[2:24 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[44:53 నిముషాలు] హైజ్ వ నిఫాస్ (బహిష్టు & పురిటి రక్తం) ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[27:32 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
తయమ్ముమ్:
క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం:
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు – ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A https://youtu.be/4tRtuTItZkY[30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) శుద్ధి & నమాజు[పుస్తకం]
ఈ ప్రసంగంలో, ‘ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్’ (పారిశుధ్యం మరియు నమాజ్ ఆదేశాలు) అనే అంశంపై ఏడవ తరగతిలో భాగంగా, జునూబీ (అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి)కి నిషిద్ధమైన పనుల గురించి వివరించబడింది. జునూబీ అంటే స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన స్త్రీ లేదా పురుషుడు. వీరికి నిషిద్ధమైనవి నాలుగు ప్రధాన పనులు: 1) నమాజ్ చేయడం, 2) కాబా తవాఫ్ చేయడం, 3) దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, మరియు 4) మస్జిద్లో ఆగడం లేదా నివసించడం. ప్రతి అంశానికి ఖుర్ఆన్ ఆయతులు, హదీసుల నుండి ఆధారాలు, మరియు నలుగురు ఇమామ్ల ఏకాభిప్రాయం (ఇజ్మా)తో సహా వివరణ ఇవ్వబడింది. అశుద్ధావస్థలో నమాజ్ చేయరాదు కానీ దాని కోసం నమాజ్ను ఆలస్యం చేయడం లేదా వదిలివేయడం తప్పు అని, వెంటనే స్నానం చేసి నమాజ్ ఆచరించాలని స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ (అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సఃబిహి అజ్మయీన్, అమ్మా బ’ద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
సోదర మహాశయులారా సోదరీమణులారా! ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్ (Fiqh al-Taharah wa’l-Salah), పరిశుభ్రత మరియు నమాజ్కు సంబంధించిన ఆదేశాల ఈ క్లాస్ ఏదైతే మనం మొదలుపెట్టామో, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఏడవ క్లాస్ మనం మొదలుపెట్టబోతున్నాము.
అయితే ఈనాడు మనం చదివేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ స్థితిలో లేనివారు, ప్రత్యేకంగా అశుద్ధావస్థలో ఉన్నవారు అంటే జునూబీ (Junubi) అని ఎవరినైతే అనడం జరుగుతుందో, వారిపై నిషిద్ధములు ఉన్నవి ఏమిటి మరియు తయమ్ముమ్కు సంబంధించి కొన్ని ఆదేశాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
అయితే రండి, ‘జునూబీ‘ అన్న పదం ఏదైతే ఉందో, అరబీలో జునూబీ అన్న పదం స్వప్నస్కలనం వల్ల లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడు అయినా, జునూబీ అని అంటారు.
అయితే, ఈ అశుద్ధ స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ కొంత కాలం, ఆ కొంత సమయం ఏదైతే వారు అశుద్ధంగా ఉంటారో అప్పుడు ఏ కార్యాలు చేయడం వారిపై నిషిద్ధంగా ఉంటాయి? అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాలుగు విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి నమాజ్, రెండవది తవాఫ్, మూడవది దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, నాలుగవది మస్జిద్ లో ఉండడం, అక్కడ కూర్చోవడం, పడుకోవడం, నిలవడం.
అయితే రండి, ఈ నాలుగు విషయాలకు కొంత వివరణ మనం తెలుసుకుందాము. నమాజ్, తవాఫ్, దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, మస్జిద్ లో ఆగడం. ఇవి నాలుగు పనులు జునూబీ చేయరాదు.
1. నమాజ్ (ప్రార్థన)
అయితే, వీటికి సంబంధించి మనం ధర్మాదేశాలు చూస్తే గనక, అక్కడ ఎన్నో దలీల్ (ఆధారాలు), నిదర్శనాలు ఉన్నాయి.
