531. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తెలలో ఒకరు, (ఒక వ్యక్తి ద్వారా) “నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కబురు చేశారు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానికి సమాధానంగా “అల్లాహ్ వెనక్కి తీసుకున్నది ఆయనదే; తాను ప్రసాదించినది కూడా ఆయనదే. ఆయన ప్రతి వస్తువుకూ ఒక గడువు (జీవితకాలం) నిర్ణయించాడు. అందువల్ల (ఈ విషాద సంఘటన పట్ల) నీవు సహనం వహించి పుణ్యాన్ని ఆశించు” అని చెప్పి పంపారు. ప్రవక్త కుమార్తె ప్రమాణం చేసి “మీరు తప్పకుండా రావాలి” అని మళ్ళీ కబురు పంపారు.
దాంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరికొందరు సహచరుల్ని వెంట బెట్టుకొని వెళ్ళారు. పిల్లవాడ్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు తీసుకు వచ్చారు. ఆ పసివాడి ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఖాళీ అయిపోయిన నీటి తిత్తి మాదిరిగా మారిపోయాడు. ఆ పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంటతడిపెట్టారు. అప్పుడు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) (ఆశ్చర్యపోయి చూస్తూ) “దైవప్రవక్తా! ఇదేమిటీ (మీరు దు:ఖిస్తున్నారు)?” అని అడిగారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఇది అల్లాహ్ తన దాసుల హృదయాల్లో ఉంచిన కారుణ్యం. తోటి మానవుల్ని కరుణించే వారినే అల్లాహ్ కరుణిస్తాడు”.
532. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) వ్యాధిగ్రస్తులయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు)లు కూడా ఉన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడకు చేరుకోగానే ఆ ఇంటి వాళ్ళు ఆయన చుట్టూ మూగారు. అది చూసి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (సందేహిస్తూ) “ఏమిటి ఆయన చనిపోయారా?” అని అడిగారు. దానికి వారు “చనిపోలేదు దైవప్రవక్తా!” అన్నారు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (రోగి స్థితి చూసి) కంట తడిపెట్టారు. ఆయన్ని చూసి అందరూ దుఃఖించడం మొదలెట్టారు. తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు “వినండి. హృదయావేదన కన్నీళ్ళ వల్ల గానీ లేదా నోట దయార్ద్ర పలుకులు వెలువడటం వల్ల గానీ అల్లాహ్ మనిషిని శిక్షించడు. అయితే దీని విషయంలో (దైవప్రవక్త నోటి వైపు చూపిస్తూ అన్నారు) మాత్రం (పెడబొబ్బలు పెడితే) అల్లాహ్ తప్పకుండా శిక్షిస్తాడు. కుటుంబ సభ్యులు ఏడ్చినా సరే మృతునికి శిక్ష వుంటుంది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగ బడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్ బఖర 2:281)
ధార్మిక సోదరులారా….
ఈ రోజు జుమా ప్రసంగంలో జనాజా నమాజ్ ఘనత, ఆదేశాల గురించి తెలుసుకుందాం. ఇది ఎలాంటి గమ్యం అంటే ఏదో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ గమ్యానికే చేరుకోవాలి. అల్లాహ్ కూడా ఆ దినం గురించే ఇలా భయపెడు తున్నాడు: “మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.” (అల్ బఖర 2: 287)
ప్రియసోదరులారా..
జనాజా పూర్తిగా తయారయిన తర్వాత ఖనన విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకూడదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే తన నివాసాన్ని చేరుకోవటంలో త్వరగా విజయం పొందుతాడు. ఒకవేళ చెడ్డవాడైతే అతని బరువును మోయటం నుండి మీ భుజాల త్వరగా బరువు తగ్గించుకుంటాయి. జనాజా వెంట వెళ్ళడంలోనే అధిక పుణ్యాలు ఉన్నాయి. అకారణంగా జనాజా కంటే ముందు వాహనం మీద వెళ్ళటం మంచిది కాదు. జనాజాను మోస్తూ వెంట వెంటనే వెళ్ళటం ఉత్తమం. దగ్గరగా ఉంటూ మూడు సార్లు మోస్తే అతని భాధ్యత పూర్తయినట్లే ఇక ఎన్ని సార్లు మోస్తే అన్ని పుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి. జనాజా ఎవరిదైనా కూడా దాన్ని చూసి నిలబడటం ఉత్తమం. జనాజా నమాజ్ అయ్యేంత వరకు మృతుని వద్ద ఉండే వానికి ఉహద్ పర్వతం మాదిరిగా ఒక రాశి పుణ్యఫలం పొందుతారు. ఖనన సంస్కారం అయ్యేంత వరకు వేచి ఉన్న వానికి రెండు రాశుల పుణ్యఫలం పొందుతారు. శవపేటికను నేలపై ఉంచే వరకూ ఎవరూ కూర్చోకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- మయ్యిత్ ఎవరికైనా వసియ్యత్ చేసి ఉంటే, అతనికి స్నానం చేయించే విధానం తెలిసి ఉంటే అతనే స్నానం చేయించాలి. అబూ బక్ర్ (రజియల్లాహు అన్హు) తన భార్యకు, అనస్ (రజియల్లాహు అన్హు) ముహమ్మద్ బిన్ సీరీన్ కు వసియ్యత్ చేసి ఉండిరి. (తబఖాత్ ఇబ్ను సఅద్)
2- స్నానం చేయించే వ్యక్తి ఎంత దగ్గరివారయితే అంతే మంచిది. అయితే స్నానం చేయించే విధానం తెలిసి ఉండడం తప్పనిసరి
3- భర్త భార్యకు, భార్య భర్తకు స్నానం చేయించవచ్చును. ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయిషా (రజియల్లాహు అన్హా)తో చెప్పారు: “నీవు నాకంటే ముందు చనిపోతే నేనే నీకు స్నానం చేయించుదును, కఫన్ ధరింపజేయుదును” (ఇబ్ను మాజ 1465, షేఖ్ అల్బానీ: హసన్).
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) వసియ్యత్ చేశారు: ఆయనకు ఆయన భార్య అస్మా బిన్త్ ఉమైస్ (రజియల్లాహు అన్హా) స్నానం చేయించాలని. (ముసన్నఫ్ అబ్దుర్ రజ్జాఖ్ 6117).
4- పురుషులు మగవారికి, మగపిల్లలకు స్నానం చేయించాలి, స్త్రీలు స్త్రీలకు, ఆడపిల్లలకు స్నానం చేయించాలి.
5- స్నానం చేయించే వ్యక్తి రెండు షరతులను పాటిస్తే గొప్ప పుణ్యం పొందుతాడు:
“40 సార్లు క్షమించబడతాడు”. (సహీ తర్గీబ్ 3492).
