నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!
ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.
వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!
మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?
ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి
45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ “ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”
ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త పరలోక చింతన (ఆఖిరత్ కా ఫిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సూరా అల్-హషర్ మరియు సూరా అల్-హజ్ నుండి ఖురాన్ వచనాలను ఉటంకిస్తూ, విశ్వాసులు రేపటి కోసం (పరలోకం కోసం) ఏమి సిద్ధం చేసుకున్నారో ఆలోచించాలని మరియు అల్లాహ్కు భయపడాలని (తఖ్వా) గుర్తుచేస్తారు. తఖ్వా యొక్క నిజమైన అర్ధాన్ని వివరించడానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను ఉదాహరణగా చూపిస్తారు. పాపాలు మరియు ప్రాపంచిక ప్రలోభాలు నిండిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడమే తఖ్వా అని వివరిస్తారు. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు ఇస్తూ, వారు ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తారు. ఆధునిక ముస్లింలు ‘వహన్’ (ప్రపంచ ప్రేమ మరియు మరణ భయం) అనే వ్యాధితో బాధపడుతున్నారని, ఇది వారి బలహీనతకు కారణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకిస్తారు. ఇహలోక జీవితం తాత్కాలికమని, పరలోక జీవితమే శాశ్వతమైనదని మరియు శ్రేష్ఠమైనదని ఖురాన్ మరియు కవిత్వం ద్వారా ప్రసంగాన్ని ముగిస్తారు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
అల్హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బஃదా అమ్మా బஃద్. ఫ అఊదు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమదిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్) “ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫీ మౌదయిన్ ఆఖర్
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్) “నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవు సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు.” (2:32)
తొలగింపబడిన షైతానుకు ఎక్కిన రక్షింప ఉందుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకే అంకితము. ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచి మరియు వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్య మూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో, వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.
పరలోక చింతన మరియు తఖ్వా
సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో 59వ సూరా, సూరా అల్-హషర్, వాక్య నెంబర్ 18లో అల్లాహ్ త’ఆలా ఇలా అంటున్నాడు:
“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.” (59:18)
ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ రెండుసార్లు ‘యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్’ – ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని చెబుతూ, తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ మరియు ప్రతీ వ్యక్తి రేపటి కోసం తాను ఏమి తయారు చేసుకున్నాడో దాని గురించి చూసుకోవాలని చెప్పి, దాని తర్వాత మరొక్కసారి అల్లాహ్ తబారక వ త’ఆలా ఒకే వాక్యంలో రెండుసార్లు ‘ఇత్తఖుల్లాహ్’ అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి, రెండుసార్లు తఖ్వా గురించి ప్రస్తావించడం జరిగింది.
అమీరుల్ మోమినీన్ హజ్రతే ఉమర్ ఫారూఖ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు, “తఖ్వా అంటే ఏమిటి?”. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తున్నారు, “ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్?” ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, మీరు మీ జీవితంలో ముళ్ల కంచెలతో నిండి ఉన్నటువంటి ఎక్కడైనా ఒక ఇరుకైనటువంటి మార్గము గుండా మీరు పయనించారా?” అని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారిని అడిగారు. అప్పుడు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు అన్నారు, “ఖాల బలా”, నేను అటువంటి మార్గంపై నడిచాను. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ నువ్వు అటువంటి మార్గంపై నడిచినట్లయితే, “ఫమా అమిల్త?” నువ్వు అటువంటి మార్గంపై నడిచినప్పుడు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి అంటే, హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “షమ్మర్తు వజ్తహత్తు”, నేను చాలా కష్టపడ్డాను, చాలా జాగ్రత్తగా నా యొక్క వస్త్రాలు, నా యొక్క బట్టలు వాటికి అంటకుండా, ముళ్ల కంచెలకు తగలకుండా నేను చాలా జాగ్రత్తగా దానిలో నుంచి బయటకు వచ్చేసానని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు జవాబు పలుకుతున్నారు. ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “ఫదాలికత్ తఖ్వా”, ఇదే తఖ్వా అంటే.
కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ ముళ్ల కంచెలు అంటే మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి మహాపాపాలు మరి అదే విధంగా అశ్లీలమైనటువంటి కార్యాలు, మరి ఈ ఇరుకైనటువంటి సందు ఏమిటంటే మన జీవితం సోదరులారా, మరి మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పనులు మరి అదే విధంగా మహాపాప కార్యాల నుండి మనల్ని మనము అదే విధంగా మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకుంటూ బయటకు వెళ్లిపోవటమే తఖ్వా.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరా అల్-హషర్ 59వ సూరాలో 18వ వాక్యంలో ఒకే వాక్యంలో రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు: య్యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ – ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు భయపడండి దేని గురించి? వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ – అంటే రేపటి కోసం అంటే మీరు పరలోకం కోసం ఏమి తయారు చేసుకున్నారో ఆ విషయంలో మీరు భయపడండి. మరి దాని తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా మళ్ళీ అంటున్నాడు: వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా త’మలూన్ – ఈ ఇహలోకంలో మీరు ఏం చేస్తున్నారో అల్లాహ్ తబారక వ త’ఆలా దాని గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని ఇటు ఇహలోకము, అటు పరలోకము, ఈ రెండు విషయాల్లో కూడా ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా రెండుసార్లు తఖ్వా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది.
సూరా అంబియా, 21వ సూరా, ఒకటో వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా మరోచోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. (21:1)
మానవుల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు పరలోక చింతనను కలుగజేస్తూ, పరలోకం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో అతి ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఈమాన్ బిల్లాహ్ (అల్లాహ్ తబారక వ త’ఆలా పై విశ్వాసము). రెండు, ఈమాన్ బిర్రుసుల్ (ప్రవక్తలపై విశ్వాసము). మరి మూడవది, ఈమాన్ బిల్ ఆఖిరా (అంటే పరలోకంపై విశ్వాసము). ఈరోజు ఏవైతే మీ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడ్డాయో, ఇందులో అల్లాహ్ తబారక వ త’ఆలా పరలోకం గురించి ప్రస్తావిస్తూ, పరలోక చింతన ఏ విధంగా కలిగి ఉండాలో అల్లాహ్ తబారక వ త’ఆలా తెలియజేస్తున్నాడు.
ప్రళయ దినం యొక్క భయంకర దృశ్యం
సూరా అల్-హజ్, 22వ సూరా, మొదటి వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:1-2)
అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ వాక్యంలో ఇలా ప్రస్తావిస్తున్నాడు: “యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్” – ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల మీరు భయపడండి. “ఇన్న జల్జలతస్సాఅతి షైయున్ అజీమ్” – ఎందుకంటే ప్రళయం రోజు వచ్చేటటువంటి జల్జలా (భూకంపము) అది ఎంతో భయంకరమైనటువంటిది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు: “యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్” – ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చేటటువంటి ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. “వతరన్నాస సుకారా వమాహుమ్ బిసుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్” – మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శిక్షను చూసి, ఆ ప్రళయాన్ని చూసి వారి మతిస్థిమితం పోతుంది అని దైవం ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు.
కాబట్టి సోదర మహాశయులారా, మనిషి జీవితంలో ఇహపరలోకాలలో సాఫల్యం చెందడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశము పరలోక చింత. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేదంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాలే నమాజులు చదివేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉపవాసాలు ఉండేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించగానే జకాత్ను చెల్లించేటటువంటి వారు. మరి అదే విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క మార్గంలో పోరాడడానికి కూడా వారు వెనకాడినటువంటి వారు కాదు.
అయినప్పటికీ కూడా సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: “ఖాల యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇஃదిల్లీ అస్అలుక అన్ కలిమతిన్ ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ.” ఫఖాల నబియ్యుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “సల్నీ అమ్మా షిஃతా.” హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు అంటున్నారు, ఈ హదీసును ముస్నదే అహ్మద్లో ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారు 22,122వ నెంబర్ హదీసులో తీసుకొచ్చారు. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నారు: “ఓ ప్రవక్తా, నా లోపల ఒక రకమైనటువంటి చింత ఉంది. అది నన్ను లోలోపల నుంచి ఎంతగా తినేస్తుందంటే, ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ – నన్ను బాధకు గురిచేస్తుంది, నా లోలోపలే అది తినేస్తుంది.” ఎలాగైతే సోదరులారా, ఒక వ్యక్తి యవ్వనుడైనప్పటికీ కూడా అతని లోపల బాధ గనుక, దుఃఖము గనుక లోలోపల అతన్ని తినివేస్తూ ఉన్నప్పుడు, అతడు ఎంత యవ్వనుడున్నా కూడా ఆ యవ్వనము ఉన్నప్పటికీ కూడా అతని ముఖంపై ముసలి యొక్క కవళికలు కనిపించడం ప్రారంభమవుతాయి. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ ముఆద్, అదేమిటో అడుగు. ఇస్సల్నీ అమ్మా షిஃతా – ఏమిటో అడుగు” అంటే, ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు సోదర మహాశయులారా అడుగుతున్నారు. ఏమన్నారంటే: “యా నబియ్యల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హద్దిస్నీ బి అమలిన్ యుద్ఖిల్నియల్ జన్నహ్” – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గములో ఎలా ప్రవేశించాలో ఏదైనా అమలు ఉంటే అది చెప్పండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీగా ధృవీకరించారు.
అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సహాబా అనుచరులు, వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నమాజులు చదువుతూ కూడా, వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ కూడా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎంతో మంది సహాబాలు అడుగుతున్నారు, “దుల్లనీ అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్నహ్” – ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఆచరణ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని చేసి నేను స్వర్గంలో ప్రవేశించడానికి. ఏ విధంగా సహాబాలలో పరలోకం అనేటటువంటి చింత ఎంత అధికంగా ఉండేదో మనం ఇక్కడ గమనించగలం.