ఉదాహరణకు, అల్లాహు త’ఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 43లో తెలిపాడు:
విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! (4:43)
నమాజ్కు సమీపించకూడదు. ఇక్కడ ఎవరు? రెండవ విషయం, వలా జునుబన్ (వలా జునుబన్) – జునూబీ, అశుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటివరకు? హత్తా తఘ్ తసిలూ – స్నానం చేసే వరకు. స్నానం చేసిన తర్వాతనే వారు నమాజ్ చేయాలి, అంతకుముందు నమాజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ నమాజ్ చేయడం వారిపై నిషిద్ధం.
ఇక ఈ అశుద్ధ స్థితిలో నమాజ్ చేయడం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు, యువతులు ఈ ఆదేశం, అల్లాహు త’ఆలా ఏదైతే ఇచ్చాడో, తప్పుడు భావం తీసుకుని నమాజ్ను వదులుతూ ఉన్నారు. ఎందరినో చూడడం జరుగుతుంది, వేరే నమాజ్లు వారు పూర్తి పాబందీగా చేసినప్పటికీ, రాత్రి అశుద్ధావస్థకు లోనయ్యారు, స్వప్నస్కలనం జరిగింది, వారిని మేల్కొలిపినప్పటికీ, వారు ఫజ్ర్ నమాజ్ జమాఅత్తో చేయడానికి రారు. ఇళ్లల్లో తల్లులు లేపినా పిల్లల్ని, వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఏందంటే నేను స్నానం చేసేది ఉంది, ఇప్పుడు ఈ చల్లదనం, ఇప్పుడు ఇంత తొందరగా చేయాలంటే నాతో కుదరదు, నేను 7 గంటల తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు నమాజ్ చేసుకుంటాను.
అయితే సోదర మహాశయులారా, ఈ ఆయత్ ద్వారా చెప్పదలచిన విషయం ఏమిటంటే, అశుద్ధావస్థలో నమాజ్ చేయడం సరియైన విషయం కాదు. ఇలాంటి మనిషి తప్పకుండా స్నానం చేసి నమాజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది కానీ, “నమాజ్ ఆలస్యం చేయండి, నమాజ్ దాని సమయం దాటినా పర్వాలేదు, మీరు ఆలస్యంగా చేసుకున్నా అభ్యంతరం లేదు”, అలాంటి మాట ఇక్కడ చెప్పడం జరగలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.
అశుద్ధావస్థలో ఉన్న వారిపై నమాజ్ నిషిద్ధం అన్న దాని గురించి హదీసులలో కూడా ఆధారం ఉంది. మనకు సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 275 మరియు సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 605, ఇలా స్పష్టంగా కనబడుతుంది.
అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:
ఉఖీమతిస్సలాహ్ – నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పడం జరిగింది. వ ఉద్దిలతిస్ సుఫూఫు ఖియామా – అందరూ పంక్తుల్లో నిలబడి సఫ్లన్నీ కూడా సక్రమంగా చేయబడ్డాయి. ఫ ఖరజ ఇలైనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం – నమాజ్ చేయించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేశారు. ఫలమ్మా ఖామ ఫీ ముసల్లా – ప్రవక్త నమాజ్ చేయించే, ఇమామత్ చేయించే స్థలం ఏదైతే ఉందో అక్కడ నిలబడిన నిలబడ్డారు, జకర – అప్పుడు గుర్తుకొచ్చింది అన్నహు జునుబున్ – ప్రవక్త అశుద్ధావస్థలో ఉన్నట్లు, స్నానం చేయవలసిన అవసరం ఉంది అని ప్రవక్త వారికి గుర్తుకొచ్చింది. ఫ ఖాల లనా – అబూ హురైరా అంటున్నారు, ప్రవక్త వారు మా సహాబాలందరినీ ఉద్దేశించి చెప్పారు, మకానకుమ్ – మీరు ఇలాగే నిలబడి ఉండండి. సుమ్మ రజ’అ ఫఘ్ తసల – ప్రవక్త వెళ్ళిపోయారు, స్నానం చేశారు. సుమ్మ ఖరజ ఇలైనా – మళ్ళీ ప్రవక్త మా మధ్యలో వచ్చారు, వ ర’సుహు యఖ్తుర్ – తల నుండి నీళ్లు, నీళ్ల యొక్క చుక్కలు, నీళ్ల బొట్లు పడుతూ ఉన్నాయి. ఫ కబ్బర ఫ సల్లైనా మా’అహు – అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అన్నారు. మేము ప్రవక్త వెంట నమాజ్ చేసుకున్నాము.
ఈ హదీస్ ద్వారా కూడా ఏం తెలిసింది? ప్రవక్త మరిచిపోయారు. అయితే, నమాజ్ చేయించడానికి వచ్చేశారు కానీ నిలబడి ముసల్లా మీద నమాజ్ స్టార్ట్ చేసేకి ముందుగా గుర్తుకు వచ్చేసింది, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆ విషయాన్ని, ఏదైతే గుర్తుకు వచ్చిందో, సహాబాలను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు మరియు నమాజ్ స్నానం చేసిన తర్వాతనే వచ్చి నమాజ్ చేయించారు.
సోదర మహాశయులారా, కనీసం ఒక ఆధారం మనం తెలుసుకున్నా అల్హందులిల్లాహ్ సరిపోతుంది. కానీ మీకు ఈ హదీసుల పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అని నిదానంగా ఇలాంటి దలీల్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు శ్రద్ధ వహించండి, నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి మరియు పాఠం జరిగిన తర్వాత, క్లాస్ తర్వాత ఈ పాఠాలను మీరు నెమరువేసుకుంటూ ఉండండి, రివ్యూ చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా విద్య అనేది ఇంకా బలపడుతుంది, మీ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంకా మీరు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే మీ వెనక వారికి, క్లాసులో పాల్గొనలేని వారికి చెబుతూ ఉండాలి కూడా.
2. తవాఫ్ (కాబా చుట్టూ ప్రదక్షిణ)
అశుద్ధావస్థలో ఉన్నటువంటి జునూబీపై రెండవది ఏదైతే నిషిద్ధంగా ఉందో, అది కాబతుల్లాహ్ యొక్క తవాఫ్. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. సర్వసామాన్యంగా నేను ఏదైతే చెబుతూ ఉంటానో, మన మధ్యలో నాలుగు ఫిఖ్లు ఏవైతే ఫేమస్గా ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఫిఖ్లు కూడా ఇమామ్లు కూడా ఉండిరి, కానీ ఇవి నాలుగు ఫేమస్ అయిపోయాయి, హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ. ఈ నాలుగు ఫిఖ్లలో కూడా ఏకీభవంగా తవాఫ్ చేసే వ్యక్తి కూడా తప్పకుండా పరిశుద్ధావస్థలో ఉండడం మరియు తవాఫ్ చేసేకి ముందు అతను వుదూ చేసుకోవడం చాలా నొక్కి చెప్పడం జరిగింది.
ఇంతకుముందు నేను ఏదైతే నమాజ్ గురించి ఒక ఆయత్ వినిపించానో, సూరత్ అన్-నిసా ఆయత్ నెంబర్ 43, దాని ద్వారా కూడా ఆధారం తీసుకోవడం జరుగుతుంది.
అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారికి హజ్ చేసే సందర్భంలో ఆమె నిలవారి ఏదైతే మొదలైపోయిందో, బహిష్టు, ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పారు: ఇఫ్’అలీ మా యఫ్’అలుల్ హాజ్, ఘైర అల్లా తతూఫిల్ బైత్ హత్తా తత్ హురీ – ఇంకో ఉల్లేఖనంలో హత్తా తఘ్ తసిలీ. ఓ ఆయిషా, నీవు ఈ నెలవారి రక్తస్రావంలో ఉన్నావని బాధపడకు, హజ్ విషయంలో నీకు ఏదైనా ఆటంకం కలిగింది అన్నట్లుగా నీవు నొచ్చుకోవద్దు ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండి కూడా హాజీ ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ చేయవచ్చును నువ్వు, కేవలం ఒక్క తవాఫ్ తప్ప. తవాఫ్ చేయకూడదు, పరిశుద్ధమై స్నానం చేసే వరకు తవాఫ్ చేయకు.
ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 305, సహీహ్ ముస్లింలో ఉంది 1211. ఈ హదీస్ ద్వారా కూడా ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. స్త్రీ నెలవారి రక్తస్రావం జరుగుతుంది అంటే ఆమె అశుద్ధావస్థలో ఉన్నట్లు. అశుద్ధావస్థలో ఉన్నవారు తవాఫ్ చేయకూడదు.
ఇదే కాకుండా హజ్రత్ సఫియా బిన్తె హుయై ఇబ్ను అఖ్తబ్ రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఆమెకు సంబంధించిన ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది.
మరియు అలాగే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది, సునన్ నసాయిలో, నసాయి కుబ్రా 3944, అలాగే బైహఖీలో 9573 మరియు ఈ హదీసును కొందరు ధర్మవేత్తలు మౌఖూఫ్ మరియు సహీహ్ అని చెప్పారు. కానీ ఈ మాట చెప్పేవారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అయినప్పటికీ, హదీస్ పరిభాషలో, ఇస్తిలాహె హదీస్లో దీనిని హుక్ముర్ రఫ్’అ అని అంటారు, హుక్ముల్ మర్ఫూ అని అంటారు. అంటే, ఇలాంటి మాట సహాబీ తన ఇష్టానుసారం చెప్పడానికి హక్కు ఉండదు, వారు ప్రవక్తతో విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు కానీ ప్రవక్త చెప్పారు అన్నటువంటి మాట ఆ సందర్భంలో వారు చెప్పలేదు. ఏంటి విషయం?
“అత్తవాఫు బిల్ బైతి సలాహ్ – కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ కూడా సలాహ్, నమాజ్ లాంటిది. కాకపోతే ఈ తవాఫ్లో మాట్లాడే అటువంటి, నడిచే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. నమాజ్లో మాట్లాడే, నడిచే అనుమతి కూడా లేదు.”
సోదర మహాశయులారా, తవాఫ్ చేయకూడదు అన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని గురించి మనకు ఈ ఆధారాలు ఏవైతే తెలిశాయో, వీటిపై మనం తృప్తి ఉండి, ఎప్పుడూ మనం తవాఫ్ చేసినా అశుద్ధావస్థలో ఉండకుండా పరిశుభ్రతలో ఉండి, వుదూ చేసుకొని తవాఫ్ చేసే ప్రయత్నం చేయాలి.
3. దివ్య ఖుర్ఆన్ ను తాకడం
ఇక రండి, మూడో విషయం అశుద్ధావస్థలో ఏమి చేయరాదు? ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం. అయితే ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దీని గురించి కూడా హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, ఈ నాలుగు ఫిఖ్లలో, నాలుగు ఫిఖ్లలో జునూబీ – జునూబీ అంటే ఎవరో తెలిసింది కదా, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి – ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, ఖుర్ఆన్ ను తాకకూడదు అని ఏకీభవించారు. మరియు ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్, ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్ ఈ విషయంలో అందరి ఏకాభిప్రాయం ఉంది, ఇజ్మా ఉంది అని కూడా స్పష్టంగా తెలిపారు. ఈ విషయం అల్-ఇస్తిద్కార్ లో ఉంది. అలాగే ఇమామ్ షౌకానీ రహిమహుల్లాహ్ కూడా ఈ విషయం తెలిపారు, నైలుల్ అవ్తార్ లో ఈ మాట ఆయన రాశారు.