అల్లాహ్ ప్రసన్నత మాత్రమే కోరాలి. (ఇది తప్పనిసరి).
ఏదైనా దోషం చూస్తే ఎవరికీ చెప్పకుండా కప్పిఉంచాలి. (ఇది విధిగా ఉంది).
శవానికి స్నానం చేయించే విధానం
1- ప్రజల దృష్టి పడని చోట స్నానం చేయించాలి.
2- నాభి నుండి మోకాళ్ళ వరకు ఏదైనా వస్త్రం కప్పి, అతని శరీరంపై ఉన్న కుట్టిన బట్టలు తీయాలి. (అబూ దావూద్ 3141లో ప్రవక్త దుస్తులు తీసే విషయంలో సహాబాల చర్చ).
3- శవాన్ని ఏదైనా కొంచెం ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి.
తల మరియు వీపు క్రింద చేయి వేసి చిత్రంలో చూస్తున్నట్లు కొంచెం పైకి ఎత్తి కడుపులో ఏదైనా ఆగి ఉన్నది పోయే విధంగా తిన్నగా ఒత్తాలి.
4- స్నానం చేయిస్తున్న నియ్యత్ మనస్సులో చేసుకోవాలి.
6- నమాజు కొరకు చేసే విధంగా వుజూ చేయించాలి. ఆ తర్వాత కుడి వైపు నుండి స్నానం చేయించడం మొదలెట్టాలి.
(బుఖారీ 167, ముస్లిం 939). «ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَوَاضِعِ الوُضُوءِ مِنْهَا»
وفي الفتح: الحكمة في الأمر بالوضوء تجديد أثر سمة المؤمنين في ظهور أثر الغرة والتحجيل.
7- తల పై నుండి ఆ తర్వాత కుడి వైపున, ఎడమ వైపున రేగాకు కలిపిన నీళ్ళతో మంచిగా స్నానం చేయించాలి.
8- మూడు సార్లు, అవసరమైతే ఎక్కువ సార్లు పర్లేదు, కాని బేసి సంఖ్యలో ఉండే విధంగా గమనించాలి. (నిసాయి 1865).
9- చివరిలో కర్పూరం కలిపిన నీళ్ళతో స్నానం చేయించాలి. అది లేనిచో ఏ సువాసన అయినా ఉపయోగించవచ్చును.
10- స్త్రీల వెంట్రుకలను మూడు భాగాలుగా చేసి జడవేయాలి. (నిసాయి 1865).
11- మృతునికి స్నానం చేయించిన వ్యక్తి స్నానం చేయడం తప్పనిసరి కాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).
ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారుః “రెండు పెద్ద కొండల వంటివి”.
ముస్లింలో ఉంది: ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా రజియల్లాహు అన్హు గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).
జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:
నియ్యత్ (సంకల్పం).
ఖిబ్లా దిశలో నిలబడుట.
సత్ర్ (అచ్ఛాదన).
వుజూ.
జనాజ నమాజ్ విధానం:
ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.
భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో జనాజా నమాజ్ (అంత్యక్రియల ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, పద్ధతి మరియు ధర్మశాస్త్రపరమైన ఆదేశాలను వివరిస్తారు. ఇస్లాం ఒక వ్యక్తిని మరణించిన తర్వాత కూడా ఎలా గౌరవిస్తుందో, వారిపై జీవించి ఉన్నవారికి ఉన్న హక్కులను గుర్తుచేస్తూ ప్రసంగం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలలో పాల్గొనడం, మృతదేహానికి స్నానం చేయించడం (ఘుస్ల్), మరియు కఫన్ (శవ వస్త్రం) తొడిగించడం వంటి చర్యలకు లభించే గొప్ప పుణ్యఫలాల గురించి హదీసుల ఆధారంగా చర్చిస్తారు. జనాజా నమాజ్ చెల్లుబాటు కావడానికి అవసరమైన నియమాలు (నియ్యత్, ఖిబ్లా, సత్ర్, వుదూ) మరియు నమాజ్ చేసే విధానం (నాలుగు తక్బీర్లు, సూరహ్ ఫాతిహా పారాయణం, దరూద్ ఇబ్రాహీం, మృతుని కోసం ప్రత్యేక దుఆ) వివరంగా చెప్పబడింది. నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భస్రావం జరిగితే, ఆ పిండానికి కూడా జనాజా నమాజ్ చేయాలనే ముఖ్యమైన ఆదేశాన్ని నొక్కి చెబుతారు. ప్రసంగం చివరలో, జనాజా నమాజ్కు సంబంధించిన సఫ్ (వరుసలు) ఏర్పాటు, గాయబానా నమాజ్ (పరోక్ష ప్రార్థన), స్త్రీ-పురుషుల కోసం దుఆలో తేడాలు మరియు చిన్న పిల్లల జనాజా వంటి అంశాలపై శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
సోదర మహాశయులారా!
అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవల్ల మనం కొన్ని రోజుల నుండి శుద్ధి మరియు నమాజ్ అనే అంశంపై ఏ మంచి పాఠాలు అయితే మొదలు పెట్టామో, అల్హందులిల్లాహ్ దాని యొక్క చివరిలో ఈ రోజు చేరుకున్నాము. ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల జనాజా నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము.
ఇందులో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, జనాజా నమాజ్ దీని యొక్క వివరణ, దీని యొక్క పద్ధతి తెలుసుకునే ముందు, ఇస్లాం యొక్క మంచితనాన్ని, మేలును, గొప్పతనాన్ని, స్వయంగా మీరు విని అర్థం చేసుకొని ప్రత్యేకంగా అవిశ్వాసులకు ఇస్లాం యొక్క ఈ మంచి విషయాన్ని బోధించండి.
అదేమిటంటే, ఇస్లాం యొక్క సంబంధం ఎవరితో ఏర్పడుతుందో వారి యొక్క హక్కు మనపై వారు బ్రతికి ఉన్నంతవరకే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనపై ఉంటుంది. మన ఒక ముస్లిం సోదరుడు బ్రతికి ఉన్నంతవరకే అతని హక్కు మనపై కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉన్నాము, మన యొక్క ముస్లిం సోదరుడు లేదా సోదరీమణి చనిపోయింది, అప్పుడు కూడా అతని యొక్క హక్కు మనపై ఉంటుంది. అల్లాహు అక్బర్.
ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు అంటే స్నానం చేపించడం, కఫన్ దుస్తులు ధరింపజేయడం, సమాధిలో దించడం, అంతకుముందు నమాజ్ చేయడం, అతని గురించి, ఆమె గురించి అల్లాహ్ తో క్షమాభిక్ష, పాపాల మన్నింపు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై కురుస్తూ ఉండాలి అని అల్లాహ్ ను వేడుకోవడం, ఆ తర్వాత ఇంకా వారి కొరకు దుఆ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఎలాంటి సత్కార్యాలు? అల్లాహు అక్బర్.
