వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఇల్మే నుజూమ్ నేర్చుకున్నాడో అతను చేతబడిలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్టే , కనుక ఆ భాగాన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. (సహీ ముస్లిం)

ఇల్మే నుజూమ్ ను ఇల్మే తాసీర్ అంటారు. అంటే: నక్షత్రాల ప్రసరణ వలన (నక్షత్రాలు తిరగటం వలన)  దాని ప్రభావం భూమండలంపై  పడుతుంది. అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అతను జాదులో (చేతబడిలో) ఒక భాగాన్ని నేర్చుకున్నాడు” కు అతను చేతబడిలోని ఒక రకానికి గురయ్యాడు అని అర్థం. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అందులో ఎవరైతే తమ భాగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో  పెంచుకోండి” అంటే అర్థము ఎవరైతే  ఖగోళ జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని నేర్చుకుంటాడో అతను అదే విధంగా చేతబడి విద్యను నేర్చుకున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు.

అల్లాహ్ దాసులారా!  ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచి శకునము తీసుకునే ఆజ్ఞ ఇస్తుంది. మరియు మానవుడికి చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అంటే: అందులో ఇహ పరలోకాలా సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. షిర్క్, బహు దైవారాధన, పాపాలు, మోసాలు,  అబద్ధాల ను నివారిస్తుంది . అందుకే ఇస్లాం షైతాన్ చేష్టలను, మార్గాలను ముందు నుంచే ఆరికట్టింది. కనుక కాహిన్ల వద్దకు వెళ్లటాన్ని నిషేధం చేసింది.  మరియు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ వద్దకు వెళ్లే వాళ్ళ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఆ  కాహిన్ల వద్దకు ప్రశ్నించడానికి వెళ్లినా సరే. ఇమామ్ ముస్లిం వారు ప్రవక్త గారి సతీమణి సఫీయహ్ (రదియల్లాహు అన్హా) వారితో ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు అన్నారు: ఏ వ్యక్తి అయితే అగోచారవిషయాలను చెప్పేవాడి (జ్యోతిష్యుడు) వద్దకు వెళ్లి అతన్ని ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, లేదా అతను చెప్పిన మాటను నమ్మినా నలభై (40) రోజుల వరకు అతను చేసిన నమాజులు స్వీకరించబడవు (ఆమోదకరమైనవి కావు). (సహీ ముస్లిం)

ఏ వ్యక్తి అయితే జ్యోతిష్యుల వద్ద కాహిన్ వద్ద వెళ్లి అతన్ని ఏదైనా విషయంలో ప్రశ్నించాడు,  కానీ దానికి ఇవ్వబడిన సమాధానాన్ని  నమ్మలేదు, అలాంటి వ్యక్తి యొక్క 40 రోజులు నమాజు స్వీకరించబడవు అనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి కాఫిర్ అవ్వడు (ఎందుకంటే ఇవ్వబడిన సమాధాన్ని స్వీకరించలేదు ‘నమ్మలేదు’ కాబట్టి). అందువల్ల అతను ఇస్లాం నుంచి బహిష్కరించబడడు.

కానీ! ఏ వ్యక్తి అయితే ఆ కాహిన్ వద్దకు వెళ్లి ఏ విషయంలోనైనా అతన్ని ప్రశ్నించి మరియు అతను ఇచ్చిన సమాధానాన్ని సత్యమని నమ్మితే అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరించబడినట్టే. ఎందుకంటే అతను ఏదో ఒక విషయాన్ని నమ్మిన తర్వాతే  కాహిన్ అగోచర జ్ఞాని అని  విశ్వసించినట్టవుతుంది.  మరియు  అల్లాహ్ కు అంకితమైన ఈ అగోచర జ్ఞానం విషయంలో ఆ కాహిన్ ను సాటి నిలబెట్టినట్టే అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఖుర్ఆన్ లో ఇవ్వబడ్డ విషయాలను తిరస్కరించినట్టు. మరియు కుఫ్ర్ కి పాల్పడినట్లు అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు : “ఏ వ్యక్తి అయితే కాహిన్  వద్దకు వెళ్లి , అతను చెప్పిన సమాచారాన్ని సత్యమని విశ్వసిస్తే అతను ప్రవక్త పై అవతరించబడ్డ ధర్మాన్ని (షరియత్) ను తిరస్కరించినట్టే“. (మస్నద్ అహ్మద్)

