జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం ‘రెండు కొండల పరిమాణం’

551. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“జనాజా (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంది. శవ ఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు యూనిట్ల పుణ్యం లభిస్తుంది.” రెండు యూనిట్లు అంటే ఏమిటని అడగ్గా ‘రెండు కొండల పరిమాణం’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయెజ్, 59 వ అధ్యాయం – మనిన్ తంజిర హత్తా తద్ ఫిన్]

జనాయెజ్ ప్రకరణం : 17 వ అధ్యాయం – జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

%d bloggers like this: