అల్లాహ్ రుబూబియత్ పై విశ్వాసం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు  భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.

అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి: అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం, ఆయన రుబూబియత్[2] పై విశ్వాసం, ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం. ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.

ఈ ఖుత్బాలో మనం అల్లాహ్ యొక్క రుబూబియత్  పై విశ్వాసం గురించి చర్చించుకుందాం.

అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం అంటే ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే రబ్ అని, ఆయనకు సహవర్ధులు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరని విశ్వసించటం. రబ్ అంటే: ఆయనకు సృష్టించే శక్తి ఉంటుంది, ఆయనే ప్రతీ దానికి యజమాని, ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుతుంది అంటే ఆయన ఆజ్ఞతో విశ్వ వ్యవహారాలు నిర్వహించ బడతాయి. ఆయన తప్ప మరో సృష్టికర్త లేడు, ఆయన తప్ప మరో యజమాని లేడు, ఆయన తప్ప ఆజ్ఞాపించేవాడు మరొకడు లేడు. సృష్టించడంలో తానే అద్వితీయుడు అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:     

أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ
(వినండి!   సృష్టి   ప్రక్రియ   ఆయన   స్వంతం.   ఆజ్ఞాపన   ఆయన   సొత్తు.) (ఆరాఫ్:54)

ఇంకా ఇలా అన్నాడు:

بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(భూమ్యాకాశాలను   ప్రప్రథమంగా   సృష్టించినవాడు   ఆయనే.) (బఖర:117)

ఇంకా ఇలా సెలవిచ్చాడు:

الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(సర్వస్తోత్రాలు   (శూన్యంలో   నుంచి)   ఆకాశాలను,   భూమిని   సృష్టించిన   అల్లాహ్‌కే   శోభిస్తాయి.) (ఫాతిర్:1)

ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా సృష్టించిన పూర్తి సృష్టిలో అన్నింటి కంటే గొప్పవి ఈ పది సృష్టితాలు: ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, మానవుడు, జంతువులు, వర్షము మరియు గాలులు. అల్లాహు తఆలా దివ్య ఖుర్ఆన్ లో అనేక చోట్ల తమ సృష్టి గురించి ప్రస్తావిస్తూ తమను తాము పొగుడుకున్నాడు, ప్రత్యేకంగా కొన్ని సూరాల ప్రారంభ ఆయతుల్లో. ఉదా: సూరతుల్ జాసియా లో ఇలా సెలవిచ్చాడు:

حم (1) تَنْزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ (2) إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِلْمُؤْمِنِينَ (3) وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِنْ دَابَّةٍ آيَاتٌ لِقَوْمٍ يُوقِنُونَ (4) وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنْزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِنْ رِزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِقَوْمٍ يَعْقِلُونَ (5)

(హామీమ్ * ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనా పరుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది * నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి * రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్‌ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.) (జాసియా:1-5).

యాజమాన్యంలో అల్లాహ్ ఏకైకుడని చెప్పడానికి గల ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ وَكَبِّرْهُ تَكْبِيرًا (الإسراء 111)

(ఇంకా   ఇలా   చెప్పు:   ”ప్రశంసలన్నీ   అల్లాహ్‌కే   శోభిస్తాయి.   ఆయన   ఎవరినీ     సంతానంగా   చేసుకోలేదు.   తన   విశ్వ   సామ్రాజ్యంలో   ఆయనకు భాగస్వాములెవరూ లేరు.   ఒకరి   సహాయ   సహకారాలపై   ఆధారపడటానికి   ఆయన   ఏ   మాత్రం   బలహీనుడు   కాడు.   కాబట్టి   నువ్వు   ఆయన   గొప్పదనాన్ని   ఘనంగా   కీర్తిస్తూ   ఉండు.”) (ఇస్రా:111)

ఇంకా ఈ ఆయతు కూడా దీనికి ఆధారం:

ذَلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ

(ఈ   అల్లాహ్‌యే   మీ   ప్రభువు.   విశ్వసామ్రాజ్యాధికారం   ఆయనదే.   ఆయన్ని   వదలి   మీరు   ఎవరెవరిని   పిలుస్తున్నారో   వారు   ఖర్జూరపు   టెంకపై   ఉండే   పొరకు   కూడా   యజమానులు   కారు.) (ఫాతిర్:13)

ఆజ్ఞాపించటంలో (మరియు విశ్వ వ్యవహారంలో) అల్లాహ్ ఒక్కడేనని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము.

أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ
(వినండి!   సృష్టి   ప్రక్రియ   ఆయన   స్వంతం.   ఆజ్ఞాపన   ఆయన   సొత్తు.) (ఆరాఫ్:54)

 మరో ఆధారం:

إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
(మేము   దేన్నయినా   చేయాలని   సంకల్పించుకున్నప్పుడు   ‘అయిపో’   అని   అంటే   చాలు,   అది   అయిపోతుంది). (నహ్ల్:40)

మరో ఆధారం:

وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ
(సమస్త   వ్యవహారాలూ  ఆయన   వైపుకే   మరలించబడతాయి.) (హూద్ :123)

ఓ ముస్లిములారా! ఆజ్ఞలు రెండు రకాలు: 1. షరీఅత్ పరమైన ఆజ్ఞ. 2. విశ్వపరమైన ఆజ్ఞ. షరీఅత్ ఆజ్ఞల సంబంధం ధర్మశాస్త్రం మరియు ప్రవక్త తత్వాలతో ఉంటుంది. అయితే ఆ అల్లాహ్ ఒక్కడే తన వివేకముతో అవసరాలానుసారం ధార్మిక నియమ నిబంధనాలపై ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఇస్తాడు, రద్దు చేయాల్సినవి రద్దు చేస్తాడు. ఆయనే మానవులకు వారి పరిస్థితులను సరిదిద్దే విధంగా తగిన షరీఅతును నియమించాడు మరియు ఆయన వద్ద స్వీకరించబడే ఆరాధనలను, ఆచరణలను చట్టబద్ధమైనవిగా చేసాడు. ఎందుకంటే ఆయనకు మానవుల పరిస్థితులు, వారి వ్యవహారాల గురించి తెలుసు మరియు ఆయన వారి పై కరుణించే కరుణామయుడు కూడాను.

అల్లాహ్ ఆజ్ఞ యొక్క రెండవ రకం విశ్వానికి సంబంధించినది. దీని సంబంధం విశ్వపరమైన వ్యవహారాలతో ఉంటుంది. కనుక మేఘాల కదలిక, వర్షాలు కురవడం, జీవన్మరణాలు, ఉపాధి మరియు సృష్టి, భూకంపాలు, ఆపదల తొలగింపు, విశ్వ సమాప్తం లాంటి అన్ని వ్యవహారాల ఆజ్ఞలు ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. అందుకనే ఈ వ్యవహారాలలో అల్లాహ్ ఏ ఆజ్ఞ ఇచ్చినా అది జరిగే తీరుతుంది. దాని పై ఎవరూ ఆధిపత్యం పొందలేరు, దానిని ఎవరు తప్పించలేరు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
(మేము   దేన్నయినా   చేయాలని   సంకల్పించుకున్నప్పుడు   ‘అయిపో’   అని   అంటే   చాలు,   అది అయిపోతుంది.) (నహ్ల్:40)

ఇంకో చోట ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
(మా   ఆజ్ఞ   ఒక్కటి   చాలు,   (అది   అమల్లోకి   రావటం   అనేది)   రెప్పపాటు   కాలంలో   జరిగిపోతుంది.) (ఖమర్:50)

అంటే ఏదైనా మేము జరపాలని అనుకుంటే కేవలం ఒకే ఒక్క మాట అంటాము, అదే: ‘కున్’ (అయిపో), అప్పుడు అది రెప్పపాటు సమయంలో జరిగిపోతుంది. అది జరగడానికి రెప్ప పాటు కూడా అలస్యం జరగదు.

సారాంశం ఏమిటంటే ఆజ్ఞలు రెండురకాలు: 1. విశ్వపరమైన ఆజ్ఞలు 2. ధర్మపరమైన ఆజ్ఞలు. దాని ప్రకారంగానే ప్రళయదినాన లెక్క తీసుకోవటం జరుగుతుంది.