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చేప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను)

అల్లాహ్ దాసులారా! ఈ కాహిన్,  జ్యోతిష్యుల  కార్యకలాపాలు సూఫీల వద్దనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురువులు  కాహిన్లు లేదా అర్రాఫ్ (జ్యోతిష్యులు) అయి ఉన్నారు. వాళ్ళ గురువులు, విలాయత్ పొంది ఉన్నారు (వలి అని) కరమాత్ (మహిమలు) తెలుసు అని ప్రకటిస్తూ ఉంటారు. మరియు అగోచర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు మత్రమే విలాయాత్ మరియు కరామాత్ చేస్తారు అనీ వాళ్ళ నమ్మకం, దాన్ని వాళ్ళు  కష్ఫ్  (నేరుగా అల్లాహ్ తో మాట్లాడటం)  అనే పేరు పెట్టారు, (ఒకవేళ వాళ్ళు దీనికి  అగోచర జ్ఞానం అని పేరు పెడితే ప్రజల ముందు అవమాన పాలవుతారని ఈ విధంగా  పేర్లు మార్చారు )

అల్లాహ్ దాసులారా! కహానత్ నిషేధము అని మరియు కాయిన్ల వద్దకు వెళ్ళటము అవిశ్వాసము అని స్పష్టం చేయడానికి ఇది చాలా లాభకరమైన విషయ సూచిక. కాహిన్ జ్యోతిష్యము చేసినా, చేయించినా, ఈ విద్యను  నేర్చుకున్న లేదా మనసులో దానికి సంబంధించి ఇష్టం కలిగి ఉన్న సరే ఇవన్నీ అవిశ్వాస పూరితమైన ఆచరణ.

అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో,  ఆశీర్వాదాలతో దీవించును గాక. అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి. సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి.  కాహిన్ ల చేష్టలలో “తరక్” అనేది కూడా ఒక భాగమే. దాని ద్వారా అరబ్ వాళ్లు అగోచర జ్ఞానాన్ని ఆర్జిస్తారన్న సంతోషంలో, భ్రమలో ఉండేవారు. తరక్ అంటే “నడవటం”. వాళ్లు నేలపై కొన్ని గీతలు గీస్తారు,  ఆ గీత ద్వారా వాళ్ళు నడిచినట్టు భావించి, ఆ గీత ద్వారా అగోచర జ్ఞానం తెలిసింది అని వ్యక్తం చేస్తారు.

రమాల్ అనేది కూడా జ్యోతిష్యంలో పరిగణించడం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా అంటే: ఓ వ్యక్తి తమ చేతులారా ఇసుకపై కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా ఆ గోచర జ్ఞానం ప్రకటిస్తాడు.

కహానత్ లో (జ్యోతిష్యంలో) రాళ్లతో కొట్టడం కూడా ఒక భాగమే, ఇది ఎలా అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఏదో ఒక సంఘటన గురించి ప్రశ్నిస్తే ఈ జ్యోతిష్యుడు తమ వద్ద ఉన్న ఆ చిన్న చిన్న కంకర రాళ్ళను తీసి ఆ రాళ్ల పై కొట్టి దాని ద్వారా ఆ వ్యక్తి అడిగిన సమస్యకు పరిష్కారం సమాధానం తెలుసుకుంటాడు.

కహానత్ లో ఫింజాన్ (కప్పు, Cup) చదవటము కూడా భాగమే, ఇది ఎలా అంటే:  వ్యక్తి కప్పులో కాఫీ తాగిన తర్వాత మిగిలిన దానిపై ఆ మాంత్రికుడు తమ దృష్టిని కేంద్రీకరిస్తాడు , దాని చుట్టుపక్కల కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా అగోచర జ్ఞానం కలిగిందని,  వచ్చిన వాళ్లకు సమస్యలకు పరిష్కారం చెప్పటము ఇలా చేస్తా ఉంటారు,

ఈ కహానత్ లో చేతి రేఖలను చదివి చెప్పటం కూడా భాగ్యమే , అది ఎలా అంటే : జ్యోతిష్యుడు కాహిన్లు చేతి రేఖలను:  అడ్డంగా నిలువుగా కలిసి ఉన్నరేఖలను చూసి ప్రజలకు ఇలా ఇలా జరగనున్నది అని చెప్తారు.

ఇక కహానత్లో “అయాఫా” (పక్షుల ద్వారా శకునం తీయడం)  కూడా భాగమే దాని పద్ధతి ఏమిటంటే: పక్షులను గాలిలో వదిలి అవి ఒకవేళ కుడివైపు ఎగిరితే మంచి శకునం లేదా ఎడమవైపు ఎగిరితే చెడు జరుగుతుంది అని శకునాలను తీస్తారు. ఖచ్చితంగా అయాఫా కూడా అధర్మమైన పద్ధతే. ఎందుకంటే పక్షులు అల్లాహ్ యొక్క సృష్టితాలు. వాటిలో మేలు గాని చెడు గాని చేసే శక్తి ఉండదు. అల్లాహ్ యే వాళ్ల పోషకుడు, పాలకుడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:

 أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (సూరా అన్ నహ్ల్ 16: 79)

ఇంకా ఈ విధంగా అన్నారు:

أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ

ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. (సూరా అత్ తహ్రీం 67 : 19)

ఈ కహానత్ (జ్యోతిష్యం) లో శకునం కూడా భాగమే. అవి కంటికి కనిపించేవే అయినా సరే, లేదా వినేటటువంటి నుంచి అయినా సరే. అంటే పావురాలను ఎగిరిపించి శకునాలు తీయటము లేదా ఇంటిపై కూర్చున్న గుడ్లగూబను చూసి శకునము తీయటము, లేదా పదమూడవ (13వ) అంకె నుంచి, మెల్లకన్ను ,కాళ్లు లేనివాడు నుంచి శకునము తీయటము, ఉదాహరణకు: “మెల్లకన్ను కలిగి ఉన్న వ్యక్తిని చూసి ఇలా అనటం “ఈరోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది, మంచి జరగదు”. కనుక అతను వ్యాపారం మూసేసి,  ఆరోజు మొత్తం కొనటము అమ్మటముగాని చేయకుండా ఉండటము, బహుశా అతనికి ఆరోజు చెడు, కీడు జరుగుతుంది అని, ఆపద విరుచుకు పడుతుందని తెలిసిపోయినట్టు. ఇంకా ఒక వ్యక్తి కుడి చేయి అరచేతిలో దురద పుట్టితే అలా జరుగుతుందని లేదా ఎడమ చేయి అరిచేతిలో దురద పుడితే ఇలా జరుగుతుందని భావించటం ఇంకా మొదలైనవి. వీటన్నిటిలో ఏ ఒక్కటి లో కూడా అల్లాహ్ చెడును, హానిని పెట్టలేదు. కానీ ప్రజలు వాటి నుంచి శకునాలను తీస్తున్నారు, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజులను కీడులా భావించుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే:  ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని, అల్లాహ్ కు తెలిసిన అగోచర విషయంలో అల్లాహ్ కు సాటిగా నిలిచాడు. దీని కొరకు వాళ్ళు అసమర్థమైన విషయాలను కారణాలుగా చేస్తున్నారు.

శకునం తీయడం అనేది హారాం, ఇంకా షిర్క్ కూడా. దీనికి ఆధారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా వివరించారు: “ఎవరి శకునము అతనికి తమ అవసరాలను తీర్చకుండా ఆపేసిందో అతను షిర్క్ చేసినట్టు,  దానికి సహాబాలు అడిగారు “దానికి పరిహారం ఏమిటి “? దానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

( اللهم لا خير إلا خيرك، ولا طير إلا طيرك، ولا إلـٰه غيرك )

ఓ అల్లాహ్ నువ్వు ప్రసాదించిన మేలు కన్నా మరో మేలు ఏదీ లేదు, నువ్వు నియమించిన శకునము కన్నా మరో శకునము లేదు,  మరియు నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు (అహ్మద్)

శకునం హరాం అనడానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) గారి ఈ హదీస్ కూడా మనకు ఆధారం : వ్యాధి తనంతట తానే  వ్యాపించడం, శకునం తీయటము, మరియు గుడ్లగూబ వల్ల కీడు, సఫర్ మాసం వల్ల శకునం ఇలాంటివి ఏమీ లేవు (అన్ని వ్యర్ధ మాటలే) ( బుఖారి)

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) మాట “శకునం లేదు”- దీనివల్ల శకునాలు ఏమీ లేవు  అన్న మాట పూర్తిగా స్పష్టమవుతుంది.

