కహానహ్ (జ్యోతిష్యం) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

అంశము : ఇస్లాం నుంచి బహిష్కరించే ఏడవ  విషయము: కహానహ్ (జ్యోతిష్యం)

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత

అల్లాహ్ దాసులారా! ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయన భీతి కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి,  అవిధేయతకు పాల్పడకండి. గుర్తుంచుకోండి!  తౌహీద్లో భాగమైన ఓ విషయం ఏమిటంటే: నామాలలో గుణగణాలలో అల్లాహ్ ను ఏకంగా భావించటం. అందులో అగోచర జ్ఞానం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన గుణం,  అది అల్లాహ్ కు  అంకితం అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మరియు ఈ ఉమ్మత్ యొక్క ఉలమాలు అందరూ ఏకీభవించి ఉన్న స్పష్టమైన విషయం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చెప్పు. (సూరా అన్ నమ్ల్ 27 : 65)

ఓ హాదీస్ లో ఖాలిద్ బిన్ జక్వాన్ వారు రబీ బింతే ముఅవ్వీజ్ తో ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బాలికను ఈ విధంగా గీతం పాడుతుండగా విన్నారు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు“. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  “ఆ విషయాన్ని విడిచి మిగతాది పాడండి” అని వారించారు మరియు రేపు ఏం జరగనున్నది అనేది అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియదు అని బోధించారు. (ఇబ్ను మాజహ్, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు).

ఇబ్నె ఉమర్ వారి ఉల్లేఖనము: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: అగోచరజ్ఞానం ఖజానా కు ఐదు తాళం చెవులు ఉన్నాయి , దాని జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి లేదు, అందులో :  (1) రేపు ఏం జరగనున్నదో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు, (2) మాతృ గర్భాలలో  ఏముందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు (*), (3) వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు, (4) ఎవరు ఏ గడ్డపై మరణిస్తారో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు మరియు (5) ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు. (సహీ బుఖారి).

తెలిసిన విషయమేమిటంటే అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితము. ఇది అల్లాహ్ యొక్క గుణము.  ఇందులో ఎవరు కూడా ఆయనకి సాటిలేరు,  వాళ్ళు అల్లాహ్ సమీపంలో ఉన్న దైవదూతులైనా కావచ్చు, పంపించబడ్డ ప్రవక్తలైనా కావచ్చు. కనుక ఎవరైతే తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రకటిస్తాడో అతను అల్లాహ్ కి ప్రత్యేకమైన గుణంలో అల్లాహ్ దాసులను భాగ్యస్వామ్యం చేసినట్టు. దాసుడ్ని అల్లాహ్ కు సమానము చేశాడు, మరియు ఘోరాతి ఘోరమైన పాపానికి (షిర్క్ ఎ అక్బర్) కి పాల్పడ్డాడు. తమ కాలానికి  ఇమామ్ అయిన ఇమామ్ అహ్లుస్ సున్నహ్: నుఐమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ వారు అన్నారు: “ఎవరైతే సృష్టికర్తను సృష్టిరాశులతో  సమానం చేశాడో అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్టు.”

అల్లాహ్ దాసులారా! ప్రజలలో కొందరు అగోచర జ్ఞాన విషయంలో అల్లాహ్ కు సాటిగా సమానులని ప్రకటిస్తున్నారు. అల్లాహ్ కు ఈ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు “కాహిన్” మరియు “అర్రాఫ్ “. కాహిన్ అంటే: భవిష్య జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రచారం చేసుకునేవాడు, జ్యోతిష్యుడు. అర్రాఫ్ ( షోబదబాజ్) అంటే ఇందులో జ్యోతిష్యుడు, గుప్త విద్య కలిగిన వాడు, చేతబడి చేసేవాడు  అనే అన్ని అర్ధాలు వస్తాయి. అరబీ భాషలో ఇతన్ని “అర్రాఫ్” అంటారు.

షేక్ సాలేహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) అన్నారు: కాహిన్ అనే పదానికి అర్ధం “అంచనా” ఆధారం లేని విషయాల ద్వారా వాస్తవాలు సేకరించడం. ఆజ్ఞాన కాలంలో ఎవరి వద్దకు అయితే షైతానులు వచ్చేవో వాళ్ళు ఇదే పని చేసేవారు, షైతానులు ఆకాశం నుంచి సమాచారాలను అందించే వారు. ఈ జ్యోతిష్యులు షైతానులు నుంచి అందిన సమాచారంతో స్వంత మాటలు కలిపి ప్రజలకు చెప్పేవారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ప్రజలు వీళ్ళకు దగ్గరై ప్రతీ సమస్యకు పరిష్కారం కొరకు వీళ్ళని ఆశ్రయించే  వారు మరియు భవిష్యవాణులు తెలుసుకునే వారు.  అందుకే మనం (సాలేహ్ అల్ఉసైమీన్ వారు) అంటున్నాం,  కాహిన్ అంటే: భవిష్యత్తులో జరిగే అగోచార  విషయాల్ని తెలియజేసేవాడు .(ఇలా ప్రజల్లో ప్రచారం వుంది)

ఓ విశ్వాసులారా! జ్యోతిష్యుడు అగోచర జ్ఞానం నిరూపించడానికి రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు,

మొదటిది: దైవదూతల నుంచి సమాచారాన్ని దొంగలిచే షైతాన్ మాటలు వినటం. దీని ఆధారం సహీ బుఖారిలో ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం:

దైవ దూతలు ఆకాశం మబ్బుల్లో వస్తారు మరియు అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు. అక్కడున్న షైతాన్లు రహస్యంగా ఆ మాటలను దైవదూతల నుంచి విని, ఈ చేతబడి చేసే వాళ్ళు,  జ్యోతిష్యాలు చెప్పే వాళ్లకు తెలియజేస్తారు. వాళ్ళు ఆ  విన్న మాటల్లో తమ తరఫునుంచి అబద్ధాలు కలిపి, తమ వద్దకు వచ్చే ప్రజలకు చెప్తారు. (బుఖారి)

అల్లాహ్ దాసులారా! తెలిసిన విషయం ఏంటంటే: జ్యోతిష్యులు ప్రజలకు అబద్ధమైన విషయాలను చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంలో ఏదైనా సత్యం ఉంటే, అది షైతాన్ దొంగిలించిన మాటల్లో నుంచి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెప్పే అగోచర జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రజలు వాళ్ళ చెప్పే విషయాల్లో ఆ ఒక్క సత్యమైన మాట వల్ల వాళ్ళ వలలో చిక్కుకుంటారు. మరియు అందులో కలిసి ఉన్న అబద్ధమైన విషయాలను పట్టించుకోరు.  మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే పూర్తి విషయాలు అబద్ధం అయినప్పటికీ దాన్ని సత్యమే అని భావిస్తారు. (ఇది మొదటి మార్గం)

రెండవ మార్గం: జిన్నులను ఆశ్రయించటం. ఆ జిన్  ప్రతి మానవుడుతో పాటే ఉండేవాడైనా కావచ్చు లేదా వేరే వాడైనా. ఇది ఎలా అంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నిమిత్తమై ఉంటాడు. అతను ఆ మానవుడికి చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు, కనుక ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం లో ఈ విధంగా ఉంది: కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కాహిన్ మరియు  జ్యోతిష్యులు గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు “అది పెద్ద విషయం కాదు”  దానికి వారు ఇలా అడిగారు ” ప్రవక్త కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి కదా”  అంటే దానికి జవాబుగా ప్రవక్త వారు ఇలా అన్నారు ” వాళ్లు చెప్పే మాటల్లో ఏదైతే నిజం అవుతాయో అవి దైవదూతల నుంచి  దొంగలిస్తారు , దానిని ఈ జ్యోతిష్యులు, కాహిన్ లకు  చెవిలో కోడికూత మాదిరిగా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ ఒక్క మాటలో  వంద  అబద్ధాలు కలిపి చెప్తారు. ( బుఖారి, ముస్లిం)

కాహిన్ లకు మానవులతో పాటు ఉండే జిన్నాతులకు సంబంధం ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఆధారం, ఎందుకంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నియమిత ఉంటాడు. అతను మానవుడికి చెడు వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈ జిన్ ఆ వ్యక్తి యొక్క ప్రతి రహస్యాన్ని ఎరిగి ఉంటాడు, ఏదైతే ఇతర ప్రజలకు తెలియవో. ఉదాహరణకు: ఒక వ్యక్తి యొక్క ఏదో ఒక వస్తువు తప్పిపోతే ఆ వ్యక్తితో పాటు ఉండే జిన్ కి ఆ ప్రదేశము తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ వ్యక్తితోనే ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కాహిన్ ను సంప్రదిస్తే ఆ  తప్పిపోయిన వస్తువు గురించి ప్రశ్నిస్తే ఆ జిన్ ఆ కాహిన్ కి ఆ వస్తువు ఒక ప్రదేశం గురించి తెలియజేస్తాడు. తర్వాత కాహిన్ ఆ ఒక్క మాటతో 100 అబద్ధాలు కలిపి ఆ వ్యక్తికి ఆ  ప్రదేశము తెలియజేస్తాడు. చివరికి ఆ వ్యక్తి పోగొట్టుకున్న వస్తువుని పొందిన తర్వాత ఆ కాహిన్ చెప్పిన ప్రతి మాట నిజమే అని భావిస్తాడు,  మరియు అతను అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్ముతాడు. వాస్తవానికి ఆ కాహిన్ ఆ జిన్ను నుంచి విన్న విషయాన్ని అతనికి చెప్పి ఉంటాడు, ఉదాహరణకు: ఒక వ్యక్తి తన భార్యతో చెప్పుకున్న విషయాలు, వాళ్ల తల్లి పేరు, ఊరు పేరు, ఇంటి అడ్రస్సు,  వాళ్ళు చేసే పని,  ఇంకా ఆ జిన్ కి , ఆ వ్యక్తికి సంబంధించి తెలిసిన విషయాలన్నీ కూడా మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! కాహిన్ ఏ షైతాన్ని అయితే సంప్రదిస్తాడో అతను షైతాన్ నుంచి సేవలు తీసుకుంటాడు. దానికి బదులు ఆ కాహిన్ అతన్ని ఆరాధిస్తాడు. షైతాన్ లక్ష్యం కూడా ఇదే. షైతాన్ పూర్తి ఆదం సంతతిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికి లక్ష్యం చేసుకున్నాడు. ఇంకా ఇదే అతని పని మరియు ఇదే అతని సందేశము. అతని వలలో జ్యోతిష్యులు,  చేతబడి చేసే వాళ్ళు  కాహిన్ అందరూ చిక్కుకుంటారు,  వీళ్ళు మానవుల్లో ఉన్న షైతానులు అయితే అతను జిన్నాతుల నుంచి షైతాన్.  ఈ షైతాన్లు అందరు కలిసి మానవాళిని అపమార్గం పట్టిస్తారు.  (అల్లాహ్ మనందరినీ ఈ షైతాన్లు నుంచి కాపాడుగాక)

అల్లాహ్ దాసులారా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే షరియత్ లో చెప్పిన రుఖ్యా ద్వారా వ్యాధులను నిర్మూలిస్తారో వాళ్లకు ఆ కాహిన్ చేసే నాటకాలు తెలిసికొని ఉంటారు. వాళ్ళల్లో ఒక్కరు చెప్పిన విషయం ఏమిటంటే: మీరు కాహిన్ రహస్యాన్ని ఛేదించడం అనుకుంటున్నారు అయితే: “మీకు కూడా తెలియని ఒక విషయము ఆ కాహిన్ ని అడగండి, ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  కనుక ఆ కాహిన్ కి కూడా తెలియకుండా పోతుంది. ఉదాహరణకు నేలపై నుంచి కొన్ని కంకర రాళ్లు తీసుకోండి, మీ పిడికిలను మూసేసి, తర్వాత కాహిన్ను ప్రశ్నించండి,  నా చేతిలో ఎన్ని రాళ్లు ఉన్నాయని, అతను దానికి సమాధానం ఇవ్వలేడు, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే ఈ విషయము, ఈ సమాధానము మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  అలాంటప్పుడు ఆ కాహిన్ ఏం సమాధానం ఇస్తాడు? .