సహీహ్ హదీసులో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ అహ్కాముల్ జనాయిజ్ లో ప్రస్తావించారు, ఒక బ్రతికి ఉన్న ముస్లిం, చనిపోయిన ఒక ముస్లింకి స్నానం చేపించాడు, స్నానం చేపిస్తున్న సందర్భంలో ఏమైనా లోపాలు, దోషాలు, ఏమైనా విషయాలు చూశాడు, , కప్పి ఉంచాడు, ఎవరికీ చెప్పలేదు,
غَفَرَ اللَّهُ لَهُ أَرْبَعِينَ مَرَّةً (గఫరల్లాహు లహు అర్బయీన మర్ర) అల్లాహ్ అతన్ని నలభై సార్లు క్షమిస్తాడు.
ఎవరైతే ఒక ముస్లింకి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో, అల్లాహు త’ఆలా స్వర్గంలో మంచి అక్కడి స్వర్గపు పట్టు వస్త్రాలు ఇలాంటి వ్యక్తికి ధరింపజేస్తాడు.
ఇక అతని కొరకు నమాజ్ చేశాడంటే, సహీహ్ బుఖారీలోని హదీస్. ఇప్పుడు కూడా ఇన్ షా అల్లాహ్ ఆ హదీస్ వస్తుంది, రెండు పెద్ద కొండలు. ఇక రెండు పెద్ద పర్వతాలు అంటే మీ ఇష్టం. మీలో ఎంత ఇఖ్లాస్, మీలో ఎంత ముతాబా’అ. ఈ పదాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చి ఉన్నాయి. గుర్తుంది కదా? ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం. ముతాబా’అ అంటే ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించడం. ఎంత ఇఖ్లాస్, ఎంత ముతాబా’అ ఉంటుందో అంతే పెద్ద పర్వతాలు. ఈ హిమాలయా కూడా చిన్నదే. అలా మీరు ఊహించారంటే, నమాజ్ చేయడం మరియు అతన్ని సమాధిలో పెట్టేవరకు ఖబరిస్తాన్ లో, స్మశాన వాటికలో ఉండటం ఎంత గొప్ప పుణ్యాలో ఒకసారి గ్రహించండి.
ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా? ఒకటి, ఒక ముస్లిం చనిపోయాడు అంటే, చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క బాధ్యత మనపై ఎంత గొప్పగా ఉందో. ఒక విషయం ఇది. ఈ బాధ్యతను గనక మనం కరెక్ట్ ఇఖ్లాస్ మరియు ముతాబా’అ ప్రకారంగా నెరవేర్చామంటే, అల్లాహ్ వైపు నుండి మనకు ఎన్ని అనుగ్రహాలు, వరాలు, పుణ్యాలు, సత్ఫలితాలు, మంచి ప్రసాదాలు ఉన్నాయో గమనించండి.
జనాజా నమాజ్
రండి. జనాజా యొక్క చాలా వివరాలతో కూడిన పాఠం. అది కూడా బహుశా ఎంత లేకున్నా గానీ ఒక 10 పాఠాలు కావచ్చు. ఇన్ షా అల్లాహ్, త్వరలో ఎప్పుడైనా మనం వివరాలతో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సంక్షిప్తంగా నమాజ్ విషయం మీకు తెలియజేస్తున్నాము.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే జనాజాలకు హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో, అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును.”
“రెండు ఖీరాతులు అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నారు, రెండు ఖీరాతులు అంటే ఏంటి, ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం? రెండు పెద్ద పర్వతాలు, పెద్ద కొండలు అని. జబలైనీ అజీమైనీ, అజీం అజీం. ఇది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.
అయితే వేరే కొన్ని మరి సహీహ్ హదీసులో ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతం అని కూడా ప్రస్తావన వచ్చి ఉంది. ఏంటి? మదీనా నగరంలో ఉన్నటువంటి ఉహుద్ పర్వతం. అయితే ఇక్కడ విరుద్ధం, విభేదం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే సత్కార్యానికి వేరువేరు రకాలుగా మనం పుణ్యాలు లేదా పుణ్యాల ప్రస్తావన చూస్తూ ఉంటే ఇది విరుద్ధం అనరు. దీని యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఎంత స్వచ్ఛంగా, ఇఖ్లాస్ మరియు ముతాబా’అ. ఆ రెండు పదాలు మీరు మరిచిపోకండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవి. చిత్తశుద్ధి మరియు ప్రవక్త విధానాన్ని అనుసరించడం. ఇఖ్లాస్, ముతాబా’అ ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా వారు ఆ పుణ్యాన్ని పొందుతారు అనే భావం.
జనాజా నమాజ్ లో నాలుగు విషయాలు తప్పనిసరి. ఏమిటి అవి?
జనాజా నమాజ్ యొక్క నిబంధనలు
నియ్యత్ (సంకల్పం), ఖిబ్లా దిశలో నిలబడుట, సతర్ (అచ్ఛాదన), వుజూ.
ఈ నాలుగు విషయాలు మీకు అర్థమయ్యాయి. నియ్యత్ అంటే మనసులో మనం సంకల్పించుకుంటాము. నోటితో నియ్యత్ చేయడం ఇది ప్రవక్త పద్ధతి కాదు. రెండవది, ఖిబ్లా దిశలో నిలబడటం. ఖిబ్లా వైపునకు. ఇది కూడా విషయం అర్థమైనదే. సత్ర్, అచ్ఛాదన అంటే నమాజ్ చేసే సందర్భంలో మన శరీరంపై ఎంత దుస్తులు ఉండాలో అంత దుస్తులు ఉండడం. ఇది కూడా తప్పనిసరి. జనాజా నమాజ్ కొరకు వుజూ చేసుకొని ఉండటం కూడా తప్పనిసరి. ఇవి నాలుగు షరతులు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా గానీ అతను నమాజ్ చేసినప్పటికీ అతని నమాజ్, నమాజ్ కాదు. అంగీకరింపబడదు.
జనాజా నమాజ్ విధానం
ఇమామ్ (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు దగ్గరగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమామ్ వెనక నిలబడాలి.
అల్లాహు అక్బర్ అని
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ పూర్తిగా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ గమనించారు కదా? నమాజ్ యొక్క విధానం, జనాజా నమాజ్ ఎలా చేయాలి అనే విధానం ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే గమనించండి, ఇమామ్ ఎవరైతే నమాజ్ చేయిస్తారో, వారు ఎలా ఎక్కడ నిలబడాలి అనే విషయం ఇక్కడ ముందు చెప్పడం జరిగింది.
