ఈ ప్రసంగంలో వక్త సూరా అల్-ఇఖ్లాస్ యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ సందర్భాలలో దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్, మగ్రిబ్, విత్ర్ మరియు తవాఫ్ నమాజులలో ఈ సూరాను పఠించేవారని తెలిపారు. నిద్రపోయే ముందు ఈ సూరాను మువ్వజతైన్ (సూరా ఫలక్, సూరా నాస్)లతో కలిపి మూడు సార్లు చదివి శరీరంపై తుడుచుకోవడం వల్ల కీడుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఉదయం మరియు సాయంత్రం అజ్కార్లలో, అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత దీనిని పఠించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రోజుకు సుమారు 14 సార్లు ఈ సూరాను పఠించడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందవచ్చని సూచించారు.
సూరా యొక్క ప్రాముఖ్యత మరియు నమాజులలో పఠనం
ఈ సూరాకు ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని కారణంగానే ఒక్క రోజులోనే అనేక సందర్భాల్లో చదవడానికి చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులోని రెండవ రకాతు సున్నత్ లో ఈ సూరా చదివేవారు. తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు చేస్తారు కదా, అందులో రెండవ రకాతు సున్నత్ తర్వాత చదివేవారు. కొన్ని సందర్భాల్లో మగ్రిబ్ నమాజు లోని రెండవ రకాతులో కూడా చదివేవారు. విత్ర్ నమాజు లోని మూడవ రకాతులో కూడా ఈ సూరా చదువుతూ ఉండేవారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి.
నిద్రపోయే ముందు పాటించవలసిన సున్నత్
అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సూరా ప్రతి ముస్లిం పడుకునే ముందు మూడు సార్లు చదవాలి. దీనితో పాటు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కూడా చదవాలి అని చెప్పారు. ఇది మనం చదివి ఊదుకున్నామంటే, ఎక్కడి వరకు మన చెయ్యి చేరుతుందో తల పై నుండి, ముఖము మరియు శరీర భాగము, అక్కడ వరకు స్పర్శ చేసుకుంటూ, తుడుచుకుంటూ వెళ్ళాలి, మసాహ్ చేసుకుంటూ. ఈ విధంగా అన్ని రకాల చెడుల నుండి, కీడుల నుండి మనం కాపాడబడతాము అన్నటువంటి శుభవార్త కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
ఉదయం, సాయంత్రం మరియు ఫర్జ్ నమాజుల తర్వాత
అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి ఈ సూరా మరియు రెండు సూరాలు (ఫలక్, నాస్) కూడా చదవాలని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు, సాయంకాలం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు చదవాలి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీథ్, “తక్ఫీక మిన్ కుల్లి షై” (నీవు ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ మూడు సూరాలు చదివావంటే, అది నీకు అన్ని రకాల కీడుల నుండి కాపాడడానికి సరిపోతుంది).
ఆత్మపరిశీలన మరియు ముగింపు
ఈ విధంగా మీరు ఆలోచించండి, ఈ సూరా యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది గనక అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇన్ని సార్లు… టోటల్ ఎన్ని సార్లు అయిందో ఒకసారి ఆలోచించారా మీరు. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి (ఐదు), ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు. తొమ్మిది ప్లస్ ఐదు, పద్నాలుగు సార్లు ఈ సూరా మనం చదువుతున్నామా? మనలో ఎవరైనా చదువుతలేరంటే వారు ఎన్ని మేళ్లను కోల్పోతున్నారు? ఎన్ని రకాల శుభాలను కోల్పోతున్నారు? స్వయంగా వారే ఆలోచించుకోవాలి.
అల్లాహ్ యే మనందరికీ ఈ సూరా యొక్క ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థ భావాలను మంచి రీతిలో అవగాహన చేసుకొని, దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢపరచుకొని, ఆచరణకు సంబంధించిన విషయాలను సంపూర్ణంగా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్త్రీలకు సంభందించిన మూడు విషయాలు (హైజ్, ఇస్తిహాజా, నిఫాస్) వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/TUhsPXUH9zw [10 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మహిళలకు సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది: హైజ్ (రుతుస్రావం), ఇస్తిహాజా (అనారోగ్య రక్తస్రావం), మరియు నిఫాస్ (ప్రసూతి రక్తస్రావం). హైజ్ అనేది ప్రతి నెలా ఆరోగ్యకరమైన స్త్రీ గర్భాశయం నుండి వచ్చే సాధారణ రక్తస్రావం. దాని కాలపరిమితి, వయస్సు, మరియు ఆ సమయంలో పాటించాల్సిన నిషిద్ధాలు (నమాజ్, ఉపవాసం, సంభోగం వంటివి), అనుమతించబడిన పనుల గురించి చర్చించబడింది. ఇస్తిహాజా అనేది అనారోగ్యం కారణంగా నరాల నుండి వచ్చే అసాధారణ రక్తస్రావం, దీనికి హైజ్ నియమాలు వర్తించవు మరియు ఆరాధనలు కొనసాగించాలి. నిఫాస్ అనేది ప్రసవానంతరం వచ్చే రక్తం, దీనికి గరిష్టంగా 40 రోజుల పరిమితి ఉంటుంది మరియు హైజ్కు సంబంధించిన నియమాలే వర్తిస్తాయి. ఈ మూడు స్థితుల మధ్య తేడాలను, వాటికి సంబంధించిన ధార్మిక విధులను మరియు మినహాయింపులను స్పష్టంగా తెలియజేయడం ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్) శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. దైవభీతిపరులకే శుభపరిణామం. ప్రవక్తలలో శ్రేష్ఠుడైన ఆయనపై, ప్రళయదినం వరకు ఉత్తమరీతిలో వారిని అనుసరించేవారిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ రోజు మనం స్త్రీలకి సంబంధించిన మూడు విషయాలు, హైజ్, ఇస్తిహాజా మరియు నిఫాస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం.
హైజ్, ఇస్తిహాజా మరియు నిఫాస్: నిర్వచనాలు
హైజ్ అంటే స్త్రీలకు ప్రతినెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు. హైజ్ రక్తం నలుపు రంగులో, చిక్కగా ఎరుపు రంగు ఆవరించినట్లుగా ఉంటుందని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హైజ్ రక్తం స్త్రీ గర్భాశయం నుండి వెలువడుతుంది. అంటే హైజ్ అనేది గర్భం నుంచి వస్తుంది గనక ఇది ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యవంతులకు ఆరోగ్యంగా ఉన్నవారికి ప్రతి నెలా ఇది గర్భం నుండి వచ్చే రక్తం.
ఇస్తిహాజా అంటే నిరంతర రక్తస్రావం. ఈ రక్తపు రంగు, వాసన హైజ్ రక్తానికి భిన్నంగా ఉంటుంది. అంటే స్త్రీకి బహిష్టు కాలం తర్వాత కూడా స్రవిస్తూ ఉండే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారు. ఇస్తిహాజా రక్తం నరాల నుండి వస్తుంది, గర్భం నుండి కాదు.
ఇక మూడవది నిఫాస్. నిఫాస్ అంటే పురిటి రక్తస్రావం. గర్భిణి ప్రసవించినప్పుడు లేక దానికంటే ముందు వెలువడే రక్తాన్ని నిఫాస్ అంటారు.
ఇప్పుడు మనం హైజ్ అంటే ఏమిటి, ఇస్తిహాజా అంటే ఏమిటి, నిఫాస్ అంటే ఏమిటి, వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం.
హైజ్ (రుతుస్రావం)
హైజ్ సమయం. సాధారణంగా హైజ్ తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై 50 సంవత్సరాల వరకు అవుతూ ఉంటుంది.
దీని వ్యవధి, అంటే ప్రతి నెలా ఎన్ని రోజులు వస్తుందంటే, అల్పంగా ఒక్క పగలు, ఒక్క రాత్రి అంటే 24 గంటలు అన్నమాట. సాధారణంగా ఐదు లేక ఆరు లేక ఏడు రోజులు. ఇది సాధారణమైన వ్యవధి. అధికంగా 15 రోజులు వస్తుంది. ఒకవేళ ఎవరికైనా 15 రోజుల కంటే ఎక్కువగా వస్తే అది ఇస్తిహాజాగా పరిగణించబడుతుంది. అది ఇస్తిహాజా అయిపోతుంది, హైజ్ అవ్వదు. 15 కంటే ఎక్కువ అయితే అది ఇస్తిహాజా.