బారకల్లాహు లీ వలకుమ్ ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

స్తోత్రం మరియు దరూద్ తర్వాత:

అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండండి.

ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ను తిరస్కరించే వారు కూడా ఉన్నారా? అంటే లేరు, కానీ గర్వం ఎవరి తలకెక్కిందో వారు తిరస్కరిస్తారు కాని నిజమైన నమ్మకంతో కాదు. ఉదాహరణకు ఫిరాఔన్ తమ జాతి వారితో ఇలా అన్నాడు :

أَنَا رَبُّكُمُ الْأَعْلَى
(”నేనే   మీ   సర్వోన్నత   ప్రభువును”) (నాజిఆత్: 24)

ఇంకా ఇలా అన్నాడు :

يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُمْ مِنْ إِلَهٍ غَيْرِي
(“ఓ   ప్రముఖులారా!   నేను   తప్ప   మీకు   మరో   దేవుడున్నాడన్న   సంగతి   నాకు   తెలీదు.) (అల్ ఖసస్:38)

కానీ  వాడు తన విశ్వాసం వలన ఇలా అనలేదు గర్వం, దౌర్జన్యం చేసే తత్వం వలన ఇలా అన్నాడు. అల్లాహ్ ఆదేశం చదవండి:

وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا
(నిజానికి   వారి   మనసులు   (సత్యాన్ని)   నమ్మినప్పటికీ   అన్యాయం,   అహంకారంతో   వారు   దాన్ని   త్రోసిపుచ్చారు.) (నమ్ల్:14)

అల్లాహ్ మీపై కరుణించుగాక! తెలుసుకోండి! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోని అవిశ్వాసులు అల్లాహ్ యొక్క రుబూబియత్ను నమ్మేవారు. అంటే అల్లాహ్ యే సృష్టికర్త, ఉపాధి ప్రధాత, ఈ విశ్వాన్ని నడిపేవాడని విశ్వసించేవారు. అయినప్పటికీ వారు తమ ఆరాధనలో అల్లాహ్ తో పాటు విగ్రహాలను భాగస్వాములుగా చేసేవారు, వారి కోసం రకరకాల ఆరాధనలు చేసేవారు. ఉదా: దుఆ చేయడం, జంతుబలి ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించటం మరియు సాష్టాంగ పడటం మొదలుగునవి. అందుకనే వారు తిరస్కారులు, అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ను విశ్వసించినా వారికి ఎటువంటి లాభము చేకూరలేదు. ఎందుకంటే వారు తౌహీదె రుబూబియత్ను నమ్మడం వల్ల ఏ బాధ్యతలు ఉంటాయో వాటిని నమ్మలేదు; అదే తౌహీదే ఉలూహియత్. సర్వ ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని విశ్వసించకుండా కేవలం రుబూబియత్ పై విశ్వాసం ఇస్లాంలో చేరడానికి సరిపోదు.

ప్రవక్త కాలంనాటి ముష్రికులు తౌహీదె రుబూబియత్ను మాత్రమే నమ్మేవారని అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలిపాడు:

قُلْ لِمَنِ الْأَرْضُ وَمَنْ فِيهَا إِنْ كُنْتُمْ تَعْلَمُونَ (84) سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَذَكَّرُونَ (85) قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ (86) سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَتَّقُونَ (87) قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ (88) سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّى تُسْحَرُونَ (89)

(“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. “సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్‌) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు. “అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో – ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.) (మూమినూన్:84-89)

 అల్లాహ్ మీపై కరుణించుగాక!, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అహ్ జాబ్:56).

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఇద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين


[1]సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు.
[2] రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం).
[3] ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది – కలామే హిక్మత్

అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)

పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :

అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)

“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.

“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.

పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)

ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :

“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)

మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :

ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.

పోతే – మద్యపానం, జూదం, వ్యభిచారం, అపసవ్యమైన అనర్థదాయకమయిన విషయాలు, అసత్యం, చాడీలు, మనోవాంఛల దాస్యం, పదార్థపూజ, వంశం, కులం గోత్రాల ప్రాతిపదికపై అహంకారాన్ని ప్రదర్శించడం, దురాచారాలు, దుస్సంప్రదాయాలు — ఇవన్నీ సరకానికి గొనిపోయేవే.

అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.

అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.

హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :

وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)

పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

ఇస్రా వ మేరాజ్ – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత
2) ఇస్రా వ మేరాజ్ తారీఖు
3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు
4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము

ఇస్లామీయ సోదరులారా!

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.

ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.

‘ఇస్రా’ గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)

ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.

ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.

ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కు కొనుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

అల్లాహ్ ఆదేశం:

يُوفُونَ بِٱلنَّذْرِ
వారు మొక్కుబడి చెల్లించేవారు” (76: దహ్ర్ : 7). 

మరోచోట:

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ
మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270). 

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి). 

1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 
2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్.
3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు. 

నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

అల్లాహ్ ఉనికిపై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు  భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.

అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి:
(1) అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం,
(2) ఆయన రుబూబియత్[2] అనే విషయం పై విశ్వాసం,
(3) ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం.
(4) ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.

ఈ ఖుత్బాలో మనము కేవలం ఆయన ఉనికి, అస్ధిత్వం పై విశ్వాసం (ఈమాన్) గురించి చర్చించుకుందాము.

అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ఉనికి పై విశ్వాసం కొరకు (నాలుగు రకాల) ఆధారాలున్నాయి:
(1) సహజ స్వభావికమైనవి,
(2) హేతు బద్ధమైనవి,
(3) ధర్మపరమైనవి మరియు
(4) ఇంద్రియజ్ఞాన పరమైనవి.

[1] సహజ స్వభావము అల్లాహ్ ఉనికిని నిరూపిస్తుంది అనే విషయానికొస్తే, ప్రతి సృష్టి ఎవరి నుండి ఏ నేర్పు, శిక్షణ మరియు ముందు ఆలోచన లేకుండా తన సృష్టికర్తను విశ్వసించే సహజగుణం పైనే పుడుతుంది. దివ్య ఖర్ఆన్ లో ఈ ఆయతు దీనికి ఆధారము.

وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَى أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَى شَهِدْنَا

(నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారికే సాక్షులుగా పెట్టి “నేను మీ ప్రభువును కానా” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువు) ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు.) (అల్ ఆరాఫ్:172)

మానవుడి సహజ స్వభావములో అల్లాహ్ అస్థిత్వము పై విశ్వాసము ఉందని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము. ఇక ఏదైనా బయటి ప్రభావం వల్లనే ఈ సహజ గుణం నుండి వైదొలగిపోతాడు. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతీ పిల్లవాడు సహజ స్వభావము పైనే పుట్టించబడతాడు. కాని వాడి తల్లిదండ్రులు వాడిని యూదుడిగా, క్రైస్తవుడిగా, మజూసీ (అగ్నిపూజారి)గే మార్చి వేస్తారు[4].

దీని వల్లే మానవుడికి ఏదైనా నష్టం జరిగినప్పుడు తమ సహజ స్వభావ ప్రకారంగా (తమ భాషలో) “ఓ అల్లాహ్” అని అరుస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు కూడా అల్లాహ్ ఉనికిని విశ్వసించేవారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ ٱللَّهُ

(మిమ్మల్ని పుట్టించినదెవరని నువ్వు గనక వారిని అడిగితే “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు.) (లుఖ్మాన్:25).

ఈ విషయంలో అనేక ఆయతులున్నాయి.

[2] ఇక హేతుబద్ధమైన రీతిలో అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే వాస్తవం ఏమిటంటే ముందు మరియు తరువాత వచ్చే జీవులన్నింటిని సృష్టించినవాడు ఒకడు తప్పకుండా ఉన్నాడు, ఆ సృష్టికర్తయే వీటన్నింటినీ ‌సృష్టించాడు. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను ఉనికిలోకి తెచ్చుకోవడం అసాధ్యం. అస్థిత్వం లేనిది తనను తాను సృష్టించుకోలేదు’

అదే విధంగా సృష్టితాలు ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావటం, రెండు కారణాల వలన అసాధ్యం.