దీనికి సూరతుల్ వాఖిఆ, ఇందులోని ఆయత్ ద్వారా కూడా దలీల్ తీసుకోవడం జరుగుతుంది. కొందరు సూరత్ అల్-వాఖిఆలో వచ్చిన ఆయత్ ను దేవదూతల గురించి అని, అది లౌహె మహ్ఫూజ్ గురించి అని అంటారు. కానీ సర్వసామాన్యంగా అధికమంది ధర్మవేత్తలు ఈ ఆయత్ నే ఆధారంగా తీసుకున్నారు మరియు ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తఫ్సీరె ఖుర్తుబీలో చెప్పారు: అన్నహు ఇదా కాన లా యజూజు లహు అల్-లుబ్సు ఫిల్ మస్జిద్, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్, వలల్ ఖిరాఅతు ఫీహి ఇద్ హువ అ’జము హుర్మతన్. మనం నాలుగో విషయం తెలుసుకోబోతున్నాము మస్జిద్ లో ఉండకూడదు అని. అక్కడ వివరాలు వస్తాయి దానికి సంబంధించి. అయితే ఇమామ్ ఖుర్తుబీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. జునూబీ మస్జిద్ లో ఆగకూడదు, అక్కడ నిలువకూడదు. అయితే, మస్జిద్ లో జునూబీ నిలువకూడదు అని ఆదేశం ఉన్నప్పుడు, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్ – అయితే అతను ముస్హఫ్ ను, ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకకపోవడం, ముట్టుకోకపోవడం ఇది మరీ చాలా అవసరమైన విషయం. వలల్ ఖిరాఅతు ఫీహి – దానిని ముట్టుకొని, చూసి చదవడం కూడా ఇది యోగ్యం లేదు. ఇద్ హువ అ’జము హుర్మతన్ – ఖుర్ఆన్ గ్రంథం, దీని యొక్క గౌరవప్రదం అనేది మస్జిద్ కంటే కూడా ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా, మరొక హదీస్ ద్వారా కూడా దలీల్ తీసుకుంటారు ఎందరో ధర్మవేత్తలు. తబరానీ, దారుఖుత్నీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 7780. ఏంటి హదీస్? లా యమస్సుల్ ఖుర్ఆన ఇల్లా తాహిరున్ – ఖుర్ఆన్ ను పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ముట్టుకోవాలి, తాకాలి. అయితే జునూబీ మనిషి ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, తాకకూడదు.
అయినా మీరు గమనించండి, ఈ జనాబత్ అనేది ఏదైతే ఉందో, ఈ అశుద్ధావస్థ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. స్త్రీలకు నెలవారి లేదా ప్రసవ రక్తం స్రవించే సందర్భంలో ఒక కొన్ని రోజుల వరకు వారు ఆ అశుద్ధావస్థలో ఉంటారు, వారి విషయం వేరు. కానీ జనాబత్ అన్నది ఏదైతే ఉందో, స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధావస్థ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకొరకు ఈ సమయంలో ఖుర్ఆన్ ను ముట్టుకోకపోవడం, తాకకుండా ఉండడమే మేలైన విషయం.
ఈ కొన్ని ఆయత్ హదీసులు కాకుండా, సహాబాల యొక్క అతర్, వాటి ద్వారా కూడా దీనికి ఆధారం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇమామ్ ఇబ్ను అబీ షైబా తన ముసన్నఫ్లో 1106, మరియు ఇమామ్ బైహఖీ మరియు ఇమామ్ దారుఖుత్నీ ఇంకా ఇమామ్ జైల’యీ రహిమహుల్లాహ్ నస్బుర్ రాయాలో కూడా దీనిని ఉల్లేఖించారు.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక ప్రయాణంలో ఉండగా, అబ్దుర్రహ్మాన్ బిన్ యజీద్ బిన్ జాబిర్ ఉల్లేఖిస్తున్నారు, ఆయన చెప్పారు: సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసిన తర్వాత నేను అడిగాను, మీరు వుదూ చేసుకోండి, ల’అల్లనా నస్’అలుక అన్ ఆయిన్ మినల్ ఖుర్ఆన్ – మేము నీతో ఖుర్ఆన్లోని కొన్ని ఆయతుల గురించి అడగాలనుకుంటున్నాము. అప్పుడు సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: సలూనీ, ఫ ఇన్నీ లా అముస్సుహు – అడగండి, నేను ఖుర్ఆన్ను ముట్టుకోను, తాకను. ఇన్నహు లా యమస్సుహు ఇల్లల్ ముతహహరూన్ – ఈ ఖుర్ఆన్ను తాకడానికి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. అప్పుడు మేము వారితో అడిగాము, ఫ ఖర’అ అలైనా ఖబ్ల అన్ యతవద్ద’అ – అయితే సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ చేసుకునేకి ముందు, ఖుర్ఆన్ను తాకకుండా, ఖుర్ఆన్ ఆయత్ మాకు చదివి వినిపించారు.
ఈ విధంగా సోదర మహాశయులారా, మనకు అల్లాహ్ యొక్క దయవల్ల ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు అన్నటువంటి విషయం గురించి ఈ ఆధారాలు తెలిసినవి.
4. మస్జిద్ లో ఉండడం
జునూబీ, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తిపై నిషిద్ధం ఉన్న నాలుగో విషయం ఏదైతే ఉందో, మస్జిద్ లో ఆగడం, మస్జిద్ లో నిలవడం. దీనికి సంబంధించి కూడా ఖుర్ఆన్ లోని సూరత్ అన్-నిసాలోని ఆయత్ 43 ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, వలా జునుబన్ ఇల్లా ఆబిరీ సబీలిన్ హత్తా తఘ్ తసిలూ, ఈ ఆయత్ ద్వారానే దలీల్ తీసుకోవడం జరుగుతుంది.
మాషాఅల్లాహ్. తబారకల్లాహ్. గమనించండి. అందుకొరకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. నాకు అరబీ వచ్చయ్యా, అరె ఖుర్ఆన్ అయితే నా భాషలో తర్జుమా, అనువాదం ఉంది కదా నేను చదివి తెలుసుకుంటాను, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదు, నాకు జ్ఞానం ఉంది, నేను స్వయంగా ధర్మ విద్య నేర్చుకుంటాను అన్నటువంటి మాటల్లో పడి మనిషి పెడమార్గంలో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉలమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, క్లాసులలో పాల్గొని ఉండేది ఉంటే, ఇంకా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే, ఒక్కొక్క ఆయత్ ద్వారా ఎన్ని ధర్మ విషయాలు ధర్మవేత్తలు మనకు తెలియజేస్తూ ఉంటారు.
మస్జిద్ లో నిలవడం జునూబీపై నిషిద్ధం అన్న దాని గురించి ఈ ఆయత్ నుండి ఎలా దలీల్ తీసుకున్నారో చెప్పండి? ఇల్లా ఆబిరీ సబీలిన్. జునూబీ ఎవరైతే ఉన్నారో వారు నమాజ్కు, నమాజ్ చేసే స్థలానికి అక్కడికి రాకూడదు. కానీ నమాజ్ చేసే స్థలం ఏదైతే ఉంటుందో, ఇల్లా ఆబిరీ సబీల్ – అలా దాటుతూ వెళ్ళవచ్చు. అయితే, నమాజ్ చేసే స్థలం అంటే ఇక మస్జిద్. సర్వసామాన్యంగా. అయితే ఆ మస్జిద్, దానికి కూడా ఒక గౌరవ స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో ఇది నమాజ్ గురించి, నమాజ్ చేసే స్థలం గురించి కూడా అని ధర్మవేత్తలు దీని గురించి ఏకీభవించారు. హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, అందరూ దీనిని ఏకీభవించారు.
ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు, సర్వసామాన్యంగా మేము అంటూ ఉంటాము, మనం కేవలం ఖుర్ఆన్ హదీస్ను ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఖుర్ఆన్ హదీస్ కాకుండా ఈ మస్లక్లలో పడి ఉన్నారో, హనఫీ, షాఫియీ, హంబలీ, మాలికీ, ఈ విధంగా ఇది మంచి విషయం కాదు, అంధీ తఖ్లీద్ (గుడ్డి అనుకరణ) అనేది ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. మరి ఈ మస్లే మసాయిల్, ఈ ధర్మ విషయాలు బోధిస్తున్నప్పుడు మాటిమాటికి హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ అందరూ దీనిని ఏకీభవించారు అని వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, ఇదే మన్హజె సలఫ్. మనకు సహాబాలు ఎలా ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకున్నారో, ధర్మవేత్తలు ఎలా అర్థం చేసుకున్నారో, వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అదే రకంగా మనం అనుసరించాలి. ఎప్పుడైనా ఎవరైనా, ఎక్కడైనా వారితో పొరపాటు జరిగితే వారి గురించి అల్లాహ్ వారిని మన్నించుగాక అని దుఆ చేస్తూ, ఖుర్ఆన్ హదీస్కు చేరువగా, దగ్గరగా ఎవరి మాట ఉందో తీసుకోవాలి, ఖుర్ఆన్ హదీస్ను అనుసరించాలి. అల్లాహ్ యొక్క దయ కలిగితే వేరే సందర్భాలలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుదాము.