నిషిద్ధాలు ఏమిటి? హైజ్ ఆ స్థితిలో, హైజ్ వచ్చే సమయంలో నిషిద్ధాలు ఏమిటి? నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్ లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్ ని ముట్టుకోకూడదు. దేనిలోనైనా చుట్టి ఉన్నట్లయితే పట్టుకోవచ్చు. ఈ ఆరు విషయాలు నిషిద్ధం. ఇక ఏడవది కూడా ఉంది, ఒకవేళ భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే హైజ్ సమయంలో విడాకులు ఇవ్వటం ధర్మసమ్మతం కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.
ఇక హైజ్కి సంబంధించిన నియమ నిబంధనలు. ఈ హైజ్ అనేది విడాకుల ఇద్దత్ సమయం, గడువు, భర్త చనిపోయిన స్త్రీల ఇద్దత్ సమయం నిర్ధారించబడుతుంది ఈ హైజ్ వలన. ఈ నెలసరి క్రమం వలన. అలాగే దినచర్యలు కొనసాగించాలి. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. ముట్టుకోవటం, పట్టుకోవటం, పక్కన కూర్చోవటం, కలిసి పడుకోవటం భర్తతో, ఇవన్నీ చేయవచ్చు. ఇస్లాంలో ఎటువంటి ఇది పట్టింపులు లేవు. ఆ సమయంలో దూరంగా ఉండాలి, పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, తాకకూడదు, హీనంగా చూడాలి, ఇది ఇస్లాం ఖండిస్తుంది. సంభోగం తప్ప అన్ని పనులు చేయవచ్చు. మాట్లాడటం, భర్త అయితే ముద్దు పెట్టుకోవటం, పట్టుకోవటం, కలిసి మెలిసి పడుకోవటం, భోజనం వంట తయారు చేయటం, కలిసి భుజించటం, అన్ని పనులు చేసుకోవటం, ఇవన్నీ చేయవచ్చు. నిషిద్ధాలు ఏమిటి? ఆరాధన నిషిద్ధం. నమాజు, తవాఫ్, ఖురాన్ పట్టుకోవటం,మస్జిద్ లో ఉండటం ఇవి నిషిద్ధాలు. అయితే జికర్ చేయవచ్చు, దుఆ చేయవచ్చు.
ఇవి హైజ్కి సంబంధించిన కొన్ని విషయాలు.
ఇస్తిహాజా (అనారోగ్య రక్తస్రావం)
ఇక ఇస్తిహాదా ఇది హైజ్ కాదు కదా. హైజ్ గర్భం నుంచి వస్తుంది, ఇస్తిహాజా నరం నుంచి వస్తుంది. అంటే ఇస్తిహాదా ఒక రకంగా అనారోగ్యానికి సంబంధించిన రక్తం. అనారోగ్యం మూలంగా వచ్చే రక్తం ఇస్తిహాజా. అందుకు ఇస్తిహాజా వలన ఎటువంటి నియమాలు లేవు. ఇస్తిహాజాకి సమయం కూడా లేదు. ఏ సమయంలో వస్తుంది, తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే ప్రత్యేక వ్యవధి కూడా లేదు. ఎన్ని రోజులు వస్తుంది తెలియదు, ఒక రోజు రావచ్చు, 20 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు. దీనికి ఏ కట్టుబాట్లు లేవు. అన్ని ఇస్లామీయ చర్యలకు అనుమతి ఉంది. నమాజ్ చేయాలి, ఉపవాసం కూడా పాటించాలి, సంభోగం కూడా చేసుకోవచ్చు భర్తతో. అన్నీ. ఎందుకంటే ఇస్తిహాదా హైజ్ కాదు. హైజ్కే అవి నిషిద్ధాలు. ఆ సమయంలో సంభోగం చేయకూడదు. అప్పుడు నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు. ఇవన్నీ హైజ్కి సంబంధించిన విషయాలు, ఆదేశాలు, నియమ నిషిద్ధాలు. ఎందుకంటే హైజ్ గర్భం నుంచి వస్తుంది. కానీ ఇస్తిహాజా నరాల నుంచి వస్తుంది గనుక అది అనారోగ్యం గనుక దీనికి హైజ్కి సంబంధం లేదు. నమాజు చేయాలి, ఉపవాసం పాటించాలి, అన్నీ చేయవచ్చు. ఎటువంటి కట్టుబాట్లు ఉండవు. కాకపోతే ప్రతి నమాజ్ కోసం ప్రత్యేకంగా వుజూ చేసుకోవాలి.