మొదటి కారణము: ఉనికిలో ఉన్న ప్రతీదానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఒకడు ఉండటం తప్పనిసరి, దీనిని బుద్ది మరియు షరీఅత్ (ఇస్లాం ధర్మశాస్త్రం) రెండూ నిరూపిస్తున్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ ( الطور 35)

(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా? ) (అల్ తూర్:35)

రెండవ కారణం: అద్భుతమైన వ్యవస్థలో, పరస్పర సామరస్యముతో ఈ సృష్టి ఉనికిలోకి రావడం, ఎటువంటి ఢీ మరియు ఘర్షణ లేకుండా వాటి కారణాలు మరియు కారకుల మధ్య మరియు స్వయం సృష్టితాల్లో ఉన్న పరస్పర గాఢమైన సంబంధం ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చేసాయి అన్న మాటని పూర్తిగా తిరస్కరిస్తున్నాయి, ఎందుకుంటే అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చినది అస్తవ్యస్తంగా ఉంటుంది, అలాంటప్పుడు తన మనుగడ మరియు అభివృద్ధిలో ఈవిధమైన అద్భుత నిర్వాహణను కలిగి ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్రద్ధగా అల్లాహ్ యొక్క మాటను వినండి.

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ (40)

(చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు, పగటిని మించి పోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.) (యాసీన్:40)

ఒక పల్లెవాసితో నువ్వు నీ ప్రభువుని ఎలా గుర్తించావు అని అడిగితే అతను ఇలా సమాధానం ఇచ్చాడు: పేడను బట్టి జంతువును గుర్తించవచ్చు, అడుగు జాడలు ప్రయాణికుడిని నిరూపిస్తాయి. అలాంటప్పుడు నక్షత్రాలతో అలంకరించబడిన ఆకాశం, విశాలమైన మార్గాలు గల భూమి, అలలు ఆడించే సముద్రం విని మరియు చూసే సృష్టికర్తను నిరూపించటం లేదా?

అల్లాహ్ యొక్క అద్భుతమైన సృష్టిరాసుల్లో ఒకటి దోమ. అల్లాహు తఆలా అందులో కూడా అనేక వివేకాలను సమకూర్చి ఉంచాడు, అల్లాహ్ దానిలో జ్ఞాపక శక్తి, గుర్తించే, గమనించే శక్తి, తాకే, చూసే మరియు వాసన పీల్చే శక్తులను మరియు ఆహార ప్రవేశ మార్గం అమర్చాడు. కడుపు, నరాలు, మెదడు మరియు ఎముకలను నియమించాడు. సరియైన అంచనా వేసి మార్గం చూపాడో  మరియ ఏ వస్తువును అనవసరంగా సృష్టించలేదో  ఆయన పరమ పవిత్రుడు, సర్వలోపాలకు అతీతుడు.

ఒక కవి[5] అల్లాహ్ ను పొగుడుతూ ఇలా వ్రాసాడు:

يا من يرى مدَّ البعوض جناحها
ویری مناط عروقها في نحرها
Žویری خرير الدم في أوداجها
ويرى وصول غذى الجنين ببطنها
ویری مكان الوطء من أقدامها
ويرى ويسمع حِس ما هو دونها
امنن علي بتوبة تمحو بها

في ظلمة الليل البهيم الأليل
والمخ من تلك العظام النحَّل
متنقلا من مفصل في مفصل
في ظلمة الأحشا بغير تمقَّل
في سيرها وحثيثها المستعجل
في قاع بحر مظلم متهوّل
ما كان مني في الزمان الأول

చిమ్మని చికిటిలో దోమ విప్పే రెక్కను చూసే ఓ అల్లాహ్! ఆ దోమ మెడలో ఉన్న నరాల సంగమాన్ని చూసేవాడా! మరియు దాని సన్నని ఎముకలపై ఉన్న మాంసాన్ని చూసేవాడా! దాని నరాలలో ఉన్న రక్తము, శరీర ఒక భాగము నుండి మరో భాగానికి చేరే రక్త ప్రవాహాన్ని చూసేవాడా! దోమ కడుపులో పోషించబడుతున్న పిండాన్ని, ప్రేగుల చీకటి లోంచి ఎటువంటి శ్రమ లేకుండా చూసేవాడా! అది నడుస్తున్నప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు దాని అడుగు జాడలను చూసేవాడా! చిమ్మని చీకటి మరియు భయంకరమైన సమద్రము లోతులో ఉన్న అతి సూక్షమైన జీవులను చూసేవాడా! నా తౌబా స్వీకరించు మరియు నా పూర్వ పాపాలన్నింటినీ క్షమించు.

సారాంశం ఏమిటంటే ఈ సృష్టితాలు తమను తాము సృష్టించుకోలేనప్పుడు మరియు అవి అకస్మాత్తుగా ఉనికిలోకి రాలేనప్పుడు దీనీ అర్థం: వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనే అల్లాహ్!.

అల్లాహు తఆలా ఈ హేతుబద్ధమైన మరియు ఖచ్చితమైన ఆధారాన్ని సూరే తూర్ లో ఇలా ప్రస్తావించాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ (35)

(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా?) (అల్ తూర్:35).

అంటే వారూ ఏ సృష్టికర్త లేకుండా పుట్టలేదు మరియు వారు స్వయాన్నీ సృష్టించుకోలేదు, అలాంటప్పుడు వారి సృష్టికర్త అల్లాహు తబారక వతఆలా అని స్పష్టమయింది.

అందుకనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరె తూర్ పఠిస్తుండగా జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు వింటున్నప్పుడు ప్రవక్త ఇదే ఆయత్ వద్దకు చేరుకున్నప్పుడు జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు అప్పుడు అవిశ్వాసి, కాని ఇలా అన్నారు:“నా గుండె ఆగిపోతుందేమొ అనిపించింది. అప్పుడే మొదటి సారిగా నా మనసులో ఇస్లాం చోటుచేసుకుంది”[6].

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ)

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్! అమ్మాబాద్.

[3] ఓ ముస్లిముల్లారా! అల్లాహ్ ఉనికి పై షరీఅత్ పరమైన అధారాల విషయానికొస్తే ఆకాశ గ్రంధాలన్నియూ అల్లాహ్ ఉనికిని నిరూపిస్తాయి? ఎందుకంటే ఈ గ్రంధాలు జీవులకు ఇహ పరలోకాల ప్రయోజనాలు చేకూర్చే ఆదేశాలతో అవతరించాయి. కావున ఈ గ్రంధాలు వివేకవంతుడైన, జీవుల లాభ, ప్రయోజనాల జ్ఞానమున్న ప్రభువు తరఫున అవతరించబడ్డాయి అని నిరూపిస్తున్నాయి. అందులో ఉన్న విశ్వ సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని వస్తువులను సృష్టించగల సమర్ధత ఉన్న ప్రభువు తరపున అవతరించబడ్డాయని ఇవి (దైవ గ్రంధాలు) నిరూపిస్తున్నాయి.

ఇదే విధంగా ఖుర్ఆన్ యొక్క పరస్పర సామరస్యము, అందులో పరస్పర విభేధాలు లేకపోవటం, దాని ఒక భాగం మరో భాగాన్ని ధృవీకరించడం వివేకవంతుడు, జ్ఞానవంతుడైన అల్లాహ్ తరుఫు నుండి వచ్చిందని చెప్పటానికి ఇది ఖచ్చితమైన ఆధారము. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا (82)

(ఏమిటి వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒక వేళ ఇది గనక అల్లాహ్ తరఫున కాక ఇంకొకరి తరఫున వచ్చి ఉంటే అందులో వారికీ ఎంతో వైరుధ్యం కనపడేది.) (అల్ నిసా:82).

ఏ ప్రభువైతే ఖుర్ఆన్ ద్వారా మాట్లాడాడో ఆ ప్రభువు యొక్క ఉనికిని నిరూపించే ఆధారము ఆయనే అల్లాహ్.

[4] ఇక ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే, ఈ విషయం రెండు రకాలుగా నిరూపించవచ్చును.