సారాంశం ఏమిటంటే: కాహిన్ తమ అన్ని వ్యవహారాలలో జిన్నాతులను ఆశ్రయిస్తాడు,సహాయం తీసుకుంటాడు. అన్ని సంఘటనలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి షైతాన్ ను ఆశ్రయిస్తాడు. షైతాన్ ఆ కాహిన్ చెవిలో కొన్ని విషయాలు ఊదుతాడు,  దానినీ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు కలిపి  ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ చెప్పిన మాట నిజమైతే ప్రజలు ఆ కాహిన్ ని అగోచర జ్ఞాని అనుకుంటారు,  ఇలా అతని వలలో చిక్కుకుంటారు. ప్రజలు అజ్ఞానంలో దాన్ని మహిమలు (కరామాత్) అనుకొని వీళ్ళు ఔలియా అల్లాహ్ (అల్లాహ్ స్నేహితులు) అనుకుంటున్నారు.  వాస్తవానికి వాళ్ళు ఔలియా ఉష్ షైతాన్ (షైతాన్ స్నేహితులు), ఎలాగైతే అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరతుష్ షుఅరా లో  ఇలా తెలియజేశారు:

(هَلْ أُنَبِّئُكُمْ عَلَى مَنْ تَنـزلُ الشَّيَاطِين * تَنـزلُ عَلَى كُلِّ أَفَّاكٍ أَثِيم * يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُون).

(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్దాలకోరు, పాపాత్ములైన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటలు చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే (26: 221,-226)

తౌహీద్ ప్రజలారా: నుజూమి కూడా అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రకటిస్తాడు. నుజూమి అంటే: నక్షత్రాలను చూసి భవిష్యతులొ సంభవించే సంఘటనాల జ్ఞానాన్ని సేకరించేవాడు. ఉదాహరణకు: గాలి వీచే సమయము , వర్షం కురిసే సమయం, చలికాలం, వేసవి కాలము మరియు ధరలు మారే జ్ఞానము. వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే : ఆకాశంలో నక్షత్రాలు తిరిగే , కలిసే సమయాల్లో దానిని చూసి వీళ్ళు ఈ విషయాలు తెలియజేస్తారు. మరియు నక్షత్రాలు భూమండలంపై ప్రభావితమై ఉంటాయి అంటారు,  దీనిని “ఇల్మె తాసీర్”  అంటారు , మరియు దీని గురించి ప్రచారం  చేసుకునే వాడ్ని ‘జ్యోతిషి” అని అంటారు. వాళ్లు నక్షత్రాలను చూసి, వాళ్లతో మాట్లాడేటప్పుడు షైతాన్ వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చిత్ర రూపంలో చూపిస్తాడు, దాని ద్వారా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. (ఇవన్నీ వ్యర్థమైన విషయాలు)

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ లో ఓ భాగం: ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు అబ్జద్ అక్షరాల (అరబీ ఆల్ఫాబెట్స్) ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలియజేయడం కూడా ఉంది, ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు చెప్పిన మాటకు ఇదే అర్థము: ఒక జాతి వారు అబూజాద్  (అరబీ ఆల్ఫాబెట్స్) లను ఉపయోగించి , నక్షత్రాలను చూసి ఇలా భవిష్యవాణిలను చెప్పేవాళ్లు  నా ఉద్దేశ ప్రకారం వాళ్లు పరలోకంలో ఏం భాగాన్ని పొందలేరు. (ఏ ప్రతిఫలం దక్కడు) .

( దీనినీ అబ్దూర్రజ్జాక్ వారు ముసన్నఫ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు , ఇమామ్ బైహకిఖీ వారు కూడా పేర్కొన్నారు)

ఇల్మే నుజూమ్ లోని ప్రదర్శనలో ఇంకో భాగం జ్యోతిష్య శాస్త్రవేత్తలు (Astrologers), వీళ్ళు మానవ భవిష్యత్తులో సంభవించే విషయాలను తెలుసుకున్నారని మరియు దానిని వార్తల్లో , మ్యాగజైన్స్ లోప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాదన ఏమిటంటే : ఎవరైతే  బిర్జ అక్రబ్ నక్షత్రము  మెరిసే సమయంలో  పుడతాడో , జన్మించాడో, అతని తలరాత మంచిది కాదని మరి ఎవరైతే “బిర్జ్ మిజాన్” నక్షత్రము మెరిసే సమయంలో జన్మిస్తాడో వాడు మంచి అదృష్టం గలవాడు అని భావించడం మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ కూడా చేతబడి కిందే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్య సమానమైన విషయం ఏమిటంటే : షైతాన్  నుండి సంప్రదింపులు,  సంబంధాలు, దాని ఆధారము ఇబ్నె అబ్బాస్ వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఇల్మే నుజూమ్ నేర్చుకున్నాడో అతను చేతబడిలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్టే , కనుక ఆ భాగాన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. (సహీ ముస్లిం)

ఇల్మే నుజూమ్ ను ఇల్మే తాసీర్ అంటారు. అంటే: నక్షత్రాల ప్రసరణ వలన (నక్షత్రాలు తిరగటం వలన)  దాని ప్రభావం భూమండలంపై  పడుతుంది. అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అతను జాదులో (చేతబడిలో) ఒక భాగాన్ని నేర్చుకున్నాడు” కు అతను చేతబడిలోని ఒక రకానికి గురయ్యాడు అని అర్థం. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అందులో ఎవరైతే తమ భాగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో  పెంచుకోండి” అంటే అర్థము ఎవరైతే  ఖగోళ జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని నేర్చుకుంటాడో అతను అదే విధంగా చేతబడి విద్యను నేర్చుకున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు.

అల్లాహ్ దాసులారా!  ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచి శకునము తీసుకునే ఆజ్ఞ ఇస్తుంది. మరియు మానవుడికి చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అంటే: అందులో ఇహ పరలోకాలా సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. షిర్క్, బహు దైవారాధన, పాపాలు, మోసాలు,  అబద్ధాల ను నివారిస్తుంది . అందుకే ఇస్లాం షైతాన్ చేష్టలను, మార్గాలను ముందు నుంచే ఆరికట్టింది. కనుక కాహిన్ల వద్దకు వెళ్లటాన్ని నిషేధం చేసింది.  మరియు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ వద్దకు వెళ్లే వాళ్ళ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఆ  కాహిన్ల వద్దకు ప్రశ్నించడానికి వెళ్లినా సరే. ఇమామ్ ముస్లిం వారు ప్రవక్త గారి సతీమణి సఫీయహ్ (రదియల్లాహు అన్హా) వారితో ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు అన్నారు: ఏ వ్యక్తి అయితే అగోచారవిషయాలను చెప్పేవాడి (జ్యోతిష్యుడు) వద్దకు వెళ్లి అతన్ని ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, లేదా అతను చెప్పిన మాటను నమ్మినా నలభై (40) రోజుల వరకు అతను చేసిన నమాజులు స్వీకరించబడవు (ఆమోదకరమైనవి కావు). (సహీ ముస్లిం)

ఏ వ్యక్తి అయితే జ్యోతిష్యుల వద్ద కాహిన్ వద్ద వెళ్లి అతన్ని ఏదైనా విషయంలో ప్రశ్నించాడు,  కానీ దానికి ఇవ్వబడిన సమాధానాన్ని  నమ్మలేదు, అలాంటి వ్యక్తి యొక్క 40 రోజులు నమాజు స్వీకరించబడవు అనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి కాఫిర్ అవ్వడు (ఎందుకంటే ఇవ్వబడిన సమాధాన్ని స్వీకరించలేదు ‘నమ్మలేదు’ కాబట్టి). అందువల్ల అతను ఇస్లాం నుంచి బహిష్కరించబడడు.

కానీ! ఏ వ్యక్తి అయితే ఆ కాహిన్ వద్దకు వెళ్లి ఏ విషయంలోనైనా అతన్ని ప్రశ్నించి మరియు అతను ఇచ్చిన సమాధానాన్ని సత్యమని నమ్మితే అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరించబడినట్టే. ఎందుకంటే అతను ఏదో ఒక విషయాన్ని నమ్మిన తర్వాతే  కాహిన్ అగోచర జ్ఞాని అని  విశ్వసించినట్టవుతుంది.  మరియు  అల్లాహ్ కు అంకితమైన ఈ అగోచర జ్ఞానం విషయంలో ఆ కాహిన్ ను సాటి నిలబెట్టినట్టే అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఖుర్ఆన్ లో ఇవ్వబడ్డ విషయాలను తిరస్కరించినట్టు. మరియు కుఫ్ర్ కి పాల్పడినట్లు అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు : “ఏ వ్యక్తి అయితే కాహిన్  వద్దకు వెళ్లి , అతను చెప్పిన సమాచారాన్ని సత్యమని విశ్వసిస్తే అతను ప్రవక్త పై అవతరించబడ్డ ధర్మాన్ని (షరియత్) ను తిరస్కరించినట్టే“. (మస్నద్ అహ్మద్)

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చేప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను)

అల్లాహ్ దాసులారా! ఈ కాహిన్,  జ్యోతిష్యుల  కార్యకలాపాలు సూఫీల వద్దనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురువులు  కాహిన్లు లేదా అర్రాఫ్ (జ్యోతిష్యులు) అయి ఉన్నారు. వాళ్ళ గురువులు, విలాయత్ పొంది ఉన్నారు (వలి అని) కరమాత్ (మహిమలు) తెలుసు అని ప్రకటిస్తూ ఉంటారు. మరియు అగోచర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు మత్రమే విలాయాత్ మరియు కరామాత్ చేస్తారు అనీ వాళ్ళ నమ్మకం, దాన్ని వాళ్ళు  కష్ఫ్  (నేరుగా అల్లాహ్ తో మాట్లాడటం)  అనే పేరు పెట్టారు, (ఒకవేళ వాళ్ళు దీనికి  అగోచర జ్ఞానం అని పేరు పెడితే ప్రజల ముందు అవమాన పాలవుతారని ఈ విధంగా  పేర్లు మార్చారు )

అల్లాహ్ దాసులారా! కహానత్ నిషేధము అని మరియు కాయిన్ల వద్దకు వెళ్ళటము అవిశ్వాసము అని స్పష్టం చేయడానికి ఇది చాలా లాభకరమైన విషయ సూచిక. కాహిన్ జ్యోతిష్యము చేసినా, చేయించినా, ఈ విద్యను  నేర్చుకున్న లేదా మనసులో దానికి సంబంధించి ఇష్టం కలిగి ఉన్న సరే ఇవన్నీ అవిశ్వాస పూరితమైన ఆచరణ.

అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో,  ఆశీర్వాదాలతో దీవించును గాక. అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి. సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి.  కాహిన్ ల చేష్టలలో “తరక్” అనేది కూడా ఒక భాగమే. దాని ద్వారా అరబ్ వాళ్లు అగోచర జ్ఞానాన్ని ఆర్జిస్తారన్న సంతోషంలో, భ్రమలో ఉండేవారు. తరక్ అంటే “నడవటం”. వాళ్లు నేలపై కొన్ని గీతలు గీస్తారు,  ఆ గీత ద్వారా వాళ్ళు నడిచినట్టు భావించి, ఆ గీత ద్వారా అగోచర జ్ఞానం తెలిసింది అని వ్యక్తం చేస్తారు.

రమాల్ అనేది కూడా జ్యోతిష్యంలో పరిగణించడం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా అంటే: ఓ వ్యక్తి తమ చేతులారా ఇసుకపై కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా ఆ గోచర జ్ఞానం ప్రకటిస్తాడు.

కహానత్ లో (జ్యోతిష్యంలో) రాళ్లతో కొట్టడం కూడా ఒక భాగమే, ఇది ఎలా అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఏదో ఒక సంఘటన గురించి ప్రశ్నిస్తే ఈ జ్యోతిష్యుడు తమ వద్ద ఉన్న ఆ చిన్న చిన్న కంకర రాళ్ళను తీసి ఆ రాళ్ల పై కొట్టి దాని ద్వారా ఆ వ్యక్తి అడిగిన సమస్యకు పరిష్కారం సమాధానం తెలుసుకుంటాడు.

కహానత్ లో ఫింజాన్ (కప్పు, Cup) చదవటము కూడా భాగమే, ఇది ఎలా అంటే:  వ్యక్తి కప్పులో కాఫీ తాగిన తర్వాత మిగిలిన దానిపై ఆ మాంత్రికుడు తమ దృష్టిని కేంద్రీకరిస్తాడు , దాని చుట్టుపక్కల కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా అగోచర జ్ఞానం కలిగిందని,  వచ్చిన వాళ్లకు సమస్యలకు పరిష్కారం చెప్పటము ఇలా చేస్తా ఉంటారు,

ఈ కహానత్ లో చేతి రేఖలను చదివి చెప్పటం కూడా భాగ్యమే , అది ఎలా అంటే : జ్యోతిష్యుడు కాహిన్లు చేతి రేఖలను:  అడ్డంగా నిలువుగా కలిసి ఉన్నరేఖలను చూసి ప్రజలకు ఇలా ఇలా జరగనున్నది అని చెప్తారు.

ఇక కహానత్లో “అయాఫా” (పక్షుల ద్వారా శకునం తీయడం)  కూడా భాగమే దాని పద్ధతి ఏమిటంటే: పక్షులను గాలిలో వదిలి అవి ఒకవేళ కుడివైపు ఎగిరితే మంచి శకునం లేదా ఎడమవైపు ఎగిరితే చెడు జరుగుతుంది అని శకునాలను తీస్తారు. ఖచ్చితంగా అయాఫా కూడా అధర్మమైన పద్ధతే. ఎందుకంటే పక్షులు అల్లాహ్ యొక్క సృష్టితాలు. వాటిలో మేలు గాని చెడు గాని చేసే శక్తి ఉండదు. అల్లాహ్ యే వాళ్ల పోషకుడు, పాలకుడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:

 أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (సూరా అన్ నహ్ల్ 16: 79)

ఇంకా ఈ విధంగా అన్నారు:

أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ

ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. (సూరా అత్ తహ్రీం 67 : 19)

ఈ కహానత్ (జ్యోతిష్యం) లో శకునం కూడా భాగమే. అవి కంటికి కనిపించేవే అయినా సరే, లేదా వినేటటువంటి నుంచి అయినా సరే. అంటే పావురాలను ఎగిరిపించి శకునాలు తీయటము లేదా ఇంటిపై కూర్చున్న గుడ్లగూబను చూసి శకునము తీయటము, లేదా పదమూడవ (13వ) అంకె నుంచి, మెల్లకన్ను ,కాళ్లు లేనివాడు నుంచి శకునము తీయటము, ఉదాహరణకు: “మెల్లకన్ను కలిగి ఉన్న వ్యక్తిని చూసి ఇలా అనటం “ఈరోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది, మంచి జరగదు”. కనుక అతను వ్యాపారం మూసేసి,  ఆరోజు మొత్తం కొనటము అమ్మటముగాని చేయకుండా ఉండటము, బహుశా అతనికి ఆరోజు చెడు, కీడు జరుగుతుంది అని, ఆపద విరుచుకు పడుతుందని తెలిసిపోయినట్టు. ఇంకా ఒక వ్యక్తి కుడి చేయి అరచేతిలో దురద పుట్టితే అలా జరుగుతుందని లేదా ఎడమ చేయి అరిచేతిలో దురద పుడితే ఇలా జరుగుతుందని భావించటం ఇంకా మొదలైనవి. వీటన్నిటిలో ఏ ఒక్కటి లో కూడా అల్లాహ్ చెడును, హానిని పెట్టలేదు. కానీ ప్రజలు వాటి నుంచి శకునాలను తీస్తున్నారు, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజులను కీడులా భావించుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే:  ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని, అల్లాహ్ కు తెలిసిన అగోచర విషయంలో అల్లాహ్ కు సాటిగా నిలిచాడు. దీని కొరకు వాళ్ళు అసమర్థమైన విషయాలను కారణాలుగా చేస్తున్నారు.

శకునం తీయడం అనేది హారాం, ఇంకా షిర్క్ కూడా. దీనికి ఆధారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా వివరించారు: “ఎవరి శకునము అతనికి తమ అవసరాలను తీర్చకుండా ఆపేసిందో అతను షిర్క్ చేసినట్టు,  దానికి సహాబాలు అడిగారు “దానికి పరిహారం ఏమిటి “? దానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

( اللهم لا خير إلا خيرك، ولا طير إلا طيرك، ولا إلـٰه غيرك )

ఓ అల్లాహ్ నువ్వు ప్రసాదించిన మేలు కన్నా మరో మేలు ఏదీ లేదు, నువ్వు నియమించిన శకునము కన్నా మరో శకునము లేదు,  మరియు నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు (అహ్మద్)

శకునం హరాం అనడానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) గారి ఈ హదీస్ కూడా మనకు ఆధారం : వ్యాధి తనంతట తానే  వ్యాపించడం, శకునం తీయటము, మరియు గుడ్లగూబ వల్ల కీడు, సఫర్ మాసం వల్ల శకునం ఇలాంటివి ఏమీ లేవు (అన్ని వ్యర్ధ మాటలే) ( బుఖారి)

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) మాట “శకునం లేదు”- దీనివల్ల శకునాలు ఏమీ లేవు  అన్న మాట పూర్తిగా స్పష్టమవుతుంది.

సారాంశము ఏమిటంటే : కహానత్ “జ్యోతిష్యం”లో చాలా రకాలు ఉన్నాయి,  కానీ అన్ని రకాలలో సమాంరతమైన విషయము ఏమిటంటే అది “అగోచర జ్ఞానం ప్రకటన“. పద్ధతులు వేరేగా ఉంటాయి, అందులో కొన్ని షైతానులతో సంబంధం ఉంటుంది,  మరికొందరు కేవలం ఉట్టిగా ప్రకటనలు చేస్తారు, దాని ద్వారా ప్రజలను మోసం చేస్తారు, తమ వలలో పడేసుకుంటారు. అల్లాహ్ మనందరినీ వీళ్ళ నుంచి కాపాడుగాక.

ముగింపు ప్రసంగం :

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

 ( إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما )

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌  పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి. – (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మన హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మాకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మాకు తెలిసిన తెలియకపోయినా. ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని గురుంచి,  ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.

ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.

اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

జాదు (చేతబడి) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

[డౌన్లోడ్ తెలుగు PDF] – [డౌన్లోడ్ అరబిక్ PDF]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

అల్లాహ్ దాసులారా!  చేతబడి అంటే తాయత్తులపై, ముడులపై, మందులపై మంత్రాలు చదివి ఊదటం. దాని ద్వారా శరీరాలు, హృదయాలు ప్రభావితమవుతాయి. దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు, లేదా మనిషి ఆలోచనలను, ఊహలను ప్రభావితం చేస్తుంది, లేదా భార్య భర్తలను వేరు చేయటము లేదా కలిసి వ్యాపారం చేస్తున్న ఇద్దరు స్నేహితులను వేరు చేయటము జరుగుతుంది. (అల్ ముగ్ని కితాబుల్ ముర్తద్)

అల్లాహ్ దాసులారా! చేతబడిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి: హఖీఖి (వాస్తవమైనది). రెండవది: తఖయ్యులాతి (ఊహలు మరియు అంచనాలు).

హాఖీఖిలో మూడు రకాలు ఉన్నాయి: 

మొదటిది శరీరం పై ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు. 

రెండవ రకములో  మానవ హృదయం పై ప్రేమ లేదా ద్వేషము ద్వారా  ప్రభావం చూపిస్తుంది, ఉదాహరణకు: భార్యను ద్వేషిస్తున్న భర్త మనసులో భార్య ప్రేమను సృష్టించడం, లేదా దానికి విరుద్ధము. దీని వల్లనే భర్త భార్యకు లేదా భార్య భర్తకు అందంగా కనిపించడం జరుగుతుంది (దీనినీ అరబిలో “అత్ ఫ్ ” అనే పేరుతో గుర్తిస్తారు) లేదా ప్రేమిస్తున్న భార్యకు భర్త దృష్టిలో శత్రువు లాగా చూపిస్తారు, దీని వల్ల భార్య భర్తకు, భర్త భార్యకు శత్రువు లాగా కనిపిస్తూ ఉంటారు (దీనినీ అరబీలో “సర్ ఫ్” అంటారు).

