దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి? https://youtu.be/YXvC41kqzPw(8:34 నిముషాలు ) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.
అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
అల్లాహ్ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.
అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.
ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.
అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.
“వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.“
ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్లోని 112వ అధ్యాయం.
ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.
ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారుపది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.
అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె సృష్టికర్త అయిన అల్లాహ్ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.
ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్ఆన్ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్ను చూడడం సాధ్యం కాదు.
ఖుర్ఆన్లో దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్ఔన్ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తూర్ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్అన్లోని ‘ఆరాఫ్ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.
ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?
పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్ఆన్లో యూనుస్ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు : “ఓ స్వర్గవాసులారా! అల్లాహ్ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్)
ఖుర్ఆన్ లో మరొకచోట అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్ఆన్, ఖియామహ్ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)
కనుక ఇహలోకంలోనే అల్లాహ్ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొదటిది: దైవ నామాలు, గుణగణాలకు సంబంధించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో ఆధారాలు, బుద్ధి పరమైన నిదర్శనాలు.
రెండవది: అల్లాహ్ పేర్లు గుణగణాల గురించి అహ్లే సున్నత్ వల్ జమాఅత్ విధానం.
మూడవది: అల్లాహ్ నామాలను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం.
మొదటిది: దైవనామాలు, గుణాల గురించి ఖుర్ఆన్, హదీసుల ఆధారాలు, బుద్ధిపరమైన ఆధారాలు.
(అ) ఖుర్ఆన్ హదీసుల ఆధారాలు :
ఇంతకుముందు మేము తౌహీదె ఉలూహియత్, తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్ అనే మూడు రకాలను గురించి ప్రస్తావించి ఉన్నాము. వాటిలో మొదటి రెండింటి ఆధారాలను, నిదర్శనాలను గురించి కూడా చర్చించాము. ఇప్పుడు తౌహీద్ మూడవ రకమయిన ‘అస్మా వ సిఫాత్’ (దైవనామాలు, గుణగణాల)ను రూఢీచేసే ఆధారాలను తెలుసుకుందాము.
“అల్లాహ్కు మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆయన్ని ఆ పేర్లతోనే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.” (అల్ ఆరాఫ్ 7:180)
ఈ సూక్తి ద్వారా అల్లాహ్ తనకు కొన్ని పేర్లున్నాయని, అవి అత్యుత్తమమయిన పేర్లని తెలియజేస్తున్నాడు. ఆ పేర్లతోనే తనను పిలవమని కూడా ఆదేశించాడు. ఉదాహరణకు : ఓ రహ్మాన్ (ఓ దయాకరా!), ఓ రహీమ్ (ఓ కృపాశీలుడా!), ఓ హై (ఓ సజీవుడా!), ఓ ఖయ్యూమ్ (ఓ ఆధారభూతుడా!), ఓ రబ్బిల్ ఆలమీన్ (ఓ లోకేశ్వరుడా!) మొదలగునవి. తన నామాల విషయంలో వక్రవైఖరి అవలంబించే వారిని, నిరాకరించేవారి గురించి హెచ్చరించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ పేర్ల విషయంలో సత్యం నుండి తొలగిపోతారు లేదా అల్లాహ్కు గల పేర్లను పూర్తిగా నిరాకరిస్తారు. లేదా వాటి అర్ధాలను వక్రీకరిస్తారు లేదా నాస్తికతకు సంబంధించిన మరేదైనా దారి తెరుస్తారు. అలాంటి వారికి, తమ స్వయంకృతానికి తగిన శిక్ష లభిస్తుందని కూడా అల్లాహ్ హెచ్చరించాడు.
“ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటికి, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, ఆయనే అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికి అతీతుడు, శాంతిప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు (ఆయనకు) కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లన్నీ ఆయనకే ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు.” (అల్ హషర్ 59 : 22 – 24)
(2) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తుల వెలుగులో దైవ నామాలకు సంబంధించిన ఆధారాలు :
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :
“అల్లాహ్కు 99 పేర్లున్నాయి – ఒకటి తక్కువ వంద పేర్లు. ఇవి ఎటువంటి నామాలంటే, వాటిని (జ్ఞానపరంగానూ, క్రియాత్మకం గానూ) గ్రహించినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.”(ముత్తఫఖున్ అలై)
అల్లాహ్ యొక్క అత్యుత్తమ నామాలు కేవలం ఈ సంఖ్య (99)కే పరిమితం కావు. దీనికి ఆధారం హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రది అల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం:
మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వేడుకున్నారు:
“(ఓ అల్లాహ్!) నేను నీకు గల ప్రతి నామం ఆధారంగా నిన్ను అర్థిస్తున్నాను – దేని ద్వారానయితే నిన్ను నీవు పిలుచుకున్నావో! లేదా నీ గ్రంథంలో అవతరింపజేశావో! లేదా నీ సృష్టితాలలో ఎవరికయినా నేర్పావో! లేదా దానిని నీ వద్దనే – అగోచర జ్ఞానంలో భద్రపరచి ఉంచావో! అలాంటి ప్రతి నామం ఆధారంగా నిన్ను వేడుకుంటున్నాను (ప్రభూ!) మహత్తరమైన ఖుర్ఆన్ను నా హృదయ వసంతం గావించు!”
(ఈ హదీసును ఇమాం అహ్మద్ తన ముస్నద్ – 3528 లో పొందుపరిచారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశాడు. అల్లాహ్ పేర్లు కేవలం 99 కే పరిమితమై లేవని ఈ హదీసు నిరూపిస్తోంది. కనుక ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే – నిజము దేవుడెరుగు – ఈ 99 పేర్లను నేర్చుకున్నవాడు, వాటి ఆధారంగా అర్థించినవాడు, వాటి ఆధారంగా దైవారాధన చేసినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విశిష్టత ఈ పేర్లకే స్వంతం – సహీహుల్ జామి – 2622)
అల్లాహ్ యొక్క ప్రతి నామం ఆయన గుణగణాలలోని ఒకానొక గుణాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు : ‘అలీమ్‘ అనే నామం ఆయనలోని ఇల్మ్ (జ్ఞానం) గుణానికి నిదర్శనంగా ఉంది. అలాగే ‘హకీమ్‘ అనే పేరు ఆయనలోని హిక్మత్ (యుక్తి, వివేకం)ను సూచిస్తోంది. ‘సమీ” అనే పేరు ఆయన ‘సమ్అ’ (వినే) గుణానికి తార్కాణంగా ఉంది. ‘బసీర్‘ అనే ఆయన నామం ఆయనలోని ‘బసర్’ (చూసే, గమనించే) గుణానికి నిదర్శనంగా ఉంది. ఇదేవిధంగా ప్రతి పేరు అల్లాహ్ గుణ విశేషాలలో ఏదో ఒక గుణానికి ఆధారంగా ఉన్నది.
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్ (నిజ ఆరాధ్యుడు) ఒకే ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (సరితూగేవాడు, పోల్చదగినవాడు) ఎవడూ లేడు.”(అల్ ఇఖ్లాస్ : 1 – 4)
హజ్రత్ అనస్ (రది అల్లాహు అన్హు) కథనం : ఒక అన్సారీ వ్యక్తి మస్జిదె ఖుబాలో వారికి ఇమామత్ చేసేవాడు (వారి సామూహిక నమాజుకు సారథ్యం వహించేవాడు). అతనెప్పుడు నమాజ్ చేయించినా (ఫాతిహా సూరా అనంతరం) ‘ఖుల్హు వల్లాహు అహద్” సూరా పారాయణం మొదలెట్టేవాడు. ఆ తరువాత ఏదైనా మరో సూరా పఠించేవాడు. అతను ప్రతి రకాత్లో అలాగే చేసేవాడు. సహాబా (సహచరు)లలో ఇది చర్చనీయాంశం అయింది. వారంతా కలసి అతనితో మాట్లాడారు. “నీవు ఇదే సూరాతో ఖిరాత్ మొదలెడుతున్నావు. పోనీ దీంతో సరిపెట్టుకుంటావా అంటే అదీ లేదాయె. దీంతో పాటు మరో సూరా కూడా పఠిస్తున్నావు. నీవు పఠిస్తే ఈ ఒక్క సూరాయే పఠించు. లేదంటే దీనిని వదిలేసి వేరే సూరా ఏదన్నా పఠించు” అని అతన్ని కోరారు. దానికతను ఇలా జవాబిచ్చాడు : “నేను ఈ సూరాను వదలనుగాక వదలను. మీకిష్టముంటే నేనిలాగే ఇమామత్ చేస్తాను. ఇలా చేయటం ఇష్టం లేదనుకుంటే చెప్పండి, మీ సారథ్య బాధ్యతలు వదలుకుంటాను.” కాని వారంతా ఆ వ్యక్తిని తామందరిలోకెల్లా ఉత్తమునిగా పరిగణించేవారు. కనుక అతను తప్ప వేరొక వ్యక్తి తమకు ఇమామత్ చేయటం వారికిష్టం లేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ వద్దకు ఏతెంచినపుడు, పరిస్థితుల స్వరూపాన్ని క్షుణ్ణంగా వివరించారు. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తినుద్దేశించి,
“ఓ ఫలానా వ్యక్తీ! నీ సహచరులు అడుగుతున్నట్లుగా మసలుకోవటంలో నీకు వచ్చిన చిక్కేమిటీ? అంటే ప్రతి రకాతులో ఇదే సూరా పఠించటానికి నిన్ను ప్రేరేపిస్తున్నదేది?” అని ప్రశ్నించారు.
దానికా వ్యక్తి, “నేనీ సూరాను ప్రగాఢంగా ఇష్టపడుతున్నాను” అన్నాడు.
“ఈ సూరాపట్ల నీకు గల ప్రేమ నిన్ను స్వర్గానికి చేరుస్తుంది” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (సహీహ్ బుఖారీ)
హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా) కథనం ఇలా ఉంది : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని ఓ చిన్న సైనిక బృందానికి అమీర్ (నాయకుని)గా నియమించి పంపారు. ఆ వ్యక్తి తన బృందానికి నమాజ్ చేయించేవాడు. ఈ సందర్భంగా ఖిరాత్ చివర్లో ఎలాగయినాసరే “ఖుల్హు వల్లాహు అహద్” సూరా చదివేవాడు. ఆ బృందంలోని సభ్యులు తిరిగి వచ్చాక, ఈ సంగతిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా,
“అతనలా ఎందుకు చేసేవాడో అతన్నే అడగండి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.
జనులు ఈ విషయమై అతన్ని దర్యాప్తు చేయగా అతనిలా అన్నాడు : “ఈ సూరా పారాయణం అంటే నాకెంతో ఇష్టం.” ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :
“అల్లాహ్ అతన్ని ఇష్టపడుతున్నాడని అతనికి తెలియజేయండి.” (సహీహ్ బుఖారీ).
అంటే: ఈ సూరా కరుణామయుడైన అల్లాహ్ గుణగణాలతో కూడుకుని ఉంది.
తనకు ముఖం కూడా ఉందని అల్లాహ్ తెలియజేశాడు. దీనికి నిదర్శనం ఈ ఆయత్ :
“ఎప్పటికీ మిగిలి ఉండేది వైభవోపేతుడైన, గౌరవనీయుడైన నీ ప్రభువు ముఖారవిందమే.”(అర్ రహ్మాన్ 55: 27)
అలాగే – అల్లాహ్కు రెండు చేతులున్నాయి :
خَلَقْتُ بِيَدَيَّ
“నేనతన్ని (ఆదమును) నా రెండు చేతులతో సృష్టించాను.”(సాద్ 38 : 75)
بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ
“వాస్తవానికి అల్లాహ్ చేతులు రెండూ తెరచుకుని ఉన్నాయి.”(అల్ మాయిద 5: 64)
ఇంకా – అల్లాహ్ సంతోషిస్తాడు, ప్రేమిస్తాడు, కినుక వహిస్తాడు, ఆగ్రహిస్తాడు – ఇవన్నీ ఆయన లక్షణాలే. ఇవిగాక మరెన్నో లక్షణాలున్నాయి. వాటిని గురించి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ద్వారా కూడా ఆయన లక్షణాలు తెలుస్తున్నాయి –
(ఆ) అల్లాహ్ నామాలను, లక్షణాలను నిరూపించే బుద్ధిపరమయిన ఆధారాలు
అల్లాహ్ నామాలు, గుణగణాలకు సంబంధించి షరీయత్ పరమయిన ఆధారాలున్నట్లే బుద్ధిపరమయిన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి :
1. రకరకాల సృష్టితాలు అసంఖ్యాకంగా ఉనికిలోనికి రావటం. తమ సృష్టికి వెనుక ఉన్న పరమార్థాలను నెరవేర్చటంలో అవి పకడ్బందీగా పనిచేయటం, తమ కొరకు నిర్ధారించబడిన కక్ష్యలో – పరిధిలో – ఉండి మరీ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం, ఇవన్నీ అల్లాహ్ ఘనత్వానికి, శక్తికి, యుక్తికి, జ్ఞానానికి, ఆయన ఇచ్చకు నిలువుటద్దంగా ఉన్నాయి.
2. అనుగ్రహించటం, మేలు చేయటం, కష్టాలను, ఆపదలను తొలగించటం – ఇవన్నీ దైవకారుణ్యానికి, ఉదాత్త గుణానికి నిదర్శనంగా ఉన్నాయి.
4. విధేయులను, విశ్వాసపాత్రులను సత్కరించటం, కటాక్షించటం, వారికి పుణ్యఫలం ప్రసాదించటం – ఇవి రెండూ దైవ ప్రసన్నతకు, ప్రేమైక గుణానికి దర్పణంగా ఉన్నాయి.
రెండవది : దైవనామాలు, దైవగుణాల విషయంలో అహ్లే సున్నత్ వల్ జమాఅత్ విధానం:
అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు, సలఫె సాలెహ్ కోవకు చెందినవారు, వారి అనుయాయులు – అల్లాహ్ నామాలు, గుణగణాల విషయంలో వీరందరి విధానం ఒక్కటే. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్లో తెలుపబడినట్లుగా వారు వాటిని యధాతథంగా విశ్వసిస్తారు. వారి పద్ధతి క్రింది నిబంధనలను అనుసరించి ఉంటుంది.
(1) వీరు దైవనామాలను, గుణగణాలను దైవగ్రంథానుసారం, ప్రవక్త విధానానుసారం నమ్ముతారు. తదనుగుణంగానే వాటిని రూఢీ చేస్తారు. వాటి బాహ్య స్వరూపానికి విరుద్ధంగా అర్థాలు తీయరు. వాటిని మార్చే ప్రయత్నం కూడా చేయరు.
(2) ఆయన నామాలను, లక్షణాలను సృష్టితాల లక్షణాలతో పోల్చి చెప్పటాన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు : అల్లాహ్ సెలవిచ్చినట్లు:
“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.”(అష్ షూరా 42 : 11)
(3) దైవనామాలను, దైవిక గుణాలను రుజువు చేయటానికి ఏ ఏ ఆధారాలు, నిదర్శనాలు ఖుర్ఆన్, హదీసులలో ఇవ్వబడ్డాయో, వాటిని సుతరామూ ఉల్లంఘించరు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ ఆధారాలను, రుజువులను చూపారో, వాటిని ఖచ్చితంగా అంగీకరిస్తారు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోసిపుచ్చిన వాటిని వీరు కూడా త్రోసిరాజంటారు. ఏ విషయాలపై అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహించారో వాటిపై వీరు కూడా మౌనం వహిస్తారు.
(4) దైవనామాలు, గుణగణాలకు సంబంధించిన దైవసూక్తులను వీరు తిరుగులేనివిగా, స్పష్టమైనవి (ముహ్కమాత్)గా విశ్వసిస్తారు. వాటి భావార్థాన్ని గ్రహించవచ్చునని, వాటిని గురించి కూలంకషంగా విడమరచి చెప్పటం సాధ్యమేనని భావిస్తారు. ఈ ఆయతులను వారు అస్పష్టమైనవిగా, నిగూఢమైనవి (ముతషాబిహాత్) గా పరిగణించరు. అందుకే వారు – అభినవ రచయితలు కొంతమంది లాగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటంగానీ, విషయాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేయటం గానీ చేయరు. మొత్తానికి వీరి వ్యవహారం ఈ విషయంలో నిర్దిష్టంగా, నిర్ధ్వంధ్వంగా, సూటిగా ఉంటుంది.
(5) గుణగణాల వైనం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న జనించినపుడు ఆ జ్ఞానం అల్లాహ్ కే ఉందని చెబుతారు. ఈ విషయంలో వితండ వాదనకు దిగరు. అనవసరంగా విషయాన్ని సాగదీయరు.
మూడవది : మొత్తం పేర్లను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం:
దైవ నామాలను, గుణగణాలను నిరాకరించే వారిలో మూడు రకాల వారున్నారు.
1. జహ్మియా వర్గం: వీరు జహమ్ బిన్ సఫ్వాన్ అనుయాయులు. వీళ్లు అల్లాహ్ పేర్లన్నింటినీ, గుణగణాలన్నింటినీ నిరాకరిస్తారు.
2. మోతజిలా వర్గం: వీళ్లు వాసిల్ బిన్ అతా అనుయాయులు. వాసిల్ ఇమామ్ హసన్ బస్రీ సమావేశాల నుండి వేరైపోయారు. వీరు కేవలం అల్లాహ్ నామాలను మాత్రమే రూఢీ చేస్తారు. అయితే ఆ నామాలు కేవలం పదాలేనని, వాటికి అర్ధం అనేది ఏమీ లేదని వాదిస్తారు. ఇక అల్లాహ్ గుణగణాల విషయానికివస్తే, ఆసాంతం వాటీని నిరాకరిస్తారు.
3. అషాఅరా [1] , మాతరీదీయ [2] వర్గీయులు – వారి అనుయాయులు: వీరు దైవనామాలు, గుణగణాలలో కొన్నింటిని అంగీకరిస్తారు. కొన్ని గుణాలను మాత్రం నిరాకరిస్తారు.
[1] వీరు అబుల్ హసన్ అష్అరీ అభిమతాన్ని అనునరించేవారు . అయితే అబుల్ హసన్ తరువాతి కాలంలో తన విధానానికి స్వస్తి పలికి అహఁలే సున్నత్ అభిమతాన్ని అవలంబించాడు. కాని అతని అనుయాయులు మరలి రాలేదు. కాబట్టి వీళ్లను అబుల్ హసన్ అష్అరీ వర్గీయులని అనటం నరికాదు.
[2] వీరు అబూ మన్సూర్ మాతురీదీ అనుయాయులు.
వీరి అభిమతానికి పునాది ఇది :
అల్లాహ్ను ఆయన సృష్టితాలతో పోల్చే చేష్ట నుండి తాము సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణులలో కొందరున్నారు. వారు తమను అల్లాహ్ నామాలతో పిలుచుకుంటున్నారు. అల్లాహ్ గుణాలలో కొన్ని గుణాలను తమ కొరకు ప్రత్యేకించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దీనివల్ల పేర్లు, గుణగణాల విషయంలో సృష్టికర్త – సృష్టితాలు కలగాపులగం అవుతున్నాయి. తత్కారణంగా ఆ రెండింటి వాస్తవికతలో కూడా “భాగస్వామ్యానికి” తావు ఏర్పడుతున్నది. ఆ విధంగా సృష్టితాలను కూడా సృష్టికర్తతో పోల్చేందుకు ఆస్కారం కలుగుతోంది – ఇదీ వారి వాదన. అందువల్ల వారు క్రింద పేర్కొనబడిన రెండు విషయాలలో ఏదో ఒకదానిని మాత్రమే అవలంబిస్తారు.
(అ) వారు అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణాలకు సంబంధించిన ‘మూలాల’ను వాటి బాహ్యార్థాల ద్వారా గ్రహిస్తారు. ఉదాహరణకు : (అల్లాహ్) ‘ముఖము’ను ‘అల్లాహ్ అస్తిత్వం’ అనే అర్థంలో తీసుకుంటారు. (అల్లాహ్) ‘చేతులు’ను ‘అల్లాహ్ అనుగ్రహం’ అన్న భావంలో తీసుకుంటారు.
(ఆ) లేదా ఈ ‘మూలాల’ భావార్ధాన్ని అల్లాహ్కే వదలివేస్తారు. అదేమంటే, వాటి అర్ధం అల్లాహ్ కే తెలుసు అంటారు. ఈ నామాలు మరియు గుణాలు వాటి బాహ్యార్ధంలో లేవని కూడా నమ్ముతారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“(ఓ ముహమ్మద్!) ఇదేవిధంగా మేము నిన్ను ఈ సమాజం లోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని వారికి వినిపించటానికి! వారు కరుణామయుని (అల్లాహ్ను) తిరస్కరిస్తున్నారు.” (అర్ రాద్ 13:20)
ఈ సూక్తి అవతరణ వెనుక గల నేపథ్యం ఇది :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కరుణామయుని (రహ్మాన్) ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, వారు దానిని స్పష్టంగా త్రోసిపుచ్చారు. అప్పుడు అల్లాహ్ వారి గురించి “వారు కరుణామయుని (అల్లాహ్ను) తిరస్కరిస్తున్నారు” అనే ఆయతును అవతరింపజేశాడు.
ఇది హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఎదురైన సంఘటన అని అల్లామా ఇబ్నె జరీర్ అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అరబ్బు ముష్రికులకు మధ్య జరిగిన ఒడంబడికను లిఖించటానికి పూనుకున్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్”అని వ్రాయించారు. దానికి ఖురైషులు అభ్యంతరం తెలుపుతూ “రహ్మాన్ ఎవరో మాకు తెలీదు” అన్నారు.
ఇబ్నె జరీర్ గారు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. దీని ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలో దుఆ చేస్తూ “యా రహ్మాన్! యా రహీమ్!” అనేవారు. అది విన్న ముష్రిక్కులు, ‘ఈయన గారు ఒక ఆరాధ్య దైవాన్ని మొర పెట్టుకుంటున్నట్టు భావిస్తున్నాడు. కాని ఆయన మొరపెట్టుకునేది ఇద్దరు ఆరాధ్యులను’ అని ఎద్దేవా చేశారు. అప్పుడు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు.
“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, “కరుణామయుడంటే ఏమిటి? (ఇంతకీ ఆయనెవరు?) అని వారంటారు. (అల్ ఫుర్ఖాన్ 25 : 60)
కనుక అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను – ఏ విధంగానయినా నిరాకరించే ఈ ముష్రిక్కులు, జహ్మియా వర్గీయులు, మోతజిలా వర్గీయులు, అషాఅరా అనుంగు అనుచరులు, ఇంకా ఈ ధోరణిని అనుసరించే వారి పూర్వీకులు – వీరంతా నిరసించదగిన వారు.
దైవనామాలను, గుణగణాలను నిరాకరించేవారి ధోరణి క్రింది పద్ధతుల ద్వారా ఖండించబడుతుంది –
మొదటి పద్ధతి :
మొదటి పద్ధతి ఏమిటంటే అల్లాహ్ తన కొరకు నామాలను, గుణాలను రూఢీ చేశాడు. ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఆయనకు పేర్లు, గుణాలున్నాయని రుజువు చేశాడు. కనుక అల్లాహ్ నామాలను, గుణాలను పూర్తిగాగానీ, పాక్షికంగా గానీ నిరాకరించటమంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరూపించిన వాటిని ఏకంగా త్రోసిపుచ్చటమే అవుతుంది. ఆ విధంగా ఇది అల్లాహ్ తోనూ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోనూ వ్యతిరేకతను, శత్రుత్వాన్ని కొనితెచ్చుకునే చేష్టే.