మొదటి రకం: అల్లాహు తఆలా తనను పిలిచే వారి పిలుపును వినటం, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయటమనేది మనము వింటూ, చూస్తూ ఉంటాం. ఇది అల్లాహ్ ఉనికిని నిరూపించే ధృఢమైన ఆధారము ఎందుకంటే దుఆ స్వీకరించబడటము ద్వారా ఆయనను పిలిచే పిలుపును వినే మరియు చేసే దుఆను స్వీకరించేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَنُوحًا إِذْ نَادَى مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ (76)

(అంతకు ముందు నూహ్ మొర పెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము). (అల్ అంబియా:76).

ఇదే విధంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَٱسْتَجَابَ لَكُمْ أَنِّى مُمِدُّكُم بِأَلْفٍۢ مِّنَ ٱلْمَلَـٰٓئِكَةِ مُرْدِفِينَ

(సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు అల్లాహ్ మీ మొరను ఆలకించాడు కూడా). (అల్ అన్ ఫాల్:9).

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి జుమా రోజు మింబర్ కి ఎదురుగా ఉన్న తలుపు నుండి మస్జిదె నబవీలోకి వచ్చాడు, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, అతను ప్రవక్తకు ఎదురుగా నిలబడి అన్నాడు: వర్షాలు కురవక జంతువులు చనిపోయాయి, మార్గాలు మూత పడిపోయాయి, కావున మీరు వర్షాల కొరకు అల్లాహ్ తో దుఆ చేయండి, ఇది విన్న వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (దుఆ కొరకు) చేతులు ఎత్తి:

اللَّهُمَّ اسْقِنَا، اللَّهُمَّ اسْقِنَا، اللَّهُمَّ اسْقِنَا

ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు.

అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా! ఆకాశంలో దూర దూరం వరకు మేఘాలుగానీ, మేఘపు ముక్కగానీ లేదా మరే విషయం (అంటే వర్షానికి చిహ్నంగా గాలి మొదలుగునవి) ఇంకా మా మధ్య మరియు సల్అ కొండ మధ్య మబ్బు ఉన్నా కనిపించకపోవటానికి ఏ ఇల్లు కూడా లేదు, కొండ వెనుక నుండి ఢాలుకి సమానమైన మేఘాలు వస్తూ కనిపించాయి, ఆకాశానికి మధ్యలో చేరాయి, నలువైపులా క్రమ్ముకున్నాయి, వర్షం కురవటం మొదలైపోయింది, అల్లాహ్ సాక్షిగా! ఒక వారము వరకు మేము సూర్యుడ్ని చూడలేదు, తర్వాత జుమా రోజున ఆ/ఓ వ్యక్తి అదే తలుపు నుండి లోపలికి వచ్చాడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఓ ప్రవక్తా! వర్షం ఎక్కువగా కురవడం వల్ల సంపద నాశనం అయిపోయింది, మార్గాలు మూతపడిపోయాయి, వర్షాలు ఆగిపోవాలని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు మహాప్రవక్త చేతులెత్తి ఇలా దుఆ చేసారు:

اللهُمَّ حَوْلَنَا وَلَا عَلَيْنَا، اللهُمَّ عَلَى الْآكَامِ، وَالظِّرَابِ، وَبُطُونِ الْأَوْدِيَةِ، وَمَنَابِتِ الشَّجَرِ

ఓ అల్లాహ్! మాపై కాకుండా, మా చుట్టు ప్రక్కన వర్షం కురిపించు, దిబ్బల పై, పర్వతాలపై, కొండలపై, లోయల్లో మరియు తోటల్లో.

ఈ దుఆ తరువాత వర్షం ఆగిపోయింది, మేము ఎండలో బయటకు వచ్చాము.

ఎవరు స్వచ్ఛ మనస్సుతో అల్లాహ్ వైపునకు మరళి, దుఆ స్వీకరించబడే సాధనాలతో అల్లాహ్ ను అల్లాహ్ తో దుఆ చేస్తే, (అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడని, స్వీకరిస్తున్నాడని) ఈ రోజు కూడా దుఆ స్వీకరించబడే సందర్భాలను, అద్భుతాలు చూడవచ్చు.

ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ ఉనికిని నిరూపించే రెండో రకం: ప్రవక్తలకు అల్లాహ్ ఇచ్చిన అద్భుతాలు. వాటిని ప్రజలు చూస్తూ వింటూ, ఉంటారు. ఇవి కూడా ప్రవక్తులను పంపిన అల్లాహ్ ఉనికిని నిరూపించే ఖచ్చిత ఆధారాలు. ఎందుకంటే ఇవి మానవుడితో సాధ్యమయ్యేవి కావు. అల్లాహ్ ప్రవక్తలకు మద్దతు పలుకుతూ వారికి (ఈ అద్భుతాలు) ప్రసాదిస్తాడు.

ఉదాహరణకు: మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించిన అద్భుతం: ఎప్పుడైతే అల్లాహ్ మూసా అలైహిస్సలాంకి తన లాఠీను సముద్రంపై కొట్టమని ఆజ్ఞాపించాడో, అప్పుడు ఆయన కొట్టారు, దాని వలన పన్నెండు పొడి మార్గాలు ఏర్పడి వారి ముందు నీరు కొండ మాదిరిగా నిలబడింది.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఉనికిని విశ్వసించాలని సహజస్వభావము మరియు ఇంద్రియ జ్ఞానం నిరూపిస్తున్నాయి కాబట్టి ప్రవక్తలు తమ జాతి వారితో ఇలా అన్నారు:

أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ

(ఏమిటీ? భూమ్యాకాశాల నిర్మాత అయిన అల్లాహ్‌పైనే మీకు అనుమానం ఉందా?) (ఇబ్రాహీం:10).

సారాంశం ఏమిటంటే అల్లాహ్ ఉనికి పై విశ్వాసం మానవుడి సహజ స్వభావములో స్థిరపడి ఉంది. బుద్ధి (తెలివి), ఇంద్రియ జ్ఞానం మరియు షరీఅత్ లో తెలిసిన విషయమే.

అల్లాహ్ మీపై కరుణించుగాక, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అల్ అహ్ జాబ్:56).

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఇద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మాపాపాలను మరియు మాఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين


[1] ‘సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు.

[2] రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం).

[3] ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.

[4] బుఖారీ1359లో అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం.

مَا مِنْ مَوْلُودٍ إِلَّا يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ وَيُنَصِّرَانِهِ وَيُمَجِّسَانِهِ،

[5] షిహాబుద్దీన్ అహ్మద్ అల్ అబ్ షీహీ గారు తమ పుస్తకం “అల్ ముస్తత్రఫ్ ఫీ కుల్లి ఫన్నిమ్ ముస్తజ్రఫ్” లోని 62వ చాప్టర్ లో ఈ పద్యాలను ప్రస్తావించారు.

[6] ఇమాం బుఖారీ దీని భిన్నమైన భాగాలను వేర్వేరు స్థలాల్లో ఉల్లేఖించారు. 4023, 4853.

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

సలాతుల్ రగాయిబ్ (రగాయిబ్ నమాజ్ ) – రజబ్ మాసంలో ఒక బిద్అత్

రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.

‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.

ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :

1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)

ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)

అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:

ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)

2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)

3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)

4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)

5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.

6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)

వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)

నుండి : జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ప్రవక్త ప్రియ సహచరులను దూషించటం హరామ్ – కలామే హిక్మత్ 

[డౌన్లోడ్ PDF]

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

“నా సహచరులను తిట్టబాకండి. నా సహచరులను తిట్టబాకండి. ఎవరి అధీనంలోనా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – ఒకవేళ మీలో ఎవరయినా ఉహద్ అంత బంగారం ఖర్చు పెట్టినాసరే వీరి (అంటే సహాబాలు ఖర్చుచేసిన) అర్థ సేరు కాదు కదా కనీసం పావు సేరు ధాన్యానికి సమానమయిన పుణ్యఫలం కూడా పొందలేరు.” (ముస్లిం)

అబూసయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ప్రకారం ఖాలిద్ బిన్ వలీద్ – అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మధ్య ఒకసారి అభిప్రాయభేదం తలెత్తింది. అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆవేశంలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ను దుర్గాషలాడారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై హదీసును పలికారు.