మూడో రకం ద్వారా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు: నేను ఆ పని చేశాను, వాస్తవానికి ఆ పని అతను చేసి ఉండడు.  ఈ చేతబడి యొక్క ఉదాహరణ: లబీద్ బిన్ ఆసిం అనే యూదుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి చేతబడి చేసాడు. దాని వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) వారు ఏదైనా పని చేశారని అనుకునేవారు కానీ వాస్తవానికి ఆ పని చేసి ఉండరు. ఈ విధంగా ఎన్నో నెలల వరకు ప్రవక్త వారిపై ఆ చేతబడి ప్రభావం ఉండేది (ఈ సంఘటన బుఖారి, ముస్లిమ్లలో వివరించబడినది)

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు  మంత్రాల ద్వారా షైతాన్ నుండి సహయం తీసుకుంటాడు, అది ఎలా అంటే: మాంత్రికుడు అతి చెడ్డదైన మురికి  పరిస్థితిలో చేరి ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాడు,  దీని కోసం అతను చెడ్డ జిన్నాతులను ఆశ్రయిస్తాడు, మరి కొన్ని ముడులను మంత్రించి  దానిపై ఊదుతాడు,  (దీనిని అరబీ భాషలో నఫస్ అంటారు) దీని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَد
(మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి (113: 04) 

ఊదేవాళ్లు అంటే: చెడు జిన్నాత్తులు. వారు ముడులపై ఊదుతారు ఎందుకంటే చేతబడి యొక్క ప్రభావము జిన్నాతులు ఊదటం ద్వారానే అవుతుంది. కనుక వాళ్ళ శరీరాల నుంచి ఒక రకమైన ఊపిరి విడుదలవుతుంది, అందులో వాళ్ల ఉమ్మి కలిసి ఉంటుంది, దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి కీడు, హాని జరుగుతూ ఉంటుంది. ఈ జిన్నాతుల, షైతాన్ల ద్వారా ఎదుటి వ్యక్తి చేతబడికి గురవుతాడు, తఖ్దీర్ (విధివ్రాత) లోని ఒక రకం“కౌని” (జరగడం) మరియు “ఇజ్నీ” (ఆజ్ఞ) ద్వారానే చేతబడి సంభవిస్తుంది. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండే:

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلاَّ بِإِذْنِ اللَّه

ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలిం కీడు కలిగించలేరు సుమా. (బఖర 2:102)

అల్లాహ్ దాసులారా!  కొంతమంది మాంత్రికుల వద్దకు వెళ్లి తనను కొంత కాలం వరకూ తన భార్య పిల్లల నుంచి వేరు చేయాలనుకొని చేతబడి జరిపిస్తారు. దాని ద్వారా వారు కొంత కాలం వరకు భార్య పిల్లల నుంచి నిశ్చింతమై ఉంటారు, ఈ విధంగా వాళ్ళు ప్రయాణాలను , పనులన్నీ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ చేతబడిని భంగం చేస్తారు.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా వాళ్ల వద్దకు వెళ్తే, వాళ్ల ముందు ఖురాన్ పారాయణం చేస్తారు. దాని ద్వారా వచ్చిన వ్యక్తి  ఇతను అల్లాహ్ యొక్క వలి అని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగా మనుషులను మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు తమ చేతబడిని కరామత్ (అల్లాహ్ తరఫు నుంచి మహిమ) అని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి అది మంత్ర తంత్రాలు, చేతబడి. దానిని నేర్చుకోవటము మరియు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లడం కూడా నిషిద్ధము. దాని నుండి దూరం ఉండటం మరియు దానిని నివారించడము తప్పనిసరి (వాజిబ్).

అల్లాహ్ దాసులారా! తఖయ్యులాతి చేతబడి ప్రభావం అవ్వడానికి ఒకే మార్గం ఉన్నది – కంటి చూపులను ప్రభావితం చేయటము. శరీరము, హృదయము, ఆలోచనపై కాదు. కనుక ఎవరిపై అయితే చేతబడి చేస్తారో ఆ వ్యక్తి ప్రతి వస్తువు రూపాన్ని దానిని అవాస్తమైన వేరే రూపంలో చూస్తాడు. వాస్తవంగా ఆ వస్తువు ఉండదు.  ఈ చేతబడి ఫిర్ఔన్ దర్బారులో ఉన్న మాంత్రికులు మూసా ప్రవక్త వారిపై ప్రయోగం చేశారు, ఇదొక రకమైన షైతాన్ పని.

ప్రజలారా!  ఈ రకమైన “తఖయ్యులాతీ” చేతబడి వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక చూసేవాని కంట్లో దాని వాస్తవ  ప్రభావం జరుగుతుంది, కానీ చూస్తున్న వస్తువుపై దీని ప్రభావం ఉండదు. చూస్తున్న వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడే వాస్తవంగా అలాగే ఉంటుంది,  కానీ చూసే వ్యక్తి కంట్లో మాత్రం చేతబడి ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు యొక్క రూపాన్ని మార్చటము తీర్చిదిద్దటము ఇది అల్లాహ్ కు మాత్రమే సాధ్యము, ఆయనకు ఎవరూ సాటి లేరు.

నేటి కాలంలో సర్కస్ పేరుమీద లేదా రెజ్లింగ్ గేమ్ అని చెప్పే ఆటలు కూడా తఖైయ్యులాతి చేతబడిలోనే భాగము. దాని ద్వారా మాంత్రికులు ప్రజల ఊహలను  ప్రభావితం చేస్తూ ఉంటారు. కనుక వస్తువులు తమ అసలైన రూపానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు తమ చేసే ఈ పనిని చేతబడి అని చెప్పరు.  ఎందుకంటే ప్రజలు భయాందోళనకి గురికాకూడదని,  దానిని రెజ్లింగ్ ఆటలు ఇంకా వేరే ఆటల పేర్లు ఇస్తూ ఉంటారు. కానీ పేర్లు మారటం వలన వాస్తవం మారదు, ఎందుకంటే  వాస్తవాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆ చేతబడి ఉదాహరణ ఏమిటంటే: ఒక వ్యక్తి తన తల వెంట్రుకల నుంచి కారు తీయడం, ఇంకో వ్యక్తి నిప్పులు తినటము, ఒక వ్యక్తి ఇనుపుతో తనకు తాను దాడి చేసుకోవడం లేదా నాలుకను కోసుకోవడం లేదా ఒక జంతువు నోటిలో ప్రవేశించి మల మార్గం ద్వారా  బయటకు రావడం, ఇంకా తమ వస్త్రాల నుంచి పావురాన్ని వెలికి తీయటము లేదా ప్రజల ముందు ఒక వ్యక్తి ఛాతీపై కారు నడిపించుట ఇలాంటి మొదలైనవి  ఎన్నో మానవుడి అధికారంలో లేనివి అన్ని షైతాన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది.  షైతాన్ దాని తీవ్రతను భరిస్తూ ఉంటాడు,  లేదా ప్రజల కంటిపై చేతబడి ప్రభావం.

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసే మాంత్రికుల గురించి ఖురాన్ లో కూడా ఖండించడం జరిగినది. అల్లాహ్ ఆజ్ఞ:

وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు. (తాహా 20:69)

ఇంకా ఇలా ఆదేశించాడు:

 وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మాంత్రికులు సఫలీకృతులు కాలేరు. (యూనుస్ 10:77).

ఈ రెండు వాక్యాల ద్వారా మాంత్రికుడు ఏ విధంగానైనా సఫలికృతుడు కాలేడు, విజయం సాధించలేడని నిరూపించడం జరుగుతుంది (ఇది చేతబడి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడిన వ్యక్తి హక్కులు) (అల్లామా షింఖీతి రహిమహుల్లాహ్ వారు ఖుర్ఆన్ వాక్యం వివరణలో మాంత్రికుడు కాఫిర్ (అవిశ్వాసి) అని నిరూపించారు)

ప్రవక్త మూసా అలైహిస్సలాం నోటి ద్వారా కూడా అల్లాహ్ మాంత్రికులను ఖండించాడు, ఖురాన్ వాక్యం ఈ విధంగా ఉన్నది:

مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ

మీరు తెచ్చినది మంత్రజాలం, అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు, అల్లాహ్ ఇలాంటి కల్లోల జనుల పనిని చక్కబడనివ్వడు. (యూనుస్ 10:81).

ఈ వాక్యం ద్వారా అర్థం అవుతున్న స్పష్టమవుతున్న విషయం ఏంటంటే ఈ భూమండలంపై మాంత్రికులు చేతబడి చేసేవాళ్లే  కల్లోల్లాన్ని, ఉపద్రవాలను, సృష్టించేవాళ్ళు.

పైన వివరించబడిన ఆయతుల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే: మాంత్రికుడు, చేతబడి చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి). చేతబడి చేపించడం నిషిద్ధం మరియు ఈ భూమండలవాసులపై దాని చెడు ప్రభావం, హాని కలుగుతుందని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పనిని మరణాంతరం మానవుడిని సర్వనాశనం చేసే పనులలో లెక్కించారు. హజ్రత్ అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ

“వినాశనానికి గురి చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి”. దానికి సహచరులు “ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు:

الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ…
“అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం, చేతబడి చేయటం….” (బుఖారి 2766/ ముస్లిం 89).

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ… وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“శకునం తీయువాడు, తీయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించు వాడు, చేతబడి చేయువాడు, చేయించువాడు మాలోని వారు కారు. ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించినచో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లలాహు  అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు.” (*)

(*) ఈ హదీస్ ని ఇమామ్ బజ్జార్ 3578 ఉల్లేఖించారు. అయితే ముఅజం కబీర్ 355లోని పదాలు ఇలా ఉన్నాయి: హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి  చేతిలో ఇత్తడి కడియాన్ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించగా అతను చెప్పాడు: నాకు ‘వాహిన’ అను ఒక రోగం ఉంది, ఇది వేసుకుంటే అది దూరమవుతుందని నాకు చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ఇమ్రాన్ రజియల్లాహు  అన్హు  చెప్పారు: أَمَا إِنْ مُتَّ وَهِيَ عَلَيْكَ وُكِلْتَ إِلَيْهَا నీవు ఇది వేసుకొని ఉండగానే చనిపోయావంటే నీవు దానికే అప్పగించబడిన వానివి అవుతావు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై హదీస్ తెలిపారు: “శకునం తీయువాడు, తీయించువాడు …. మాలోనివారు కారు”. (దీనిని అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీ అన్నారు. సహీహుల్ జామి 5435, సహీహా 2195).

ఇమామ్ బైహఖి హజ్రత్ ఖతాదాహ్ వారితో ఉల్లేఖించారు, కఅబ్ అన్నారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “చేతబడి చేయువాడు, చేయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించువాడు, శకునం చేయువాడు, చేయించువాడు నా నిజదాసులు కారు. నా నిజమైన దాసులు: నన్ను విశ్వసించి నాపై పూర్తి నమ్మకం కలిగినవారే”. (షుఅబుల్ ఈమాన్ 1176).

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేయించడం కొరకు మాంత్రికుని (జాదూగర్) వద్దకు వెళ్లడం అవిశ్వాసం. అది కుఫ్ర్ (అవిశ్వాసం) అవ్వడానికి కారణం ఏమిటంటే: అతను ఆ చేతబడి(జాదు) ను ఇష్టపడ్డాడు, తమపై లేదా ప్రజలపై  చేయించడాన్ని సమ్మతించాడు.