అంతేకాదు సోదరులారా, హజ్రతే అబూదర్ రిఫారీ రది అల్లాహు అన్హు వారైతే ఆయన అంటున్నారు, నన్ను గనక ఒక వృక్షంగాను అల్లాహ్ తబారక వ త’ఆలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు, ఎవరైనా దాన్ని నరికి వెళ్ళిపోయేటటువంటి వారు, నాకు పరలోకంలో అల్లాహ్ తబారక వ త’ఆలా లేపి నువ్వు ఈ పని ఎందుకు చేశావు అనేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తి ఉండేది కాదేమో అని ఈ విధంగా సహాబాలు దుఃఖించేటటువంటి వారు.
ముస్నద్ ఏ అహ్మద్ లో 13,150వ హదీసులో హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారి యొక్క ఉల్లేఖనంలో ఈ హదీస్ వస్తుంది. ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, “సమిஃతున్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు ఫీ బஃది సలాతిహి, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా.” హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చదివేటటువంటి నమాజుల్లో కొన్నింటిలో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు: “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా” – ఓ అల్లాహ్, నా యొక్క లెక్కలను తేలికపాటి లెక్కలుగా నువ్వు తీసుకో. అమ్మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తేలికపాటి లెక్కలంటే ఏమిటి?” అని ఆయిషా రది అల్లాహు అన్హా వారు హజ్రతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు చెబుతూ అంటున్నారు, “ఖాల అయ్ యన్జుర ఫీ కితాబిహి ఫయతజావదు అన్హు.” దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఆయిషా, నువ్వు భలే ప్రశ్నలు వేస్తావే! వాస్తవానికి తేలికపాటి లెక్కలంటే ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలా తన దాసుల యొక్క కర్మపత్రాలను చూసిన తర్వాత వారిని అట్టే విడిచిపెట్టటము లేక వారిని అలాగే క్షమించివేయటము ఇదే తేలికపాటి లెక్కలు. ఎందుకంటే ఆయిషా, ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం ప్రారంభిస్తే, ఆయన ప్రశ్నించేటటువంటి జవాబులు చెప్పేటటువంటి ధైర్యము గానీ లేక జవాబు చెప్పేటటువంటి స్తోమత ఎవరికీ ఉంటుంది? ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం మొదలుపెడితే, వివరంగా అడగటం మొదలుపెడితే ఆ వ్యక్తి నాశనమైపోతాడు” అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో ప్రస్తావిస్తున్నారు.
ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎంతగా పరలోకం గురించి చింతన చెందేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మన జీవితాల్ని మనం చూసుకున్నట్లయితే, మన జీవితాల్లో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటి? వాస్తవానికి మనం పరలోక జీవితం గురించి ఆలోచించి మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామా? ఇహలోక జీవితంలో పడిపోయి పరలోక జీవితాన్ని మరచి నడుస్తున్నామా? అల్లాహ్ తబారక వ త’ఆలా అందుకనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, “ఇఖ్ తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిమ్ ముஃరిదూన్” – ప్రజల యొక్క లెక్కల గడియ సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం పరధ్యానంలో పడి ఉన్నారని దైవం అంటున్నాడు.
‘వహన్’ అనే వ్యాధి
అందుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబూ దావూద్ లో 4297వ నెంబర్ లో హదీస్ ఈ విధంగా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు: “యూషికుల్ ఉమము అన్ తదాఅ అలైకుమ్ కమా తదాఅల్ అకలతు ఇలా ఖస్అతిహా.” ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్? ఖాల “బల్ అన్తుమ్ యౌమయిదిన్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్. వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్, వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్.” ఫఖాల ఖాయిలున్ “యా రసూలల్లాహ్, వమల్ వహన్?” ఖాల “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్.”
ప్రళయానికి సమీప కాలంలో ముస్లిం సమాజంపై ఇస్లాం వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆ విధంగా విరుచుకొని పడతాయి, ఏ విధంగానైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి జంతువు విరుచుకొని పడుతుందో. అప్పుడు ఒక అతను అడుగుతున్నాడు, “ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్” – ఆ సమయంలో మా యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందా? అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లేదు, “బల్ అన్తుమ్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్.” మీరు ఆ సమయంలో అత్యధికంగా ఉంటారు, కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోయి ఉంటారు. ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి నురగ ఉంటుందో. వాస్తవానికి ఇక్కడ ఆలోచించినట్లయితే సోదర మహాశయులారా, ఎవరైనా దాహము, దప్పికతో ఉంటే ఒక గ్లాసు నీళ్లు అతనికి దప్పిక తగ్గడానికి, దాహం తీరడానికి మనం ఇచ్చినట్లయితే అతడు ఆ గ్లాసు నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోగలడు గానీ అదే గనక మనం అదే గ్లాసులో మనం ఒక గ్లాసు నురగ అతనికి ఇచ్చినట్లయితే ఆ నురగతో అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే నీటికి విలువ ఉంది గానీ నురగకు ఆ విలువ ఉండదు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోతారు. మరి అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది? “వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్” – మీ యొక్క శత్రువుల యొక్క హృదయాల్లో మీ పట్ల ఉన్నటువంటి భయాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా తొలగిస్తాడు. మరి అదే విధంగా, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – మీ యొక్క హృదయాలలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఆ సమయంలో ఒక రోగాన్ని జనింపజేస్తాడు. ఏమిటండీ ఆ రోగము అంటే, బీపీనా? కాదు సోదరులారా. షుగరా? కాదు సోదరులారా. మరి ఇటువంటి వ్యాధులేమీ కానప్పుడు అది ఏ వ్యాధి అండీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వింతైనటువంటి పదాన్ని వినియోగించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – అదేమిటంటే మీ హృదయాల్లో జనించేటటువంటి వ్యాధి, ఆ వ్యాధి పేరే వహన్. మరి ఈ వ్యాధి వహన్ అన్నటువంటిది అరబ్బులో కూడా సహాబాలు కొత్తగా విన్నారు. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నారు, “వమల్ వహను యా రసూలల్లాహ్?” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వహన్ అంటే ఏమిటి అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్” – పరలోక చింత వదిలేసి ఇహలోక వ్యామోహంలో పడిపోవటము ఈ వ్యాధికి ఉన్నటువంటి మొదటి లక్షణము. మరి రెండవ లక్షణం ఏమిటండీ అంటే మరణము అంటే భయము.
అయితే సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే, మరి మన సమాజం దేని వైపునైతే పరుగెడుతుందో, ఆ పరుగును మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మన సమాజము ఇహలోకం అన్నటువంటి వ్యామోహంలో కొట్టిమిట్టాడుతుంది. పరలోక ధ్యానాన్ని మరిచిపోయి ఉన్నాము. అల్లాహ్ త’ఆలా సూరతుల్ ఆలాలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ﴿١٦﴾ وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ﴿١٧﴾ కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. (87:16-17)
అయినప్పటికీ ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా – ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క సహీఫాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఎలా ఉంది అంటే “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా” – మీరు అయినప్పటికీ ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తున్నారే గానీ, పరలోక జీవితం ఎటువంటిది? అల్లాహ్ త’ఆలా అంటున్నాడు, “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా వల్ ఆఖిరతు ఖైరువ్ వ అబ్ఖా.” వాస్తవానికి ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం ఎంతో మేలైనటువంటిది. ఎందుకంటే అది కలకాలం ఉండిపోయేటటువంటిది. ఇహలోక జీవితం అంతమైపోయేటటువంటిది.
అందుకనే సోదర మహాశయులారా, ఒక కవి తెలుగులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎల భ్రమచితివోయి మనసా! కాలూని వలలోన కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా! తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా! నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీవెంట రాదేది మనసా!
ఇల్లు, వాకిలి, నీవు కట్టుకున్నటువంటి ఇల్లాలు ఇవన్నీ నీవే అని అనుకుంటున్నావు. కాలూని వలలోన కానేక చిక్కేవు, కడచేరుటే త్రోవ మనసా. బంధుత్వం అన్నటువంటి వలలో చిక్కుకొని పోయావు, మరి ఈ బంధుత్వాన్ని బ్యాలెన్స్ గా చేసుకొని ఇహపరలోకాలలో సాఫల్యం చెందటం అంటే మామూలు విషయం కాదు. నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. కానీ నీ తనయులు, చుట్టాలు నీ వారని నమ్ముతున్నావేమో, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేది కేవలం నువ్వు చేసుకున్నటువంటి నీ పాపపుణ్యాలు తప్ప మరొకటి ఏమీ రాదు అన్నటువంటి విషయాన్ని ఒక కవి కూడా తెలుగులో ఈ విధంగా చక్కగా తన తెలుగు కవితంలో తెలియజేస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ త’ఆలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వాస్తవానికి పరలోక జీవితమే అసలైనటువంటి జీవితము. ఇహలోక జీవితము కేవలం ఒక ఆటవినోదం తప్ప మరేమీ కాదు. ఒక మోసపూరితమైనటువంటి జీవితం తప్ప మరేమీ కాదు అని దైవం ఎన్నో చోట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.
అల్లాహ్ తబారక వ త’ఆలాతో దువా ఏమనగా, అల్లాహ్ తబారక వ త’ఆలా మనందరికీ కూడా పరలోక చింతనను కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పటివరకైతే మనం ఇహలోకంలో బ్రతికి ఉంటామో అప్పటివరకు కూడా అల్లాహ్ తబారక వ త’ఆలాను ఆరాధిస్తూ బ్రతికి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎప్పుడైతే మనం మరణిస్తామో అల్లాహ్ తబారక వ త’ఆలా వైపునకు విశ్వాస స్థితిలోనే అల్లాహ్ వైపునకు మరలేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 68
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
(1) దైవప్రవక్త (ﷺ) వారికి స్వప్నం లో శత్రుసైన్యాన్ని తక్కువ మందిగా చూపించింది ఏ యుద్ధ సందర్భంగా తెలపండి?
A) ఉహద్ యుద్ధం
B) బద్ర్ యుద్ధం
C) తబూక్ యుద్ధం
(2) ప్రళయదినం నాడు అల్లాహ్ మనల్ని ప్రశ్నించే 5 ప్రశ్నల క్రమంలో ఈ క్రింది వాటిలో ఒక ప్రశ్న ఉంది అదేమిటి?
A) తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు ?
B) ఎంత వరకు తెలుసుకున్నావు ?
C) ఎంత ఎక్కువ మందికి తెల్పావు ?
(3) “భయపడినవాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టాడు ఇలాంటి వ్యక్తి గమ్యాన్ని చేరుకుంటాడు , వినండి ! అల్లాహ్ యొక్క సామగ్రి అమూల్యమైనది , జాగ్రత్తగా వినండి ! అల్లాహ్ సామగ్రి అనగా స్వర్గం ” [తిర్మిజీ ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం ద్వారా మనకు లభించే గుణపాఠం ఏమిటి?
A) తెల్లవారు జామున మాత్రమే ప్రయాణం చెయ్యాలి
B) అల్లాహ్ విధేయత కొరకు పుణ్యాలు చెయ్యడం లో ఆలస్యం చెయ్యకూడదు
C) పై రెండూ యధార్థమే
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె సృష్టికర్త అయిన అల్లాహ్ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.
ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్ఆన్ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్ను చూడడం సాధ్యం కాదు.
ఖుర్ఆన్లో దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్ఔన్ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తూర్ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్అన్లోని ‘ఆరాఫ్ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.
ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?
పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్ఆన్లో యూనుస్ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు : “ఓ స్వర్గవాసులారా! అల్లాహ్ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్)
ఖుర్ఆన్ లో మరొకచోట అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్ఆన్, ఖియామహ్ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)
కనుక ఇహలోకంలోనే అల్లాహ్ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.
ప్రళయదిన భయంకరత
ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ (యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్) ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.
రెండో విషయం చెప్పాడు:
وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا (వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా) ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది
మూడో విషయం చెప్పాడు.
وَتَرَى النَّاسَ سُكَارٰى (వ తరన్ నాస సుకారా) జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.
وَمَا هُمْ بِسُكَارٰى (వమా హుమ్ బిసుకారా) కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)
ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.
وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ (వలాకిన్న అదాబల్లాహి షదీద్) ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.
మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే
ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.
ప్రళయ దినం సూచనలు
అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.
ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:
فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا (ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా) ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)
ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.
اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ (ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్) ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)
ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.
అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.
ప్రళయ సూచనలు మరియు వాటి రకాలు
ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.
మొదటి రకం, సూచనలు మొదలై సమాప్తం కూడా అయినవి:
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ (బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్) నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.
అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.
ప్రళయ సూచనల్లో రెండో రకమైన సూచనలు, మొదలైపోయినాయి మరియు ఇంకా పెరుగుతూనే పోతున్నాయి.
ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.
ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا (అన్ తలిదల్ అమతు రబ్బతహా) బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.
మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.
ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.
మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.
ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.
وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى (వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా) అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.
ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.
అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.
ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.
పెద్ద సూచనలు
మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”
అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,
إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ (ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్) నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.
ఏంటి ఆ పెద్ద సూచనలు?
అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.
వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:
“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.
మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.
ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?
వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.
సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.
దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.
కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,
అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.
ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.
రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.
మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సూరహ్ అల్ మా’ఊన్ (సూరహ్ నం.107) అనువాదం, వ్యాఖ్యానం
[35 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరాను సూరయె దీన్గా, సూరయె అరఐత్గా, సూరయె యతీమ్గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్హుల్ ఖదీర్).
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.
1 తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు
2. కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచిపనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …
బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా?
అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు.
ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీం
فَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారు
వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్
وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు.
ఫవైలుల్ లిల్ ముసల్లీన్
فَوَيْلٌ لِلْمُصَلِّينَ
5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారో
అల్లదీన హుమ్ అన్ సలాహితిహిం సాహూన్
الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో,
అల్లదీన హుమ్ యురాఊన్
الَّذِينَ هُمْ يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో.
వయంన ఊనల్ మాఊన్
وَيَمْنَعُونَ المَاعُونَ
ఈ ప్రసంగంలో సూరహ్ అల్ మా ఊన్ (107) యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం అందించబడింది. పరలోక దినాన్ని తిరస్కరించే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, ముఖ్యంగా అనాథలను గెంటేయడం మరియు పేదలకు ఆహారం ఇవ్వకపోవడం వంటి అంశాలను ఇది వివరిస్తుంది. అలాగే, నమాజు పట్ల అశ్రద్ధ వహించే వారు, ప్రదర్శన బుద్ధితో (రియా) చేసే ప్రార్థనలు మరియు ఇరుగుపొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేయడానికి నిరాకరించే వారి పట్ల హెచ్చరికలు చేయబడ్డాయి. పరలోక విశ్వాసం గట్టిగా ఉన్న వ్యక్తిలో ఉండే సద్గుణాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా వివరించడం జరిగింది.
ఈ సూరత్ పేరు మా ఊన్ అనేది ఇందులోని చివరి వాక్యంలో అల్ మా ఊన్ అన్న పదం ఏదైతే వచ్చిందో దానిని బట్టి. అయితే ముందు అలవాటు ప్రకారంగా దీని అనువాదం విందాము, ఆ తర్వాత దీని యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాము.
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ (వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్) మరియు నిరుపేదకు అన్నం పెట్టేందుకు పురికొల్పనివాడు. (107:3)
فَوَيْلٌ لِلْمُصَلِّينَ (ఫ వైలున్ లిల్ ముసల్లీన్) నమాజు చేసే (ఈ రకం) జనులకు ఇక వినాశం తప్పదు. (107:4)
الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ (అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్) ఎవరైతే తమ నమాజు పట్ల ఏమరుపాటుకు లోనై ఉంటారో, (107:5)
الَّذِينَ هُمْ يُرَاءُونَ (అల్లజీన హుమ్ యురాఊన్) లోక ప్రదర్శన కోసం వ్యవహరిస్తారో, (107:6)
وَيَمْنَعُونَ الْمَاعُونَ (వయమ్నఊనల్ మావూన్) మరియు (పొరుగువారికి) చిన్నచిన్న అవసరాల వస్తువులు కూడా ఇవ్వకుండా తప్పుకుంటారో! (107:7)
సోదర మహాశయులారా! ఈ సూరత్ సూరహ్ మా ఊన్ లో మొదటి వాక్యం మొదటి ఆయత్ ‘అరైతల్లజీ యుకజ్జిబు బిద్దీన్’. నీకు అతని గురించి తెలుసా? నీవు అతన్ని చూశావా? ఎవరు? అల్లజీ యుకజ్జిబు బిద్దీన్. ఎవరైతే దీన్ ను తిరస్కరిస్తున్నాడు, ధిక్కరిస్తున్నాడు. దీన్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో దీనికి రెండు భావాలు. ఒకటి ఇస్లాం ధర్మం అని. ఖురాన్ లో అల్లాహ్ ఏమి చెప్పాడు? ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ కు ఇష్టమైన ధర్మం, అల్లాహ్ వద్ద అంగీకార యోగ్యం పొందే ధర్మం ఇస్లాం మాత్రమే. వరదీతులకుముల్ ఇస్లామ దీనా. మీకు ధర్మంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్లాంనే మెచ్చుకున్నాడు, ఇస్లాం తోనే ఇష్టపడ్డాడు. దీన్ అన్న దానికి ఒక భావం ఏమిటి? ఇస్లాం ధర్మం అని.
దీన్ కు మరొక భావం కూడా ఉంది. అది ఏమిటి? ప్రతిఫల దినం. మంచివారికి విశ్వాసం మరియు సత్కార్యాలతో జీవితం గడిపిన వారికి సత్ఫలితం, అవిశ్వాస మార్గాన్ని లేదా విశ్వాస మార్గం అవలంబించి దుష్కార్యాలకు పాల్పడిన వారికి వారి దుష్కార్యాలకు బదులుగా శిక్ష లభించే ఆ పరలోక దినాన్ని దీన్ అని అంటారు. ఖురాన్ లో దీన్ అన్న పదం దీని గురించి కూడా వచ్చింది. ఆ పరలోక దినం, ఏ దినమైతే ప్రతిఫలం అనేది మంచివారికి సత్ఫలితం మరి చెడ్డవారికి దుష్ఫలితం ఇవ్వబడే రోజు. చదవండి సూరహ్ ఫాతిహా – అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీమ్, ఆ తర్వాత మాలికి యౌమిద్దీన్. దీన్ అన్న పదం వచ్చింది కదా ఇక్కడ కూడా. ఇక్కడ ఏదైతే దీన్ అన్న పదం వచ్చిందో, ఇస్లాం ధర్మం అన్న భావంలో కాదు. ఆ పరలోక దినాన, ఏ రోజునైతే ప్రతి ఒక్కరికి తాను చేసిన దానికి ప్రతిఫలం లభించనున్నదో, ఆ రోజు యొక్క నాయకుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఆ రోజు యొక్క సర్వాధికారి కేవలం అల్లాహ్ మాత్రమే.
అల్లాహ్ యే మార్గదర్శి
ఈ విధంగా ఈ ఆయత్ లో దీన్ అన్న పదానికి రెండు భావాలు ఉన్నాయి. కానీ అధిక శాతం వ్యాఖ్యానకర్తలు ఇక్కడ రెండో భావం కుదురుతుంది, అదే ఉద్దేశించబడినది అని అంటున్నారు. దీనివల్ల తెలిసే మరొక విషయం ఏంటంటే, ఎవరైతే పరలోక దినాన్ని విశ్వసించరో, వారిలో చాలా రకాల చెడు కార్యాలు, చెడు విశ్వాసాలు ఎన్నో రకాల తప్పిదాలకు వారికి ఆ పరలోకాన్ని విశ్వసించకపోవడం అనేది ఎన్నో రకాల చెడుల వైపునకు తీసుకెళ్తుంది. అందులో నుంచి ముఖ్యమైనవి రెండు చెడు గుణాలను ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. ఏమి చెప్పాడు? అరైతల్లజీ యుకజ్జిబు బిద్దీన్. ఆ ధర్మాన్ని, ఇస్లాం ధర్మం అనండి కానీ ఇక్కడ మనం ఉద్దేశించింది ఏంటిది పరలోక దినాన్ని. ఆ ప్రతిఫల దినాన్ని తిరస్కరించే వ్యక్తి అతనిలో ఎలాంటి గుణం ఉంది? ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్. అతడే అనాథలను కసరి కొడుతున్నాడు, నెట్టేస్తున్నాడు, గంటేస్తున్నాడు. వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ మరియు మిస్కీన్ నిరుపేదలకు వారికి చెందిన అన్నం ఏదైతే ఉందో అది కూడా పెట్టండి అని ప్రోత్సహించడం లేదు.