”ఉహద్” ఒక పర్వతం పేరు. ప్రాచీన కాలంలో అది మదీనాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే అది ప్రస్తుతం మదీనా నగరంలో ఒక వీధిగా ఉంది. ఈ పర్వతానికి ఆనుకునే ఆనాడు మహా సంగ్రామం జరిగింది. అది ఉహద్ సంగ్రామంగా చరిత్ర ప్రసిద్ధిచెందింది.

అర్థ సేరు అనేపదం హదీసులోని ‘మద్ద్‘ అనే పదానికి మారుగా వ్రాయడం జరిగింది. “మద్” అనేది ధాన్యం కొలిచే డబ్బా లాంటిది. అది ఇంచుమించు అర్థ సేరుకు సమానం.

అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తొలితొలి సహచరులలోని వారు. అల్లాహ్ ఆయనకు పుష్కలమయిన ధనరాసుల్ని ఒసగాడు. అయితే ఆయన ఆ ధనరాసులను అల్లాహ్ మార్గంలో విరివిగా ఖర్చు చేశారు. హిజ్రీ 33లో మదీనాలో తనువు చాలించారు.

ఖాలిద్ బిన్ వలీద్ కూడా మహాప్రవక్త సహచరులలోని వారే. అయితే ఆయన ప్రారంభంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా నిలబడి పోరాడినవారు. ఆతరువాత హిజ్రీ 8వ యేట సత్యాన్ని గ్రహించి ఇస్లాం స్వీకరించారు. ఇక ఆ తరువాత ఆయన ఇస్లాం వ్యాప్తికై తన శక్తులన్నింటినీ ధారపోశారు. ఆయన్ని ఏ సైనిక పటాలానికి కమాండర్ గా నియమించినా విజయమే లభించేది. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ హిజ్రీ 21 యేట కాలధర్మం చెందారు.

పై హదీసులో సహాబాల స్థానం, వారి త్యాగాలు ప్రముఖంగా ప్రస్తుతించబడ్డాయి.విశ్వాస స్థితిలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూచి, ఆయన వెంట ఉన్నవారిని, విశ్వాసస్థితి లోనే మరణించిన వారిని సహాబాలు అంటారు.

ఇమామ్ నవవి ఇలా అంటున్నారు:- “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులంతా ఆదరణీయులే. నమ్మకస్తులే. ‘ఒకవేళ వారు ఉపద్రవానికి గురయినా కాకపోయినా’ దీని భావం ఏమంటే వారిలో ఎవరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పలుకులను ఉల్లేఖించినా అవి ప్రామాణికంగానే పరిగణించబడతాయి. వారి ఉల్లేఖనాలపై సంశయాలకు తావులేదు.

హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ”మహాప్రవక్త సున్నత్ ని అనుసరించే వారందరిలో సహాబాలు నమ్మకస్తులన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఎవరో కొద్దిమంది బిద్అతీలు (కొత్తపుంతలు తొక్కేవారు) మాత్రమే దీంతో విభేదిస్తారు.”

కాజీ అయాజ్ ఇలా అన్నారు – “ఈ హదీసు ద్వారా సహాబాలంతా, తదనంతర అనుయాయులకన్నా శ్రేష్ఠులు అన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యక్ష సహచరులు తొలి దశ నుంచీ కష్టకాలంలో ఆదుకున్నారు. తమ ఇళ్ళల్లో ఉన్నదంతా అల్లాహ్ మార్గంలో అర్పించారు. ఎల్లప్పుడూ మహాప్రవక్తను వెన్నంటి ఉండేవారు. ఈ భాగ్యం తరువాతి వారికి లభించలేదు. జిహాద్ విషయంలోనయినా, విధేయత విషయంలోనయినా సహాబాల తరువాతే ఇతరుల స్థానం. సర్వోన్నత ప్రభువు ఇలా సెలవిచ్చాడు –

“మీలో (మక్కా) విజయానంతరం ఖర్చుపెట్టిన వారు మరియు పోరాడినవారు, (మక్కా) విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, పోరాడినవారితో సమానులు కాజాలరు. వారు ఉన్నత శ్రేణికి చెందినవారు.”

అదీగాక వారి హృదయాలలో ప్రేమానురాగాలు, దయాభావం, సంకల్పశుద్ధి, అణకువ, వినమ్రత, అల్లాహ్ మార్గంలో పోరాటపటిమ విరివిగా ఉండేవి. ఒక్క క్షణమే కానివ్వుగాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి గడపటమే వేరు. ఆ మధుర క్షణాలతో సరితూగగల ఆచరణ ఇంకేది కాగలదు!? ఎవరెంత ప్రయత్నించినా ఆ స్థాయికి చేరుకోలేరు. అది కేవలం అల్లాహ్ కృప మాత్రమే. అల్లాహ్ కోరిన వారికే అది దక్కింది. కాజీ అయాజ్ ఇలా అభిప్రాయపడ్డారు : “ఈ ఉన్నతస్థానం, మహాప్రవక్త వెంట సుదీర్ఘకాలం గడిపిన, దైవమార్గంలో విరివిగా ఖర్చుచేసిన, ధర్మపోరాటం చేసిన, హిజ్రత్ చేసిన వారికే వర్తిస్తుందని పలువురు హదీసువేత్తలు అంటున్నారు. అంతేగాని మహాప్రవక్తను కేవలం ఒకసారి చూసినవారికో, లేక మక్కా విజయానంతరం విశ్వసించిన వారికో ఆ ఉన్నత స్థానం లభించదు. ఎందుకంటే వారికి అల్లాహ్ మార్గంలో హిజ్రత్ ని, ప్రారంభంలో విశ్వసించిన ముస్లిములకు సహాయపడే అవకాశం గాని రాలేదు.”

ఈ అభిప్రాయంకన్నా, మహాప్రవక్తను విశ్వాసస్థితిలో చూసిన వారంతా సహాబాలుగానే పరిగణించబడతారన్న అభిప్రాయమే నిర్వివాదాంశంగా తోస్తుంది.

ఈ హదీసు మహాప్రవక్త ప్రియ సహచరుల త్యాగాల సాగరంలో ఒక బిందువు మాత్రమే. దైవగ్రంథమైన ఖుర్ఆన్లోనూ, మహాప్రవక్త పలుకులలోనూ సహాబాల స్థానం అత్యున్నతమైందని చెప్పబడింది.

“(ఈ విజయప్రాప్తి) ఆ బీద ముహాజిర్లకే చెందాలి. ఎవరయితే తమ ఇళ్ళూ, వాకిలి మరియు ఆస్తిపాస్తులకు నోచుకోకుండా తీసివేయబడ్డారో, వీరు అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను కోరుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త మద్దతుకై సన్నద్ధులై ఉంటారు. వీరే సన్మార్గగాములు. ఇంకా, ఈ ముహాజిర్లు వలస రాకపూర్వం విశ్వసించి ‘దారుల్ హిజ్రత్’ (యస్రిబ్ లేదా మదీనా) లో వేచివున్న వారికి కూడా (ఈ విజయ ప్రాప్తిచెందాలి). వీరు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. ఏది వారికి ఇచ్చినా దాని గురించి మనసులోనే పెట్టుకోరు. తమకేదయినా అవసరం ఉన్నప్పటికీ తమ స్వయంపై ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు. యధార్థానికి తమ మనసులోని సంకుచితత్వానికి దూరంగా మసలుకున్నవారే సాఫల్యం పొందుతారు.” (అల్ హష్ర్ : 8, 9)

పై రెండు ఆయత్లలో అల్లాహ్ అన్సార్లను, ముహాజిర్లను సాఫల్యం పొందిన వారుగా పేర్కొన్నాడు. ఈ విధంగా ఎన్నో ఆయత్లలో మహాప్రవక్త ప్రియ సహచరులు కొనియాడబడ్డారు. తరువాత వచ్చిన అనుయాయులు ఈ సహాబాల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలని తాకీదు చేయడంజరిగింది. హష్ర్ సూరాలోనే పదవ ఆయత్లో చూడండి –

”వీరి తరువాత వచ్చిన వారు ఇలా వేడుకుంటారు – “ఓ మా ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన సోదరులందరినీ క్షమించు! విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎటువంటి కాపట్యాన్నీ ఉంచబాకు. మా ప్రభూ! నువ్వెంతో దయామయుడవు, కృపాకరుడవు.” (అల్ హష్ర్ : 10)

తమకు పూర్వం విశ్వసించిన వారి మన్నింపునకై ప్రార్థించటం విశ్వాసుల సుగుణానికి తార్కాణమని పై ఆయత్ ద్వారా రూఢీ అవుతోంది. వారి యెడల ఎటువంటి కాపట్యాన్నిగాని, దురుద్దేశ్యాన్ని గాని వారు సహించరు.