జాదు (చేతబడి)కి పాల్పడక పోయినా దానిని ఇష్టపడటం కూడా అవిశ్వాసమే (కుఫ్ర్). ఎందుకనగా కుఫ్ర్ ను ఇష్టపడటం కూడా కుఫ్ర్ (అవిశ్వాసమే) అవుతుంది.  ఇది ఎలాంటిదంటే: ఒక వ్యక్తి విగ్రహారాధనను లేదా శిలువకు సాష్టాంగం చేయడాన్ని ఇష్టపడుతున్నట్లు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ అతను సాష్టాంగం చేయకపోయినప్పటికీ,  విగ్రహారాధన చేయకపోయినా అతను కాఫిరే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు “నేను చేతబడి చెయ్యను, చేయమని ఆజ్ఞాపించను, చేతబడి నేర్చుకోను, నేర్చుకోమని ఆజ్ఞాపించను, కానీ నా ఇంట్లో, సమాజంలో చేతబడి జరగటం నాకు ఇష్టం, నేను దానిని నిరాకరించను”. ఇలాంటి వ్యక్తి కూడా కాఫిరే. ఎందుకంటే కుఫ్ర్ పట్ల రాజీ పడి ఉండడం కూడా కుఫ్ర్ యే గనక. కనీసం తన మనస్సుతో కుఫ్ర్ ను ఖండించనివాని హృదయంలో విశ్వాసం లేనట్లే. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక)

అల్లాహ్ దాసులారా! ఈ తఖయ్యులాతీ  చేతబడి చేసేవాడు, వాస్తవాలను మార్చే శక్తి ఉందని ఆరోపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు తమ ఈ దుష్చేష్ట వల్ల ఈ విశ్వంలో నియంత్రణ అధికారం కలిగి ఉన్నారని,  మరియు అల్లాహ్ ను కాకుండా వేరే వాళ్ళతో సహాయం ఆర్థిస్తారు.  ఈ రెండిటికి పాల్పడతారు, మొదటిది తౌహీదే రుబూబియత్ లో షిర్క్, రెండోది తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఒక వ్యక్తి ముష్రిక్ మరియు మార్గ భ్రష్టుడు అవ్వడానికి ఈ రెండు ఆచరణలు సరిపోతాయి.  తౌహీదే రుబూబియత్ లో షిర్క్ అవ్వటానికి కారణం ఏమిటంటే అతను వాస్తవాలను మార్చే శక్తి కలిగి ఉన్నాడని ఆరోపించటం. కానీ ఈ విశ్వంలో వాస్తవాలను మార్చే శక్తి  అల్లాహ్ కు తప్ప మరెవరికీ లేదు, ఆయనే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఒక వస్తువుని మరో వస్తువులో (రూపములో) మార్చే అధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఇలాంటి అధికారము ఒక చేతబడి చేసేవాడు నేను కలిగి ఉన్నానని ఆరోపిస్తాడు,  ఈ విషయంలో అతను షిర్క్ కి పాల్పడుతున్నాడు, ఈ విషయంలో అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అతను చేసే జాదు (చేతబడి)ని బట్టి అతను నేను అధికారం కలిగి ఉన్నాను అని ఆరోపిస్తున్నాడు, కానీ కళ్ళ పై ఆ చేతబడి ప్రభావం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తి భ్రమలో పడి ఉంటాడు. ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గుతుందో వాస్తవం ప్రజల ముందు స్పష్టమవుతుంది మరియు వస్తువులు తమ అసలైన రూపంలో కనిపిస్తాయి

తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవ్వడానికి కారణం ఏమిటంటే అతను షైతాన్ నుంచి సహాయం తీసుకుంటాడు మరియు షైతాన్ కి సాష్టాంగం చేసి, షైతాన్ని ఆరాధిస్తాడు,  షైతాన్ పేరు మీద జంతువులను జిబహ్ చేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో షైతాన్ ప్రసన్నత పొందటానికి ఖుర్ఆన్ని అవమానిస్తాడు. ఎందుకంటే షైతాన్ అతడి నుంచి ఎటువంటి ప్రతీకారము కోరడు, కేవలం అతను కుఫ్ర్ కి పాల్పడి, ఈ భూమండలంలో కల్లోలాన్ని వ్యాపించడం తప్ప. కనుక మాంత్రికుడు (చేతబడి చేసేవాడు) తనకు సహాయపడే షైతాన్ ను ఆరాధిస్తాడు, ఇదే అతని కుఫ్ర్ కి కారణం. మరియు ఆ మాంత్రికుడు అతన్ని ఆరాధించడం ద్వారా షైతాన్ లాభం పొందినట్లు గ్రహిస్తాడు. అదే షైతాన్ యొక్క అసలుద్దేశ్యం, అతడు ఆదం సంతతి నుండి కోరేది అదే. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు:

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لاَّ تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِين * وأنِ اعْبُدونِي هَذَا صِرَاطٌ مُسْتَقِيم

“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్‌ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? “మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా. (యాసీన్ 36:60,61).

ఇప్పటి వరకు వివరించబడిన విషయాల యొక్క సారాంశం ఏమిటంటే ఖురాన్, హదీసుల ఆధారంగా మరియు ఇజ్మాఎ ఉమ్మత్ ప్రకారంగా “చేతబడి నిషిద్ధము“. (మజ్మూఉల్ ఫతావా లిబ్ని తైమియహ్ 35/171)

షైతాన్   నుంచి సహాయం పొందటం వలన మాంత్రికుడికి ఏం లాభం? మరియు ఆ  మాంత్రికుడికి ప్రజల నుంచి  ఏమి లాభం?

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు (మాంత్రికుడు) షైతాన్ నుంచి అనేక లాభాలు పొందుతాడు. ఉదాహరణకు:

షైతాన్ అతనికి దూర ప్రదేశాల ప్రయాణం అతి వేగంగా చేపిస్తాడు, ఇలాంటివి మొదలైనవి.

మాంత్రికుడు ప్రజల బలహీనతల నుంచి లబ్ధి పొందుతాడు , దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందుతూ ఉంటాడు.  ఈ ముగ్గురు – షైతాన్ ,చేతబడి చేసేవాడు, చేయించేవాడు – తమ ప్రపంచాన్ని, పరలోకాన్ని నాశనం చేసుకుంటారు.

అల్లాహ్  దాసులారా!  చేతబడి చేయుట మరియు వాళ్ళ వద్దకు వెళ్లుట నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. అయితే మాంత్రికుల వద్దకు పోకుండా ఉండటమే సరిపోదు, ఇస్లామీయ చట్ట ప్రకారం పరిపాలిస్తున్న దేశం అయితే, బాధ్యులకు మాంత్రికుల గురించి, వారి కార్యకలాపాల గురించి తెలియజేయాలి. వాళ్ళ సభలకు వెళ్లి, వాళ్ళ సంఖ్యను పెంచి, వాళ్లకు సహాయం చేయడం లాంటివన్నీ యోగ్యం లేలదు; అది టెలివిజన్ ద్వారానైనా, అనేక ఛానల్స్ మరియు అప్లికేషన్ల ద్వారా అయినా, అది కాలక్షేపం కొరకైనా, దాని అవగాహన కొరకైనా, లేదా దాన్ని తెలుసుకునే ప్రయత్నానికైనా  సరే,  ఏ ఉద్దేశంతో నైనా సరే వాళ్ళ వైపుకు వెళ్లకుండా ఉండాలి.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసేవాళ్లు మరియు ఇలాంటి అనేక ప్రక్రియలు అవిశ్వాస పూరితమైనవి. ఈ పనులు చేసే వాళ్ళపై అల్లాహ్ విధించిన శిక్షలను అమలు చేయడం ఉత్తమమైన ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యాన్ని పొందే ఉత్తమైన ఆరాధనలలో ఒకటి. ఎందుకంటే వీళ్లు భూమండలంపై కల్లోల్లాన్నీ, ఉపద్రవాలను వ్యాపింప చేస్తారు, కనుక అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా తెలియజేశారు: భూమిపై ఒక్క అపరాధికి అల్లాహ్ నియమించిన శిక్షను విధించడం వలన భూవాసులపై 40 రోజులు వర్షం కురవటం  కన్నా ఉత్తమైనది. (ఇబ్ను మాజహ్, అల్లామా ఆల్బాని వారు ప్రామాణికంగా ఖరారు చేశారు)

ఇబ్ను తైమియహ్ రహిమహుల్లాహ్ వారు ఇలా చెప్పారు: (మాంత్రికులను హతమార్చడం) దీనితోపాటు వాళ్ళ ఆచరణ, చేతబడికి సహాయపడే ప్రతి దానిని నాశనం చేయాలి, వృధా చేయాలి, అంతం చేయాలి, వీళ్లను సామాన్య రహదారులపై కూర్చోవడానికి నివారించాలి, మరియు ఇలాంటివాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఇవన్నీ అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉత్తమమైన రూపము, మార్గము.( మజ్మూ ఫతావా లి ఇబ్న్ తైమీయహ్)

చేతబడి ప్రక్రియలో పడకుండా జాగ్రత్త పడడానికి తెలుసుకోవలసిన ఖచ్చితమైన విషయాలు మరియు చేతబడి చేసేవాడు మరియు అతని వద్ద  పోయే వాళ్ల  కుఫ్ర్ ను తెలుసుకొనుటకు ఈ ఖుత్బా చాలా ప్రయోజనం చేకూర్చి ఉండాలి.

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ.

చేతబడి నుండి రక్షణ మార్గాలు

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా!  అల్లాహ్  భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి. చేతబడి ప్రభావం కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

చేతబడి సంభవించిన తర్వాత స్వస్థత పొందటానికి మూడు పద్ధతులు అవలంభించాలి:

మొదటి పద్ధతి మరియు చాలా ముఖ్యమైనది: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

రెండవది పద్ధతి మరియు చాలా లాభదాయకమైనది: చేతబడి చేసిన ఆ వస్తువునీ,  దాచిన  ప్రదేశాన్ని తెలుసుకోవడం.  అది నేల లోపల ఉన్నా, లేదా కొండపై ఉన్నా, లేదా వేరే ఎక్కడున్నా సరే చేతబడి చేసి దాచిన ఆ వస్తువును తెలుసుకుంటే, దాన్ని అక్కడ నుంచి వెలికి తీసి నాశనం చేస్తే, తొలగిస్తే చేతబడి ప్రభావం దూరం అవుతుంది.