సారాంశము ఏమిటంటే : కహానత్ “జ్యోతిష్యం”లో చాలా రకాలు ఉన్నాయి,  కానీ అన్ని రకాలలో సమాంరతమైన విషయము ఏమిటంటే అది “అగోచర జ్ఞానం ప్రకటన“. పద్ధతులు వేరేగా ఉంటాయి, అందులో కొన్ని షైతానులతో సంబంధం ఉంటుంది,  మరికొందరు కేవలం ఉట్టిగా ప్రకటనలు చేస్తారు, దాని ద్వారా ప్రజలను మోసం చేస్తారు, తమ వలలో పడేసుకుంటారు. అల్లాహ్ మనందరినీ వీళ్ళ నుంచి కాపాడుగాక.

ముగింపు ప్రసంగం :

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

 ( إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما )

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌  పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి. – (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మన హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మాకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మాకు తెలిసిన తెలియకపోయినా. ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని గురుంచి,  ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.

ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.

اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

రమజాన్ పండుగ గురించి పది ముఖ్య విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిపద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి బిద్అత్ కార్యకలాపాలు. ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

1. ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి మరియు ఎల్ల వేళలా దైవభీతి కలిగి ఉండండి. ఇస్లాం పై స్థిరంగా ఉండండి. ఆయన మనందరినీ ఈ రమజాన్ చివరి వరకు చేర్చినందుకు అల్లాహ్ కు స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. అల్లాహ్ సాక్షిగా ఇది ఆయన యొక్క గొప్పవరం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ 
(మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది ఆయన అభిలాష!)

కనుక మనందరము ఈమాసాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను అల్లాహ్ ను కీర్తించాలి మరియు కృతజ్ఞతతో ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి.

2. ఓ ముస్లింలారా! నిశ్చయంగా అల్లాహ్ వాక్కు సత్యమైనది. (రమజాన్ కేవలం లెక్కించ బడిన దినాలే ) ఆ పగలు రాత్రి ఎంత వేగంగా గడిచి పోయాయో, అసలు ఎలా గడిచిపోయాయో మీకు తెలుస్తుందా?

3. ఓ విశ్వాసులారా! పూర్తి రమజాన్ ను పొందినందుకు  మరియు అందులో ఉపవాసాలు పాటించినందుకు మీకు అభినందనలు. మరియు ఈ రమజాన్ రాత్రులలో మేల్కొని ఆరాధనలు చేసినందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఎంతో మంది ఈ రమజాన్ మాసం రాక మునుపే వెళ్లిపోయారు. ఈ రమజాన్ చివరి దశను కూడా పొందలేక పోయారు. ఆయన తన వరాల జల్లును తన అనుగ్రహాలను మనపై కరిపించినందుకు వేయి నూళ్ళ కోటానుకోట్ల స్తుతులూ స్తోత్రాలు తెలియ చేస్తున్నాను.

4. ఓ ముస్లింలారా! మీ అందరికీ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇస్లాం మూలస్తంభాలలో ఒకటైన ఈ ఉపవాసాలు పూర్తి చేసుకున్నందుకు గాను నేను  అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండండి. ఆయన ఏకత్వాన్ని గురించి చాటి చెప్పండి. అల్లాహ్ పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఈ రమజాన్ లో మీ సత్కార్యాలను రెట్టింపు అయ్యి ఉండవచ్చు, పాపాలు క్షమించబడవచ్చు మరియు మీ అంతస్తులు కూడా పెంపొందించవచ్చు.

5. అల్లాహ్ దాసులారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వివేకం ఏమిటంటే ఆయన రెండు గొప్ప సందర్భాల తర్వాత మన కొరకు రెండు పండుగలను ప్రసాదించాడు. ఒకటి ఉపవాసాలు ముగించుకున్న తర్వాత రంజాన్ పండుగ. రెండు హజ్జ్  పూర్తి చేసుకున్న తర్వాత బక్రీద్ పండుగ జరుపుకుంటాము. మన ఈ పండుగలలో ఎన్నో గొప్ప ఆరాధనలు ఉన్నాయి – నమాజ్, రోజా, జిక్ర్, ఖుర్బానీ, ఫిత్రా దానం మొదలైనవి.