సోదర మహాశయులారా! ఖురాన్ లో మరి ఎన్నో చోట్ల అల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ పరలోక విశ్వాసం అనేది మనిషిలో ఎలాంటి మంచి గుణాలు తీసుకొస్తుందో ప్రస్తావించి ఉన్నాడు. ఉదాహరణకు సూరత్ దహర్, దాని యొక్క రెండో పేరు సూరహ్ ఇన్సాన్. అందులో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు:
విన్నమా వయుత్తయిమూనత్తఆమ అలా హుబ్బిహి మిస్కీనన్ వయతీమన్ వ అసీరా. పుణ్యాత్ములు కొందరు మంచి మనుషులు వారు ఏం చేస్తున్నారు? యుత్తయిమూనత్తఆమ అలా హుబ్బిహి. స్వయంగా వారికి ఇష్టమైన ప్రియమైన తిండి, భోజనం, అన్నం, తిను పదార్థాలు, త్రాగు పదార్థాలు యుత్తయిమూన తినిపిస్తున్నారు. ఎవరికి? మిస్కీనన్ నిరుపేదలకు, యతీమన్ అనాథలకు, అసీరన్ ఖైదీలకు. ఎందుకు తినిపిస్తున్నారు? ఏంటి ఉద్దేశం? ఇన్నమా నుత్తయిముకుమ్ లివజ్ హిల్లాహ్. మేము మీకు ఏదైతే తినిపిస్తున్నామో అది కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు. కేవలం పరలోక దినాన అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం మాకు లభించాలి అన్నటువంటి ఉద్దేశంతో, కేవలం ఆయన యొక్క సంతృప్తి కొరకు. లా నురీదు మింకుమ్ జజాఅన్ వలా శుకూరా. మేము మీకు తినిపించడం ద్వారా మీతో ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు దానికి బదులుగా మాకు ఏదైనా ఇవ్వాలని మేము కోరము. వలా శుకూరా కనీసం మీరు మాకు థాంక్స్ చెప్పాలని మా కృతజ్ఞత చెల్లించాలని కూడా మేము కోరము, ఉద్దేశించము. ఇన్నా నఖఫు మిర్ రబ్బినా యౌమన్ అబూసన్ ఖమ్ తరీరా. మేము ఆ సుదీర్ఘమైన మహా కఠినాలతో కూడుకున్న మహా కష్టతరంతో ఉన్నటువంటి ఆ భయంకరమైన రోజు నుండి భయపడుతున్నాము.
ఏ రోజు అది? ఖయామత్, ప్రళయ దినం. ఆ పరలోక దినం, ఆ పరలోక విశ్వాసం, అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న కార్యానికి మనం జవాబు చెప్పుకోవలసి ఉన్నది అన్నటువంటి ఆ భయం మాలో ఉంది. ఆ రోజు ఇహలోకంలో అల్లాహ్ మాకు ఏదైతే కొంతపాటి ధనం ఇచ్చాడో, మాకు ఏదైతే సౌకర్యాలు ఇచ్చాడో దాని మూలంగా అది మేము అవసరం ఉన్న వారికి, అనాథలకు, నిరుపేదలకు, బీద వాళ్లకు, ఖైదీలకు తినిపించకుంటే రేపటి రోజు అల్లాహ్ మమ్మల్ని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు అన్నటువంటి భయం మాలో ఉంది. అందుగురించి ఆనాటి ఆ భయం మాలో ఉండి మేము తినిపిస్తున్నాము. అయితే ఆనాడు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని ఆ భయం నుండి దూరం చేసి తొలగించి ఆయన మాకు ప్రతిఫలం ఇవ్వాలి, దాని యొక్క సత్ఫలితం ఆయన ఇవ్వాలని మేము ఆయన యొక్క ప్రేమలో వీరికి తినిపిస్తున్నాము. వీరి ద్వారా మాకు ఎలాంటి బదలా ప్రతిఫలం అవసరం లేదు. మేము కనీసం వారు మాకు కృతజ్ఞత చెల్లించాలని థాంక్స్ చెప్పాలని కూడా కోరము.
ఇది ఒక విశ్వాసిలో పరలోక విశ్వాసం గట్టిగా ఉండేదుంటే నిజమైన రీతిలో ఉంటే, పక్కవాడు ఉపవాసం ఉంటే తిండి లేకుండా ఉంటే ఆయన కడుపు నిండా తిని బేవుల్ తీసుకుంటూ పడుకోడు. పరలోక విశ్వాసం ఉన్నవాడు పక్కింటి వారి వర్షం వల్ల ఇల్లు కూలిపోతుంది, వారు నీళ్లలో వర్షంలో తడుచుకుంటూ నిద్రిస్తున్నారు పక్కన బిల్డింగ్ లో హాయిగా నిద్రిస్తున్నాడు, విశ్వాసం ఉన్న వ్యక్తి ఇలా తనలాంటి మనుషుల్ని ఇలాంటి ఇబ్బందిలో చూసుకుంటూ జీవితం గడపడు. భావం ఏమిటి? ఎవరిలో ఎంత పరలోక విశ్వాసం లోపిస్తుందో అంతే అతను ప్రజల పట్ల మృదు భావంతో వారి పట్ల ప్రయోజనకరంగా వారికి లాభాన్ని చేకూర్చే విధంగా జీవితం గడపడు. అదే ఒకవేళ పరలోక విశ్వాసం గట్టిగా ఉండి అనాటి ఆ సుదీర్ఘ కష్టతరమైన రోజు నుండి భయపడి అల్లాహ్ ఆనాడు సత్ఫలితాలు ప్రసాదించాలి అన్నటువంటి ఆశ ఉన్న వ్యక్తి స్వయంగా అతడు కేవలం తన లాభాన్నే కాదు ప్రజల యొక్క అవసరాలు ఏమిటో అవి కూడా దృష్టిలో ఉంచుకుంటారు.
అయితే ఇక్కడ ఈ ఆయత్ లలో పరలోక విశ్వాసాన్ని పరలోక ప్రతిఫల దినాన్ని తిరస్కరిస్తున్నాడు గనుక ఇతనిలో ఈ రెండు రకాల గుణాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటి? యదుఉల్ యతీమ్. అనాథను నెట్టేస్తున్నాడు, కసరి కొడుతున్నాడు. వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ మరియు నిరుపేదలకు వారికి చెందిన అన్నం వారికి ఇవ్వండి అని కూడా కనీసం ప్రోత్సహించడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. పరలోక విశ్వాసం లేనందుకు లేదా పరలోక విశ్వాసంలో కొరత ఉన్నందుకు కేవలం ఇవి రెండు గుణాలు ఈ చెడు గుణాలు మాత్రమే పుడతాయని భావం కాదు. వేరే చెడు గుణాలు ఉండవని భావం కాదు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సమాజంలో మనిషి ఎన్నో రకాల చెడు కార్యాలకు పాల్పడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? ఉదాహరణకు మనిషి ఏదైనా దొంగతనం చేయాలనుకుంటాడు, వ్యభిచారం చేయాలనుకుంటాడు కానీ దొంగతనం చేయబోతే వ్యభిచారం చేయబోతే పట్టుకోబడతాను అన్నటువంటి భయం కూడా ఉంటుంది. ఉంటుందా లేదా?
లేదా ఏదైనా భయం ఉండి మనిషి ఆ పని చెడు చేయలేకపోతాడు. లేదా మనిషి ఏదైనా మంచి పని చేస్తున్నాడు అంటే కనీసం అరే ఈయన మా దగ్గరికి గెస్ట్ గా వచ్చాడు కనీసం ఒక ఛాయ్ అన్నా తాగిద్దాం రేపటి రోజు మనం పోతే కూడా మరి మనల్ని చూడకుండా ఉంటాడు కదా అంటే ఒకరి పట్ల ఏదైనా మంచితనం చేస్తున్నాడు అంటే వారి నుండి ఏదైనా ఆశిస్తున్నాడు. వారి నుండి ఏదైనా బదలా ప్రతిఫలం దొరుకుతుంది అన్నటువంటి ఆశ అతనికి ఉంటుంది. అంటే ఈ ఆశా భయం ఇవి రెండు ఉండి మనిషి ఏదైనా మంచి చేస్తాడు చెడు నుండి దూరం ఉంటాడు అవునా కాదా?
కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ రెండు రకాల మనుషులు, నిరుపేదలు నిరుపేదలు మరియు అనాథలు. నిరుపేదకు ఏదైనా ఇచ్చేదుంటే తిరిగి అక్కడ నుండి మాకు ఏదైనా దొరుకుతుందని ఆశ ఉంటుందా? ఉండదు. ఈ రోజుల్లో ఏం జరుగుద్ది? మంచిగా హై ఫై లో ఉన్న వారికి మంచి మంచి హై ఫై గిఫ్ట్ తీసుకొని వెళ్తాము. ఎందుకు? కనీసం ఇంత కూడా ఇవ్వకుంటే నన్ను చిన్న చూపుతో చూస్తాడు అతడు, రేపటి రోజు అతని వద్దకు వెళ్లకుంటే అరే నువ్వు అక్కడ నుండి వచ్చావు నా గురించి ఏం తెచ్చావురా అని కూడా అడుగుతాడు. ఇటువంటి భయం అతనికి ఉంటది అవునా కాదా?
కానీ నిరుపేదకి ఇస్తే? బీదవాళ్ళకి ఇస్తే? అక్కడ నుండి ఏం దొరుకుతుంది? వారి నుండి మనకు ఏం వస్తుంది? ఏమీ ఆశ ఉండదు. ఇకపోతే అనాథలు. మన సమాజంలో ప్రత్యేకంగా అనాథలు మహా ఎక్కువ ఉంటే వారి తల్లి వారికి దిక్కుగా ఉంటుంది. అది కూడా ఒక స్త్రీ. సామాన్యంగా ఒక బాధ్యులు అని అతని వారి వెంట ఎవరూ ఉండరు. వారిపై ఏదైనా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మనిషికి ఏ భయం కూడా కలగదు.