మూడవ పద్ధతి: ఇది ఏ వ్యక్తికి అయితే తన భార్యతో సంభోగ విషయంలో ఇబ్బందిగా ఉందో,  అలాంటి వ్యక్తికి చేయబడ్డ చేతబడి కి చాలా లాభకరమైనది.  ఏడు (7 ) పచ్చటి రేగి  ఆకులను తీసుకోవాలి, దానిని రాయితో దంచి, రుబ్బి, సన్నగా పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి దానిపై స్నానం చేసేంత నీటిని వేసి, అందులో ఆయతుల్ కుర్సీ మరియు ఖుల్ యొక్క నాలుగు సూరాలు చదివి మరియు సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ యూనుస్ మరియు సూరతుత్ తాహా లో చేతబడికి సంబంధించిన ఆయతులు పఠించాలి. దాని తర్వాత ఆ నీటిలోని కొద్ది భాగాన్ని మూడు సార్లు చేసి త్రాగాలి, మిగిలిన నీళ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా చేతబడి యొక్క ప్రభావము ఇన్ షా అల్లాహ్  తొలగిపోతుంది. ఈ విధంగా రెండు మూడు సార్లు వ్యాధి నయం అయ్యే వరకు చేసినా పర్వాలేదు.

అల్లాహ్ మీపై కరుణించుగాకా, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

రమజాన్ పండుగ గురించి పది ముఖ్య విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిపద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి బిద్అత్ కార్యకలాపాలు. ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

1. ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి మరియు ఎల్ల వేళలా దైవభీతి కలిగి ఉండండి. ఇస్లాం పై స్థిరంగా ఉండండి. ఆయన మనందరినీ ఈ రమజాన్ చివరి వరకు చేర్చినందుకు అల్లాహ్ కు స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. అల్లాహ్ సాక్షిగా ఇది ఆయన యొక్క గొప్పవరం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ 
(మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది ఆయన అభిలాష!)

కనుక మనందరము ఈమాసాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను అల్లాహ్ ను కీర్తించాలి మరియు కృతజ్ఞతతో ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి.

2. ఓ ముస్లింలారా! నిశ్చయంగా అల్లాహ్ వాక్కు సత్యమైనది. (రమజాన్ కేవలం లెక్కించ బడిన దినాలే ) ఆ పగలు రాత్రి ఎంత వేగంగా గడిచి పోయాయో, అసలు ఎలా గడిచిపోయాయో మీకు తెలుస్తుందా?

3. ఓ విశ్వాసులారా! పూర్తి రమజాన్ ను పొందినందుకు  మరియు అందులో ఉపవాసాలు పాటించినందుకు మీకు అభినందనలు. మరియు ఈ రమజాన్ రాత్రులలో మేల్కొని ఆరాధనలు చేసినందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఎంతో మంది ఈ రమజాన్ మాసం రాక మునుపే వెళ్లిపోయారు. ఈ రమజాన్ చివరి దశను కూడా పొందలేక పోయారు. ఆయన తన వరాల జల్లును తన అనుగ్రహాలను మనపై కరిపించినందుకు వేయి నూళ్ళ కోటానుకోట్ల స్తుతులూ స్తోత్రాలు తెలియ చేస్తున్నాను.

4. ఓ ముస్లింలారా! మీ అందరికీ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇస్లాం మూలస్తంభాలలో ఒకటైన ఈ ఉపవాసాలు పూర్తి చేసుకున్నందుకు గాను నేను  అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండండి. ఆయన ఏకత్వాన్ని గురించి చాటి చెప్పండి. అల్లాహ్ పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఈ రమజాన్ లో మీ సత్కార్యాలను రెట్టింపు అయ్యి ఉండవచ్చు, పాపాలు క్షమించబడవచ్చు మరియు మీ అంతస్తులు కూడా పెంపొందించవచ్చు.

5. అల్లాహ్ దాసులారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వివేకం ఏమిటంటే ఆయన రెండు గొప్ప సందర్భాల తర్వాత మన కొరకు రెండు పండుగలను ప్రసాదించాడు. ఒకటి ఉపవాసాలు ముగించుకున్న తర్వాత రంజాన్ పండుగ. రెండు హజ్జ్  పూర్తి చేసుకున్న తర్వాత బక్రీద్ పండుగ జరుపుకుంటాము. మన ఈ పండుగలలో ఎన్నో గొప్ప ఆరాధనలు ఉన్నాయి – నమాజ్, రోజా, జిక్ర్, ఖుర్బానీ, ఫిత్రా దానం మొదలైనవి.

అంతేకాదు ఈ శుభసందర్భంలో బంధుత్వ సంబంధాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమానురాగాలతో కలుసుకుంటారు, ఒకరి పట్ల మరొకరు మన్నింపుల వైఖరి అవలంభిస్తారు మరియు కుళ్ళు కుతంత్రాలు, ఈర్షద్వేషాలు అన్నింటిని మరిచిపోయి అందరూ కలిసిమెలిసిపోతారు. ఒకవేళ మనలో ఎవరైనా ఈ విధంగా సంబంధాలు తెంపుకొని ఉంటే వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరికొత్త రీతిలో సంబంధాలను బలపరచుకొని సంతోషాలను పంచాలి.

6. ఓ విశ్వాసులారా! బహుదైవారాలకులు మరియు అన్యమతస్తుల దేశాలలో కనిపించని మన ఈ స్వచ్ఛమైన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. వారి పండుగలలో పాపము మరియు అల్లాహ్ అవిధేయత తప్ప మరి ఏమీ కానరావు. ఈ విధమైన దురాచరణల ద్వారా వారు అల్లాహ్ తో దూరం పెంచుకుంటున్నారు.

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క ఈ కారుణ్యం పట్ల సంతోషంగా ఉండండి ఎందుకంటే అల్లాహ్  ఇలాఅంటున్నాడు

[قُلۡ بِفَضۡلِ ٱللَّهِ وَبِرَحۡمَتِهِۦ فَبِذَٰلِكَ فَلۡيَفۡرَحُواْ هُوَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ]
(ఇలా అను: ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దాని కంటే ఎంతో మేలైనది.)   

7. ఓ ముస్లింలారా పండుగపూట అందంగా తయారవ్వండి మరియు సుగంధం పరిమళాలను పూసుకోండి మరియు ఇతరులకు కూడా పూయండి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు ఇలాతెలియజేస్తున్నారు “నేను అహ్లె ఇల్మ్ (పండితుల) ద్వారా విన్నాను. వారు తప్పనిసరిగా ప్రతి పండుగ రోజున అందంగా తయారై సుగంధ పరిమళాలను  పూసుకునేవారు”.(షరహ్ బుఖారి లిఇబ్నె రజబ్ 68/6)

8. ఓ విశ్వాసులారా! ఈ పండుగ రోజున మన ఇళ్ల ద్వారాలతో పాటు మన హృదయాల ద్వారాలను కూడా తెరిచి ఉంచండి, ఒకరి కొరకు మరొకరు తప్పక దుఆ చేయండి. అల్లాహ్ తఆలా అందరి సత్కర్మలను స్వీకరించుగాక. మరియు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మన సహాబాలు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. ఇలా అనేవారు  

(تقبل الله منا ومنكم)
అల్లాహ్ మా సత్కార్యాలను మరియు మీ సత్కార్యాలను స్వీకరించుగాక!

9. ఓ ముస్లింలారా! గడిచిపోయిన పొరపాట్లను మన్నించడం విధేయత యొక్క గొప్ప చర్యలలో ఒకటి.  అల్లాహ్ వద్ద దీనికొరకు గొప్ప ప్రతిఫలం ఉంది.  అల్లాహ్  ఇలా అంటున్నాడు.

[فَمَنۡ عَفَا وَأَصۡلَحَ فَأَجۡرُهُۥ عَلَى ٱللَّهِۚ]
(కానీ ఎవరైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతి ఫలం అల్లాహ్ దగ్గర ఉంది)

అల్లాహ్ వద్ద ప్రతిఫలం ఉందంటే వాస్తవంగా ఈ పని ఎంతోగొప్పది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది.

ఓ విశ్వాసులారా! హృదయాలను పరిశుభ్రపరచుకోండి. ఇది కూడా ఒక గొప్ప ఆచరణ. దీని కొరకు కూడా మంచి సాఫల్యం ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا٩ وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا]
(వాస్తవానికి తన ఆత్మను శుద్దపరచుకున్నవాడే సఫలుడౌతాడు మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడౌతాడు)

అల్లాహ్ దాసులారా! సంతోషాన్ని కలుగజేసేటువంటి పనులలో ఒకటి సంబంధాలను కలుపుకోవడం. సంవంత్సరం మొత్తంలో మనిషి మనసులో ఉండేటువంటి ఈర్ష ద్వేషాల నుండి మనిషి తన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఆవ్యక్తి కొరకు శుభవార్త ఉంది ఎవరైతే ఈ పండుగ రోజున సద్వినియోగం చేసుకుని తెగిపోయినటువంటి బంధాలను కలుపుకుంటాడో మరియు విరిగిన హృదయాలను కలుపుతాడో. దానివలన కుటుంబంలో ఏర్పడిన కలహాలు దూరమైపోతాయి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.

ఓ అల్లాహ్! సమస్త ప్రశంసలు మరియు సకల ఆరాధనలు అన్నీ కూడా నీకే శోభిస్తాయి. నీ కారుణ్యంతో మమ్మల్ని అందరినీ ఈ రమజాన్ మాసం చివరి వరకు చేర్చి పండుగను మాకు ప్రసాదించావు. ఓ అల్లాహ్ నీకు విధేయత చూపడంలో మాకు సహాయం చేయి. ఓ అల్లాహ్ మాకు నీ ప్రేమని ప్రసాదించు మరియు నీకు  దగ్గర చేసేటువంటి ప్రతి పనిపై మాకు ప్రేమను ప్రసాదించు. ఓ అల్లాహ్! మేము మా పాప క్షమాపణ గురించి నిన్ను  వేడుకుంటున్నాము. నిశ్చయంగా నువ్వు  ఎంతో క్షమాగుణం కలవాడవు. 

రెండవ ఖుత్బా

 స్తోత్రం మరియు దరూద్ తరువాత

10. ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్  మిమ్మల్ని కరుణించుగాక. మీరు తెలుసుకోండి. అన్నిటికంటే గొప్ప ఆనందం అల్లాహ్ ను కలిసి ఆయన దగ్గర నుండి మనం చేసినటువంటి సత్కార్యాల ప్రతిఫలం పొందేటప్పుడు లభించేది.