మయ్యిత్, శవం పురుషునిది అయ్యేదుంటే, అతని యొక్క తలకు సమానంగా ఇలా నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఒకవేళ స్త్రీ అయ్యేది ఉంటే, ఆమె యొక్క మధ్యలో, నడుము కాడ. ఈ విషయం అర్థమైపోయింది కదా? ఇక ముక్తదీలు అందరూ కూడా ఇమామ్ వెనక నిలబడతారు. అయితే ఇమామ్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఎందుకంటే, జనాజా నమాజ్ కు సంబంధించి హదీసులు ఏవైతే వచ్చాయో, జనాజా నమాజ్ కు సంబంధించిన హదీసుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనా చదివారా, చదవలేదా, ఏ ప్రస్తావన లేదు. చదివారు అని లేదు, చదవలేదు అని లేదు. అందుకొరకే ఇక్కడ ధర్మవేత్తలు ఎంతో మంది ఏమని అభిప్రాయపడ్డారు? ఒకవేళ ప్రవక్త చదివి ఉండేది ఉంటే, ప్రస్తావన ఉండేది. కానీ వేరే ఎంతో మంది సర్వసామాన్యంగా ధర్మవేత్తలు అంటారు, నమాజు ఆరంభంలో సనా చదవడం సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇక్కడ దాని ప్రస్తావన ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ చదవడమే మంచిది. అయితే మీ ఇష్టం. చదివినా అల్హందులిల్లాహ్, చదవకపోతే ఎలాంటి పాపం లేదు. కానీ ఏం చదవాలి? అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే,
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
చదివి సూరె ఫాతిహా పూర్తిగా చదవాలి. సూరె ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివినా అల్హందులిల్లాహ్. చదవకపోయినా అల్హందులిల్లాహ్. ఆ తర్వాత రెండవసారి అల్లాహు అక్బర్ అని మళ్ళీ చేతులు కట్టుకొని దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం… మనం తషహ్హుద్ లో చదువుతాము కదా? అది పూర్తిగా చదవాలి. మళ్ళీ మూడోసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని మయ్యిత్ కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో సహీహ్ హదీసుల్లో నాలుగు రకాల దుఆలు వచ్చి ఉన్నాయి. ఆ నాలుగింటిలో కూడా చాలా మంచి లాభదాయకమైన, శవానికి, మయ్యిత్ కు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించగలుగుతారా?
ఒక సందర్భంలో ఒక సహాబీ బ్రతికి ఉన్నారు. ప్రవక్త వెనక ఉండి ఒక మయ్యిత్, ఒక శవం యొక్క, ఒక ముస్లిం జనాజా నమాజ్ చేస్తున్నారు. ప్రవక్త ఈ దుఆ, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీకు, ఈ దుఆ ఏదైతే చదివారో వెనక ఉన్న ఆ సహాబీ ఏమంటున్నారు? ఆ దుఆ విని నాకు అనిపించింది, అయ్యో! ఆ శవం కాడ నా శవం ఉండేది ఉంటే ఎంత బాగుండేది. ప్రవక్త వారి దుఆలు అన్నీ కూడా నాకు ప్రాప్తమయ్యేవి అని. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, ఇలాంటి దుఆలు మనం నేర్చుకోవాలి. మన గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో చాలా, చాలా బాధాకరమైన విషయం నా కొరకు. ఏంటో తెలుసా? చాలా మంది ఈ జనాజా నమాజ్ లో చదివే దుఆ వారికి తెలిసే ఉండదు. అడిగారు నేను ఎన్నో సందర్భాలలో. సంవత్సరం క్రితం కూడా నేను ఏదైతే ఇండియాకు వెళ్లానో ఒక నెల గురించి, అక్కడ సుమారు రెండు, మూడు జనాజాలలో చదవడం, చదివించే అవసరం పడింది. ఇక మన వద్ద చిన్నపాటి ఇఖ్తిలాఫ్ కూడా. ఈ జనాజా నమాజ్ చదివించే వారు శబ్దంగా చదవాలా? మనసులో చదువుకోవాలా? మెల్లగా నిశ్శబ్దంగా? లేదా శబ్దంగా చదవాలా? సర్వసామాన్యంగా మన వద్ద హనఫీ సోదరులు మెల్లగా చదువుతారు. హనాబిలా వద్ద కూడా మెల్లగానే చదవాలి అని ఉంది. అహ్లుల్ హదీస్ వారు శబ్దంగా చదువుతారు. అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లను నేను. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పిన విషయం సహీహ్ బుఖారీలో, నేను శబ్దంగా ఇప్పుడు ఇక్కడ మీకు చదివింది ఎందుకంటే, ఈ సూరె ఫాతిహా కూడా జనాజాలో చదవడం ప్రవక్త వారి సున్నత్ అని మీకు తెలియాలి.
ఈ విధంగా సోదర మహాశయులారా, కనీసం జనాజా సందర్భాలలో మనం ప్రజలకు చెప్పాలి. అయ్యలారా, అవ్వలారా, కొంచెం నేర్చుకోండి దుఆలు. ఓ కొడుకా, ఓ నా బిడ్డా, నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏమి లాభం నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం “అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా” చదవలేకపోతే. నీవు బంగళాలు కట్టించి, మీ నాన్న సమాధి మీద ఎంత పెద్ద గోపురం కట్టినా గానీ ఏమి లాభం, నీవు నీ తండ్రి గురించి క్షమాభిక్ష ఎలా కోరాలో నీకు తెలియకుంటే.
సోదర మహాశయులారా, వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. సౌదీ అరబ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒకేషన్ లో వెళ్ళాడు, సెలువులో. కానీ కరోనా కారణంగా చిక్కిపోయాడు అక్కడే. రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న నాలుగు రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. “షేఖ్, ఎందుకో నాకు ఇక్కడ ఇండియాలో భార్యా పిల్లలు అందరిలో కలిసి ఉన్నాను కానీ ఉండబుద్ధి అయితే లేదు. అటే రావాలి అనిపిస్తుంది.” నేనన్నాను, ఇది కూడా నువ్వు అదృష్టంగా భావించు. అల్లాహ్ ఏదైనా పరీక్షలో మనల్ని పడవేసాడు అంటే అందులో కూడా ఏదైనా మేలు ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. “షేఖ్, ఇప్పటికి సుమారు నేను ఇక్కడికి వచ్చేసి ఏడు నెలలు అయిపోయినాయి, కేవలం ఎవరితోనైనా కలిసినప్పుడు అస్సలాము అలైకుమ్ అంటే వ అలైకుమ్ అస్సలాం. ఇంతే కానీ, అక్కడ అరబులో ఉండి పరస్పరం దుఆలు ఇచ్చుకోవడం, జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీక్, అహ్సనల్లాహు ఇలైక్, కైఫల్ హాల్, ష్లోనక్, అల్లా యహ్ఫజక్, అల్లా యర్హమక్, ఇలాంటి దుఆలు ఏదైతే ఇచ్చుకుంటారో పరస్పరం అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు చాలా బాధ కలుగుతుంది” అని అన్నాడు.
ఇంతకుముందు కూడా నేను ఒక విషయం మీకు తెలియజేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందు వచ్చే ఎన్నో సూచనలు తెలుపుతూ, ధర్మం ఎంత బలహీనంగా అయిపోతుందో తెలియజేస్తూ, వారిలో కొందరిని ప్రశంసించారు. ఎవరు? అల్ హమ్మాదూన్, అధికంగా అల్లాహ్ ను ప్రశంసించే వారు, అల్లాహ్ తో వేడుకునే వారు.
క్షమించండి, జనాజా నమాజ్ కు సంబంధించిన పద్ధతులు, దుఆల గురించి మనం తెలుసుకుంటున్నాము. కానీ మనం ఈ రోజుల్లో ధర్మం నేర్చుకోకుండా, దుఆలు నేర్చుకోకుండా ప్రపంచ విషయాలు రోజు ఎంత తిరిగేస్తా ఉంటామో మనం, కానీ మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక విషయం మనం నేర్చుకోము. రండి, ముందు నేను మీకు దీని యొక్క అనువాదం వినిపిస్తాను, ఆ తర్వాత ఈ దుఆ చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను దుఆ ముందు చదివేశాను, అరబీలో ఉంది. భావం తెలిస్తే కదా మీకు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి భావం.
ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్న వారిని, దూరముగా ఉన్న వారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమించుము. ఓ అల్లాహ్! మాలో ఎవరిని సజీవంగా ఉంచదలచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము.ఓ అల్లాహ్! అతని చావుపై మేము వహించిన ఓపిక, పుణ్యాలు మాకు లేకుండా చేయకుము.
గమనిస్తున్నారా, ఎంత మంచి భావాలు ఉన్నాయి? ఏం తెలుస్తుంది? మనకు ఎంత దగ్గరి బంధువు అయినా గానీ, భార్య కొరకు ఒక భర్త చనిపోయినా, భార్య విధవ అయిపోయినా, తండ్రి చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయినా, భార్య చనిపోయి భర్త ఒంటరిగా అయిపోయాడు అన్నటువంటి వ్యధకు, బాధకు గురి అయినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహించాలి. ఓపిక సహనాలు వహిస్తూ, అల్లాహ్ దానికి సరియైన ఫలితం కూడా ప్రసాదించాలి అని ఆశిస్తూ ఉండాలి. “ఫల్ తస్బిర్ వల్ తహ్తసిబ్” అదే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సొంత కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా వారికి నసీహత్ చేసింది? ఇంకా ఆ దుఆలోని మరో పదం గుర్తుంచుకోండి: “అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.” ఎంత మంచి భావం ఉందో ఇక్కడ గమనిస్తున్నారా మీరు? సోదర మహాశయులారా,
اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాఇబినా వ సగీరినా వ కబీరినా వ దకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫ అహ్యిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్ అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు వ లా తుదిల్లనా బ’అదహు)
ఈ దుఆ యొక్క అనువాదం మీరు విన్నారు. మరొక దుఆ ఉంది, అది కూడా అందులో ఎంత గొప్ప భావం ఉంది?
اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్ హమ్హు వ ఆఫిహి వ’అఫు అన్హు) ఓ అల్లాహ్, అతన్ని క్షమించు, అతన్ని కరుణించు. ఓ అల్లాహ్, అతన్ని సుఖంగా, శాంతిగా ఉంచు. అతనిని నీవు అన్ని రకాలుగా అతని పాపాలను తుడిచివేసి నీవు మన్నించేసెయ్.
وَأَكْرِمْ نُزُلَهُ (వ అక్రిమ్ నుజులహు) అతడు ఇప్పుడు నీకు అతిథిగా అయ్యాడు. నీవు అతన్ని మంచిగా చూసుకో.
وَوَسِّعْ مُدْخَلَهُ (వ వస్సి’అ ముద్ఖలహు) అతడు సమాధిలో ప్రవేశించాడు, సమాధిని నీవు విశాలపరచు.
وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ (వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బరద్) నీవు అతని యొక్క పాపాలను నీటితో, బర్ఫ్ (ఐస్)తో, కడగండ్లతో పూర్తిగా కడిగి వేసెయ్. ఏమి పాపాలు లేకుండా చేయి అతన్ని.
وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ (వ అబ్ దిల్హు దారన్ ఖైరమ్ మిన్ దారిహి) ఈ ఇక్కడి గృహం కంటే, నీవు ఉత్తమమైన గృహం అక్కడ అతనికి ప్రసాదించుము.
وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ (వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహి) ఇక్కడ ఉన్న అతని జంట కంటే, మంచి ఓ జంట నీవు అతనికి ప్రసాదించు.
وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ (వ అహْلన్ ఖైరమ్ మిన్ అహ్లిహి) ఇక్కడ ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, ఇంతకంటే మంచి కుటుంబం నీవు అతనికి ప్రసాదించుము.
وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ (వ అ’ఇద్హు మిన్ అదాబిల్ ఖబ్ర్) ఇతన్ని నీవు సమాధి శిక్ష నుండి కాపాడు, శరణు ప్రసాదించు.
وَعَذَابِ النَّارِ (వ అదాబిన్నార్) నరక శిక్ష నుండి కూడా ఇతనికి శరణు ప్రసాదించు.
وَأَدْخِلْهُ الْجَنَّةَ (వ అద్ఖిల్హుల్ జన్నహ్) మరియు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము.
గమనిస్తున్నారా ఎంత గొప్ప భావాలు ఉన్నాయో?
అయితే సోదర మహాశయులారా, ఈ దుఆ ఏదైతే ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉందో, మళ్లీ అంటే ఈ మూడు తక్బీర్, మూడోసారి అల్లాహు అక్బర్ అని చేయి కట్టుకున్న తర్వాత ఈ దుఆ చదివాము కదా, గుర్తుంది కదా మీకు? మరోసారి కొత్తగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మధ్యలో చాలా విషయాలు, మాటలు వచ్చాయి కదా? మొదటిసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, సనా చదివితే చదవచ్చు లేకపోతే పర్వాలేదు. అ’ఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్, సూరె ఫాతిహా మొత్తం చదివి, ఆ తర్వాత ఏదైనా సూరా చదివితే చదవచ్చు లేకపోయినా పర్వాలేదు. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ ఇబ్రాహీం పూర్తిగా చదవాలి, ఏదైతే మనం తషహ్హుద్ లో చదువుతామో. మూడోసారి అల్లాహు అక్బర్ అని ఈ దుఆలు చదవాలి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న దుఆలు. నాలుగోసారి అల్లాహు అక్బర్ అని అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్, ఒకవైపున సలాం తింపినా సరిపోతుంది, సహీహ్ హదీస్ తో రుజువు అయి ఉంది. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని రెండో వైపున కూడా ఒకవేళ సలాం తెంపితే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రెండు సలాముల విషయం కూడా ఒక సలాం అయినా, రెండు సలాములైనా, ఈ రెండు విషయాలు సహీహ్ హదీసులతో రుజువు అయి ఉన్నాయి.