రెండవ పద్ధతి:
రెండవ పద్ధతి ఏమిటంటే; మనుషులలో అల్లాహ్ లోని సుగుణాలు కానవచ్చినంత మాత్రాన లేదా మనుషులలో కొందరికి అల్లాహ్ పేర్లున్నంతమాత్రాన సృష్టికర్తకు – సృష్టితాలకు (అల్లాహ్ కు – మనుషులకు) మధ్య సామ్యం, పోలిక ఉండాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే అల్లాహ్ నామాలు, గుణ విశేషాలు అల్లాహ్ కే స్వంతం. అల్లాహ్ కే పరిమితం, ప్రత్యేకం. మనుషులకు గల పేర్లు, గుణాలు మనుషులకే పరిమితం. ఏ విధంగానయితే అల్లాహ్ అస్థిత్వం ఇతర సృష్టితాల అస్థిత్వంతో పోలిక కలిగిలేదో, అదేవిధంగా అల్లాహ్ నామాలు, గుణగణాలు కూడా సృష్టితాల పేర్లతో, గుణాలతో పోలిక కలిగి లేవు. అల్లాహ్ పేరు – మనుషుల పేరు ఒకటై ఉన్నంత మాత్రాన వారికి భాగస్వామ్యం ఉన్నట్లు లెక్క కాదు. ఉదాహరణకు : అల్లాహ్కు అలీమ్, హకీమ్ అనే పేర్లున్నాయి. అయితే ఆయన తన దాసుల్లో కొందరికి ‘అలీమ్’ అనే పేరు పెట్టాడు.
“మీ దగ్గరకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను మృదు స్వభావి (రవూఫ్), దయాశీలి (రహీమ్).” (అత్ తౌబా 9 : 128)
అయితే ఒక “రవూఫ్” మరో “రవూఫ్” వంటివాడు కాడు. ఒక “రహీమ్” మరో “రహీమ్” వంటివాడు కాడు.
అలాగే అల్లాహ్ తనకు ఎన్నో గుణ విశేషాలున్నాయని చెప్పుకున్నాడు. దాంతో తన దాసులలో కూడా అలాంటి గుణగణాలున్నాయని పేర్కొన్నాడు. ఉదాహరణకు : ఒకచోట ఈ విధంగా సెలవీయబడింది :
“అల్లాహ్ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. ఈ బలం తరువాత మళ్లీ మీకు బలహీనతను ఇచ్చాడు. (మిమ్మల్ని) వృద్ధాప్యానికి చేర్చాడు.”(అర్ రూమ్ 30 : 54)
దీనిద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్ నామాలు, గుణాలు ఆయనకే స్వంతం. ఆయనకే శోభాయమానం. మనుషుల పేర్లు గుణాలు వారికే ప్రత్యేకం, వారికే అవి తగినవి. పేర్లు, గుణాలు ఒకేవిధంగా కనిపించినంతమాత్రాన వాస్తవంలో అవి ఒకటి కావు. రెండింటి మధ్య ఎలాంటి సామ్యంగానీ, పోలికగానీ లేదు. ఇది చాలా స్పష్టమయిన విషయం. సర్వస్తోత్రాలు అల్లాహ్కే శోభాయమానం.
మూడవ పద్ధతి
ఎవరయితే గుణగణాల రీత్యా పరిపూర్ణుడు కాడో అతనికి ఆరాధ్య దేవుడయ్యే అర్హత లేదు. అందుకే దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం ( అలైహిస్సలాం) తన తండ్రితో ఇలా అన్నారు:
“అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదన్న సంగతిని గురించి వారు ఆలోచించలేదా?”(అల్ ఆరాఫ్ 7 : 148)
నాల్గవ పద్దతి:
గుణాలను రూఢీ చేయటం పరిపూర్ణతకు చిహ్నం. నిరాకరించటం లోపానికి ఆనవాలు. ఎందుకంటే గుణములు లేనివాడు నశించినవానితో సమానం లేదా లోపభూయిష్టతకు తార్కాణం. అల్లాహ్ ఈ రెండింటికీ అతీతుడు, పవిత్రుడు.
ఐదవ పద్ధతి:
దైవగుణాలకు మనం మనవైన భాష్యాలు చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. పైగా ఈ ధోరణి ఒక మిథ్య. వాటి అర్ధాలను అల్లాహ్ కే అప్పగించటం కూడా సరైనది కాదు. ఇలా చేస్తే, ఖుర్ఆన్లో మనకు ఏమీ తెలియని విషయాల గురించి అల్లాహ్ మనకు ఆజ్ఞలు జారీచేసినట్లవుతుంది. కాగా; తనను తన పేర్లతోనే పిలవమని అల్లాహ్ మనల్ని ఆదేశించాడు. మరి మనకు అర్థమే తెలియనపుడు ఎలా పిలిచేది? మరోవైపు అల్లాహ్ ఖుర్ఆన్లో అనేకచోట్ల ఆజ్ఞాపిస్తున్నాడు – ఖుర్ఆన్పై చింతన చేయమని! మనకు భావార్దాలే తెలియనపుడు వాటిపై మనం చింతన ఎలా చేయగలుగుతాము?
కనుక బోధపడేదేమిటంటే అల్లాహ్ యొక్క నామాలను, ఆయన గుణగణాలను మనుషులతో పోల్చకుండా యధాతథంగా అంగీకరించటం అనివార్యం. ఎందుకంటే ఆయన నామాలు, ఆయన గుణగణాలు ఆయన స్టాయికి, వైభవానికి తగినట్లుగానే ఉన్నాయి. ఉదాహరణకు : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.”(అష్ షూరా 42 : 11)
ఈ ఆయతులో అల్లాహ్ తనను ఏ వస్తువుతోనయినా సరే పోల్చటాన్ని త్రోసిపుచ్చాడు. అలాగే తనలోని వినే, చూచే గుణాలను రుజువు చేశాడు. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే దైవగుణాలను అంగీకరించటం వల్ల వాటికి పోలికలను ఆపాదించినట్టు అర్థం కాదు. పోలికలను త్రోసిపుచ్చటంతో పాటు, గుణగణాలను అంగీకరించటం అవశ్యమని కూడా దీనిద్వారా అవగతమవుతోంది. అల్లాహ్ నామాల, గుణాల విషయంలో అహఁలే సున్నత్ వల్ జమాఅత్ చెప్పేదొక్కటే : “పోలికలతో నిమిత్తం లేకుండా వీటిని ఒప్పుకోవాలి. కాదు, కూడదు అని అనకుండా వాటిని స్వచ్చమైనవిగా ఖరారు చేయాలి.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[40 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క పరిచయం
అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.
అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ (అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్) ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)
ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ నిస్సందేహంగా అల్లాహ్యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.(7:54)
ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.
ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا (అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా) స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)
ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ (అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్) ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్దే. (14:2)
وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ (వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్) తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)
మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.
اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)
మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,
هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا (అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ) భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)
ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.
ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ (అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్) అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)
అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.
ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,
أَبَشَرٌ يَهْدُونَنَا (అ బషరున్ యహ్దూననా) ‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)
మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.
మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.
ఇస్లాం – సర్వ సృష్టి యొక్క ధర్మం
అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,
كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ (కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్) (ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)
సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.
స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)
ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.
అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,
يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا (యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ) “ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)
ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,
ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.
ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ (షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్) రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)
రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.
ఇస్లాం పై అపోహలు
కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.
అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.
ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.
أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ (అఫగైర దీనిల్లాహి యబ్గూన్) ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)
ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?
وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا (వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా) వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)
మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.
సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.
అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.
ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.
మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?
فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا (ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా) అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.
అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు) ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.