అయితే పరలోక విశ్వాసం గట్టిగా ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఇతనికి ఎవడు దిక్కు లేకున్నా నేను ఇతన్ని కసరి కొట్టవద్దు, ఇతన్ని దూరం చేయవద్దు, ఇతన్ని గెంటేయవద్దు, ఇతని దగ్గర ఇతని దగ్గర ఏమీ లేకున్నా నేను అతనికి ఇవ్వాలి దాని యొక్క ప్రతిఫలం నాకు ఎక్కడ దొరుకుద్ది అల్లాహ్ వద్ద దొరుకుతుంది అన్నటువంటి నమ్మకం ఉండి అతను ముందడుగు వేస్తాడు. మరి వాస్తవానికి ఇస్లాం ధర్మం ఈ రోజుల్లో ఎన్నో టీవీ ఛానల్లు, న్యూస్ పేపర్లు ఇంకా ఎన్నో వర్గాలు ఎన్నో ఫిర్కాలు ఎన్నెవరు ఎవరెవరు ఇస్లాం గురించి ఏమన్నా గానీ ఒక బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఖురాన్ గ్రంథం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర చదివాడంటే అనాథలకు, నిరుపేదలకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడిందో వారికి వారి అవసరాలు తీర్చే విధంగా ఎలా ప్రోత్సహించబడిందో చాలా దీనికి సంబంధించిన ఆయత్ లు హదీసులు ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఒక రెండు విషయాలను మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు: ‘అనా వ కాఫిలుల్ యతీమి కహాజైని ఫిల్ జన్నా’. ప్రవక్త స్వయంగా తమ గురించి అంటున్నారు: నేను మరియు ఎవరైతే ఒక అనాథకు, అనాథ బాలుడు గానీ అనాథ బాలిక గానీ అనాథకు బాధ్యుడిగా ఉండి వారి యొక్క మంచి చెడ్డలు చూసుకుంటూ వారి యొక్క శిక్షణ, వారి యొక్క చదువు, వారి యొక్క పెళ్లి అన్ని రకాల బాధ్యతలు వహిస్తాడో మేమిద్దరము స్వర్గంలో ఇలా దగ్గరగా కలిసి ఉంటాము అని శుభవార్త ఇచ్చారు. ప్రవక్తకు తోడుగా ఉంటాడు అలాంటి వ్యక్తి. ఎంత గొప్ప స్థానమో గమనించండి. ఇది ఎవరి గురించి అనాథల గురించి ఎన్నో ఉన్నాయి లాభాలు ఫజీలత్ లు హదీసులు కానీ ఈ ఒక్క హదీసును గమనిస్తే కూడా మనం ఇస్లాం లో అనాథలకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడింది వారి యొక్క మంచి చెడ్డలు చూడడం, వారి యొక్క కష్టాల్లో వారికి తాత్ ఇవ్వడం, మద్దతు చేయడం, వారి యొక్క శిక్షణ, వారి యొక్క చదువు అన్ని రకాల వారి యొక్క బాధ్యతలను వహించడం ఎంత గొప్ప విషయం.
ిక మిస్కీన్ నిరుపేదలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: ‘అస్సాయీ అలల్ అర్మలతి వల్ మిస్కీన్ కల్ ముజాహిది ఫీ సబీలిల్లాహ్’. ఎవరైతే విధవలకు అంటే భర్త లేకుండా జీవితం గడుపుతున్నారు దిక్కు లేకుండా భర్త చనిపోయాడా లేదా విడాకులు ఇచ్చాడా ఇక ఎవరూ కూడా తనను పెళ్లి చేసుకోవడం లేదు వారి యొక్క జీవితం చాలా దుర్భరంగా గడుస్తుంది. వల్ మిస్కీన్ నిరుపేదలు మరీ బీదవాళ్లు. ఇలాంటి విధవలకు మరియు బీద వాళ్లకు నిరుపేదల కొరకు కృషి చేసేవాడు, స్వయంగా నా దగ్గర ఏం లేకున్నా వారిని కలిసి వారిని కలిసి ఫలానా ఒక బేవా స్త్రీ ఉన్నది ఫలానా ఒక మిస్కీన్ వ్యక్తి ఉన్నాడు మీరు ఒక నెలకు ఐదువందలు ఇవ్వండి మీరు ఒక రెండొందలు ఇవ్వండి వారి యొక్క ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు స్కూల్ లో అడ్మిట్ చేయండి దాని గురించి ఫీజు ఇవ్వండి ఈ విధంగా వారి యొక్క బాగుగోలు కొరకు స్వయంగా డబ్బు రూపకంగా ఏమీ చేయలేకపోయినా ఆర్థికంగా సహకరించలేకపోయినా డబ్బు ఉన్న వారి దగ్గరికి వెళ్లి పరపతి ఉన్న దగ్గరికి వారు వెళ్లి ఎవరు ఏ రకమైన సహాయం చేయగలుగుతారో వారిని కలిసి వారి గురించి మంచి చేయడానికి ప్రయత్నం చేసేవారు కల్ ముజాహిది ఫీ సబీలిల్లాహ్ అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారి లాంటి పుణ్యం వారికి లభిస్తుంది. అల్లాహ్ తఆలా ఇలాంటి సత్కార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొనే ఒక సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక.
నమాజు పట్ల ఏమరుపాటు మరియు ప్రదర్శన బుద్ధి
ఇక ఆ తర్వాత ఏం చెప్పాడు అల్లాహ్ తఆలా? ఫవైలుల్ లిల్ ముసల్లీన్. నమాజు చదివే వారి కొరకు వినాశం ఉంది అల్లాహు అక్బర్ ఎంత విచిత్ర విషయం ఆలోచించండి. ఎవరైతే నమాజు చేయటం లేదో వారు ఇప్పుడే తొందరగా సంతోష పడకండి నమాజు చేస్తే ఇక్కడ పాపం దొరుకుతుంది నమాజు చేస్తే శిక్ష దొరుకుతుంది అని. నమాజు చేయని వారి గురించి ఇంకా మహా భయంకరమైన శిక్షలు ఉన్నాయి. మసలకకుమ్ ఫీ సఖర్. ఖాలు లమ్ నకు మినల్ ముసల్లీన్. ఇహలోకంలో నెక్స్ట్ పార్ట్నర్ ఉండవచ్చు క్లాస్మేట్ ఉండవచ్చు జాబ్ మేట్ ఉండవచ్చు ఒక కాడ పని చేసుకునే వాళ్ళు ఒక కాడ కలిసి మెలిసి తినేవాళ్ళు కానీ ఎవరైతే నమాజు చేసేవాళ్లో ఎవరైతే మంచి కార్యాలు చేసేవాళ్లో విశ్వాసం పై గట్టిగా స్థిరంగా ఉన్నవారు వారు స్వర్గంలో పోతారు పోయిన తర్వాత అక్కడ చూస్తారు ఫలానా ఫలానా ఫలానా మన ఫ్రెండ్స్ మనకు కనబడతలేరు కదా మన బంధువులు మనకు కనబడతలేరు కదా ఎక్కడున్నారు? అల్లాహ్ తఆలా అడుగుతాడు వారిని చూడాలనుకుంటున్నారా? అవును అల్లాహ్ తఆలా. ఇక చూడండి వారు నరకంలో ఉన్నారు అని అల్లాహ్ తఆలా చూపిస్తాడు. అప్పుడు ఈ స్వర్గవాసులు ఆ నరకవాసిని అడుగుతారు ఇహలోకంలో మాతో కలిసి మెలిసి ఉండేవారు మీరైతే కానీ ఈరోజు ఎందుకు మీరు నరకంలో వచ్చి పడ్డారు? మసలకకుమ్ ఫీ సఖర్ మిమ్మల్ని ఏ విషయం నరకంలో తీసుకొచ్చేసింది? ఖాలు లమ్ నకు మినల్ ముసల్లీన్ మేము నమాజు చేసే వారిలో లేకుంటిమి. తిండిలో పనిలో ఫిలింలో అన్నిట్లో మీతోని పాల్గొన్నాము కానీ మీరు నమాజ్ కు వెళ్ళినప్పుడు నమాజ్ కు రండి అనంటే అరె పోరా ఇప్పుడే మీరు ముతవా అయిపోయింది ఇక మేము మీతోని కలవలేము నమాజ్ కు మీతో మేము వచ్చేవాళ్లము కాదు అందుగురించి అల్లాహ్ మమ్మల్ని నరకంలో పడేశాడు. ఈ నమాజ్ చేయని విషయం అనేది మమ్మల్ని ఈ స్థానానికి దిగజారి చేసింది అని వారు అప్పుడు అంటారు. నమాజ్ చేయని వారి స్థితి మరీ భయంకరంగా ఉంది కానీ ఇక్కడ ఏ నమాజ్ చేసే వారి గురించి చెప్పడం జరుగుతుంది ముందు ఆ విషయం ఉంది. నమాజ్ చేసే వారి గురించి ఈ వినాశం ఉంది ఎవరు వారు? అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్. వారు తమ నమాజుల పట్ల ఏమరుపాటుకు గురి అయ్యి ఉన్నారు.