సోదర మహాశయులారా, ఆ తర్వాత…
ఎవరైనా పాఠాలు వింటున్నారు కదా?
షేఖ్, వింటున్నాం షేఖ్. జజాకుముల్లాహు ఖైరన్ షేఖ్.
జజాకుముల్లాహు ఖైరన్. వాస్తవానికి ఇది ఒక క్లాసే. కానీ సమయం సరిపోవడం లేదు. డిస్టర్బెన్స్ కూడా చాలా అవుతుంది అని అందరినీ సైలెంట్ చేసి మ్యూట్ చేసి పాఠం చెప్పడం జరుగుతుంది. లేదా అంటే క్లాస్ అన్నప్పుడు క్లాస్ గా ఒక మాట చెప్పి, ఆ అబ్దుల్లా, అర్థమైందా? ఖాజా, ఆ చెప్పండి. అస్మా గారు చెప్పండి. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడుగుకుంటూ వెళితే చాలా బాగుండేది. కానీ క్షమించండి, అల్లాహు త’ఆలా మన సమయంలో బరకత్ ప్రసాదించుగాక. చదవండి అబ్దుల్ ఖాదిర్ గారు.
గర్భిణీల గర్భస్రావంపై ఆదేశం
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భము పడిపోయినచో, దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాకముందు గర్భము పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ విషయం కూడా చాలా అవసరం. అనేక మంది ఈ ఆదేశం పట్ల కూడా చాలా అశ్రద్ధగా ఉన్నారు. కొందరు కొందరి గురించి అయితే తెలుస్తుంది, తొమ్మిది నెలలు పూర్తి నిండి పుట్టిన వెంటనే లేదా పుట్టినప్పుడే చనిపోయాడు అని తెలిస్తే కూడా జనాజా నమాజ్ చదవకుండానే తీసుకెళ్లి దఫన్ చేసి వచ్చేస్తారు. కానీ అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ఆధారంగా అనేక ధర్మవేత్తలు, ప్రస్తుత కాలంలోని ఎందరో మషాయిఖ్ ఇదే ఫత్వా ఇచ్చారు. ఏంటి? నాలుగు నెలలు గర్భం పూర్తి అయింది, 120 రోజులు పూర్తిగా నిండిపోయాయి, ఆ తర్వాత తల్లి గర్భంలో పిండం చనిపోతే అతని యొక్క జనాజా నమాజ్ తప్పకుండా చదవాలి. ఎందుకు? ఇంతకు ముందు నేను మీకు చూపించాను ‘Z Daroos’ అని మా YouTube ఛానల్ ఏదైతే ఉందో ఆఫీస్ వైపు నుండి, అందులో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కొంచెం వివరంగా ఉన్నాయి, తప్పకుండా వినండి అక్కడ. సంక్షిప్తం ఏమిటి? సుమారు 80 నుండి 90 రోజుల తర్వాత తల్లి గర్భంలో పిండం సంపూర్ణ మానవ ఆకారం పొందుతాడు. కళ్ళు, చేతులు, మొత్తం శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి ఒక మానవ రూపంలో వచ్చేస్తాడు. అంతకుముందు 40 రోజులు నుత్ఫా, 40 రోజులు అలకా, తర్వాత 40 రోజులు ముద్గా, ఈ విధంగా 120 రోజులు పూర్తి అయిపోయేసరికి ఇక అతడు సంపూర్ణ ఒక మనిషి, మనిషి రూపం దాల్చేశాడు. 120 రోజుల తర్వాత అతనిలో రూహ్, ఆత్మ కూడా వేయడం జరిగింది. ఇక అతడు ఒక సంపూర్ణ ఒక మనిషిగా ఉన్నాడు, చిన్న సైజులో, తల్లి గర్భంలో. ఆ తర్వాత మరణిస్తే తప్పకుండా అతని యొక్క జనాజా నమాజ్ చేయాలి. “అస్సిక్తు యుసల్లా అలైహ్” హదీసులో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఇక నాలుగు నెలల కంటే ముందు, నాలుగు నెలలు పూర్తి కాకముందే చనిపోతే, జనాజా నమాజ్ చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇక్కడ వరకు సోదర మహాశయులారా, అల్హందులిల్లాహ్ జనాజా నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు పూర్తి అయ్యాయి.
ప్రశ్న-జవాబులు
సలాం అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అడగండి, మాట్లాడండి.
షేఖ్, నమాజ్, జనాజా నమాజ్ కొరకు సఫ్ ఎలా ఏర్పాటు చేయాలి షేఖ్?
సర్వసామాన్యంగా నమాజుల కొరకు ఎలాగైతే సఫ్ ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ కొందరు అంటారు మూడు, ఐదు, ఏడు, ఇలా తప్పనిసరి ఏమీ లేదు కానీ ఉంటే మంచిది. కానీ సఫ్ కంప్లీట్ కూడా ఉండాలి. ఇది మంచి విషయం. సఫ్ కంప్లీట్ కాకుండా ఎక్కువ సఫ్ లు చేయడం మరియు బేసి సంఖ్యలో చేయడం ఇది అంత తప్పనిసరి కాదు. సఫ్ కంప్లీట్ గా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం.
జజాకల్లాహు ఖైరన్ షేఖ్.
వ ఇయ్యాక.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, ఈ కువైట్ లో రాజు చనిపోయాడు కదా, అయితే అతని యొక్క జనాజా నమాజ్ అన్ని మస్జిద్ లలో చదివించడం జరిగింది. ఇలా ఎక్కడైనా నమాజ్ చదివించవచ్చా? లేక జనాజా ముందరనే జనాజా నమాజ్ చదవాలా షేఖ్?