అయితే, జునూబీ అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి మస్జిద్ లో నిలవకూడదు. ఈ ఆయత్ ద్వారా దలీల్ తీసుకోవడం జరిగింది. ధర్మ పండితులందరూ కూడా ఏకీభవించారు. తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో ఈ మాట ఉంది. అలాగే సౌదీ అరబ్ లోని ఇఫ్తా కమిటీ, ఫత్వా కమిటీ ఏదైతే ఉందో వారు కూడా దీనిని ఏకీభవించారు. కానీ ఇందులో ఒక విషయం, ఖుర్ఆన్ ఆయత్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరికైనా వేరే ఏ గత్యంతరం లేక మస్జిద్ నుండి దాటి వెళ్ళవలసిన అవసరం వస్తే, వారు తప్పకుండా అలా వెళ్ళవచ్చు. ఇందులో అనుమానం లేదు. ఫిఖ్ షాఫియీ, హంబలీ అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా, ఇబ్ను బాజ్, ఇబ్ను ఉసైమీన్ వీరందరి ఫత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి.
ఇక్కడ ఒక విషయం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కాకపోవచ్చు కానీ అంతకుముందు కూడా మస్జిద్ లో పడుకుంటారు కొందరు. అయితే మస్జిద్ లో పడుకోవడం పాపం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే మస్జిద్ లో పడుకుంటున్నారో వారు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని శ్రద్ధగా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండాలి. అదేమిటి? ఒకవేళ నిద్రలో వారికి స్వప్నస్కలనం జరిగిందంటే, వెంటనే వారు వెళ్లి స్నానం చేసేయాలి. అరె ఫజర్ నమాజ్ కొరకు ఇంకా మూడు గంటలు ఉన్నాయి కదా, ఇంకా రెండు గంటలు ఉన్నాయి కదా అని అలాగే అక్కడ పడుకొని ఉండిపోవడం, ఇది మంచి విషయం కాదు.
సోదర మహాశయులారా, ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఈ అశుద్ధావస్థలో ఏ ఏ పనులు చేయరాదు అన్నటువంటి విషయం ఆ మనం తెలుసుకున్నాము. అయితే, ఖుర్ఆన్ చదవవచ్చు కానీ ఖుర్ఆన్ ను తాకకూడదు అని సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాట ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము ఈ మధ్యలో. కానీ ఎలాగైనా అశుద్ధావస్థ అనేది జనాబత్కు సంబంధించింది, ఎక్కువ సేపు ఉండదు గనుక మనం కావాలని మరీ ఆలస్యం చేయకూడదు. కావాలని ఖుర్ఆన్ ను తాకడం గాని, చదవడం గాని చేయకుండా ఉండి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండడం, ఇందులో అభ్యంతరం లేదు.
మరి ఏ ధర్మ పండితులైతే ఖుర్ఆన్ చూడకుండా చదవవచ్చు అని అన్నారో, వారు తీసుకున్నటువంటి దలీళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్, అన్న నబి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యద్కురుల్లాహ అలా కుల్లి అహ్యానిహి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉండేవారు. ఇమామ్ బుఖారీ ము’అల్లఖన్ ఈ హదీస్ను ప్రస్తావించారు 634 కంటే ముందు, సహీహ్ ముస్లింలో 373లో ఈ హదీస్ ఉంది.
కానీ హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఆచరణ గురించి ముసన్నఫ్ అబ్దుర్రజాఖ్లో అలాగే ఇమామ్ అబూ ను’అయమ్ అస్సలాలో, ఇమామ్ దారుఖుత్నీ సునన్లో ఆ మరియు ఇంకా వేరే ధర్మవేత్తలు ప్రస్తావించారు, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో చెప్పారు: ఇఖ్ర’ఉల్ ఖుర్ఆన మా లమ్ యుసిబ్ అహదుకుమ్ జనాబ, ఫ ఇన్ అసాబత్హు జనాబతున్ ఫలా, వలా హర్ఫన్ వాహిదా – మీలో ఎవరైనా జనాబత్, అశుద్ధావస్థకు లోనయ్యారంటే వారు ఖుర్ఆన్ లోని ఒక అక్షరం కూడా చదవకూడదు.
