ప్రవక్తలు ఎందుకు వచ్చారు? [వీడియో | టెక్స్ట్]

ప్రవక్తల రాక ఉద్దేశ్యం
https://youtu.be/e0k8L0QdnRk [12 నిముషాలు]
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు, 22వ పాఠం.

ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ
(వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్)
అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.

అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?

శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.

ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.

అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.

ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ
(రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్)
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)

అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?

لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ
(లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్)
ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)

ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.

ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ
(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.

وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
(వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్)
అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)

అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.

ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?

يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ
(య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్)
కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు

وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ
(వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్)
మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.

ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.

ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా)
ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)

ఆ ప్రవక్త తమ జాతి వారికి:

أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్)
అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)

అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.

ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.

తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.

واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41240

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).

జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు [వీడియో & టెక్స్ట్]

జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు
https://youtu.be/Oldiv3H1dE0 [60+ నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) మరియు ధిక్ర్ (అల్లాను స్మరించడం) యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ఇస్తిగ్ఫార్ అనేది పాపాల నుండి హృదయాన్ని శుభ్రపరచడమే కాకుండా, వర్షాలు, సంపద, సంతానం వంటి ప్రాపంచిక మరియు పారలౌకిక శుభాలను తెస్తుందని నొక్కి చెప్పబడింది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ వంటి ప్రత్యేక దువాల ఘనత కూడా చర్చించబడింది. అదేవిధంగా, ధిక్ర్ అనేది ఒక ముస్లిం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆరాధనగా మారుస్తుందని, నిలబడి, కూర్చుని, పడుకుని – అన్ని స్థితులలో అల్లాహ్ స్మరణలో ఉండటం వల్ల అపారమైన పుణ్యం మరియు అల్లాహ్ శిక్ష నుండి రక్షణ లభిస్తుందని స్పష్టం చేయబడింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు సుబ్హానల్లాహి వబిహమ్దిహి వంటి ధిక్ర్ ల యొక్క గొప్పతనం మరియు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత చేసే తస్బీహ్‌ల వల్ల కలిగే లాభాలు కూడా వివరించబడ్డాయి. అంతిమంగా, ప్రతి ముస్లిం తన జీవితాన్ని ఇస్తిగ్ఫార్ మరియు ధిక్ర్ లతో అలంకరించుకోవాలని ప్రబోధించబడింది.

ప్రియ వీక్షకులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం రెండు అంశాలపై మాట్లాడుకుందాము. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించిన సందేశం మీకు ముందే చేరి ఉన్నది గ్రూపులలో. ఒకటి ధిక్ర్ గురించి మరొకటి ఇస్తిగ్ఫార్ గురించి. అయితే ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ లో మన రోజువారీ జీవితంలో మనం చదివే దువాలలో ఏ గొప్ప విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను.

అయితే ఇందులో ప్రతి ఒక్క అంశం, ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, సపరేట్గా మనకు స్పష్టంగా అర్థం కావడానికి నేను రెండు టాపిక్కులుగా, రెండు అంశాలుగా వేరువేరు చెప్తాను. సుమారు ఒక 25 నుండి 30 నిమిషాలు ముందు ఇస్తిగ్ఫార్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత ధిక్ర్ గురించి.

అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం)

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా, యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా, వయుమ్‌దిద్‌కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా.
నేను ఇలా అన్నాను, ‘క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్యయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని ఒసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.’

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! సూరత్ నూహ్ 29వ పారాలో ఒక ముఖ్యమైన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి దావత్, వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశంలో ఇస్తిగ్ఫార్ గురించి ఉన్నటువంటి కొన్ని ఆయతులు, అందులోని కొన్ని గొప్ప భావం గలటువంటి, ఘనత గలటువంటి విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందు తిలావత్ చేశాను.

అయితే ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? ఇస్తిగ్ఫార్ అంటే మనం మన పాపాల మన్నింపుకై అల్లాహ్ తో అర్ధించడం. అస్తగ్ఫిరుల్లాహ్ అని మనం అంటాము సర్వసామాన్యంగా. నమాజ్ నుండి సలాం తిప్పిన తర్వాత అంటే ఏంటి? ఓ అల్లాహ్, నేను నా పాపాల నుండి నీ క్షమాభిక్షను, మన్నింపును కోరుతున్నాను.

సోదర మహాశయులారా, నేను ఈ ఇస్తిగ్ఫార్ గురించి మరికొన్ని విషయాలు చెప్పేకి ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎంతో మంది ఒకరి చేతి కింద పని చేస్తారు. అలాంటప్పుడు సర్వసామాన్యంగా ఏదైనా మన పనిలో మిస్టేక్ జరిగినప్పుడు మనం మన పై వారితో సారీ అని అంటూ ఉంటాము. కదా? కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో ఎన్నోసార్లు ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం అక్కడ ఆ సమయంలో ఆ పెద్దవారి ముందు సారీ అని, క్షమించండి అని ఈ భావం గల ఇంకా వేరే ఏ పదాలైనా గానీ ఉపయోగిస్తాము.

ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. తనకు పైగా ఉన్నటువంటి అధికారికి ఆ పని గురించి ఉత్తమ రీతిలో చేయాలని, అందులో ఏదైనా లోపం జరిగితే క్షమాపణ కోరాలని మన యొక్క స్వభావంలో ఈ విషయం ఉన్నది. అయితే మనమందరము కూడా మన సృష్టికర్త నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహు తాలా ఆరాధన కొరకే మనం పుట్టించబడ్డాము. ఇక తప్పు జరగకుండా నూటికి నూరు శాతం, హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం జీవితం గడపలేము. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఎల్లవేళల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యందు మన యొక్క లోపం, మన యొక్క కొరత, మనతో జరిగేటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు అన్నిటి గురించి ఓ అల్లాహ్, నీవు నన్ను క్షమించు, మన్నించు అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇది మన యొక్క ఆత్మశుద్ధి, ఆ పాపం నుండి ఇక ముందుకు దూరం ఉండడానికి, జరిగిన పాపం దాని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, మన్నింపు పొంది అతని కరుణ ఛాయల్లో రావడానికి, అతనికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇస్తిగ్ఫార్ ఎంతో ముఖ్యమైన విషయం.

అయితే రండి, ఇస్తిగ్ఫార్ గురించి రెండు, మూడు గంటలు చెప్పుకుంటూ పోయినా గానీ ఈ అంశం పూర్తి కాదు. అన్ని ఆయతులు, అన్ని హదీసులు ఎన్నో కోణాల నుండి దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

అన్నిటికంటే ముందు నేను ఇబ్ను మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ వినిపిస్తున్నాను. చాలా ముఖ్యమైన హదీస్ ఇది. దీని ద్వారా మనకు ఇస్తిగ్ఫార్ యొక్క లాభం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రండి ఇదిగోండి, ఈ హదీస్ అరబీ పదాలు మీరు కూడా చూస్తూ దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క భావాన్ని తెలుసుకోండి.

ఇప్పుడే మీకు చూపిస్తూ ఉన్నాను.

అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నిశ్చయంగా దాసుడు ఒక తప్పు, అపరాధం, పాపం చేసినప్పుడు అతని యొక్క హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. అతడు ఆ పాపాన్ని వదులుకుంటే, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, పాపం చేయడం ద్వారా అల్లాహ్ కు ఏదైతే దూరమయ్యాడు కదా, తాబా (అల్లాహ్ వైపునకు మరలితే) అతని ఆ హృదయంలో నుండి ఆ మచ్చ అనేది దూరమైపోతుంది. పాపాలు పెరిగిపోతే ఆ నల్ల మచ్చలు పెరుగుతూ పోతాయి, చివరికి పూర్తి హృదయంపై ఆ మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు ఎక్కువైపోయి హృదయమే నల్లగా అయిపోతుంది. ఇదే అల్లాహు అజ్జవజల్ల తన కితాబులో చెప్పాడు.” ఇదే,

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్.
అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.

ఇక్కడ అల్లాహు తాలా తుప్పు పట్టింది అని ఏదైతే అంటున్నాడో, ఈ తుప్పు అనేది హృదయానికి దేనివల్ల పట్టింది? వారి యొక్క దురాగతాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు పనులు ఏవైతే వారు చేస్తున్నారో.

ఇన్షా అల్లాహ్ మీకు విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటి? ఎప్పుడెప్పుడైతే దాసుడు ఓ తప్పుకు, ఓ పాపానికి ఒడిగడతాడో అప్పుడప్పుడు అతని యొక్క హృదయం నల్లగా అవుతుంది. పాపాలు పెరిగిపోతూ పోయాయి, కానీ వాటిని ఆ నల్ల మచ్చను దూరం చేయడానికి పాపాన్ని వదులుకోవడం, అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడం, అల్లాహ్ వైపునకు మరలడం ఇలాంటిదేమీ చేయకుంటే అది ఇంకా నల్లగా అయిపోయి తర్వాత చాలా ప్రమాదానికి మనిషి గురి అయిపోతాడు.

అయితే రండి ఇక్కడ మనం ముందు తెలుసుకుందాము, పాపం అంటే ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహ్ ఏ ఆదేశం ఇచ్చాడో దానిని పాటించకపోవడం పాపం. అల్లాహ్ ఏ విషయాన్ని చేయకూడదు అని చెప్పాడో అంటే అల్లాహ్ యొక్క వారింపులు, వాటికి పాల్పడడం ఇది పాపంలో లెక్కించబడుతుంది. ఈ విధంగా ఇది మన మధ్య అల్లాహ్ కు మధ్యలో కావచ్చు, మన మధ్య మనలాంటి మానవుల మధ్యలో కావచ్చు, మనము మరియు మానవులే కాకుండా ఇతర, ఉదాహరణకు ఎక్కడైనా ఒక చెట్టు ఉన్నది. నీడ ఆ చెట్టు ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నారు. అనవసరంగా ఆ చెట్టును కోసేసాము. ప్రజలకు కలిగేటువంటి లాభాన్ని మనం దూరం చేశాము. ఇది కూడా ఒక పాపమే. మనం డైరెక్ట్ గా ఒక మనిషికి బాధ కలిగించలేదు, ఇన్డైరెక్ట్ గా కలిగించాము. జంతువులు ఉన్నాయి, కాలక్షేపంగా నా యొక్క గురి బాగా ఉందా లేదా అని కేవలం పరీక్షించుకోవడానికి పక్షులను, జంతువులను ఈటెతో గానీ లేదా ఇంకా ఈ రోజుల్లో గన్ అలాంటి వేరే పరికరాలతో వాటిని చంపడం ఇది ఇస్లాం ధర్మంలో పాపంగా చెప్పడం జరిగింది. కొందరు కొన్ని రకాల పక్షుల పిల్లల్ని పట్టుకుంటారు దాని మూలంగా ఆ పక్షి యొక్క తల్లి ఏదైతే ఉంటుందో దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇది కూడా ఒక పాపంలో వస్తుంది. అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం వెళ్తూ వెళ్తూ ఆ ఏందీ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేది అని బనానా అరటిపండు యొక్క ఆ తొక్క ఏదైతే ఉందో అలాగే దారిలో పడేస్తాము. హదీస్ లో ఏముంది? దారిలో నుండి బాధ కలిగించే విషయాన్ని దూరం చేయడం పుణ్యకార్యం. ఇక్కడ మనం బాధ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం అల్లాహ్ పట్ల గానీ, ప్రజల పట్ల గానీ, ఇంకా వేరే ఎవరి పట్ల గానీ ఏదైనా వారికి హాని కలిగించడం ఇవన్నీ కూడా పాపాల్లో లెక్కించబడతాయి. పాపాలు చేయడం వల్ల అది స్వయం మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, పాపం వల్ల మన ఇంట్లో మనకు, మన పిల్లలకు, మన యొక్క సంపదలో, మన యొక్క ధనంలో, మన రోజువారీ జీవితంలో, మన సమాజానికి ఎంతో చెడు ఉంటుంది. పాపాల ప్రభావం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్షా అల్లాహ్ ఏ రోజైనా దాని గురించి వివరంగా తెలుసుకుందాము. కానీ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఇలాంటి ఏ తప్పు ఏ పాపం జరిగినా గానీ మనం స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహ్ తో క్షమాభిక్ష కోరాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటామో అక్కడ నాలుగు కండిషన్లను గుర్తుంచుకోవాలి. అప్పుడే అల్లాహ్ తో మనం కోరుకున్న ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. మన యొక్క తప్పు, మన యొక్క పొరపాటు, మన యొక్క పాపం అది మన్నించబడుతుంది. దాని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఈ కండిషన్లు పూర్తి చేయడంలో ఎంత వెనక ఉంటామో, ఎంత లేజీతనం మనం చేస్తామో అంతే మన తౌబా ఇస్తిగ్ఫార్ యొక్క ఆమోదం కూడా, అది స్వీకరించబడడం కూడా చాలా వెనక ఉండిపోతాము. ఏంటి అవి? మొదటిది, చేసిన తప్పును ఛీ అని భావించడం. దానిని అది గుర్తు వచ్చినప్పుడు నాతో ఎలా జరిగిపోయింది కదా అని ఒక పశ్చాత్తాప భావం అనేది మనిషిలో ఉండాలి. కొన్ని పాపాల గురించి ఎలా ఉంటుంది? అయ్యో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అని వదులుకుంటాము. కానీ మనసులో ఇంత మంచి అవకాశం పాయే కదా అని అనుకుంటాము. చూడడానికి పాపం చేయట్లేదు కావచ్చు, కానీ ఇది తౌబాలో రాదు. ఎందుకు? పాపం పట్ల కాంక్ష ఉంది. ఇక్కడ ఏం జరగాలి? మొట్టమొదటి షరతు, మొట్టమొదటి నిబంధన, పాపాన్ని తప్పుగా భావించాలి, పాపంగా భావించాలి, ఛీ నాతో ఎలా ఇది జరిగింది కదా అని ఒక బాధగా ఉండాలి. రెండవది, ఏ పాపం నుండి మనం క్షమాపణ కోరుకుంటున్నామో, తౌబా చేస్తున్నామో దానిని వదులుకోవాలి. దానిని వదులుకోవాలి. వడ్డీ తినే వ్యక్తి గానీ, జూదం ఆడే వ్యక్తి గానీ, మత్తు సేవించే వ్యక్తి గానీ, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు, కానీ ఆ పాపాన్ని వదులుకోవడం లేదు. ఒక వ్యక్తి నమాజ్ చేయట్లేదు. మహా ఘోరమైన పాపం ఇది. ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు. మళ్ళీ నమాజ్ సమయం వచ్చింది. నమాజ్ చేయడం, అతడు నమాజ్ చేయకపోవడం ఒక చెడు అలవాటు ఏదైతే చేసుకున్నాడో దానిని వదులుకోవాలి. మూడో కండిషన్, ఇకముందు నేను ఆ పాపానికి ఒడిగట్టను, నేను ఆ పాపం చేయను అని బలంగా సంకల్పించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ మూడు పాపాలు, సారీ, ఈ మూడు కండిషన్లు పాపం యొక్క సంబంధం మనిషి మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒకవేళ ఒకవేళ పాపం ఎవరితో, మనిషి పట్ల జరిగి ఉంటే, ఎవరినైనా కొట్టి ఉన్నాము, ఎవరినైనా మనం అవమానపరిచి ఉన్నాము, ఎవరిదైనా ఏదైనా సొమ్ము అన్యాయంగా తీసుకుని ఉన్నాము, అలాంటప్పుడు ఈ మూడు షరతులతో పాటు కండిషన్లతో పాటు ఆ వ్యక్తితో క్షమాపణ కోరుకోవాలి, ఆ వ్యక్తి మన్నిచేసేయాలి, లేదా అతని యొక్క హక్కు అతనికి చేరవేసేయాలి. ఈ నాలుగు కండిషన్లు ఉంటాయి. ఈ నాలుగు కండిషన్లు మనం పూర్తి చేయాలి. అప్పుడే మన తౌబా, మన ఇస్తిగ్ఫార్ అన్నది స్వీకరించబడుతుంది.

సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఏంటి అవి? ఒకటి, పాపాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. రెండవది, పాపాలు ఎంత ఘోరమైనవి అయినా ఆ ఇంత పెద్ద పాపం చేశాను నేను, అల్లాహ్ క్షమిస్తాడా నన్ను అని అనుకోవద్దు. నిన్ను క్షమించడం అల్లాహ్ కు కష్టం ఏమీ కాదు. కానీ స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని పాపాన్ని విడనాడాలి. రెండోది ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంత ఘోరమైన పాపాలు అయినా గానీ. మూడవది, అజ్ఞానం వల్ల, షైతాన్, మానవుల్లోని, జిన్నాతుల్లోని షైతానుల దుష్ప్రేరేపణ వల్ల అయ్యో ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కదా నేను పాపాలు, అని అనుకోవద్దు. అర్థమవుతుంది కదా? పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపమైనప్పటికీ, మూడవది ఎంత దీర్ఘకాలం నుండి ఉన్నా గానీ, నేను ఇందులో ప్రతి ఒక్కదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు అని నేను ఆ ఆధారాలు మీకు చూపడం లేదు.

ఇక సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీరు గమనించండి, సహీహ్ ముస్లిం షరీఫ్ ఇంకా తిర్మిజీ, ఇబ్ను మాజా వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చిన విషయం, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమని విశ్వసిస్తాము? మాసూమ్ అనిల్ ఖతా, పాప రహితులు ప్రవక్తలు. అయినా గానీ సహాబాలు ఏమంటున్నారు? ఒక్కొక్క సమావేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వందేసి సార్లు రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అని అనేవారు. ప్రవక్త అయి ఇంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండేవారంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి? అయితే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ కోరుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. లాభాల దాని యొక్క ఘనతలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, చాలా ఎక్కువ ఘనతలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా కొన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో సూరత్ నూహ్ లోని ఆయత్లు ఒక్కసారి ఆ ఆయతుల యొక్క కేవలం భావాన్ని మీరు స్పీడ్ గా చూసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మీకు చూపించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి కసీరా.

ఆయత్ నెంబర్ 10 నుండి మొదలవుతుంది చూడండి. మన సూర నెంబర్ 71. నేను ఇలా అన్నాను, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, “క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.” లాభాలు ఏంటి? “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.” వర్షాలు లేకుంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే అల్లాహ్ వర్షాలు కురిపిస్తాడు. రెండో లాభం, “మీ సిరిసంపదల్లోనూ,” చూస్తున్నారా? రెండో లాభం సిరిసంపదల్లో. మూడో లాభం, “పుత్ర సంతతిలోనూ.” సంతానం కలిగే విషయంలో “పురోభివృద్ధిని ఒసగుతాడు.” నాలుగో లాభం, “మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు.” మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఐదో లాభం, “ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.” తోటలు ఉంటే నీళ్లు వాటికి అవసరం. అయితే అల్లాహు తాలా కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. చూస్తున్నారా? ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు కనబడిందో, ఇస్తిగ్ఫార్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క దయతో మనకు లాభాలు కలుగుతూ ఉంటాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇది సహీహ్ హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు సహీహాలో ప్రస్తావించారు 2299. ఏంటి హదీస్? జుబైర్ బిన్ అవ్వామ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ప్రళయ దినాన స్వయం తన కర్మల పత్రాన్ని చూసి సంతోషపడాలి అని ఎవరైతే కోరుతున్నారో, కోరుకుంటున్నారో, ఎంత ఎక్కువ ఇస్తిగ్ఫార్ అందులో ఉంటే అంతే ఎక్కువగా అతనికి ప్రళయ దినాన సంతోషం కలుగుతుంది.” అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, గమనిస్తున్నారా? ఈ ప్రపంచపు ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పగలను. ఒక వ్యక్తి ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి ఒక వర్క్ షాప్ లో, ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో. ఇద్దరితో కూడా తప్పు జరిగింది. కానీ ఒక వ్యక్తి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి, “సార్, ఆ పనిలో నాతో ఈ మిస్టేక్ జరిగింది, క్షమించండి సార్, ఇక నుండి నేను శ్రద్ధ వహిస్తాను.” జీతం తీసుకునే సమయం వచ్చేసరికి మరొక వ్యక్తి క్షమాపణ కోరుకోలేదు. ఆ ఏంటి మొన్న నువ్వు ఆ తప్పు చేశావు కదా, అయ్యో జరగదా అంత మాత్రంలో దాన్ని గురించి మందలిస్తావా? ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా వేరే ఏదైనా అడ్డ రీతిలో మాట్లాడాడు. మీరే ఆలోచించండి ఇద్దరిలో ఎవరు ఆ మేనేజర్ కి ఇష్టం? ఆ మేనేజర్ ఎవరి పట్ల ఇష్టపడతాడు? మరియు మనం మన జీతం తీసుకునే సందర్భంలో మనతో జరిగే మిస్టేక్ వల్ల ఏ మన జీతం అయితే కట్ అవుతుందో దాని కారణంగా జీతం పొందిన రోజు సంతోషం ఎవరు ఉంటారు, బాధగా ఎవరు ఉంటారు? కేవలం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ప్రళయ దినాన మనం అల్లాహ్ ముందు హాజరైన తర్వాత అక్కడ మన కర్మ పత్రాలు తూకం చేయబడతాయి, మన కర్మ పత్రాలు మన కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఆ సందర్భంలో మన కర్మ పత్రంలో మనకు సంతోషకరమైన విషయం చూడాలనుకుంటే అధికంగా, అధికంగా, అధికంగా ఇస్తిగ్ఫార్ అందులో ఉండడం తప్పనిసరి.

మరొక హదీస్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు 3930, అబ్దుల్లా బిన్ బుస్ర్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, “తూబా.” తూబా అంటే ఏంటి? తూబా అంటే మీకు సంతోషం, మీకు శుభవార్త కలుగు గాక అని కూడా భావం వస్తుంది. తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని ద్వారా స్వర్గవాసుల వస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ విధంగా అల్లాహు తాలా దాని నీడలో ఉండేటువంటి గొప్ప శుభవార్త మనకు ఇస్తున్నాడని భావం. అయితే ఎవరైతే తన కర్మ పత్రాల్లో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చూస్తారో అలాంటి వారికి గొప్ప శుభవార్త ఉన్నది.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనం ఇస్తిగ్ఫార్ పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఏమాత్రం ఉండకూడదు. ఇక రండి, మన రోజువారీ జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి? సోదర మహాశయులారా, అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ప్రతి నమాజ్ వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్. రుకూలో, సజ్దాలో సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. అల్లాహుమ్మగ్ఫిర్లీ. గుర్తుంది కదా, అల్లాహుమ్మగ్ఫిర్లీ అంటే ఓ అల్లాహ్ నన్ను క్షమించు. రుకూలో, సజ్దాలో. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్ లో మనం చదవవలసిన దువాలలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు అడిగినప్పుడు చెప్పిన దువా ఏమిటి?
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇన్దిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్.
చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో,
اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిక్కహూ వజిల్లహూ వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ.
అంటే ఏంటి? గమనించండి ఇక్కడ భావాన్ని. ఇది ముస్లిం షరీఫ్ లోని హదీస్. అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ. ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు. కుల్లహూ అన్ని పాపాలను. దిక్కహూ వ జిల్లహూ, చిన్న పాపాలు, పెద్ద పాపాలు. వ అవ్వలహూ వ ఆఖిరహూ, ముందు చేసినవి, తర్వాత చేసినవి. వ అలానియతహూ వ సిర్రహూ, నేను ఎక్కడైనా దాగి ఉండి గుప్తంగా చేసిన పాపాలైనా లేదా బహిరంగంగా చేసిన పాపాలైనా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అన్ని రకాల పాపాల నుండి క్షమాపణకై ఎంత మంచి దువాలు నేర్పబడ్డాయో మీరు గమనిస్తున్నారు కదా? ఇలాంటి దువాలు మనం నేర్చుకోవాలి. రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మాది ఒక పీడీఎఫ్ ఉంది, చదవండి. అందులో ఇలాంటి దువాలన్నీ కూడా జమా చేయడం, అందులో పూర్తి రిఫరెన్స్ తో తెలియజేయడం జరిగినది.

సోదర మహాశయులారా, అతి ముఖ్యంగా, అతి ముఖ్యంగా మనం ఎన్ని రకాల పదాలు, ఏ ఏ సందర్భాలు అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడానికి ఉపయోగిస్తామో వాటన్నిటిలోకెల్లా సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైనది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్.

اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్‌దిక వ వఅ్‌దిక మస్తతఅతు, అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు, అబూఉ లక బి నిఅమతిక అలయ్య, వ అబూఉ లక బి జంబీ ఫగ్ఫిర్లీ, ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

మీరందరూ కూడా దీనిని కంఠస్థం చేసుకునే అవసరం లేదు. లేదు, నిజంగా చెప్తున్నాను. కేవలం చూసి చదవండి సరిపోతుంది. మీకు ఈ ఘనత ప్రాప్తిస్తుంది. ఈ దువా గురించి ముస్నద్ అహ్మద్ లో ఒక పదం ఏముందో తెలుసా? ఇన్న అవ్ఫకద్ దుఆ. దువాలలో ఎక్కువ భాగ్యాన్ని ప్రసాదించేటువంటి దుఆ, అల్లాహుమ్మ అంత రబ్బీ వ అన అబ్దుక, జలమ్తు నఫ్సీ వఅతరఫ్తు బిజంబీ, యా రబ్బి ఫగ్ఫిర్లీ జంబీ ఇన్నక అంత రబ్బీ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. మరియు నేను సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ లో ఏదైతే చదివాను కదా, దాని గురించి సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే పగలు, ఉదయం పూట దీనిని సంపూర్ణ నమ్మకం మరియు విశ్వాసంతో చదువుతారో సాయంకాలం కాకముందే అతను చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. ఎవరైతే రాత్రి చదువుతారో పూర్తి నమ్మకంతో అతను ఉదయం కాకముందు చనిపోతే అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప అదృష్ట విషయం ఇందులో తెలియజేయడం జరిగింది? అందుకొరకే సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. కానీ ఉదయం అజ్కార్లలో, సాయంకాలం అజ్కార్లలో కనీసం ఒక్కసారైనా గానీ, ఒక్కసారైనా గానీ ఈ దువా చదవాలి.

సోదర మహాశయులారా ఇక్కడ మీకు ఒక శుభవార్త వినిపిస్తున్నాను, శ్రద్ధ వహించండి. కొందరు మీ యొక్క ఫ్రెండ్స్ లలో, మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ముస్లిమేతరులు అయి ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సందర్భంలో లేదా అట్లే ఏదైనా సందర్భంలో, “అరే మీ ముస్లింలు మంచిగా దువా చేస్తారురా భాయ్, మీ ముస్లింలు ఆ ఏదో చదివి ఊదుతారు చాలా నయం అవుతుంది” ఈ విధంగా కొంచెం ఒక ముస్లింల వైపు ఆకర్షణ కలిగి, ముస్లింల యొక్క దువాతో వారు ప్రభావితులై ఉంటారు. అలాంటి వారిలో, అలాంటి వారికి ఈ దువా మీరు నేర్పే ప్రయత్నం చేయండి. దీని యొక్క భావం వారిని చదవమని చెప్పండి, అరబీలో ఈ పదాలు రాకపోయినా గానీ.

ఒక సందర్భంలో ఏం జరిగింది? హుసైన్ అనే వ్యక్తి, స్వాద్ తో వస్తుంది ఇక్కడ పేరు, ఇమ్రాన్ ఇబ్ను హుసైన్ గారి యొక్క తండ్రి, ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, దాని యొక్క రిసెర్చ్ చేసేవారు షేఖ్ షుఐబ్ అల్ అర్నావూత్ దీని యొక్క సనదును సహీహ్ అని చెప్పారు. ఒక వ్యక్తి హుసైన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను వచ్చి ప్రవక్తతో అడిగాడు, “నాకు మీరు ఏదైనా నేర్పండి, నేను చెప్పుకోవడానికి, చదువుకోవడానికి.” ప్రవక్త చెప్పారు,

اللَّهُمَّ قِنِي شَرَّ نَفْسِي، وَاعْزِمْ لِي عَلَى أَرْشَدِ أَمْرِي
అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ, వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ.
ఓ అల్లాహ్ నా యొక్క నఫ్స్, స్వయం నాలో ఉన్నటువంటి చెడు నుండి నన్ను కాపాడు. మరియు అతి ఉత్తమ విషయం వైపునకు నాకు మార్గదర్శకత్వం చేసి నేను దానిపై దృఢంగా ఉండే విధంగా నాకు భాగ్యం కలుగజేయి.

ఒక నాన్ ముస్లిం, ముస్లిమేతరుడు అడిగినప్పుడు ప్రవక్త అతనికి ఈ దువా నేర్పారు. ఆ వ్యక్తి ఈ దువా చదవడం మొదలు పెట్టాడు, కొద్ది రోజులకు అల్లాహు తాలా అతనికి భాగ్యం కలుగజేశాడు, అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన కొద్ది రోజులకు మళ్ళీ వచ్చాడు. వచ్చి చెప్పాడు, “నేను ఒక సందర్భంలో మీ వద్దకు వచ్చాను, మీరు అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ అని నాకు నేర్పారు. అయితే నేను దానిని చదువుతూ చదువుతూ ఉన్నాను, నాకు ఇస్లాం భాగ్యం కలిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలో మీరు నాకు తెలియజేయండి.” అప్పుడు ప్రవక్త నేర్పారు,

اللَّهُمَّ اغْفِرْ لِي مَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَخْطَأْتُ وَمَا عَمَدْتُ، وَمَا عَلِمْتُ وَمَا جَهِلْتُ
అల్లాహుమ్మగ్ఫిర్లీ మా అస్రర్తు వమా ఆలన్తు వమా అఖ్తఅతు వమా అమద్తు వమా అలిమ్తు వమా జహిల్తు.
ఓ అల్లాహ్ నన్ను క్షమించు. నేను గోప్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు. ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో అవి వాటిని కూడా మన్నించు, ఏ పాపాలైతే తెలియకుండా చేశానో వాటిని కూడా మన్నించు. మరియు ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో మరియు ఏ పాపాలైతే నేను తెలియకుండా అజ్ఞానంగా చేశానో అన్నిటినీ కూడా నీవు మన్నించు.

చూస్తున్నారా గమనిస్తున్నారా? ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు నేర్పేవారు. అయితే సోదర మహాశయులారా, చివరిలో నేను ఇస్తిగ్ఫార్ కు సంబంధించిన మరొకటి మీకు వినిపించదల్చుకుంటున్నాను, దాన్ని కూడా గుర్తుంచుకోండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి దువాలన్నీ కూడా మీరు కంఠస్థం చేసే అవసరం లేదు, కేవలం చూసి చదువుతున్నా గానీ మీకు లాభం కలుగుతుంది.

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيَّ الْقَيُّومَ وَأَتُوبُ إِلَيْهِ
అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై.
అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై.
ఇది ఎప్పుడూ కూడా చదవడం మర్చిపోకండి. ఇది మర్చిపోకండి ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఇది చదువుతూ ఉంటారో వారి యొక్క పాపాలు ఒకవేళ వారి యొక్క పాపాలు ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా గానీ మన్నించబడతాయి. చివరికి అతను ధర్మ యుద్ధం నుండి వెనుదిరిగినా అలాంటి పాపం కూడా ఈ దువా కారణంగా మన్నించబడుతుంది. చూశారా? చూస్తున్నారా గమనిస్తున్నారా ఎంత గొప్ప లాభం అనేది ఇందులో తెలపడం జరిగింది? అందుకొరకు సోదర మహాశయులారా, ఇస్తిగ్ఫార్ అనేది మాటిమాటికి చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందే చెప్పాను చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి. కానీ ఈ కొన్ని విషయాలు ఈరోజు మనకు సరిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో మన రోజువారీ జీవితంలో మనం చదవవలసిన కొన్ని ముఖ్యమైన దువాలు, సందర్భాల గురించి కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భాల్లో వాటిని మీరు పాటిస్తూ ఉండండి. ఇన్షా అల్లాహ్ ఇక్కడి వరకు దీన్ని ఆపేసి ఈ అంశాన్ని వేరే అంశం వైపునకు ముందుకు సాగుదాము. విన్న విషయాలను అర్థం చేసి ఆచరించే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ధిక్ర్ (అల్లాను స్మరించడం)

సరే మిత్రులారా, ఇప్పుడు నేను రెండవ అంశం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను మరియు అందరూ కూడా దీనిని విని, ఆచరించి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వాలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا
వజ్కురుల్లాహ జిక్రన్ కసీరా.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! మనమందరము దాసులము. దాసుడు తన యజమాని యొక్క స్తుతి, అతని యొక్క పొగడ్త, అతని యొక్క గొప్పతనాన్ని చాటడమే దాసుని యొక్క అసలైన పని. ఇందులో అతను ఎంత వెనక ఉంటే అంతే అతనికి నష్టం జరుగుతుంది, యజమానికి ఏ నష్టం జరగదు. అందుకొరకే ఒక మన తెలుగు కవి ఏం చెప్తున్నాడు?

ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా.

సృష్టికర్తను గ్రహించాలి. ఆ సృష్టికర్తనే మనం స్తుతిస్తూ ఉండాలి, అతన్నే పొగడుతూ ఉండాలి.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధన కొరకే పుట్టించబడ్డాము. అయితే ఇక మనకు వేరే పనులు వద్దా? ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే ఎన్నో పనులు కూడా ఉంటాయి. మాటిమాటికి అల్లాహ్ నే ఆరాధించుకుంటూ ఎలా ఉండగలుగుతాము అని కొందరు చికాకుగా అడ్డ ప్రశ్న వేస్తారు. కానీ ఇస్లాం ధర్మాన్ని కొంచెం లోతు జ్ఞానంతో, మంచి విధంగా అర్థం చేసుకుంటూ చదివారంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం ఆరాధనలో ఉన్నట్లు, మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ ను గుర్తిస్తూ ఉన్నట్లు చేసుకోగలము. కానీ ఈ భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరు ఎంత ఎక్కువ ఇస్లాం జ్ఞానం నేర్చుకుంటారో అంతే ఎక్కువగా వారు తమ ప్రతి విషయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రతి ఘడియను అల్లాహ్ యొక్క స్మరణలో గడపగలుగుతారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా గానీ, ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏదైనా వ్యవసాయంలో ఉన్నా, బజార్లో ఉండి ఏమైనా సామానులు అమ్ముతూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా గానీ. అవునా? అవును. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? ఇన్నీ అహ్‌తసిబు నౌమతీ కమా అహ్‌తసిబు కౌమతీ. నేను రాత్రి మేల్కొని అల్లాహ్ ఎదుట నిలబడి తహజ్జుద్ చేస్తూ ఉండి, అహ్‌తసిబు (పుణ్యం ప్రాప్తించాలని కోరుతూ ఉంటానో), అహ్‌తసిబు నౌమతీ (నేను పడకపై పడుకొని నిద్రిస్తూ కూడా దీనికి బదులుగా అల్లాహ్ నాకు పుణ్యం ప్రసాదించాలి, ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి, నమ్మకం కలిగి ఉంటాను).

అవును మరి. ఎవరైతే టైం మేనేజ్మెంట్ ఏ కాదు ఈనాటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులలో వినేది, స్వయం తన క్షణ క్షణాన్ని అల్లాహ్ యొక్క స్మరణలో, అల్లాహ్ యొక్క ధిక్ర్ లో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలా గడపగలను అన్నది నేర్చుకోవాలి. తాను చేస్తున్న ప్రతిదీ కూడా అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి.

ఎందుకంటే ముస్లిం అని ఏదైతే మనం అంటామో దాని భావమే ఏంటి? విధేయుడు. అయితే విధేయత ఏదో ఒక్క సందర్భంలో కాదు, ఎల్లవేళల్లో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అది నీ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటే నీవు అతని ఆరాధనలో ఉన్నట్లే, అతని స్మరణలో ఉన్నట్లే.

ఈ విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో వారికి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వారిపై వచ్చిపడినా అల్లాహ్ యొక్క స్మరణ నుండి వారు దూరం కాలేరు. ఒక విషయం ఆలోచించండి, సుఖంగా హాయిగా జీవిస్తున్నారు అని మనం కొందరి గురించి అనుకుంటాము. ఏ విషయం చూసి? అతని వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి, అతని వద్ద ఉన్న బిల్డింగ్లను చూసి, అతని వద్ద ఉన్న కార్లను చూసి, అతని వద్ద ఉన్నటువంటి ధన సంపద, ఈ లోకపు కొన్ని సౌకర్యాలు. అరే వానికేం బాధరా భాయ్, ఎంత ధరలు పెరిగినా గానీ బోలెడంత డబ్బు ఉన్నది వానికి, వాడు హాయిగా బతుకుతాడు. ఈ విధంగా మనం అనుకుంటాము. కానీ ఒకవేళ అతను అల్లాహ్ స్మరణలో లేకుంటే, తన జీవితాన్ని అల్లాహ్ యొక్క విధేయతలో గడపకుంటే అతడు ఈ సౌకర్యం సౌకర్యం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఇది వాస్తవానికి చాలా చాలా బాధాకరమైన జీవితం.

ఇక సోదర మహాశయులారా, ఈ ధిక్ర్ యొక్క అంశం కూడా, అల్లాహు అక్బర్, చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రతీది కూడా ధిక్ర్ లో రావచ్చు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ధిక్ర్. నమాజ్ కూడా ధిక్ర్. ప్రతి ఆరాధన అల్లాహ్ యొక్క ధిక్ర్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ధిక్ర్ ను రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి సులభ రీతిలో విభజించి నేను చెబుతున్నాను. ఒకటి ఏమిటి? ధిక్ర్ అంటే స్మరించడం, గుర్తు చేయడం, మరిచిపోకుండా ఉండడం. ఈ భావాలు వస్తాయి ధిక్ర్ అన్న అరబీ పదానికి. అయితే అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండాలి అని అంటే ఏంటి? మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ స్థితిలో ఉంటామో అక్కడ ఆ సమయంలో, ఆ స్థితిలో, ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఏ ఆదేశం ఉన్నది, ప్రవక్త వారి ఏ విధానం ఉన్నది తెలుసుకొని ఆ రకంగా చేయడం, పాటించడం ఇది అల్లాహ్ యొక్క ధిక్ర్. ఇది ఒక సామాన్య భావంలో, ఓకేనా? ఇక రెండవది, మనం అల్లాహ్ ను గుర్తు చేస్తూ కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని అనడం. ఉదాహరణకు, ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు బిస్మిల్లాహ్. ఏదైనా తిన్న తర్వాత, తాగిన వెంటనే అల్హమ్దులిల్లాహ్. ఏదైనా శుభవార్త మనకు దొరికింది, మాషా అల్లాహ్. ఏదైనా పని పూర్తయింది, అల్హమ్దులిల్లాహ్. ఏదైనా బాధాకరమైన వార్త మనకు వచ్చింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆశ్చర్యకరమైన ఏదైనా విషయం మనకు తెలిసింది, సుబ్హానల్లాహ్. ఎవరి గురించైనా, ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయాలు చెప్పుకుంటూ విన్నాము, అల్లాహు అక్బర్. మనం ఏదైనా సహాయం కోరాలనుకున్నాము, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మనం అల్లాహ్ ను స్తుతించి పుణ్యాలు సంపాదించుకోవాలనుకుంటున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహ్. మన యొక్క పుణ్యాల త్రాసు బరువుగా కావాలని కోరుతున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాధ కలుగుతుంది, అవన్నీ కూడా తొలగిపోవాలని కాంక్ష ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏదైనా బాధగా ఏర్పడుతుంది, కష్టాల్లో ఉన్నారు అవి తొలగిపోవాలి, దూరం అయిపోవాలి, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్. ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో.

ఒక్కసారి మీరు సూరత్ ఆలె ఇమ్రాన్. సూర ఆలె ఇమ్రాన్ చివరి కంటే కొంచెం ముందు, కొన్ని ఆయతుల ముందు ఈ రెండు ఆయతులను గనుక మీరు శ్రద్ధ వహించారంటే ఎంత గొప్ప శుభవార్త ఇందులో ఉందో ఒక్కసారి మీరు చూడండి. అల్లాహు తాలా ఇలాంటి శుభవార్త ఇస్తున్నాడు.

అది ఏమిటంటే, సూర ఆలె ఇమ్రాన్, సూర నెంబర్ మూడు, ఆయత్ నెంబర్ 191.

الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
అల్లజీన యజ్కురూనల్లాహ కియామవ్ వ కుఊదవ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్, రబ్బనా మా ఖలఖ్త హాజా బాతిలా, సుబ్హానక ఫకినా అజాబన్నార్.
వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. వీరే నిజమైన విజ్ఞులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఇలాంటి వారే అల్లాహ్ ను అన్ని స్థితుల్లో స్మరిస్తూ, గుర్తు చేస్తూ, అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉంటూ తమ జీవితం గడుపుతారు కదా, భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, “మా ప్రభువా, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. సుబ్హానక్, నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.”

ఇక్కడ మీరు గమనించారు కదా? వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. అల్లాహ్ ను ఎప్పుడెప్పుడు స్మరించాలి? అన్ని స్థితుల్లో స్మరిస్తూ ఉండాలి అన్నటువంటి గొప్ప విషయం ఇందులో మనకు తెలిసినది. అర్థమైంది కదా?

ఇక ఈ ధిక్ర్ మనం ఎల్లవేళల్లో చేస్తూ ఉంటే మనకు ఏంటి లాభం కలుగుతుంది? అల్లాహు అక్బర్. నేను కొన్ని లాభాలు ఇంతకు ముందే మీకు చెప్పాను కొన్ని పదాలు చెప్తూ చెప్తూ. ఇందులో అతి గొప్ప విషయం మీరు గమనించాల్సింది, అదేమిటి? ముస్నద్ అహ్మద్ లో వచ్చిన హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 134 హదీస్ నెంబర్. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క వసియత్, వాంగ్మూలం తన కుమారుడికి ఏముండినది? ఆయన చెప్పారు, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్ అధికంగా చదువుతూ ఉండు. ఎందుకు? దీని ఘనత, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదంటే, ఏడు ఆకాశాలు, ఏడు భూమిలు త్రాసులోని ఒక పల్లెంలో పెట్టబడి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ను మరో పల్లెంలో ఇది త్రాసు యొక్క రెండు పల్ల్యాలు ఉంటాయి కదా, ఒక వైపున ఏడు ఆకాశాలు, ఏడు భూములు, మరోవైపున కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టబడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నది చాలా బరువుగా అయిపోతుంది. అంతేకాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, ప్రాముఖ్యత గురించి ఇంకా ఏం చెప్పారు? ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక రింగ్ మాదిరిగా, ఎలాంటి రింగ్? చాలా బలమైన, గట్టి. లా ఇలాహ ఇల్లల్లాహ్ దానిని విరగ్గొట్టగలిగేంతటి శక్తి కలదు. అల్లాహు అక్బర్ చూస్తున్నారా? ఆ తర్వాత సుబ్హానల్లాహి వబిహమ్దిహి గురించి ఏం చెప్పారో చూడండి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి ఇది కూడా అధికంగా నీవు చదువుతూ ఉండు, దీని గురించి నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క ఇబాదత్, ప్రతి వస్తువు యొక్క ఆరాధన. ఈ విషయం మీకు ఖురాన్ లో తెలుస్తుందా?

وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ
వఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిల్ లా తఫ్కహూన తస్బీహహుమ్.
ఆకాశాలు, భూములు అన్నీ కూడా అల్లాహ్ యొక్క స్తుతి, అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాయి. వాటిలో ఉన్న ప్రతీది కూడా సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హదీస్ లో ఇదే విషయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం తన కొడుక్కు చెప్పారు, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి ప్రతి సృష్టిలోని ప్రతీ దాని యొక్క సలాహ్. దీని ద్వారా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి సుబ్హానల్లాహి వబిహమ్దిహి అనడం ద్వారానే వారికి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఆహారం లభిస్తున్నది.” అందుకొరకే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాము? నాకు మంచి ఉద్యోగం ఉంటేనే నా ఉపాధి, నాకు నా మంచి ఆ వ్యవసాయం ఉంటేనే ఉపాధి. ఇవన్నీ బాహ్యమైన సాధనాలు. వీటిలో హలాల్ ఏవో వాటిని మనం పాటించాలి. కానీ ఉత్తమమైన ఉపాధి లభించడానికి బాహ్యంగా కనబడని ఎన్నో, ఎన్నో సాధనాలు ఉంటాయి. వాటిలో అతి గొప్పది, అతి ముఖ్యమైనది అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్.

సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలోని ధిక్ర్ లలో కొన్ని ఘనతలు మీరు చూడండి. ఈ విషయాలను మనం ఒకవేళ గ్రహించామంటే ప్రతిరోజు మనం అల్లాహ్ యొక్క ధిక్ర్ ఇంకా అధికంగా చేస్తూ ఉండగలము. అధికంగా చేస్తూ ఉండగలము. ఉదాహరణకు, ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక దువా ఉంది,

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్కిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక.
ఉదయం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు” అని అంటారు. సాయంకాలం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అమ్సైతు” అని అంటారు. ఈ దువా చదవడం ద్వారా లాభం ఏంటి? ఈ దువా ఉదయం చదివినట్లయితే వారి యొక్క పగలంతా జరిగిన పాపాలు మన్నించబడతాయి. సాయంకాలం చదివిన ఈ దువా ఎవరైతే నాలుగు సార్లు చదివేది ఉంటే వారిని నరకాగ్ని నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ లో ఉదయం, సాయంకాలం కొన్ని అజ్కార్లు వేరువేరుగా ఉన్నాయి మరియు ఎక్కువ శాతం ఉదయం, సాయంకాలం రెండు సందర్భాల్లో చదివేటివి ఉన్నాయి. ఒక దువా వస్తుంది,

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ
అఊజు బికలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.
మూడు సార్లు ఎవరైతే దీనిని చదువుతారో వారికి రాత్రి ఏ విష పురుగు హాని కలిగించదు అని ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్. గమనించండి ఎంత గొప్ప పుణ్యం ఇందులో, ఎంత గొప్ప లాభం ఉంది ఇందులో. అలాగే ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు

بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ వహువస్ సమీఉల్ అలీమ్.
చదివేది ఉంటే వారికి ఏదీ కూడా నష్టం పరచదు అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది.

సోదర మహాశయులారా,

لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్.
ఇది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదివేది ఉంది. ఉదయం, సాయంకాలం చదివేది ఉంది. ఇన్షా అల్లాహ్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్సు కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో చదివే దాంట్లో కొన్ని పదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి, దాని ప్రకారంగా వాటి యొక్క ఘనతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మీరు అల్లాహ్ యొక్క ధిక్ర్ లలో ఫర్జ్ నమాజ్ తర్వాత మనం పది పది సార్లు సుబ్హానల్లాహ్, పది సార్లు అల్హమ్దులిల్లాహ్, పది సార్లు అల్లాహు అక్బర్ లేదా 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే 33, 33, 33 తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కసారి చదివి వంద పూర్తి చేస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ అవి మన్నించబడతాయి. ఎంత గొప్ప అదృష్టం గమనిస్తున్నారా మీరు? అలాగే సోదర మహాశయులారా, పది సార్లు, పది సార్లు, పది సార్లు చదవడం ఫర్జ్ నమాజ్ ల తర్వాత. దీని ఘనత నమాజ్ నిధులు అనేటువంటి మా వీడియోలో చెప్పడం జరిగినవి. మీరు జీడీకే ఎన్ఎస్సిఆర్ఈ యూట్యూబ్ ఛానల్ లో వెళ్లి నమాజ్ నిధులు అన్నది చూడండి. సుమారు దాంట్లో 10వ వీడియో, 10వ ఎపిసోడ్. మీకు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసినంత, ఉమ్రా చేసినంత, హజ్ చేసినంత, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత పది పది సార్లు మీరు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అంటూ ఉంటే, ఎంత గొప్ప ఘనతనో గమనించండి.

ఇంకా సోదర మహాశయులారా, ఈ పది పది సార్లు చదవడం ద్వారా దీని గురించి సహీహ్ హదీస్ ఒకటి అబూ దావూద్ లో కూడా వచ్చి ఉంది. మనం పది పది సార్లు చదివితే 30 అవుతాయి, ఐదు నమాజ్ లలో కలిపితే 150 అవుతాయి, కానీ త్రాసులో ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.

సోదర మహాశయులారా, మనం ఎప్పుడైతే నమాజ్ లో వచ్చి నిలబడతామో సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అని చదువుతామో ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని సహీహ్ ముస్లిం లో వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ప్రవక్తతో నేను ఈ హదీస్ విన్నప్పటి నుండి నా నమాజ్ ఆరంభంలో నేను ఇదే చదువుతాను అని. గమనిస్తున్నారా? ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణలో చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందుకొరకే అల్లాహు తాలా మీరు అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయండి అని చెప్పాడు. మరియు ఏ నమాజ్ లో ఎక్కువగా అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో ఆ నమాజ్ యొక్క సవాబ్, ఆ నమాజ్ యొక్క పుణ్యం పెరిగిపోతుంది. ఏ ఉపవాసంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువ ఉంటుందో ఆ ఉపవాస పుణ్యం అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఏ హజ్ లో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువగా ఉంటుందో ఆ హజ్ లో, ఆ హజ్ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

చివరిలో ఒక రెండు విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాము. అదేమిటంటే అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడం ఇది విశ్వాసుల ఉత్తమ గుణం. ధిక్ర్ లో వెనక అయి ఉండడం, ధిక్ర్ లో బద్ధకం వహించడం ఇది మునాఫికుల గుణం. మునాఫికులు అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడంలో చాలా బద్ధకం వహిస్తారు అని అల్లాహు తాలా స్పష్టంగా ఖురాన్ లో తెలిపాడు. అల్లాహు తాలా ఖురాన్ లో తెలిపాడు. అయితే అలాంటి ఆ బద్ధకం వహించే మునాఫికులలో మనం ఏ మాత్రం చేరకూడదు. మనం ఏ మాత్రం చేరకూడదు. సూరత్ నిసా ఆయత్ నెంబర్ 142. మీకు కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను, శ్రద్ధగా చూసి ఆ మునాఫికుల లిస్టులో నుండి తమను తాము బయటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.

إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊనల్లాహ వహువ ఖాదిఉహుమ్, వఇజా కామూ ఇలస్సలాతి కామూ కుసాలా యురాఊనన్నాస వలా యజ్కురూనల్లాహ ఇల్లా కలీలా.
నిశ్చయంగా కపటులు అల్లాహ్ ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు చాలా తక్కువగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తారు. నామమాత్రంగా అల్లాహ్ ని స్మరిస్తారు.

ఇలాంటి వారిలో మనం కలవకూడదు. ఇలాంటి ఈ భావం ఒకటి అక్కడ సూరత్ తౌబాలో కూడా చెప్పడం జరిగింది. సూరత్ తౌబాలో కూడా ఇలాంటి ఒక భావం వచ్చి ఉంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క ధిక్ర్ అన్నది మనం ఉదయం మేల్కొని అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వఇలైహిన్నుషూర్ నుండి మొదలుకొని పొద్దంతలో అనేక సందర్భాల్లో చివరికి మళ్ళీ పడకపై వెళ్లే వరకు ప్రతి సమయం, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో ఉంది. యుద్ధ మైదానంలో శత్రువులు ఒకరిపై ఒకరు అక్కడ తూటలు వదులుకుంటూ, బాణాలు విసురుకుంటూ, రక్త సిక్తం అయ్యే సందర్భంలో కూడా అల్లాహ్ ఏమన్నాడు? మీరు ఒక వర్గాన్ని కలిసి యుద్ధంలో వారితో పోరాటంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా స్థిరంగా ఉండండి, వెనుదిరగకండి మరియు అల్లాహ్ ను అధికంగా స్మరించండి. గమనించండి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అల్లాహు తాలా స్మరణ చేయడం నుండి మనకు మినహాయింపు ఇవ్వలేదంటే వేరే ఏ సందర్భంలో ఉంటుంది? అజాన్ తర్వాత కూడా ధిక్ర్ ఉంది, ఇంకా అనేక వజూ తర్వాత ఉంది, మస్జిద్ లో ప్రవేశించే సందర్భంలో ఉంది, రాత్రి వేళ ఉంది, రుకూలో, సజ్దాలో, కునూతులో, సలాం తింపిన తర్వాత, మయ్యిత్ కొరకు అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనం చిన్నపాటి జేబులో ఉండేటువంటి పుస్తకాలు గానీ లేదా మన మొబైల్ లో చిన్నపాటి రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు ఇలాంటి పీడీఎఫ్ గానీ పెట్టుకొని మనం అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేస్తూ ఉన్నామంటే మనకు ఇహపరలోకాల్లో మేల్లే మేలు కలుగుతాయి.

చివరిలో ఒక హదీస్ యొక్క భావం, ఇక నేను అది చూపించి మళ్ళీ ఇంకా ఆలస్యం చేయను, హదీస్ భావం చెప్పి సమాప్తం చేస్తాను. అదేమంటే ఎవరైతే ఈ లోకంలో ఎక్కడైనా కూర్చుంటారో లేదా ఏదైనా ఎక్కడైనా నడుస్తారో లేదా ఎక్కడైనా ఇలా వెల్లకిలా పడుకుంటారో, అక్కడ అల్లాహ్ ను స్మరించలేదు, అల్లాహ్ ను స్తుతించలేదు, అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తపై దరూద్ చేయలేదు, చదవలేదు అంటే ఆ సమయం, ఆ ఘడియ, ఆ పడుకోవడం, ఆ నడవడం, ఆ కూర్చోవడం ఇదంతా కూడా వారి కొరకు ప్రళయ దినాన పశ్చాత్తాప భావంగా చాలా నష్టకరంగా ఉంటుంది. అక్కడ ఈ నష్టాన్ని తీర్చుకోవడానికి వేరే ఏ సాధనం ఉండదు. ఇలాంటి సమయం రాకముందే ఇక్కడే బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని అల్లాహ్ ను అధికంగా స్మరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

(ఆడియోలో కనిపించే హదీస్ యొక్క అనువాదం)

ఈ హదీస్ చూస్తున్నారు. దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కేవలం అనువాదం నేను చెబుతున్నాను శ్రద్ధ వహించండి. అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలతో అడిగారు, “నేను మీకు తెలియజేయనా, మీ కర్మల్లో అతి ఉత్తమమైనవి, అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, మీ యొక్క చక్రవర్తి అయిన అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, అంటే అల్లాహ్ కు ఎక్కువ ఇష్టమైన మరియు అల్లాహ్ వద్ద మీ కర్మల్లో అత్యంత ఉత్తమమైనది, మీ యొక్క స్థానాలను చాలా పైకి చేసే ఎత్తు చేసే రెట్టింపు చేసేటువంటిది, మరియు మీరు వెండి బంగారాలను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది. అంతేకాదు ఇంకా, ఇంకా ఉంది. మీరు మీ శత్రువులను కలిసి, మీరు వారి మెడలను నరకడం, వారు మీ మెడలను నరకడం కంటే కూడా ఉత్తమం.” అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎన్ని విషయాల కంటే ఉత్తమమైనదో గమనించండి. సర్వ కర్మల్లో ఉత్తమమైనది, అల్లాహ్ కు చాలా ప్రసన్నతమైనది, స్థానాలను రెట్టింపు చేయునది, మరియు వెండి బంగారం ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది, శత్రువులను కలిసి వారు మెడలు నరకడం మనం వారి మెడలను మెడలను నరకడం కంటే కూడా ఉత్తమమైనది. ఏంటి? అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క ధిక్ర్. చూశారా? ఇంత గొప్ప ఘనత. ఈ ఘనతను మనం మరియు ఇది చాలా సులభమైనది కూడా. ధిక్ర్ చేయడానికి మనకు వజూ అవసరం ఉండదు. ధిక్ర్ చేయడానికి మనకు నిలబడాలి, ఖిబ్లా దిశలో ఉండాలి ఇట్లాంటి ఏ కండిషన్లు లేవు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబకల్ ముఫర్రిదూన్ అని చెప్పారు. అంటే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేసేవారు చాలా చాలా చాలా అందరికంటే ముందుగా దూసుకెళ్లారు అని. అందుకొరకే మరొక హదీస్ లో ఉంది, మనిషిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి కాపాడేది అల్లాహ్ యొక్క ధిక్ర్ కంటే గొప్ప విషయం మరొకటి వేరేదేమీ లేదు అని.

జిక్ర్, దుఆ మెయిన్ పేజీ:
https://teluguislam.net/dua-supplications/

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1