అల్లాహ్ తఆల స్వర్గవాసులతో ఇలా అంటాడు “ఓ స్వర్గ వాసులారా! అప్పుడు స్వర్గవాసులు ఇలా సమాధానం ఇస్తారు – ఓ అల్లాహ్ మేము నీ సన్నిధిలో  హాజరయ్యాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు – మీరు సంతోషంగా ఉన్నారా! అప్పుడు వారు అంటారు- ఎందుకు కాదు అల్లాహ్!  మీరు ఈ  సృష్టిలో ఎవరికీ ప్రసాదించనివి మాకు ప్రసాదించారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఏమిటి దాని కంటే ఉత్తమమైనటువంటి దానిని మీకు ప్రసాదించనా! స్వర్గ వాసులు ఇలా ఉంటారు – ఓ మా ప్రభువా! దీనికంటే మేలైనది ఇంకేం ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఇప్పటి నుండి నేను శాశ్వతంగా మీ పట్ల ఇష్టుడనయ్యాను ఇక ఎప్పటికీ మీపై కోపంగా ఉండను.(బుఖారి 6549 – ముస్లిం 2829)

11. ఓ విశ్వాసులారా! ఈ రమజాన్ మాసము సంస్కరణ కోసం అల్లాహ్ తో సంభందాన్ని దృడపరచుకోవడానికి అతి గొప్ప అవకాశం కనుక మీరందరూ కూడా ఆరాధనలో నిమగ్నమై ఉండండి ఎందుకంటే ఆరాధన రమజాన్ తో ముగిసిపోదు, మనిషి మరణం వరకు కూడా సదా చరణ చేస్తూఉండాలి  అల్లాహ్ ఇలా అంటున్నాడు

[وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ]
(మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాదిస్తూఉండు)

ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు:
అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఆచరణ ఎల్లకాలం చేస్తూ ఉండేటువంటిది అది ఎంతచిన్న ఆచరనైనా సరే. (బుఖారి 5861)

ఓ ముస్లింలారా! రమజాన్ తర్వాత సదాచరణపై స్థిరంగా ఉండటం ఇది అల్లాహ్ వద్ద ఆచరణ స్వీకారయోగ్యం  పొందడానికి సూచన. దీనికి వ్యతిరేకంగా కేవలం రమజాన్ లో మాత్రమే చేసి మిగతా రోజుల్లో మానుకోవడం ఇది అజ్ఞానము. అల్లాహ్ యొక్క భాగ్యం నుంచి దూరం అవడానికి ఒక సూచన. ఎందుకంటే రమజాన్ ప్రసాదించిన ప్రభువే మిగతా నెలలు కూడా మనకు ప్రసాదించాడు. ఒక వ్యక్తి గురించి సలఫ్ ను ఈ విధంగా అడగడం జరిగింది. ఎవరైతే కేవలం రమజాన్ లో మాత్రమే ప్రార్థన చేస్తాడో మరియు  ఇతర దినాలలో ఆరాధనను వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి చెప్పండి? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు – ఆ వ్యక్తి లేక ఆ జాతి చెడ్డది ఎవరైతే కేవలం అల్లాహ్ ని రమజాన్ లోనే గుర్తు చేసుకుంటారో.  

ఓ విశ్వాసులారా! ముస్లింల యొక్క ఒక ఉత్తమ గుణం ఏమిటంటే వారు విధేయతా పరులై ఉంటారు. విధేయత అంటే ఆరాధనపై స్థిరంగా ఉండటమే.  అల్లాహ్  విధేయత చూపేవారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّٰدِقِينَ وَٱلصَّٰدِقَٰتِ وَٱلصَّٰبِرِينَ وَٱلصَّٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّٰٓئِمِينَ وَٱلصَّٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا]

(నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.)

12. ఓ అల్లాహ్ దాసులారా! రమజాన్ తర్వాత షవ్వాల్ నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉండటం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ వారి సాంప్రదాయం. అల్లాహ్  దీని కొరకు గొప్ప ప్రతిఫలం ఉందని వాగ్దానం చేశాడు.

అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే రమజాన్ యొక్క ఉపవాసాలు ఉంటారో మరియు ఆతర్వాత షవ్వాల నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉంటారో  వారు పూర్తి సంవత్సరం యొక్క ఉపవాసాలు ఉన్నట్లే” (ముస్లిం-1164)

ఈ ఆరు ఉపవాసాలు  ప్రసాదించడానికి గల కారణం ఏమిటంటే రంజాన్ యొక్క విధి చేయబడినటువంటి ఉపవాసాలలో  ఏదైనా లోపం ఉండి ఉంటే ఈ నఫీల్ ఉపవాసాల ద్వారా అవి చెరిగిపోతాయి. ఎందుకంటే ఉపవాసి ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనితో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసాలు ఆ సమయంలో  ఏర్పడినటువంటి ఆ యొక్క కొరతని పూర్తి చేస్తాయి.

పండుగ గురించి ఇంకా ఎన్నో  విషయాలు ఉన్నాయి. కనుక ఒక విశ్వాసి రంజాన్ పండుగ సందర్భంగా వీటిని గుర్తు పెట్టుకోవాలి మరియు వాటిపై ఆచరించాలి. కేవలం వాటిని ఒక రివాజుగా భావించి వదిలి పెట్ట కూడదు.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మాకు స్వర్గాన్ని ప్రసాదించు మరియు ఫిర్దౌస్ యొక్క వారసులుగా చేయు మరియు ఎటువంటి లెక్కాపత్రం లేకుండా మరియు శిక్ష లేకుండా మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశింపచేయి.

ఓ అల్లాహ్! నువ్వు కరుణామయుడవు, కృపాశీలుడవు. మమ్మల్ని మా పాపాల నుండి పరిశుభ్రం చేయి, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుండి వచ్చామో ఆ విధంగా మమ్మల్ని పరిశుభ్రపరుచు.

ఓ అల్లాహ్! మా అందరి ఈ సమావేశాన్ని స్వీకరించి మాకు పాపక్షమాపణ కలుగచేయి. మా ఆచరణలను స్వీకరించు.

ఓ అల్లాహ్! మా దేశంలో మరియు ముస్లిం దేశాలన్నింటిలో శాంతి భద్రతలను ప్రసాదించు.

ఓ అల్లాహ్! రమజాన్ తర్వాత కూడా సదాచరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, నీకు విధేయత చూపే వారిగా చేయి, మరియు ఇలాంటి వరాల వసంతాలను మా జీవితంలో  మరెన్నో ప్రసాదించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

జకాత్ | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

[డౌన్లోడ్ PDF]

عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَ مُعَاذًا ‏- رضى الله عنه ‏- إِلَى اَلْيَمَنِ.‏.‏.‏ } فَذَكَرَ اَلْحَدِيثَ, وَفِيهِ: { أَنَّ اَللَّهَ قَدِ اِفْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ, تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ, فَتُرَدُّ فِ ي 1‏ فُقَرَائِهِمْ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ 2‏ .‏


‏1 ‏- كذا في الأصلين، وهي رواية مسلم، وأشار في هامش “أ” أن في نسخة “على” وهي رواية البخاري ومسلم.‏
‏2 ‏- صحيح.‏ رواه البخاري ( 1395 )‏، ومسلم ( 19 )‏، ولفظه: أن رسول الله صلى الله عليه وسلم بعث معاذا إلى اليمن، فقال له: “إنك تأتي قوما أهل كتاب، فادعهم إلى شهادة أن لا إله إلا الله وأني رسول الله، فإن هم أطاعوا لذلك، فأعلمهم أن الله افترض عليهم صدقة في أموالهم، تؤخذ من أغنيائهم وترد على فقرائهم، فإن هم أطاعوا لذلك، فإياك وكرائن أمولهم، واتق دعوة المظلوم؛ فإنها ليس بينها وبين الله حجاب”.‏

483. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను యమన్ వైపునకు సాగ నంపారు. తరువాత హదీసునంతటినీ వివరించారు. అందులో ఇలా వుంది: “అల్లాహ్ తరఫున వారి సంపదలపై ‘జకాత్’ విధించబడింది. అది వారి స్థితిమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని అగత్యపరులలో, పేదలలో పంచి పెట్టబడాలి.” (బుఖారీ)

సారాంశం:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ధనవంతుల నుండి జకాత్ ను వసూలు చేసి అధికార స్థాయిలో హక్కుదారులకు (అగత్యపరులకు) పంపిణీ చేసే వ్యవస్థ ఏర్పడిందని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఏ ప్రాంతంలో జకాత్ వసూలు చేయబడుతుందో ఆ ప్రాంతంలోని పేదలకు, నిరాధార జీవులకే అది పంచిపెట్టబడటం న్యాయం అన్న విషయం కూడా దీనిద్వారా అవగతమవుతున్నది. ఒకవేళ అక్కడ జకాత్ పంపిణీ అయ్యాక కూడా మిగిలి ఉంటే అప్పుడు ఇతర ప్రాంతాలలోని హక్కు దారులకు ఇవ్వవచ్చు. ‘జకాత్’ అనేది పేదల హక్కు. దాన్ని చెల్లించటం శ్రీమంతుల బాధ్యత. జకాత్ ను చెల్లించి వారు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారే తప్ప ఒకరిపై ఉపకారం ఏమీ చేయటం లేదని గ్రహించాలి.

ఉపవాసాల నియమాలు | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

527. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్ కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాస వ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

528. హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత చూపాడు.”

(బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఇస్లామీయ షరియత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరియత్ పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరియత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ] 2‏ .‏ ثَلَاثِينَ } 3‏ .‏ وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ } 4‏ .‏

وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ } 1‏ .‏

529. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహ్).

‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజాల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: ‘మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.’

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) [పుస్తకం]

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్)
ఉర్దూ సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

[డౌన్లోడ్ బుక్]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్

[డౌన్లోడ్ PDF]

కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో

మహాశయులారా !

ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.

అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.

అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.

అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.

అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.

అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”

ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !

ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.

అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/VqNlWM-JI88

అల్లాహ్ ఆదేశం: 

وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا
మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6). 

ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:

ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం). 

  • 1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది. 
  • 2. అది షిర్క్ అని తెలిసింది. 
  • 3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్. 
  • 4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది. 
  • 5. ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి). 

ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

దుఆ ఇలా చేయండి - తప్పక ఫలిస్తుంది [పుస్తకం]
దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

సులువైన, సంక్షిప్తమైన, సమగ్రమైన – దుఆ చేసే విధానం
దుఆ ఇలా చేయండి తప్పక ఫలిస్తుంది
[డౌన్లోడ్ బుక్] [PDF] [16 పేజీలు ]

దుఆ(ప్రార్థన) చేయవలసింది ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే. ఎందుకంటే, ప్రతిరోజూ మనం నమాజులో-

“ఓ అల్లాహ్ ! మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము” అని వాగ్దానం చేస్తున్నాం.(ఫాతిహా సూరా : 5)

కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహ్ కు మాత్రమే దుఆ చేసుకోవాలి. ప్రార్థన (దుఆ) విషయంలో ఇతర మధ్యవర్తులను (అనగా ఉదాహరణకు పుణ్యాత్ములను, వలీలను) ఆశ్రయించటాన్ని కూడా అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. తన తరఫున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దివ్యఖుర్ఆన్లో ఈ విధంగాచెప్పాడు:

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవువారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గభాగ్యం పొందగల్గుతారు.” (ఖుర్ఆన్ 2: 186)

మరోచోట ఆయన స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు:

“మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన (ఇబాదత్) పట్ల గర్వాహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులైనరకంలో ప్రవేశించటం ఖాయం.” (ఖుర్ఆన్ 40: 60)

మానవులందరూ-వారు మంచివారైనా, పాపాత్ములైనా అందరూ నేరుగా అల్లాహ్ ప్రార్థిస్తూఉండాలి. ‘మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా?’ అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే, పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో పుణ్యాత్ముల ప్రతి వేడుకోలునూ అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహ్, ఇబ్రాహీమ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతటి గొప్ప దైవప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయీల్కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా! దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ప్రతిఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహ్ ను ప్రార్థిస్తూఉండాలి. దాసులు కనబరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక తోసిపుచ్చుతాడు. అంతేగాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా? పాపాత్ముడా? అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడోచూడండి:

“ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యంపట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగాక్షమించేవాడు. అపారంగా కరుణించేవాడు.” (ఖుర్ఆన్ 39 : 53)

మీ దుఆలు స్వీకరించ బడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే, మీ దుఆలు క్రింది మూడు రూపాల్లోని బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు.