సోదరులారా! నమాజ్ అన్న విషయం మన మరియు మన యొక్క ప్రభువు మన యొక్క అల్లాహ్ మధ్యలోని ఒక స్పష్టమైన సంబంధం. ఈ సంబంధాన్ని సంపూర్ణ ప్రేమతో ఇష్టపూర్వకముగా మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో బలిమిటికి ఫలానా చెప్తున్నాడు ఫలానా చెప్తున్నాడు అన్నటువంటి బలిమితో ఎప్పుడైతే మనం చేస్తామో ఆ బలిమి చేసేవాళ్ళు లేదా ఆ బోధ చేసేవాళ్ళు మనకు దగ్గరగా లేకుంటే మనం ఏమరుపాటుకు గురి అయి ఉంటాము. అలా ఏమరుపాటుకు గురైన వారు నమాజుల విషయంలో వారికి వినాశం ఉంది. ఈ ఏమరుపాటు అనేది ఏ రకంగా నమాజ్ టైంకు చేయకపోవడం ఇది కూడా ఏమరుపాటులో వస్తుంది లేదా టైంకు నమాజ్ లో వచ్చాము కానీ మనసు పెట్టి నమాజ్ చేయడం లేదు. ఎప్పుడు అయిపోతే తొందరగా పరిగెత్తి పోవాలి అని ఎందుకైతే వచ్చానో ఇక్కడికి నమాజ్ చేయడానికి అని ఇలాంటి ఇష్టం లేకుండా ఎంతో బద్ధకంతో మూడవ విషయం నమాజ్ చేస్తున్నప్పుడు నమాజ్ యొక్క విధులు నమాజ్ యొక్క సున్నతులు ఏ విషయం ఏ పద్ధతి ఎలా అవలంబించాలి ఎలా చేయాలి సమయం గడుస్తున్న కొద్దీ వయసు మీద పడుతున్న కొద్దీ వారాలు నెలలు సంవత్సరాలు దాటుతున్నాయి మన జీతం పెరగడానికి ప్రయత్నం చేస్తాము సంతానం పెరగడానికి ప్రయత్నం చేస్తాము వ్యాపారం పెరగడానికి ప్రయత్నం చేస్తాము ప్రపంచ రంగంలో అన్నిట్లో ఇంకా ముందుముందుకు ఉండాలి అని చూస్తాము కానీ మన యొక్క నమాజ్ అల్లాహ్ తో మన యొక్క సంబంధం అది కూడా గట్టిగా పడాలి ఈరోజు ఒక సూర యాద్ చేసుకున్నాము రేపటి రోజు రెండు యాద్ చేసుకుందాం ఈరోజు నేను తెలియక ఏదో తొందరగా చేశాను రేపటి రోజు తెలుసుకొని మరింత మంచిగా చేస్తాను ఇలాంటి తపన లేకుంటే అలాంటి నమాజుల వల్ల ఏం లాభం కలుగుతుంది?
దీని గురించి ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: ద్వంద్వ స్వభావులు మునాఫికులు పై పైగా ఇస్లాం అని చెప్పుకుంటూ లోపట ఇస్లాం పట్ల అల్లాహ్ పట్ల ధర్మం పట్ల ప్రేమ లేకుండా జీవితం గడిపే వారు. ఇలాంటి వారి గురించి ఏం చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: ‘తిల్క సలాతుల్ మునాఫిఖ్, తిల్క సలాతుల్ మునాఫిఖ్, తిల్క సలాతుల్ మునాఫిఖ్’. ఈ మునాఫికులు ద్వంద్వ స్వభావులు కపట విశ్వాసులు వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది ఎలా? టైం దాటుతూ ఉంటుంది దాటుతూ ఉంటుంది దాటుతూ ఉంటుంది ఇక చివరి గడియ ఉన్నప్పుడు అరె నమాజ్ టైం సంపూర్ణంగా కంప్లీట్ అయిపోతుంది కదా ఇక మూడు నాలుగు నిమిషాలే ఉంది తొందరగా వచ్చేస్తాడు టకా టక్ టకా టక్ ప్రవక్త గారు చెప్పారు ఎలాగైతే కోడి గింజలు తినడానికి చుంచు ఎలా కొడుతుంది ఆ విధంగా తన నమాజ్ చేసి వెళ్లిపోతాడు. అతనికి అతని ఆ నమాజ్ ద్వారా ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? లాభం కలుగుతుందా? పుణ్యం దొరుకుతుందా? దొరకదు. అందుగురించి సోదరులారా! ఇలాంటి అలసట ఇలాంటి అలక్ష్యం ఏమరుపాటు నమాజ్ విషయంలో ఉండకూడదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని యొక్క ప్రేమలో మనస్ఫూర్తిగా ప్రవక్త యొక్క సరైన విధానంలో ఈ ఐదు పూటల నమాజులు చేస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. ఐదు పూటల నమాజులతో పాటు తహజ్జుద్ ఇంకా ఇతర నఫిల్ నమాజులు కూడా చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
ఇలాంటి నమాజీలకు వినాశం ఉంది అని ఏదైతే చెప్పబడుతుందో అందులో ఒక రెండో రకం ‘అల్లజీన హుమ్ యురా ఊన్’. ఎవరైతే ప్రదర్శన బుద్ధితో నమాజ్ చేస్తారో. నమాజ్ చేస్తున్నారు కానీ ఎందుకు? అల్లాహ్ చూసి నన్ను మెచ్చుకోవాలి, అల్లాహ్ తన యొక్క పుణ్య దాసుల్లో నన్ను చేర్చాలి అలాంటి ఉద్దేశం కాదు ఆ ఫలానా వ్యక్తి చూస్తున్నాడు నన్ను నమాజీ అని అనుకోవాలి. ఫలానా వ్యక్తి నన్ను మెచ్చుకోవాలి, మా ముతవల్లి గారు నన్ను మెచ్చుకోవాలి, మా తండ్రి నన్ను మెచ్చుకోవాలి, ఫలానా నా ఫ్రెండ్ నన్ను మెచ్చుకోవాలి, మా వాడ యొక్క మౌల్వీ సాబ్ నన్ను మెచ్చుకోవాలి ఈ విధంగా ప్రదర్శన బుద్ధి ప్రజలకు చూపించాలని రియా దిఖవా సుమ్ ఆ ఎవరైతే ఇలాంటి ఉద్దేశాలతో నమాజ్ చేస్తారో వారికి కూడా దాని యొక్క పుణ్యం లభించదు వారికి వినాశం ఉంది అని ఇక్కడ హెచ్చరించబడుతుంది.
చిన్న చిన్న సహాయాలు మరియు ముగింపు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏమిటో తెలుసా? అరైతల్లజీ – ఆ వ్యక్తిని నీవు చూశావా ఎవరైతే పరలోక దినాన్ని తిరస్కరిస్తున్నాడు అందువల్ల అతనిలో ఒక చెడ్డ గుణం అనాథను కసరి కొట్టడం నిరుపేదలకు అన్నం పెట్టండి అని చెప్పకపోవడం లాంటి చెడు గుణాలు జన్మించాయి. అలాగే ఈ నమాజ్ చేసే వారికి ఏ వినాశం అయితే ఉందో వారి సంగతి కూడా చూడు కొంచెం. ఎవరు వారు? నమాజ్ లో ఏమరుపాటుతో పాల్గొంటారు, ప్రదర్శన బుద్ధితో నమాజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? పరలోక విశ్వాసం గట్టిగా లేదు గనుక నమాజ్ లో కూడా లోపం జరుగుతుంది. ఒకవేళ పరలోక విశ్వాసం బలంగా ఉండేదుంటే నమాజ్ లో కూడా ఇలాంటి ఏమరుపాటు అనేది జరగదు. ఇలా పరలోక విశ్వాసం బలహీనంగా ఉన్నందుకు మరొక మూడో రకమైన చెడు వారిలో ఏమొస్తుంది? వయమ్నఊనల్ మా ఊన్. వారు సాధారణంగా పరస్పరం ఒకరికి ఒకరు చేయూతగా తోడ్పాటుగా వాడుకునే అవసరాలు వస్తువులు కూడా ఇవ్వకుండా ఆపుకుంటారు.