మహాప్రవక్త ప్రియ సహచరులలో ఎవరినయినాసరే నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అర్వ బిన్ జుబైర్ తో ఇలా అన్నారు: “ఓ నా సోదరి కుమారా! సహాబాల మన్నింపునకై వేడుకుంటూ ఉండమని వీరికి ఆదేశించబడింది. కాని వీళ్ళు వారిని దుర్భాషలాడారు.” (ముస్లిం)

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “అత్యుత్తమమైన కాలం నాది. ఆపైన నా తరువాతది. ఆపైన దాని తరువాతది.” (బుఖారి)

ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు – “మహాప్రవక్త వారి సహచరులను దూషించకండి. వారు మహాప్రవక్తతో గడిపిన ఒక్క క్షణం మీ యొక్క 40 యేళ్ళ ఆచరణకన్నా శ్రేష్ఠమైనది.”

”కొంతమంది, దైవప్రవక్త సహచరులను, ఆఖరికి అబూబకర్, ఉమర్లను కూడా పరుషంగా మాట్లాడుతున్నారు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) తో చెప్పగా, “అందులో ఆశ్చర్య పడాల్సింది ఏముంది? వారి ఆచరణ సమాప్తమయింది. అయితే వారికి లభించేపుణ్యఫలం సమాప్తం కారాదని అల్లాహ్ నిర్ణయించాడు” అని ఆమె బదులిచ్చారు. ఈ పలుకులను జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. దీని భావం ఏమిటంటే, దుర్భాషలాడిన, చాడీలు చెప్పిన వారి సత్కార్యాలు కీర్తిశేషులయిన ఆ మహనీయుల ఖాతాలో జమ అవుతాయి. ఆ విధంగా వారు చనిపోయినప్పటికీ ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు.

ప్రముఖ హదీసు వేత్త అబూజర్ అత (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : “ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరులలో ఎవరినయినా అగౌరవపరుస్తూ మాట్లాడటం మీరు చూస్తే అతను ధర్మభ్రష్టుడని తెలుసుకోండి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యసంధులు. ఖుర్ఆన్ సత్యబద్ధమైనది. అటువంటి ఖుర్ఆన్ ను, మహాప్రవక్త సంప్రదాయాన్ని మన దాకా అందజేసినవారే సహాబాలు. ఖుర్ఆన్ మరియు సున్నత్ ను మనకందజేసిన సహాబాలు నమ్మకస్తులు కారని వారు చెప్పదలుస్తున్నారు. ఆ విధంగా ఖుర్ఆన్ హదీసులు మిథ్య అని నిరూపించదలుస్తున్నారు. ఇటువంటి వారంతా ధర్మ విరోధులు, ధర్మ భ్రష్టులు.”

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియసహచరుల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ పంథా సమతూకంతో కూడినది. అది వారి స్థానం నుండి వారిని మరీ ఎత్తి దైవంతో సరితూగే స్థానమూ కల్పించదు. అలా అని వారిని అవహేళనచేసే విధంగానూ దిగజార్చదు. అందుకే అహ్లె సున్నత్లు మధ్యస్థ విధానాన్ని అవలంబిస్తారు. వారు అందరినీ ప్రేమిస్తారు. న్యాయంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఇస్తారు. వారి అంతస్తును మరింత పైకి ఎత్తనూ ఎత్తరు. వారి హక్కుల్ని నెరవేర్చటంలో లోటూ రానివ్వరు. మహాప్రవక్త సహచరుల ప్రశంసలో వారి నోళ్ళు తడిగా ఉంటాయి. వారి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండిపోతాయి.

సహాబాల మధ్య ఎప్పుడయినా, ఏదయినా విభేదం గాని, వివాదం గాని తలెత్తితే అది కేవలం ‘ఇజ్తెహాద్ ‘ షరీఅత్ అన్వయింపు కారణంగానే తలెత్తేది. ఎవరు ఇజ్తెహాద్ లో కరెక్టుగా ఉంటే వారికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరెవరి ఇజ్తెహాద్ లో లోపం ఉంటుందో వారికి ఒకే వంతు ప్రతిఫలం లభిస్తుంది. సహాబాలు మానవాతీతులు కారు. వారూ మానవులే. వారి ద్వారా కూడా పొరపాట్లు జరగవచ్చు. జరిగేవికూడా. అంతమాత్రాన అసాధారణమయిన వారి త్యాగాలు, సుగుణాలు మరుగున పడజాలవు. వారి సత్కర్మలు తదనంతర అనుయాయుల సత్కార్యాల కంటే అధికం. అలాగే వారి పొరపాట్లు వారి తరువాతి వారి పొరబాట్లకన్నా బహుస్వల్పం. అదీగాక, అల్లాహ్ వారిని మన్నించాడు. వారితో ప్రసన్నుడైనాడు.

తావీ (రహిమహుల్లాహ్) గారు “అఖీద అహ్లుల్ సున్నత్ లో ” ఇలా రాస్తున్నారు : “మనమంతా మహాప్రవక్త ప్రియ సహచరులను ప్రేమిస్తున్నాము. వారిలో ఎవరి ప్రేమ పట్ల కూడా వైపరీత్యానికి పోము. ఇంకా వారిలో ఏ ఒక్కరితోనో సంబంధాన్ని త్రెంచుకోవటమూ లేదు. ఎవరు సహాబాల పట్ల కపటత్వం ప్రదర్శించారో వారిపట్ల మేముకూడా అలాగే వ్యవహరిస్తాము. మేము మటుకు వానిని మంచి పదాలతోనే స్మరిస్తాము. వారిపట్ల ప్రేమ ఉంటేనే ధర్మం (దీన్) పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నట్లు లెక్క. వారిపట్ల గనక వైరభావం ఉంటే అది కుఫ్ర్ (తిరస్కారం)కు, కాపట్యానికి, తలపొగరుతనానికి ఆనవాలు అవుతుంది.”

ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి: “సహాబా (రదియల్లాహు అన్హు)లందరి సుగుణాలను స్మరించడం, వారిలోని పరస్పర విభేదాల గురించి చర్చకు తావీయకుండా ఉండిపోవటం సంప్రదాయం (సున్నత్). ప్రవక్త సహచరుల్లో ఏ ఒక్కరినయినా సరే దూషించినవాడు మార్గవిహీనుడే. సహాబాల పట్లప్రేమ కలిగి ఉండటం సున్నత్. వారి కోసం అల్లాహ్ ను వేడుకోవటం అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటమే. ఇంకా వారి మార్గాన్ని అనుసరిస్తే అది మోక్షానికి వారధి వంటిది. వారి పాద చిహ్నాలలో నడుచుకోవటం ఔన్నత్యానికి సోపానం.”

సహాబాలలోని తప్పులను చర్చించే, లేదా వారిలో ఎవరినయినా అవమానపరచే అనుమతి ఎవరికీ లేదు. అలా చేసిన వారిని కాలపు రాజ్యాధికారి విధిగా శిక్షించవలసి ఉంటుంది. అటువంటి వారిని మన్నించి వదలివేయటం సబబు కాదు. వారిని శిక్షించాలి, ఆపైన వారిచేత పశ్చాత్తాపం ప్రకటించాలి. పశ్చాత్తాపపడితే సరి. లేకపోతే వారికి మళ్ళీ శిక్ష విధించాలి. వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడేవరకూ నిర్బంధంలో పెట్టాలి.