(1) ప్రార్థన చేసిన వెంటనే (అంటే ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, సమీప కాలంలోనో, సుదీర్ఘకాలంలోనో ఎప్పుడైనా) అది తప్పక నెరవేరవచ్చు.

(2) లేక అల్లాహ్ ఆ ప్రార్థనను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు.

(3) లేక ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు.

ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్ధన చేస్తే అల్లాహ్ అతని కోసం పై మూడు వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు. (అహ్మద్)

(1) చిత్తశుద్ధి: ఒక్క అల్లాహ్ నే ప్రార్థించాలి. ఖుర్ఆన్ ఇలా అనబడింది: మీరు మీధర్మాన్ని (ఆరాధనను) అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి.(ఖుర్ఆన్ 40: 65)

(2) ఏకాగ్రత: పూర్తి ఏకాగ్రతతో, మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకొని ప్రార్థించాలి. “పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు.”(బుఖారీ గ్రంథం)

(3) వినమ్రత, అణకువ: అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణకువ భావాలు ఉట్టిపడాలి. దివ్యఖుర్ఆన్ ప్రబోధనం:“మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, గోప్యంగానూ.” (ఖుర్ఆన్ 7: 55)

ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

“పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను”.(ఖుర్ఆన్ 20: 82)

అంటే,

(1) మనిషి గతంలో తనవల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. క్షమాభిక్షకై వేడుకోవాలి.
(2) అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, దైవగ్రంథాలను, పరలోక దినాన్ని హృదయ పూర్వకంగా విశ్వసించాలి.
(3) ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి.
(4) సత్కార్యాల మార్గంలో స్థయిర్యాన్ని,నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థనస్వీకరించబడటానికి అవకాశం వుంటుంది.

(1) దుఆ చేసే వ్యక్తి వుజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దుఆ చేసే చోటు కూడా పరిశుభ్రంగాఉంటే మంచిది.

(2) చేతులెత్తకుండా నయినా దుఆ చేయవచ్చు (ముస్లిం). కాని చేతులెత్తి దుఆ చెయ్యడం సున్నత్ (బుఖారి గ్రంథం).

(3) ఒకవేళ చేతులు ఎత్తి దుఆ చేస్తున్నట్లైతే భుజాలవరకు పైకెత్తి దుఆ చేయాలి. (తిర్మిజీ గ్రంథం)

(4) దుఆ చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపుఉండాలి.(అబూదావూద్)

[1] ముందుగా అల్లాహ్ ను స్తుతించండి. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించండి. (తిర్మిజీ)

[2] అంతకు ముందు మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి (హాకిమ్ గ్రంథం) (అయితే క్రైస్తవుల్లో మాదిరిగా మత గురువుల ముందు మీ పాపాలను బయటపెట్టుకొని అవమానం పాలుకావలసిన అవసరం లేదు.)

[3] పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. (బుఖారి గ్రంథం)

[4] పరిపూర్ణ ఏకాగ్రతతో (అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకొని) ప్రార్థించండి. (తిర్మిజీ)

[5] అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయంమీకు చాలా ముఖ్యమైనదయితే ప్రార్థనా వచనాలను మూడేసి సార్లు పలకండి. (ముస్లిం)

[6] ముందు మీ కోసం ప్రార్ధించుకోండి. తర్వాతమీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం,ముస్లిం సమాజం కోసం ప్రార్థించండి. (ముస్లిం)

[7] ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండాపరులకోసం కూడా ప్రార్థించండి.(బుఖారి)

[8] సమగ్రమైన, మంచి భావం కలిగిన ప్రార్థనలుచేయండి. (అబూదావూద్ గ్రంథం) (అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైన వేడుకోలు వచనాల ద్వారా ప్రార్థించటం ఎంతోఉత్తమం.)

[9] మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా!అని అనుకోకండి. (ఎంత చిన్న అవసరమైనా అంతిమంగా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ యే కనుక) ప్రతి అవసరం కోసం ఆయన్నే వేడుకోండి.(తిర్మిజీ)

[10] ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ పలకటం మర్చిపోకండి.(ముస్లిం)

[11] చివర్లో కూడా మరో మారు దరూద్ పఠించండి.ఆ తర్వాత అల్లాహ్ ను మళ్ళీ స్తుతిస్తూ ప్రార్థన(దుఆ) ముగించండి. (ముస్లిం)

వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం (ఇస్మె ఆజం) కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలుపెట్టండి. ‘ఇస్మె ఆజం’ కలిగివుండే ప్రార్థనా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.

“అల్లాహుమ్మ! ఇన్నీ అలుక బిఅన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్సమదుల్లజీ లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.”

(ఓ అల్లాహ్! అల్లాహ్ వు నీవే. కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరో అరాధ్యుడు లేనేలేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరి సమానులు ఎవరూ లేరు అటువంటి మహోన్నత అస్తిత్వం నీది.)-(ఇబ్నెమాజా – సహీహ్)

“లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”(అహ్మద్, తిర్మిజీ – సహీహ్)

”యా జల్(zal) జలాలి వల్ ఇక్రామ్! యా హయ్యు! యా ఖయ్యూమ్!” (తిర్మిజీ)

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలిముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలాఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్ అల్లాహుమ్మబారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్

ఉదాహరణకు ఒక ప్రార్థన:

అల్లాహుమ్మ ఇన్నక అ’ఫువ్వున్ తుహిబ్బుల్ అ’ఫ్వ’ఫా’ఫు (fafu) అన్నీ
(అల్లాహ్ ! నువ్వు క్షమించేవాడవు. క్షమను ఇష్టపడతావు. నన్ను క్షమించు.)

“రబ్బనా ఆతినా ‘ఫిద్దున్యా హసనతన్ వ’ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.”
ప్రభూ! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుండి రక్షించు.(ఖుర్ఆన్ 2 : 201)

‘రబ్బిరమ్ హుమా కమా రబ్బయానీ స’గీరా’
ఓ అల్లాహ్! వారిద్దరూ (నా తల్లిదండ్రులు) నన్నుఏ విధంగా ప్రేమగా పెంచారో అదే విధంగా నువ్వుకూడా వారిపై దయజూపు.

‘రబ్బి జిద్నీ ఇల్మ (ఖుర్ఆన్ 17:24)
ప్రభూ! నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు.(ఖుర్ఆన్ 20:114)

‘రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్ అల్నా లిల్ ముత్తఖీన ఇమామా’

ఓ మా ప్రభూ! నీవు మా భాగస్వాముల (నా భర్త లేక నా భార్య) ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని దైవభక్తిపరుల (ముత్తఖీన్) నాయకునిగా చేయి.(ఖుర్ఆన్ 25:74)

“అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుఖా వల్ అ’ఫా’ఫ వల్ ‘గినా”
అల్లాహ్! నాకు సన్మార్గాన్నీ, దైవభీతినీ, శీలాన్నీ,నిరపేక్షా భావాన్నీ ప్రసాదించమని వేడుకుంటున్నాను.(ముస్లిం)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ అర్బయి మిన్ యిల్మిన్ లా యన్ఫా, వ మిన్ ఖల్బిన్ ల యఖ్షా, వ మిన్ నఫ్సిన్ లా తష్బా, వమిన్ దుఆయిన్ లా యుస్మా.”

అల్లాహ్ ! నేను నాలుగు విషయాల నుండి నీ శరణు వేడుతున్నాను. (1) నిష్ప్రయోజనకరమైన విద్యనుండి (అంటే ఆచరణలేని విద్య) (2) దైవ భీతి లేని హృదయం నుండి (3) ఆత్రం తీరని మనస్సు నుండి (4) అంగీకరించబడని ప్రార్ధన నుండి (అహ్మద్)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ హమ్మి వల్ హుజిని వల్ అజిజి వల్ కస్ లి వల్ బుఖ్ లి వల్ జుబ్ ని వ జలయిద్దయిని వ ‘గలబతిర్రిజాలి.”

అల్లాహ్! నేను దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణ భారం, ఇంకా ప్రజలు నాపై ఆధిక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుతున్నాను. (నసాయి గ్రంథం)

ఇంకా మీకు ఏం ఏం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్ధించుకోండి. మీ ఇష్టం. కాని జాగ్రత్త! మీరు చనిపోవాలనిగాని లేక పరులకు హాని జరగాలని గాని శాపనార్ధాలు పెట్టకండి. అలా చేయటం పాపం.

ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ అని పలకండి.

దరూద్ 11వ పేజీలో వుంది.

ఇలాగా: సుబహానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్.

దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించ బడటానికి అవకాశం ఉంటుంది.

[1] అజాన్, ఇఖామత్ ల మధ్య సమయంలో (తిర్మిజీ)

[2] అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి (సజ్దాలో) ఉన్న స్థితిలో (ముస్లిం)

[3] ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది.(తిర్మిజీ గ్రంథం)

[4] ఉపన్యాసకుడు (ఖతీబ్) వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి (జుమా) నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియలో దుఆ స్వీకరించబడుతుంది.(ముస్లిం గ్రంథం) అంటే రెండు ఖుత్బాల మధ్యన.

[5] జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థనస్వీకరించబడుతుంది.(బుఖారి గ్రంథం)

[6] ఉపవాస విరమణ (ఇఫ్తార్) సమయంలో (ముస్లిం)

[7] రమదాన్ నెలలోని ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్)లో చేసే ప్రార్థన (తిర్మిజీ గ్రంథం)

[8] రాత్రి ఆఖరి జాము (తహజ్జుద్ సమయం)లో ప్రార్థన స్వీకరించ బడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. (బుఖారి గ్రంథం)

[9] వర్షం కురిసేటప్పుడు.(హాకిమ్ గ్రంథం)

మీ దుఆల్లో మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ…

ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డ గొప్ప హదీసు – కలామే హిక్మత్

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు :

“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”

”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”

“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”

”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”

“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”

”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”

“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)

(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.

దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.

(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.

(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”

ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “

(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ

”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)

(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:

 قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ

“వారితో అనండి, తెలిసినవారు, తెలియనివారు ఇద్దరూ సమానులు అవగలరా? హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు.” (అజ్జుమర్ 39 : 9)

(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.

(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “

ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “

(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –

وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ

“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)

తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్