జనాజా ముందట కూడా చదివించడం జరిగింది. జనాజా ముంగట పెట్టుకొని అక్కడ కూడా చదివించడం జరిగింది. కానీ దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఆధారంగా ముస్లిం ప్రభుత్వంలోని నాయకుడు ఎవరి జనాజా నమాజ్ గాయబానా వేరేచోట చదివించడానికి ఆదేశం ఇస్తాడో, అక్కడ చదవచ్చు. ఇక్కడ సౌదీ అరబ్ లో కూడా ఇక్కడి రాజు ఆదేశం ఇచ్చారు. అందుకని కువైత్ రాజు యొక్క జనాజా నమాజ్ గాయబానా ఇక్కడ మక్కా, మదీనాలో, హరమైన్ లో కూడా చేయడం జరిగింది.
ఇంకొక ప్రశ్న షేఖ్. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే దుఆ చదవవచ్చా లేక వేరే దుఆలు చదవవచ్చా షేఖ్, జనాజా నమాజ్ లో?
పర్వాలేదు, ఒకే దుఆ చదివితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రెండో దుఆ ఏదైతే నేను చదివానో, అందులో “అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు” ఈ ఏదైతే పదాలు ఉన్నాయో చివరిలో హూ, హీ అని, అక్కడ, “అల్లాహుమ్మగ్ఫిర్ లహా వర్హమ్హా వఆఫిహా వఅఫు అన్హా వఅక్రిమ్ నుజులహా” ఈ విధంగా చదవడం మంచిది. కానీ ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం మయ్యిత్, మయ్యిత్ పదం ముజక్కర్. ఇది ఆహ్, మేల్ వర్డ్. అందుకొరకు “అల్లాహుమ్మగ్ఫిర్ లహు” చదివినా ఎలాంటి అభ్యంతరం లేదు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, జనాజా నమాజ్ చదివేటప్పుడు ఎవరికైనా దుఆ పూర్తిగా రాకపోతే అలాంటి నమాజ్ నెరవేరుతుందా? లేకపోతే అది మరలా వచ్చిన వాళ్ళు చదవాలా? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరు నమాజ్ చదివించడానికి దుఆలు వచ్చిన వాళ్ళు ఉండరు.
ఏం చదువుతారు మరి ఆ సందర్భంలో?
అంటే ఏదైతే దుఆలు అయితే వాళ్లకు తెలిసి ఉంటాయో అలాంటి దుఆలు చదవవచ్చినా అనేది ప్రశ్న.
ఇక్కడ ఎవరు ఫత్వా ఇచ్చారో ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు కానీ నేను ఎవరో ఎవరిదో ఫత్వా చదివాను. జనాజా నమాజ్ లో ఒకవేళ ఎవరికైనా దుఆ కంఠస్థం లేకపోతే వారు రాసుకొని ఏదైనా మొబైల్ లో గానీ లేదా కాగితంలో గానీ చూసి చదవడంలో ఇబ్బంది లేదు ఇన్ షా అల్లాహ్. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కనీసం ఒక్క దుఆనైనా. అల్లాహు ఆ’లమ్.
జజాకల్లాహు ఖైర్ షేఖ్.
వ ఇయ్యాక, బారక ఫీక్.
ఈ అంశానికి సంబంధించి ఇంకా ప్రశ్న ఉంటే ఎవరిదగ్గరైనా మైక్ ఆన్ చేసుకొని అడగవచ్చు లేదా రేస్ హ్యాండ్ చేయవచ్చు.
అహ్సనల్లాహు ఇలైక్ షేఖ్.
వ ఇలైకుమ్, వ బారక ఫీకుమ్. తఫద్దల్, హయ్యాకల్లాహ్.
షేఖ్, అరబీలో దుఆ రాకపోతే, జనాజా సలాత్ లో, వేరే ఇంకా వేరే భాషలో ఏమైనా చేసుకోవచ్చా షేఖ్ దుఆ?
నేను చెప్పాను కదా ఇంతకుముందు, రాసి ఉండాలి అరబీలో. దాన్ని చూసి చదివితే ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది “హాదా అహ్వను అలైక మిన్ గైరిల్ అరబియ్యా”. అరబీ భాషలో కాకుండా వేరే భాషలో చదవడం కన్నా చూసి నమాజ్ లో అరబీలో ఆ దుఆ చదవడం ఉత్తమం. అల్లాహు ఆ’లమ్.
జజాకల్లాహు ఖైరన్ షేఖ్. బారకల్లాహు ఫీక్.
వ ఇయ్యాక.
షేఖ్, ఇక్కడ మన ఇండియాలో చాలా జనాజాలు నేను చేశాను. రెండు మూడు జనాజాలు. రెండు నిమిషాల్లో జనాజా నమాజ్ పూర్తి చేసేస్తారు షేఖ్. అది ఎలాగ అనేది నాకు అర్థం కావడం లేదు. ఏం దుఆలు చదువుతారు? ఏం పఠిస్తారు?
చెప్తాను, వినండి. మన వద్ద సర్వసామాన్యంగా మన హనఫీ సోదరులు అల్లాహ్ మాకు, వారికి అందరికీ హిదాయత్ ఇవ్వుగాక, హనఫీ సోదరులు సూరతుల్ ఫాతిహా చదవరు. సనా చదువుతారు. ఇదే చాలా విచిత్ర విషయం అనిపిస్తుంది. అందుకొరకే అంధానుసరణ ఉండకూడదు. అంటే ఈ అంధానుసరణ, తక్లీద్ ఏదైతే ఉందో, దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు సనా ప్రస్తావన లేదు, అది చదువుతున్నారు. సూరె ఫాతిహా ప్రస్తావన ఉంది, దాన్ని వదులుతున్నారు. అందుకొరకు కూడా వారి యొక్క నమాజ్ సంక్షిప్తంగా అయిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఎవరైనా వేరే కారణాలతో సంక్షిప్తంగా చేస్తే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అల్లాహు ఆ’లమ్. ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, సూరె ఫాతిహా కూడా జనాజా నమాజ్ లో చేయాలి.
జజాకుముల్లాహు ఖైర్ షేఖ్. ఇంకొక విషయం షేఖ్. ఎందుకు జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు ఉండవు? శవం ముందర ఉన్నదానా? లేకపోతే ఎందుకు షేఖ్?
ఎలా? జనాజా… ఏంటి ఏంటి? రుకూలు, రుకూ, సజ్దాలు. అల్లాహు ఆ’లమ్. ముందు ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో మనకు నేర్పిన విషయంలో జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు లేవు. కారణం ఏంటి? మీరు చెప్పినట్లు, ముందు ఒక శవం ఉంటుంది గనక చూసే వారికి మనం అతని కొరకు రుకూ చేస్తున్నట్లు, అతని కొరకు సజ్దా చేస్తున్నట్లు ఏర్పడకూడదు కావచ్చు. అల్లాహు ఆ’లమ్. ఇదే అల్లాహ్ యొక్క ఇష్టం. అందుకొరకే విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? తూచా తప్పకుండా ఎందుకు, ఎలా, ఇలా ఎందుకు, అలా ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్నలు లేకుండా అల్లాహ్ చెప్పిన మాటను, ప్రవక్త చూపిన పద్ధతిని మనం అనుసరించాలి. బారకల్లాహు ఫీకుమ్.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, ఈ జనాజా నమాజ్ లోని ఒక ప్రశ్న షేఖ్. చిన్న పిల్లలకు నమాజ్ చదివించవచ్చు, చదివించవచ్చుకూడదు ఎలాగైనా ఒకటే అంటారు షేఖ్. దీని గురించి.
ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేకి బదులుగా, ఒకవేళ మీరు గ్రహించారంటే, ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇంతకు ముందే నేను ఇచ్చేసాను, ఇదే పాఠంలో, ఈ రోజే. కానీ అది కొందరికి డైరెక్ట్ గా అర్థం అయ్యింది కావచ్చు, మరి కొందరికి డైరెక్ట్ గా అర్థం కాలేదు కావచ్చు.
అయితే మీలోనే ఎవరైనా సమాధానం ఇవ్వాలి అని కోరుతున్నాను. సోదరుడు అబ్దుల్ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. అడపదడప మిమ్మల్ని కూడా అడగాలి కదా మరి నేర్చుకున్నది ఏం నేర్చుకుంటున్నారు మీరు అనేది తెలియాలి కదా.
అదే కదా షేఖ్, గర్భంలో నాలుగు నెలలు పూర్తి నిండితే చదివించాలి, పూర్తి నిండకపోతే చదివించకూడదు. ఇలాగేనా షేఖ్, ఇదేనా షేఖ్?
కరెక్ట్. ఈ విషయం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ నాలుగు నెలల గర్భం నిండిన తర్వాత ఒకవేళ చనిపోతే నమాజ్ చేయాలి అని అన్నప్పుడు, ఇక చిన్నపిల్లలు ఎవరైతే పుట్టి కొద్ది రోజులు బ్రతికి చనిపోయారో, వారి జనాజా నమాజ్ చదవకపోవడానికి ఏంటి దలీల్? ఏంటి కారణం? ఏంటి రీజన్? అర్థమైంది కదా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
551. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“జనాజా (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంది. శవ ఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు యూనిట్ల పుణ్యం లభిస్తుంది.” రెండు యూనిట్లు అంటే ఏమిటని అడగ్గా ‘రెండు కొండల పరిమాణం’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయెజ్, 59 వ అధ్యాయం – మనిన్ తంజిర హత్తా తద్ ఫిన్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జనాజ. మృత దేహానికి స్నానం చేయించటం, ఖననం చేయటం యొక్క ప్రాముఖ్యతలు
మృతునిస్నానంచేయించుట.
మగవారు మగవారికి, స్త్రీలు స్త్రీలకి స్నానం చేయించవలెను.
భార్య భర్తకి, భర్త భార్యకి స్నానం చేయించ వచ్చును.
మృతుని యొక్క మర్మంగాలపై వస్త్రం కప్పి, మిగతా వస్త్రాలు శరీరం నుండి వేరు చేయవలెను.
మీసాలు,గోళ్ళు, చెంక వెంట్రుకలు అతి పెద్దగా ఉంటే స్నానానికి ముందు కత్తిరించవలెను.
వీపును కాస్త పైకి లేపి విసర్జన బయటకు వచ్చునట్లుగా కడుపును నొక్కవలెను. ఆతర్వాత బాగా కడుగవలెను. శుభ్రపరుస్తున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వాడవలెను.
చేతికి తొడుగుళ్ళు తొడిగి విసర్జన కడుగవలెను.
బాగా శుభ్రపరచిన తర్వాత వుదూ చేయించవలెను.
ముందు కుడి ప్రక్కకు, ఆ తర్వాత ఎడమ ప్రక్కకు స్నానం చేయించవలెను.
ఆతర్వాత రేగుచెట్టు ఆకుతో లేదా సబ్బుతో స్నానం చేయించవలెను. స్నానం ఒకసారి చేయించడం తప్పని సరి. 3 సార్లు చేయించడం సున్నహ్.
ఇక చివరన కాపూర్ (కర్పూరం) నీళ్ళతో లేదా సువాసన ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించవలెను.
తప్పని సరిగా స్త్రీల వెంట్రుకలను మూడు జడలు చేయవలెను.
కఫన్తొడిగించుట
మగవారికి 3 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
కఫన్ శుభ్రముగా, తెల్లగా, సువాసన పూసినదై ఉండాలి.
ఆడవారికి 5 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
ఒక బట్టను నడుం క్రింద, ఒకటి భుజాల క్రింద, ఒకటి దుపట్టా మరియు రెండు పొడుగాటి బట్టలు ఉండాలి
కఫన్పద్ధతి
ముందుగా మూడు గట్టిగా ఉండే వస్త్రపు పట్టీలు పరచవలెను.
మూడు పట్టీలపై మగవారి కోసం ఒకే సైజులోని 3 కఫన్ వస్త్రములు, స్త్రీల కోసమైతే 2 కఫన్ వస్త్రములు పరచవలెను.
స్త్రీల కోసం కఫన్ వస్త్రంపై తల బయటికి తీయటానికి వీలుగా కత్తిరించఉన్న ఇంకో చిన్న వస్త్రం పరచవలెను.
స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము (నడుము నుండి కాళ్ళ వరకు సరిపోయేటట్లు) పరచవలెను.
స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము తల కప్పేటట్లుగా పరచవలెను.
చివరగా గుసుల్ చేయబడిన మృతదేహమును పైన పరచబడిన వస్త్రములపై పడుకోబెట్టి ఒక్కో వస్త్రమును చుట్టవలెను. ఆఖరుగా మొట్టమొదట పరచిన మూడు పట్టీలతో కఫన్ ను కట్టవలెను.
సమాధి లహద్ లో త్రవ్వుట ఉత్తమం అంటే మృతదేహాన్ని లోపల దాచి పెట్టేంత లేదా అడుగు పెట్టె మాదిరిగా చొరియ ఖిబ్లావైపుకు త్రవ్వవలెను.
సమాధిలో మృతదేహమును కాస్త కుడివైపు త్రిప్పి, ముఖం ఖిబ్లావైపు ఉండేటట్లు చేయవలెను.
లహద్ (చొరియ)ని కాల్చని ఇటుకలు మరియు తడిచిన మట్టి గారతో పూడ్చి (సీలు చేసి) ఆ తర్వాత సమాధిని మట్టితో నింపవలెను.
సమాధిని భూమినుండి ఒక జాన అంతట పైకి ఉండునట్లు మట్టికప్పి నీళ్ళు చల్లవలెను.
Source: ఫిఖ్ హ్ – రెండవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.