అంతేకాదు ఈ శుభసందర్భంలో బంధుత్వ సంబంధాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమానురాగాలతో కలుసుకుంటారు, ఒకరి పట్ల మరొకరు మన్నింపుల వైఖరి అవలంభిస్తారు మరియు కుళ్ళు కుతంత్రాలు, ఈర్షద్వేషాలు అన్నింటిని మరిచిపోయి అందరూ కలిసిమెలిసిపోతారు. ఒకవేళ మనలో ఎవరైనా ఈ విధంగా సంబంధాలు తెంపుకొని ఉంటే వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరికొత్త రీతిలో సంబంధాలను బలపరచుకొని సంతోషాలను పంచాలి.

6. ఓ విశ్వాసులారా! బహుదైవారాలకులు మరియు అన్యమతస్తుల దేశాలలో కనిపించని మన ఈ స్వచ్ఛమైన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. వారి పండుగలలో పాపము మరియు అల్లాహ్ అవిధేయత తప్ప మరి ఏమీ కానరావు. ఈ విధమైన దురాచరణల ద్వారా వారు అల్లాహ్ తో దూరం పెంచుకుంటున్నారు.

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క ఈ కారుణ్యం పట్ల సంతోషంగా ఉండండి ఎందుకంటే అల్లాహ్  ఇలాఅంటున్నాడు

[قُلۡ بِفَضۡلِ ٱللَّهِ وَبِرَحۡمَتِهِۦ فَبِذَٰلِكَ فَلۡيَفۡرَحُواْ هُوَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ]
(ఇలా అను: ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దాని కంటే ఎంతో మేలైనది.)   

7. ఓ ముస్లింలారా పండుగపూట అందంగా తయారవ్వండి మరియు సుగంధం పరిమళాలను పూసుకోండి మరియు ఇతరులకు కూడా పూయండి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు ఇలాతెలియజేస్తున్నారు “నేను అహ్లె ఇల్మ్ (పండితుల) ద్వారా విన్నాను. వారు తప్పనిసరిగా ప్రతి పండుగ రోజున అందంగా తయారై సుగంధ పరిమళాలను  పూసుకునేవారు”.(షరహ్ బుఖారి లిఇబ్నె రజబ్ 68/6)

8. ఓ విశ్వాసులారా! ఈ పండుగ రోజున మన ఇళ్ల ద్వారాలతో పాటు మన హృదయాల ద్వారాలను కూడా తెరిచి ఉంచండి, ఒకరి కొరకు మరొకరు తప్పక దుఆ చేయండి. అల్లాహ్ తఆలా అందరి సత్కర్మలను స్వీకరించుగాక. మరియు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మన సహాబాలు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. ఇలా అనేవారు  

(تقبل الله منا ومنكم)
అల్లాహ్ మా సత్కార్యాలను మరియు మీ సత్కార్యాలను స్వీకరించుగాక!

9. ఓ ముస్లింలారా! గడిచిపోయిన పొరపాట్లను మన్నించడం విధేయత యొక్క గొప్ప చర్యలలో ఒకటి.  అల్లాహ్ వద్ద దీనికొరకు గొప్ప ప్రతిఫలం ఉంది.  అల్లాహ్  ఇలా అంటున్నాడు.

[فَمَنۡ عَفَا وَأَصۡلَحَ فَأَجۡرُهُۥ عَلَى ٱللَّهِۚ]
(కానీ ఎవరైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతి ఫలం అల్లాహ్ దగ్గర ఉంది)

అల్లాహ్ వద్ద ప్రతిఫలం ఉందంటే వాస్తవంగా ఈ పని ఎంతోగొప్పది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది.