నిఫాస్ (ప్రసూతి రక్తస్రావం)
ఇక చివరిది నిఫాస్. దీని సమయం బిడ్డ పుట్టినప్పుడు లేదా దానికి ఒకటి, రెండు, మూడు రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే రక్తస్రావాన్ని నిఫాస్ అంటారు.
దీని వ్యవధి ఏమిటి? అధికంగా 40 రోజులు. అంతకంటే ఎక్కువ రోజులు వస్తే అది ఇస్తిహాజా. అల్పంగా వ్యవధి లేదు. ఒక రోజు రావచ్చు, ఒక వారం రావచ్చు, 10-15 రోజుల్లో రావచ్చు ఆ తర్వాత ఆగిపోవచ్చు. అధికంగా 40 రోజులు. ఆ తర్వాత కూడా కంటిన్యూ వస్తే అది ఇస్తిహాజా అవుతుంది. అల్పంగా దానికి వ్యవధి లేదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు.
నిషిద్ధాలు ఏమిటి? హైజ్కి సంబంధించిన నిషిద్ధాలే నిఫాస్కి కూడా వర్తిస్తాయి. ఏ నిషిద్ధాలు హైజ్లో ఉన్నాయో అంటే నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్ని ముట్టుకోకూడదు, ఈ నిషిద్ధాలే నిఫాస్కి కూడా వర్తిస్తాయి.
నిబంధనలు ఏమిటి? తన దినచర్యలు చేసుకోవాలి, సంభోగం తప్ప అన్నీ చేయవచ్చు.
అభిమాన సోదర సోదరీమణులారా, ఇవి కొన్ని విషయాలు హైజ్, ఇస్తిహాదా మరియు నిఫాస్కి సంబంధించిన.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ సున్నత్ విధానంగా, ఇస్లామీయ ఆరాధనలు, ఇస్లామీయ జీవన విధానం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ప్రవచనాలు, ఆయన సున్నత్ విధానాన్ని పాటిస్తూ జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ మరింత జ్ఞానం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు] వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.
ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.
అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.
ఖాబిల్ సంతానం & షైతాన్ కుతంత్రం
ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.
చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.
అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.
ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.
అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.
షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.
అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.
ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.
అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.
ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.
ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.
అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.
అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.
అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.
తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.
వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.
ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.
ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.
ఇద్రీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా రాక
షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.
ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్)దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.
దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.
చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.
మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.
మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,
“ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)
అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.
మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.
ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.
అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.
ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.
ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.
ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.
మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.
నేర్చుకోవలసిన పాఠాలు
అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?
మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.
రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.
కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.
అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.
దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.
అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.
ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా? https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్
అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.
దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్
మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.
ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ (ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్) నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)
ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.
ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.
అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ (లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం) మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.
మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا (మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా) ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.
ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.
అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.
చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.
అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:
قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ (ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న) (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)
అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీ – నా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ (మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక) ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.
అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.
ప్రశ్న: షిర్క్ చేసే భర్త నుండి ఖులా తీసుకోవచ్చా?
భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.
దర్గాలు మరియు తాయెత్తులు: షిర్క్ వైపు దారితీసే పనులు
వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.
దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.
وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ (వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్) వాటిని సృష్టించిన అల్లాహ్కే సాష్టాంగపడండి. (41:37)
భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం) మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)
మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.
ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.
భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.
దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.
నమాజును విస్మరించడం యొక్క తీవ్రత
దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.
ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
فَوَيْلٌ لِلْمُصَلِّينَ (ఫ వైలుల్ లిల్ ముసల్లీన్) వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)
الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ (అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్) ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)
ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.