అయితే, మరి అలీ రదియల్లాహు త’ఆలా అన్హు చదవకూడదు అని అంటున్నారు కదా? మరి కొందరు ధర్మవేత్తలు ఏమన్నారు? చదవవచ్చు అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ద్వారా దలీల్ తీసుకున్నారు. అయితే, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ద్వారా వేరే కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, అలీ రదియల్లాహు అన్హు చెప్పిన మాట కరెక్టే, చదవకండి అని. కానీ అక్కడ వివరణ లేదు, ఖుర్ఆన్ చూసి చదవడమా లేకుంటే చూడకుండా చదవడమా అని. ఖుర్ఆన్ ను పట్టుకొని చదవడమా లేక మనకు కంఠస్థం ఉన్న దానిలో నుండి చదవడమా? ఈ విధంగా కూడా ఒక దలీల్ ఇవ్వడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[45:28 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: గుసుల్ (శుద్ధి స్నానం)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
గుస్ల్ (స్నానం):
శుద్ధి పొందే ఉద్దేశం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుటనే గుస్ల్ అంటారు. పూర్తి శరీరం కడగడం, అందులో పుక్కిలించడం మరియు ముక్కులో నీళ్ళు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే గుస్ల్ అగును. (ప్రవక్త గుస్ల్ పద్థతి ఇదిః ముందు మర్మాంగ భాగాన్ని శుభ్ర- పరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటు- వంటి వుజూ చేయాలి. అరచేతిలో నీళ్ళు తీసుకొని తల మీద పోసి రుద్దాలి. ఇలా మూడు సార్లు చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి).
ఐదు సందర్భాల్లో గుస్ల్ చేయడం విధిగా ఉంది:
1- స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడితే గుస్ల్ విధి అవుతుంది. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి అవుతుంది. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.
2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగం భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యం పడకపోయినా స్నానం చేయుట విధియగును.
3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.
4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.
5- అవిశ్వాసుడు ఇస్లాం స్వీకరించినపుడు.
‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు:
(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).
1- నమాజ్. 2- తవాఫ్. 3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిశిధ్ధం. 4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[22:07 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: వుజూను భంగపరిచే విషయాలు
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
వుజూను భంగపరిచే విషయాలు:
1- మలమూత్రపు దారుల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది. ఉదాః మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మనీ’, ‘మజీ’, ‘వదీ’ రక్తము. (‘మనీ’ వలన స్నానం చేయడం విధి అవుతుంది).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).
వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
‘మసహ్’ గడువు
స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలు
గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).
వుజూ విధానం :
* వుజూలో ఒక అవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి([1]).
[1] క్రమ ప్రకారంగా వుజూ చేయాలి. అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే చేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’.
మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (క్రింది వుజూ చిత్రాలు చూడండి).
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. (చిత్రం2).
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. (చిత్రాలు 3, 4).
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. (చి.5)
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. (చి.6)
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. (చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం).
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. (చిత్రం 8.)
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు.
9- తర్వాత దుఆ చదవాలి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం“. (ముస్లిం 234).
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ
(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).
మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:
గుఫ్రానక غُفْرَانَكَ నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).
2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.
3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు.
4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల
చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.
5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.
6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.
ప్రశ్నలు & సమాధానాలు (Q&A) – మల మూత్ర విసర్జన పద్ధతులు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు [పుస్తకం]
శుచి శుభ్రత ఆదేశాలు
పరిశుభ్రత మరియు అపరిశుభ్రత
‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.
ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.
పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.
అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.
‘నజాసత్’ రకాలు:
(1,2) మలమూత్రం.
(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.
(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.
*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.
(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.
పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.
(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.
‘నజాసత్’ ఆదేశాలు:
1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.
2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.
3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.