ఓ విశ్వాసులారా! హృదయాలను పరిశుభ్రపరచుకోండి. ఇది కూడా ఒక గొప్ప ఆచరణ. దీని కొరకు కూడా మంచి సాఫల్యం ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا٩ وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا]
(వాస్తవానికి తన ఆత్మను శుద్దపరచుకున్నవాడే సఫలుడౌతాడు మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడౌతాడు)

అల్లాహ్ దాసులారా! సంతోషాన్ని కలుగజేసేటువంటి పనులలో ఒకటి సంబంధాలను కలుపుకోవడం. సంవంత్సరం మొత్తంలో మనిషి మనసులో ఉండేటువంటి ఈర్ష ద్వేషాల నుండి మనిషి తన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఆవ్యక్తి కొరకు శుభవార్త ఉంది ఎవరైతే ఈ పండుగ రోజున సద్వినియోగం చేసుకుని తెగిపోయినటువంటి బంధాలను కలుపుకుంటాడో మరియు విరిగిన హృదయాలను కలుపుతాడో. దానివలన కుటుంబంలో ఏర్పడిన కలహాలు దూరమైపోతాయి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.

ఓ అల్లాహ్! సమస్త ప్రశంసలు మరియు సకల ఆరాధనలు అన్నీ కూడా నీకే శోభిస్తాయి. నీ కారుణ్యంతో మమ్మల్ని అందరినీ ఈ రమజాన్ మాసం చివరి వరకు చేర్చి పండుగను మాకు ప్రసాదించావు. ఓ అల్లాహ్ నీకు విధేయత చూపడంలో మాకు సహాయం చేయి. ఓ అల్లాహ్ మాకు నీ ప్రేమని ప్రసాదించు మరియు నీకు  దగ్గర చేసేటువంటి ప్రతి పనిపై మాకు ప్రేమను ప్రసాదించు. ఓ అల్లాహ్! మేము మా పాప క్షమాపణ గురించి నిన్ను  వేడుకుంటున్నాము. నిశ్చయంగా నువ్వు  ఎంతో క్షమాగుణం కలవాడవు. 

రెండవ ఖుత్బా

 స్తోత్రం మరియు దరూద్ తరువాత

10. ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్  మిమ్మల్ని కరుణించుగాక. మీరు తెలుసుకోండి. అన్నిటికంటే గొప్ప ఆనందం అల్లాహ్ ను కలిసి ఆయన దగ్గర నుండి మనం చేసినటువంటి సత్కార్యాల ప్రతిఫలం పొందేటప్పుడు లభించేది.

అల్లాహ్ తఆల స్వర్గవాసులతో ఇలా అంటాడు “ఓ స్వర్గ వాసులారా! అప్పుడు స్వర్గవాసులు ఇలా సమాధానం ఇస్తారు – ఓ అల్లాహ్ మేము నీ సన్నిధిలో  హాజరయ్యాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు – మీరు సంతోషంగా ఉన్నారా! అప్పుడు వారు అంటారు- ఎందుకు కాదు అల్లాహ్!  మీరు ఈ  సృష్టిలో ఎవరికీ ప్రసాదించనివి మాకు ప్రసాదించారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఏమిటి దాని కంటే ఉత్తమమైనటువంటి దానిని మీకు ప్రసాదించనా! స్వర్గ వాసులు ఇలా ఉంటారు – ఓ మా ప్రభువా! దీనికంటే మేలైనది ఇంకేం ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఇప్పటి నుండి నేను శాశ్వతంగా మీ పట్ల ఇష్టుడనయ్యాను ఇక ఎప్పటికీ మీపై కోపంగా ఉండను.(బుఖారి 6549 – ముస్లిం 2829)

11. ఓ విశ్వాసులారా! ఈ రమజాన్ మాసము సంస్కరణ కోసం అల్లాహ్ తో సంభందాన్ని దృడపరచుకోవడానికి అతి గొప్ప అవకాశం కనుక మీరందరూ కూడా ఆరాధనలో నిమగ్నమై ఉండండి ఎందుకంటే ఆరాధన రమజాన్ తో ముగిసిపోదు, మనిషి మరణం వరకు కూడా సదా చరణ చేస్తూఉండాలి  అల్లాహ్ ఇలా అంటున్నాడు

[وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ]
(మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాదిస్తూఉండు)

ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు:
అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఆచరణ ఎల్లకాలం చేస్తూ ఉండేటువంటిది అది ఎంతచిన్న ఆచరనైనా సరే. (బుఖారి 5861)

ఓ ముస్లింలారా! రమజాన్ తర్వాత సదాచరణపై స్థిరంగా ఉండటం ఇది అల్లాహ్ వద్ద ఆచరణ స్వీకారయోగ్యం  పొందడానికి సూచన. దీనికి వ్యతిరేకంగా కేవలం రమజాన్ లో మాత్రమే చేసి మిగతా రోజుల్లో మానుకోవడం ఇది అజ్ఞానము. అల్లాహ్ యొక్క భాగ్యం నుంచి దూరం అవడానికి ఒక సూచన. ఎందుకంటే రమజాన్ ప్రసాదించిన ప్రభువే మిగతా నెలలు కూడా మనకు ప్రసాదించాడు. ఒక వ్యక్తి గురించి సలఫ్ ను ఈ విధంగా అడగడం జరిగింది. ఎవరైతే కేవలం రమజాన్ లో మాత్రమే ప్రార్థన చేస్తాడో మరియు  ఇతర దినాలలో ఆరాధనను వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి చెప్పండి? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు – ఆ వ్యక్తి లేక ఆ జాతి చెడ్డది ఎవరైతే కేవలం అల్లాహ్ ని రమజాన్ లోనే గుర్తు చేసుకుంటారో.  

ఓ విశ్వాసులారా! ముస్లింల యొక్క ఒక ఉత్తమ గుణం ఏమిటంటే వారు విధేయతా పరులై ఉంటారు. విధేయత అంటే ఆరాధనపై స్థిరంగా ఉండటమే.  అల్లాహ్  విధేయత చూపేవారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّٰدِقِينَ وَٱلصَّٰدِقَٰتِ وَٱلصَّٰبِرِينَ وَٱلصَّٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّٰٓئِمِينَ وَٱلصَّٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا]

(నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.)

12. ఓ అల్లాహ్ దాసులారా! రమజాన్ తర్వాత షవ్వాల్ నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉండటం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ వారి సాంప్రదాయం. అల్లాహ్  దీని కొరకు గొప్ప ప్రతిఫలం ఉందని వాగ్దానం చేశాడు.

అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే రమజాన్ యొక్క ఉపవాసాలు ఉంటారో మరియు ఆతర్వాత షవ్వాల నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉంటారో  వారు పూర్తి సంవత్సరం యొక్క ఉపవాసాలు ఉన్నట్లే” (ముస్లిం-1164)

ఈ ఆరు ఉపవాసాలు  ప్రసాదించడానికి గల కారణం ఏమిటంటే రంజాన్ యొక్క విధి చేయబడినటువంటి ఉపవాసాలలో  ఏదైనా లోపం ఉండి ఉంటే ఈ నఫీల్ ఉపవాసాల ద్వారా అవి చెరిగిపోతాయి. ఎందుకంటే ఉపవాసి ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనితో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసాలు ఆ సమయంలో  ఏర్పడినటువంటి ఆ యొక్క కొరతని పూర్తి చేస్తాయి.

పండుగ గురించి ఇంకా ఎన్నో  విషయాలు ఉన్నాయి. కనుక ఒక విశ్వాసి రంజాన్ పండుగ సందర్భంగా వీటిని గుర్తు పెట్టుకోవాలి మరియు వాటిపై ఆచరించాలి. కేవలం వాటిని ఒక రివాజుగా భావించి వదిలి పెట్ట కూడదు.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మాకు స్వర్గాన్ని ప్రసాదించు మరియు ఫిర్దౌస్ యొక్క వారసులుగా చేయు మరియు ఎటువంటి లెక్కాపత్రం లేకుండా మరియు శిక్ష లేకుండా మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశింపచేయి.

ఓ అల్లాహ్! నువ్వు కరుణామయుడవు, కృపాశీలుడవు. మమ్మల్ని మా పాపాల నుండి పరిశుభ్రం చేయి, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుండి వచ్చామో ఆ విధంగా మమ్మల్ని పరిశుభ్రపరుచు.

ఓ అల్లాహ్! మా అందరి ఈ సమావేశాన్ని స్వీకరించి మాకు పాపక్షమాపణ కలుగచేయి. మా ఆచరణలను స్వీకరించు.

ఓ అల్లాహ్! మా దేశంలో మరియు ముస్లిం దేశాలన్నింటిలో శాంతి భద్రతలను ప్రసాదించు.

ఓ అల్లాహ్! రమజాన్ తర్వాత కూడా సదాచరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, నీకు విధేయత చూపే వారిగా చేయి, మరియు ఇలాంటి వరాల వసంతాలను మా జీవితంలో  మరెన్నో ప్రసాదించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్