అల్ మా ఊన్ అన్న పదం ఏదైతే ఉందో ఇక్కడ హజ్రత్ ఇబ్నె మసూద్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్, హజ్రత్ అలీ, అబ్దుల్లా బిన్ ఉమర్, ఉమ్మె అతియ్య ఇంకా ఎందరో సహాబాల వ్యాఖ్యానాలు ఏదైతే వచ్చి ఉన్నాయో హదీసు గ్రంథాల్లో, ఇంట్లో గొడ్డలి, నీళ్ల బొక్కెన బకెట్ మరియు ఇటువంటి చిన్న చిన్న ఏదైనా బౌల్స్ ఏదైనా చిన్నపాటి సామాన్ ఏదైతే అవసరం ఉంటుందో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఇంటి పక్కవాళ్ళు పరస్పరం ఒకరి నుండి ఒకరు అడుగుకుంటూ ఉంటారు. కనీసం ఇలాంటి చిన్న విషయాలు కూడా ఇవ్వకపోవడం వారికి చేయూతగా తోడ్పాటుగా ఉండకపోవడం కూడా దీనివల్ల మనకు వినాశం కలుగుతుంది అన్నటువంటి హెచ్చరిక ఇందులో ఇవ్వబడింది. ఇక ఈ సూరాను మీరు గమనిస్తే ఇందులో మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. అవేంటి? ముఖ్యంగా మనిషిలో పరలోక విశ్వాసం చాలా బలంగా ఉండాలి. అల్లాహ్ నన్ను ఏదైతే సృష్టించాడో పుట్టించాడో అతను చనిపోయిన తర్వాత ఒకరోజు నన్ను మరోసారి తిరిగి బ్రతికిస్తాడు లేపుతాడు అక్కడ ఇహలోకంలో నేను చేసిన ప్రతి చిన్న పెద్ద మంచి చెడు అన్ని విషయాల గురించి సమాధానం చెప్పుకునేది ఉంది. ఆ పరలోక దినాన్ని బలంగా గట్టిగా విశ్వసించాలి. ఆ విశ్వాసం వల్ల అతని మధ్య అతని సృష్టికర్త మధ్య సంబంధం బాగుపడుతుంది. అతి ముఖ్యమైన ఆరాధన నమాజ్ అనేది సంపూర్ణ ప్రేమతో మనస్ఫూర్తిగా చేయగలుగుతాడు. అంతేకాకుండా అతని మధ్య అతని లాంటి సోదరుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. పరస్పరం ఒకరికి ఒకరు చేయూతగా తోడ్పాటుగా ఉండి వారికి అవసరం ఉన్న విషయాల్లో వారికి సహాయపడే అన్నటువంటి గుణం వారిలో వస్తుంది. అంతేకాకుండా సమాజంలో ఎవరైతే దిక్కు లేని వాళ్ళు సామాన్యంగా బలహీనులుగా ఉంటారో అనాథలు గానీ నిరుపేదలు గానీ విధవలు గానీ ఇలాంటి వారి పట్ల కూడా ఒకరితో ఏమీ ఆశించకుండా నేను ఒక అనాథల గురించి భవనం తయారుచేసి మంచిగా చేస్తే ప్రభుత్వం నాకు చాలా రకాల సహాయాలు చేస్తుంది అన్న ఆశతో కూడా ఎందరో ముందడుగు వేసి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు ఆయన నాకు తన యొక్క సంతృప్తిని ప్రసాదించి ఆయన యొక్క దర్శన భాగ్యం నాకు కలుగనుంది పరలోకంలో స్వర్గంలో అన్నటువంటి ఆశతో వారి పట్ల మంచితనం చేస్తూ ఉండాలి. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రవక్త పదవి లభించక ముందే ఇలాంటి సద్గుణాలు వారిలో ఉండినవి. హజ్రత్ ఖదీజా రజిఅల్లాహు అన్హు గారు ఏం చెప్పారు? ఇన్నక లతసిలుర్రహిమ్. నీవు సంబంధాల్ని బంధుత్వాల్ని పెంచుతూ ఉంటారు. వతఖ్రిద్దైఫ్. ఎవరైతే అతిథులు వస్తారో మీరు అతిథి మర్యాద చాలా మంచి విధంగా చేస్తారు. తక్సిబుల్ మాదూమ్. ఏమీ పని చేయలేకుండా ఎవరైతే సంపాదించకుండా బలహీనంగా ఉన్నాడో అలాంటి వారికి మీరు సంపాదించి పెడతారు. వతుఈను అలా నవాయిబిల్ హఖ్. మరి ఎవరైతే ధర్మపరంగా ఏదైనా కష్టానికి ఆపదకు ఏదైనా ఇబ్బందికి గురి అయి ఉన్నారో వారికి మీరు సహాయపడతారు. ఇలాంటి సద్గుణాలు ఉన్న వారిని అల్లాహ్ ఎప్పుడూ కూడా అవమాన పరచడు అలాంటి వారిని అల్లాహ్ వృథా చేయడు మీరు బాధపడకండి అని ఓదార్పుని ఇచ్చింది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు ఓ అల్లాహ్! నన్ను మిస్కీన్ లలో చేర్చుకో, మిస్కీన్ ల పట్ల నాకు ప్రేమ నిరుపేదల యొక్క ప్రేమ నాలో కలిగించు మరియు ప్రళయ దినాన ఈ నిరుపేదల యొక్క జమాత్ లో వారి వెంట నన్ను కూడా ప్రళయ దినాన హాజరు చేయి. నిరుపేదలతో కూర్చోవడం వారికి అవసరాలు తీర్చడం ఇందులో ఎలాంటి చిన్నతనం అనేది మన ప్రవక్త గారు భావించేవారు కాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సూరా ఏదైతే మనం ఈరోజు విన్నామో దీని యొక్క వ్యాఖ్యానం తెలుసుకున్నామో దీని ప్రకారం మన యొక్క జీవితం గడుపుకునే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైర్ వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
Tags: Islamic Sermon, Surah Al-Maun, Quran Telugu, Day of Judgment, Orphan, Prayer, Charity, Namaz, Riya, Telugu Islam, ఇస్లామిక్ ప్రసంగం, సూరహ్ అల్ మా ఊన్, ఖురాన్ తెలుగు, పరలోక దినం, అనాథలు, నమాజు, దానం, రియా, తెలుగు ఇస్లాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ కథనం: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రళయం సమీపించినప్పుడు ఈ ఉమ్మత్ ప్రజలు భూమిలోనికి దిగద్రొక్కబడతారు, ఢీ కొట్టుకొని చనిపోతారు, రూపాలు మారిపోతాయి” అప్పుడు ఒక వ్యక్తి: “ఓ దైవ ప్రవక్తా! అది ఎప్పుడు సంభవిస్తుందని” ప్రశ్నించాడు. “సంగీతాలు, భజంత్రీలు, నాట్యాలు ఎక్కువైనప్పుడు. మరియు మద్యం (అధికంగా) హెచ్చరిల్లినప్పుడు” అని సమాధానమిచ్చారు”
అనేక మంది ప్రజలు పోటిలు పడి గెలవాలనే భావనతో తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అది అలా ఉండగా మరో వైపు చిన్న చిన్న పిల్లలతో సహా వృద్దులను కూడా నాట్యాలు చేయిస్తున్నారు. పోటీల పేరున ఇండ్లల్లో దాగిఉన్న స్త్రీలు సహితం బహిరంగంగా నిర్వహించే పోటిలలో పాల్గొంటున్నారు. అనేక భాషలలో, అనేక రాష్ట్రాలలో, నాట్య పోటీలు అధికమై పోయాయి. అలాగే స్టేజ్ పోటీలు, సంగీతాల పోటీలు, పాటల కచేరీలు ప్రతి ఛానలుకు అధికంగా డబ్బును సమకూర్చుకొనే సాధనాలుగా మారిపోయాయి.
ఇది ప్రళయ దిన చిహ్నాలు అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సఊది అరేబియాలోని జుల్ఫీ జాలియాత్ వారు సమర్పిస్తున్న మరో నూతన వీడియో వీక్షించండి ప్రళయదినాన త్రాసును నెలకొల్పడం సత్యం, ఎవరి పుణ్యపళ్ళాలు బరువుగా ఉంటాయో వారే స్వర్గంలో చేరేవారు.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసు స్థాపించబడుతుంది.
త్రాసు గురించి అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
“ప్రళయ దినాన కచ్చితంగా తూచేటటువంటి త్రాసులను మేము ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఎవరిపై కూడా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఒక ఆవగింజకు సమానమైన ఆన్యాయం చేసి ఉన్నా దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. లెక్క తీసుకొనుటకు మేమే చాలు.”(21,సూరతుల్ అంబియా: 47)
హజ్రత్ ఇమామ్ ఖుర్తుబి (రహిమహుల్లాహ్) ఇలా ప్రవచించారు: “లెక్కలు తీసుకున్న తరువాత కర్మలను తూకం వేస్తారు. వారి పుణ్యాల బరువుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకనే లెక్కలు తీసుకున్న తరువాత కర్మలు తూయబడును. తరువాత వాటి ఆధారంగా మానవులకు (అంతస్తుల) ప్రతిఫలం ప్రసాదించడం జరుగుతుంది.” (తజ్కిరతుల్ ఖుర్తుబి: 309)
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన త్రాసులో (కర్మలు) తూకం వేయబడును. ఆ త్రాసు భూమ్యాకాశాలను తూకం వేసేటంత విశాలంగా ఉంటుంది“. *
ఓ ప్రభూ! “దీనిలో ఎవరినీ తూకం వేస్తారు?” అని అల్లాహ్ దూతలు ప్రశ్నించారు. దానికి అల్లాహ్: “నా సృష్టిలో నేను తలచుకున్నవారందరినీ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ దూతలు: “సుబ్ హానక్! మేము నీకు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించ లేదే!” అని అంటారు.(హాకిమ్, అస్ సహీహ: 941)
*గమనిక: కొందరు త్రాసు అనగా “అల్లాహ్ న్యాయాన్ని స్థాపిస్తాడే తప్ప త్రాసు రూపాంతరము ఉండదనీ భావించారు”. అలా భావించడం సరికాదు. నిజమైన విషయం ఏమంటే! అల్లాహ్ సాక్ష్యాత్తు త్రాసును నిలబెట్టుతాడు. ఇలా మనం విశ్వసించడం వల్ల ఖుర్ఆన్, హదీసులలో ప్రచురించబడిఉన్న నిజమైన వాక్యాలకు అనుగుణమైన విశ్వాసం అవుతుంది. కనుక విశ్వాసులందరూ ఆ త్రాసును తప్పక విశ్వసించాలి. మరియు ప్రళయ దినాన దానిలో కర్మలు తూయబడుతాయనీ, దానికి రెండు తూకం వేసే పళ్ళెములు ఒక సరిసమానం చేసే ముళ్లు కూడా ఉందనీ విశ్వసించాలి. ఇంకా దానిలో కర్మలు తూకం వేస్తే పైకీ క్రిందికి ఆ పళ్ళెములు వంగుతాయనీ కూడా విన్వసించాలి. ఇదే ‘“అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్” విశ్వాసం.
ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి, సుబ్హానల్లాహిల్ అజీమ్.” (బుఖారీ,ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మత్కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.”
తరువాత అల్లాహ్ అతనితో: “దీని (పాపాల పత్రాలు)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయనీ చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు.
అతను: “లేదు నా ప్రభూ!” అని అంటాడు.
మరలా అల్లాహ్ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్ నకీర్) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!”’ అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు.
అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు” అని అంటాడు.
ఆ తరువాత అల్లాహ్ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్ (షహాదత్) “అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”’ పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: (దాన్ని చూసి) “ఓ అల్లాహ్ ఈ ఒక్క పత్రం అన్ని (పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు.
తరువాత అల్లాహ్: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదు” అని అంటాడు.
తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.”’ (తిర్మిజీ హాకిమ్, సహీహ్ ఇబ్నుమాజ: 3469)
హజ్రత్ అబూ దర్దా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్ఆన్ సూక్తిని ఇలా పఠించారు:
فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
“ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.””(18,సూరతుల్ కహఫ్:105) (బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రది అల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మిస్వాక్ చెట్టు నుండి మిస్వాక్ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ పరిస్టితిని చూసి ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్, ఇర్వావుల్ గలీల్:65)
హజ్రత్ అబూ మాలిక్ అల్ అష్అరి (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. ఆల్ హమ్దులిల్లాహ్ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఎవరైనా అల్లాహ్ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారి)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పుస్తకం పేరు: మరణానంతర జీవితం (Life After Death) (ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో) కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
అల్లాహ్కు మాత్రమే సర్వ స్తోత్రములు చెందును. ఆయనే సర్వలోకాలకు ప్రభువు, ప్రతిఫల దినానికి అధిపతి, ఆయన ఎంతో పరిశుద్దుడు సంరక్షకుడు. అల్లాహ్ శాంతి మరియు కరుణ కటాక్షాలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై, పుణ్యాత్ములైన సత్య మూర్తులసై కురియుగాక!.