అబూ సయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం సహాబాలలో అంతస్తులున్నట్లు నిర్ధారణ అవుతోంది. వారిలో వివిధ కోవలున్నట్లు కూడా విదితమవుతోంది. విజయానికి పూర్వం అల్లాహ్ మార్గంలో తమ ధనంతో, ప్రాణాలతో పోరాడిన వారికి విజయం తరువాత పోరాడిన వారు సాటి రాలేరని అల్లాహ్ స్వయంగా “పేర్కొన్నాడు.

“మీలో ఎవరయితే విజయం తరువాత ఖర్చు చేశారో, పోరాడారో వారు ఎప్పటికీ విజయానికి పూర్వం ఖర్చుచేసిన, పోరాడిన వారితో సమానులు కాలేరు.”

ఇక్కడ “విజయం” అనే పదం హుదైబియా ఒడంబడిక నేపధ్యంలో ఉంది. హుదైబియా ఒప్పందం తరువాత చేసిన త్యాగాల కంటే హుదైబియా ఒప్పందానికి ముందుచేసిన త్యాగాలు ఇంకా విలువైనవని తెలుస్తోంది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ని ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) పరుషంగా మాట్లాడినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించటమే గాక అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ను తన సన్నిహితునిగా పేర్కొన్నారు. ఎందుకంటే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ చివర్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ అంతటి వారే అబ్దుర్రహ్మాన్ బిన్ఔఫ్ (రదియల్లాహు అన్హు)కు సాటి రాలేనపుడు ఆ తరువాతి అనుయాయుల్లో మాత్రం సహాబాలతో సరిపడే వారెవరుంటారు?

హదీసు ద్వారా బోధపడిందేమంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రియ సహచరులంతా మనకు గౌరవనీయులు, ఆదర్శప్రాయులు, కనుక వారి పొరపొచ్చాలను వెతుకుతూ ఉండటం, వాటిని సాగదీయటం వాంఛనీయం కాదు. అది అమర్యాద, అవిజ్ఞత అనిపించుకుంటుంది. మనం ఎంతసేపటికీ వారి సత్కార్యాలనే మార్గపు కాగడాలుగా ఎంచుకోవాలి. వారిలోని లోటుపాట్లను విస్మరించాలి. వారి స్థాయిని మనలో ఎవరూ అందుకోలేరని తెలుసుకోవాలి. వారి అపారమైన సుగుణాల ముందు వారి లోటుపాట్లు దేనికీ పనికిరావు. అనుయాయుల్లో ఎవరయినా సరే వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం అమర్యాదకరంగానే పరిగణించబడుతుంది. మనం చేయవలసిందల్లా వారి శ్రేయాన్ని అభిలషిస్తూ ప్రార్థించటం, వారి జీవితాల ద్వారా గుణపాఠం గరపుతూ ఉండటమే.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్

సహాబాలు మరియు మన సలఫ్:
https://teluguislam.net/sahaba-and-salaf/

రజబ్ మాసపు క్రొత్త పోకడ (బిద్అత్)లు – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్

4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)

ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)

అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.

ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?

దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)

ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.

ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.

దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.

ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)

అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.

జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

అంశము: జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి! అల్లాహ్ యే ఈ సృష్టి ప్రదాత. ఆయన ఎవరిని కోరుతాడో వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు, వారు మనుషులైనా లేక ప్రదేశమైనా, లేక ఏదైనా సందర్భం అయినా, లేక ఏదైనా ఆరాధన అయినా అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) (అల్ ఖసస్ 28:68)

మరియు నిశ్చయంగా అల్లాహ్ నమాజులలో జుమా నమాజును ఎంచుకున్నాడు. మరియు దానికి కొన్ని ప్రత్యేకతలను ప్రసాదించాడు. మరియు కొన్ని సున్నతులను మరికొన్ని ఆచరణలను అభిలషణీయం (ముస్తహబ్)గా నిర్వచించాడు.

1. జుమా ప్రార్థన ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి మరియు ముస్లింల గొప్ప సమావేశాలలో ఒకటి.

2. జుమా నమాజ్ యొక్క సున్నతులు:- (గుసుల్ చేయడం) అనగా తప్పనిసరిగా తలస్నానం చేయడం, సువాసనలు పూసుకోవడం, మరియు మిస్వాక్ చేయడం, మంచి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం సున్నత్ ఆచరణ లోనివి.  అబూ దర్దా (రదియల్లాహు అన్హు) గారి హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; “ఎవరైతే జుమ్అహ్ రోజు తలస్నానం చేసి, మంచి అందమైన దుస్తులు ధరించి మరియు పరిమళాలు పూసుకొని ప్రశాంతంగా జుమా నమాజ్ కొరకు బయలుదేరుతాడో దారి మధ్యలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని వేధించకుండా ఉండి, మస్జిద్ చేరుకుని తన అదృష్టం కొద్ది నఫిల్ నెరవేర్చి ఇమామ్ కొరకు వేచి చూస్తూ ఉంటాడో’ అతని రెండు జుమాల మధ్య పాపాలు క్షమించబడతాయి.” (అహ్మద్)

సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు; “మనిషి శుక్రవారం నాడు తలంటు పోసుకొని, వీలైనంతవరకు పరిశుద్ధతను పాటించి, నూనె రాసుకొని లేక తన ఇంట్లో ఉన్న పరిమళాన్ని పూసుకుని, ఆ తర్వాత మస్జిద్ కి వెళ్లి అక్కడ ఏ ఇద్దరి మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్ళకుండా (ఎక్కడో ఒక చోట) తన అదృష్టంలో వ్రాసివున్న నమాజు చేసుకొని ఆ తర్వాత ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు అతని వల్ల జరిగే పాపాలు మన్నించబడతాయి”. (బుఖారి)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమ్అహ్ నాడు గుసుల్ (తలంటు స్నానం) చేయటం ప్రతి వయోజనుడికి తప్పనిసరి (వాజిబ్) మరియు వారు మిస్వాక్ చేయాలి మరియు ఒకవేళ పరిమళం ఉంటే పూసుకోవాలి” (బుఖారీ-ముస్లిం)

3. జుమ్అహ్  యొక్క మరొక సున్నత్ ఏమిటంటే నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఆధారం: ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు శుక్రవారం రోజున ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, అయితే ప్రజలు రోజు వినియోగించే దుస్తువులను ధరించి ఉన్నారు అప్పుడు అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు “ఈ రోజు మీరు (ప్రజలు) గనక అవకాశం ఉండి ఉంటే రోజూ ధరించే దుస్తులు కాకుండా జుమా నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోండి” అని అన్నారు.(అబూ దావుద్)

ఈ హదీసు ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే జుమా నమాజ్ కొరకు అన్నిటికంటే అందమైన దుస్తులను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది.

4. జుమా నమాజ్ యొక్క అభిలషణీయమైన (ముస్తహబ్) కార్యాలలో ఒకటి మస్జిదును పరిమళింప చేయాలి.  ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా ఆజ్ఞాపించారు – “మీరు మధ్యాహ్నం వేళ జుమా రోజున మస్జిదె నబవిని సువాసనలతో పరిమళింప చేయండి”. (ముస్నద్)

5. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటి జుమా నమాజ్ కొరకు త్వరపడటం, మరియు కాలినడకన మస్జిదుకు వెళ్లడం. ఇది ఉత్తమమైన ఆచరణ.

ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త  ప్రవచనం, “జుమా రోజు స్నానం చేయించి, తాను కూడా స్నానం చేసి, ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్ కు వాహనంపై రాకుండా నడచి వచ్చి, ఇమాముకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా విని ఎటువంటి చెడుపని చేయకుండా ఉంటే, అతని ప్రతి అడుగుకు బదులు సంవత్సరమంతా ఉపవాసాలు మరియు రాత్రంతా ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి)

దైవప్రవక్త  ప్రవచనంలో గుసుల్ చేయించమని ఉంది, అనగా తన భార్యతో సంభోగించడం. దీని వివరణ అహ్మద్ గారు ఇలా తెలియజేశారు; మరియు ఇందులో ఉన్నటువంటి వివేకాత్మకమైన విషయాన్ని కూడా తెలియపరిచారు, సంభోగం వలన మనిషి మనసుకు ప్రశాంతత లభిస్తుంది  దాని వలన ఒక నమాజికి నమాజులో ఉపశమనం లభిస్తుంది.