మరణానంతర జీవితం మానవునికి అసలైన జీవితం. ఇహలోక జీవితంలో చేసుకున్న మంచిచెడులు మాత్రమే అతని వెంట వస్తాయి. మిగతా విషయాలన్ని ఇహలోక జీవితానికే పరిమితం. మానవుడు అసలైన విజయ లక్ష్యం సాధించాలంటే పరలోక విశ్వాసం, జ్ఞానం మరియు భయం, భక్తిని సాధించాలి. ఇహలోకంలో కూడా మనిషి శాంతి సుఖాలతో ఉండాలంటే మరియు సమాజం మానవ మర్యాదలతో ముందుకు నడవాలంటే పరలోక విశ్వాసమే పునాది. మరణానంతర జీవితం లేదంటే! మంచి, చెడులకు, సద్గుణాలకు, దుర్గుణాలకు, పాపాలకు, పుణ్యాలకు అర్జాలే ఉండవు. చావు బ్రతుకులకు, జంతువులకు, మానవులకు, స్వర్గానికి, నరకానికి కూడా అర్థమే లేదు.
మనిషి మరణించిన తరువాత తన విశ్వాసం ప్రకారం ప్రశ్నించబడుతాడు. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే, సర్వసృష్టికర్తను విశ్వసించకుండా నాస్తికుడిగా మారిపోయి. తన ఇష్టానుసారంగా జీవించడమే మానవుని లక్ష్యం అనుకుంటే అతను అవిశ్వాసి. ఇంకా కొంత మంది ప్రజలు దేవుడు ఉన్నాడనీ పరలోకం వాస్తవమేననీ, స్వర్గం, నరకం నిజమేననీ విశ్వసించినా వాటి వాస్తవాలను గ్రహించకుండా తమ ఇష్టానుసారంగా మూఢ విశ్వాసాలకు అనుగుణంగా ఆరాధించేవారు కూడా అవిశ్వాసులే.
అల్లాహ్ పై విశ్వాసం లేకపోతే, మరణానంతర జీవిత వాస్తవాలను విశ్వసించకపోతే, మరియు వాటిపై ధృఢమైన నమ్మకం లేకపోతే, ఇంకా తమ జీవితాలను పుణ్య జీవితాలుగా మార్చుకోకపోతే, అలాంటివారి ఇహపరాల జీవిత ఫలితాలు శూన్యమే. వారు ఎన్ని మానవతా కార్యసాధనలు చేసినా, చక్రవర్తులుగా ఉండి రాజ్యం మొత్తం దానం చేసినా, పరలోక లక్ష్యాన్ని సాధించలేరు. నరకాగ్ని నుండి రక్షించబడలేరు.
మానవునికి ప్రసాదించబడిన ఒక్కొక్క క్షణం మరియు ఒక్కొక్క అనుగ్రహం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వనిదే మనిషి ఒక్క అడుగు ముందుకు వేయలేడు. అతను తాను చేసిన ప్రతి పనిని, ప్రతి మాటను, ప్రతి కుట్రను గురించి ప్రశ్నించబడుతాడు.
మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు పరలోక బాధల నుండి రక్షింపబడాలని, పరలోక జ్ఞానాన్ని అధ్యయనం చేసి దాన్ని విశ్వసిస్తాడు. ఇహలోక జీవితాన్ని ఉత్తమ రీతిలో గడుపుటకై సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అలాగే మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు మృత్యువు పాందే వరకూ ఒక లక్ష్యాన్ని సాధించాలనీ శ్రమిస్తాడు. ఆ మహా లక్ష్యమే స్వర్గం.
మరణానంతర జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అగోచర విషయాలను, అంటే మనిషి మరణించిన తరువాత నుండి స్వర్గంలోనికి లేక నరకంలొనికి చేరుకునే వరకు ఎదురయ్యే విషయాలను ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో అల్లాహ్ ప్రసాదించిన జ్ఞానం మేరకు మీ ముందు పొందుపరిచే ప్రయత్నం చేసాము.
“అహ్వాలుల్ ఖియామహ్”’అనే పేరున అబ్దుల్ మలిక్ అల్ కులైబ్ గారు, మరియు “అల్ జన్నత్ వన్నార్‘” పేరున ఉమర్ అల్ అష్ఖర్ గారు ఖుర్ఆన్ ఆయతులను మరియు ప్రామాణికమైన హదిసులను సేకరించి అరబీ భాషలో గ్రంథస్థం చేసారు. ఈ రెండు పుస్తకాలను అధ్యయనం చేసిన తరువాత మేము మీ కొరకు “మరణానంతర జీవితము” పేరుతో ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా తెలుగు భాషలో కూర్చు చేసాము. మరి కొన్ని వివరాలను కూడా అనేక ప్రామాణికమైన హదీసు గ్రంథాల నుండి సేకరించి చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో కూర్చు చేసాము.
సమగ్ర విషయ సూచిక
[1] మరణానంతర జీవిత విశ్వాసము
మనిషికి జ్ఞానం ఎలా ప్రసాదించబడింది?
మరణానంతర జీవితాన్ని ఎందుకు తిరస్కరించారు?
జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు ప్రళయ దినాన జన్మించక తప్పదు.
[2] మనుషులకు మరణం ప్రాప్తమయ్యే లక్షణాలు.
విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు.
కలిమయే షహాదత్.
నుదుటిపై చెమటలు.
శుక్రవారం మరణం.
షహీద్ కాబడిన ముస్లిం (అమరుడు).
అల్లాహ్ మార్గంలో (ఫీ సబిలిల్లాహ్) మృత్యువు పాందినవారు షహీద్.
పుణ్యకార్యాలు చేస్తుండగా మరణం సంభవిస్తే స్వర్గం ప్రాప్తమవుతుంది.
అవిశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే చెడ్డ లక్షణాలు.
ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన ప్రజలు.
మరణం సమీపించినప్పుడు దైవదూతలు ప్రత్యక్షమవుతారు.
మరణ వేదనలు (సకరాతుల్ మౌత్).
ఆకాశాలఫైకి ఆత్మ ప్రయాణం.
విశ్వాసిగా ఉన్న పుణ్యాత్ముడైన ముస్లిం ఆత్మకు లభించే గౌరవం.
అవిశ్వాసికి మరియు పాపాత్ముడైన ముస్లిం ఆత్మకు ధిక్కరణ లభిస్తుంది.
[3] సమాధిలో ఏం జరుగుతుంది?
సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత జరిగే సుఖదుఃఖాలు.
సమాధి తీవ్రత.
సమాధి భయాందోళన
సమాధి చీకటి.
నమ్మక ద్రోహం (గులూల్).
అబద్దాలు పలికేవారు, వ్యభిచారులు, వడ్డీ తీసుకునే వారు, ఖుర్ఆన్ గ్రంథాన్ని నేర్చుకున్న అవిధేయులు.
సమాధిలో నలిగిపోయే యాతన.
సమాధి యాతనలను మానవులు, జిన్నాతులు తప్ప ప్రతి ఒక్కరూ వినగలరు.
మానవులు, జిన్నాతులు సమాధి సుఖదుఃఖాలు ఎందుకు వినలేరు?
సమాధి యాతనలను ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) విన్నారు.
సమాధిలో శిక్షలకు గురికాబడే కొన్ని కారణాలు.
మూత్రం అశుద్ధత వలన, చెప్పుడు సంభాషణ వలన శిక్షలు అనుభవిస్తారు.
అప్పు తీసుకొని తిరిగి చెల్లించని వారికి సమాధి శిక్ష.
ఇతరులు రోధించడం వలన మృతుడు శిక్షింపబడుతాడు.
సమాధి శిక్షనుండి కాపాడే పుణ్యాలు.
షహీద్గా మరణించిన వ్యక్తి.
అల్లాహ్ మార్గంలో పోరాడేందుకై సిద్ధంగా ఉండి చనిపోయిన వ్యక్తి
శుక్రవారం చనిపోయిన వ్యక్తి.
కడుపు బాధతో మరణించిన వ్యక్తి.
ప్రతి రాత్రి సూరతుల్ ముల్క్ పారాయణం చేసిన వ్యక్తి.
సమాధి శిక్షనుండి రక్షణకై చేసే ప్రార్థనలు
[4] ప్రళయం రోజు సర్వమానవుల సమీకరణ.
సూర్ (శంఖం) పూరించబడుతుంది.
కొమ్ము రూపంలో శంఖం.
శంఖాన్ని పూరించేవాడు.
శంఖం పూరించబడే రోజు.
రెండు సార్లు శంఖాన్ని పూరిస్తారు.
మట్టినుండి పునర్జీివితం ప్రాప్తమవుతుంది.
ప్రతి వ్యక్తికి వెన్నపూస ఆధారంగా పునర్జన్మ ప్రాప్తమవుతుంది.
ప్రవక్తల శరీరాలను భూమి తినదు.
సమాధి నుండి మొట్టమొదట వెలికివచ్చేవారు.
ప్రళయం రోజు సర్వ మానవాళి సమీకరణ జరుగుతుంది.
కర్మలకు అణుగుణంగా తీర్చు చేయబడును.
ప్రళయ దినాన భూమి నుండి సర్వ మానవులు సమావేశమయ్యే స్థితి.
ప్రళయం రోజు మొట్ట మొదట దుస్తులు ధరించేవారు.
సర్వ మానవులు సమీకరించబడే భూమి.
భూమ్యాకాశాలు మార్చబడేటప్పుడు మానవులంతా సిరాత్ (పుల్సిరాత్)పై ఉంటారు.
ప్రళయ బీభత్సం.
ప్రళయం రోజున ప్రతి ఒక్కరు స్వార్థపరులుగా ఉంటారు.
ప్రళయం ఒక్కరోజు 50 వేల సంవత్సరాలకు సమానమైనది.
అల్లాహ్ యావత్తు భూమ్యాకాశాలను చుట్టి తన పిడికిలిలో ఇముడ్చుకుంటాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.