మరొక వివరణ ఏమిటంటే తలను శుభ్రంగా కడగడం, తలంటి స్నానం చేయడం ఎందుకంటే మామూలుగా మనం తలకు నూనె రాస్తాము అందువలన గుసుల్ స్నానం చేసే ముందు తలను శుభ్రంగా కడగమని ఆజ్ఞాపించబడింది.

జుమా నమాజ్ కొరకు త్వరగా మస్జిద్ చేరుకోవడానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే శుక్రవారం రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందటానికి చేస్తున్నంత చక్కగా ‘గుస్ల్’ (స్నానం) చేసి జుమా నమాజ్ చేయటానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. అతని తర్వాత రెండవ వేళలో (ఆ విధంగా స్నానం చేసి) వెళ్ళే వ్యక్తి ఒక ఆవును బలి ఇచ్చినట్లుగా భావింపబడతాడు. ఆ తర్వాత మూడో వేళలో వెళ్ళే వాడికి కొమ్ములు తిరిగిన పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఇక నాల్గవ వేళలో వెళ్ళేవాడు ఒక కోడిని బలిచ్చినట్లుగా, ఐదవ వేళలో వెళ్ళేవాడు ఒక గ్రుడ్డును దానం చేసినట్లుగా పరిగణించ బడతాడు. ఆ తర్వాత ఇమామ్ (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయటం ఆపి) ఖుత్బా వినటానికి మస్జిద్లోకి వచ్చేస్తారు”.(బుఖారీ-ముస్లిం)

6. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో మరొకటి ఏమిటంటే; నమాజ్ కొరకు మస్జిద్ వైపు రావాలి మరియు ఇమామ్ మింబర్ పై ఎక్కక మునుపే నఫిల్ నమాజులు ఆచరించాలి. అది సూర్యుడు నడి నెత్తిపై నుండి వాలే సమయంలోనైనా సరే అనివార్యం (మక్రూహ్) కాదు దీని ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది, ఇప్పుడే మనం దాన్ని చదివి ఉన్నాము “అతని అదృష్టంలో ఎంత నమాజ్ అయితే ఉందో దాన్ని ఆచరించాలి” ఇది ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారి మాట మరియు ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్)గారు కూడా ఇలానే అన్నారు.

8. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటేమిటంటే ఖుత్బా సమయంలో మౌనంగా ఉండాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.” (బుఖారి- ముస్లిం)

9. జుమా నమాజు యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రెండు రకాతులలో సూర జుమా మరియు సూర మునాఫిఖూన్ లేక సూర ఆలా మరియు సూర గాషియా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ సూరాలను జుమా నమాజులో చదివేవారు. ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) గారు జుమా రోజున ఈ రెండు సూరాలు పఠించడం వెనుక ఉన్న వివేకాన్ని తెలియపరుస్తూ ఇలా అన్నారు; ఈ సూర జుమా నమాజ్ కొరకు  త్వరపడడానికి మరియు దాని కొరకు వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి మరియు అతి ఎక్కువగా అల్లాహ్ ను స్మరించడం యొక్క ఆదేశాన్ని కలిగి ఉంది, దీని వలన ప్రజలకు ఇహపరాల సాఫల్యం లభిస్తుంది మరియు అల్లాహ్ స్మరణను మరవడం ద్వారా ఇహపరాల జీవితం వినాశనానికి లోనవుతుంది, రెండవ రకాతులో మునాఫిఖూన్ పటించబడుతుంది దీనికి గల కారణం ఏమిటంటే ఉమ్మతును దీని వలన కలిగే వినాశనం నుంచి హెచ్చరించడానికి మరియు ప్రజల యొక్క సిరిసంపదలు వారిని జుమా ఆరాధన నుంచి ఏమరపాటుకు లోను కాకుండా చేయడానికి ఒకవేళ ప్రజలు అలా చేస్తే వారు తప్పకుండా నష్టానికి లోనవుతారు. మరియు అదే విధంగా ఈ సురా పఠించడానికి గల కారణం ప్రజలను దానధర్మాలు చేయడం కొరకు ప్రేరేపించడం, మరియు అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ మరణం గురించి అవగాహన కలుగచేయడం, ఆ మరణ సమయంలో ప్రజలు కొంత సమయం కావాలని కోరుకుంటారు కానీ వారి ఆ కోరిక అస్సలు నెరవేరదు.

10. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒకటి ఏమిటంటే ఎవరైతే దీనిని విడిచిపెడతారో వారి కొరకు హెచ్చరిక ఉంది. అబూ జాద్ జమ్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా మామూలుగా భావించి మూడు జుమా నమాజులను విడిచిపెడతాడో అల్లాహ్ అతని హృదయంపై (మొహర్) సీలు వేస్తాడు.” (అహ్మద్)

11. జుమా నమాజ్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైతే ప్రజల మెడలపై నుండి గెంతుతారో మరియు అనవసరమైన కార్యాలకు పాల్పడతారో వారు ఘోరంగా నష్టానికి లోనవుతారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఎవరైతే వ్యర్ధమైన పనికి పాల్పడ్డారో లేక ప్రజల మెడలపై నుంచి గెంతారో అలాంటి వారికి జుమా పుణ్యఫలం లభించదు వారికి జుహర్ నమాజ్ పుణ్యం మాత్రమే లభిస్తుంది”.(అబూ దావుద్)

కావున ఎవరైతే జుమా నమాజుకి వస్తారో  వారు దాని గొప్పదనాన్ని తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క గొప్ప సూచనల లోనిది, ఇమామ్ ప్రసంగించేటప్పుడు మనిషి తన అవయవాల పట్ల జాగ్రత్త వహించాలి, అనవసరంగా కుదపరాదు అనగా రాళ్లతో పుల్లలతో ఆడుకోవడం లేక నేలపై గీతలు గీయడం లేక మిస్వాక్ చేయడం ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.  ఇది జుమా యొక్క మర్యాదలలో ఒకటి మరియు అదే విధంగా మౌనం వహించడం కూడా జుమాయొక్క మర్యాదలలోనిదే. ఇలా చేయకుంటే జుమాయొక్క పుణ్య ఫలం లో కొరత ఏర్పడుతుంది లేక పూర్తి పుణ్యఫలాన్ని కోల్పోయిన వారమవుతాం మరియు  జుమా జుహర్ గా మారుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “మీరు ప్రసంగ సమయంలో మీ తోటి వ్యక్తితో నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడం కూడా వ్యర్థ మైన పనికి పాల్పడినట్లే”.

12. జుమా నమాజ్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే జుమా నమాజు తర్వాత నాలుగు రకాతులు నమాజ్ చదవడం (ముస్తహబ్) అనగా అభిలషణీయం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే జుమా నమాజు చదువుతాడో అతను దాని తర్వాత నాలుగు రకాతుల నఫిల్ నమాజ్ చదవాలి.”(ముస్లిం)

13. జుమా నమాజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియచేశారు; జుమా నమాజుకు ఇతర నమాజుల కంటే గొప్ప ప్రత్యేకత ఉంది, అదేమిటంటే ఇందులో ప్రజలు ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో సమావేశం అవుతారు, ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది, ఆ సమయంలో ఖురాన్ పారాయణం బిగ్గరగా చేయరాదు, ఇలాంటి ఎన్నో షరతులు ఇందులో ఉన్నాయి. (జాదుల్ మఆద్)

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి జుమా నమాజుకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే ఇతర నమాజుల కంటే ఈ జుమా నమాజ్ కు ప్రాముఖ్యత లభించింది, మరియు అల్లాహ్ దగ్గర ఇది గొప్ప ప్రాధాన్యత కలది, కనుక మనం తప్పకుండా వీటిపై ఆచరించాలి, మరియు ఈ ఆచరణకై అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుతూ ఉండాలి, మరియు అల్లాహ్ తో ఈ ఆచరణల పుణ్యఫలాన్ని ఆశించాలి.

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

రెండవ ఖుత్బా

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు. అల్లాహ్ ఇలా అన్నాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు.ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి: ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్