భార్యకు ఇస్లామీయ తీర్పు మరియు సలహా
అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.
కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దొంగతనం మరియు ఇస్లాం బోధనలు https://youtu.be/htWndMP8VBQ [55 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, దొంగతనం మరియు దానిపై ఇస్లామీయ బోధనల గురించి వివరించబడింది. దొంగతనం ఇస్లాంలో ఒక ఘోరమైన పాపంగా పరిగణించబడుతుందని, దానిని నివారించడానికి ఖురాన్ మరియు హదీసులలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వక్త తెలియజేశారు. సూరహ్ అల్-మాయిదాలోని ఆయతులను ఉటంకిస్తూ, దొంగతనం చేసిన స్త్రీపురుషులకు ఇస్లామీయ ప్రభుత్వం విధించే శిక్ష గురించి, మరియు పశ్చాత్తాపపడితే అల్లాహ్ క్షమించే కారుణ్యం గురించి వివరించారు. దొంగతనం యొక్క చెడు ప్రభావాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తూ, ఈ చెడు గుణానికి దూరంగా ఉండాలని, ధర్మబద్ధమైన జీవితం గడపాలని ప్రబోధించారు. ఈ నేరానికి పాల్పడిన వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో ఎదురయ్యే తీవ్రమైన పరిణామాల గురించి కూడా హెచ్చరించారు.
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభిల్లుతాయి. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము, ఆయననే క్షమాపణ వేడుకుంటున్నాము. మా ఆత్మల కీడుల నుండి, మా దుశ్చర్యల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ మార్గదర్శకత్వం వహించినవానిని ఎవరూ మార్గభ్రష్టతకు గురిచేయలేరు. ఆయనచే మార్గభ్రష్టతకు గురైనవానికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ తర్వాత, నిశ్యయంగా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం, ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ధర్మభ్రష్టత). ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత. ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది.
దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు
أعوذ بالله السميع العليم من الشيطان الرجيم (అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్) సర్వశ్రోత, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ నుండి.
وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)
فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوب عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)
أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.(5:40)
సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, అన్ని రకాల గొప్పతనాలు కేవలం ఏకైక సృష్టికర్త మరియు మనందరి ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.
ప్రియ వీక్షకుల్లారా! సోదర సోదరీమణులారా! ఈరోజు మన అంశం దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు. దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు ఈ అంశాన్ని పురస్కరించుకొని నేను సూరతుల్ మాయిదా, సూర నెంబర్ ఐదు, ఆయత్ నంబర్ 38 నుండి 40 వరకు మూడు ఆయతులు తిలావత్ చేశాను. నేను తిలావత్ చేసినటువంటి ఈ ఆయతుల అనువాదం ముందు మీరు వినాలని ఆ తర్వాత మనం ఇన్షా అల్లాహ్ మన అంశంలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాము.
దొంగతనం చేసినది పురుషుడైనా స్త్రీ అయినా ఉభయుల చేతులు నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం, అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష, అల్లాహ్ సర్వాధిఖ్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు. (5:40)
పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది, ఇక్కడ ఈ అనువాదం చాలా శ్రద్ధగా గమనించండి.
فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ ఈ దుర్మార్గానికి పాల్పడిన తర్వాత పశ్చాత్తాపపడి
అని ఇక్కడ అరబీలో అల్లాహుతాలా ఖురాన్ లో జుల్మ్ అన్న పదం చెప్పాడు. దీనికి పాపం అన్న ఒక భావం కూడా వస్తుంది. మరియు సర్వసామాన్యంగా జుల్మ్, హక్కు గల వారి నుండి వారి హక్కును దోచుకోవడం, తీసుకోవడం, లాక్కోవడం మరియు అలాగే దౌర్జన్యం, అన్యాయం ఈ భావాల్లో కూడా వస్తుంది.
అల్లాహ్ ఏమంటున్నాడు? ఈ దౌర్జన్యానికి ఈ పాపానికి దొంగతనం లాంటి చెడ్డ గుణానికి పాల్పడిన తర్వాత నిజంగా అతను పశ్చాత్తాపం చెంది అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ కోరుకొని وَأَصْلَحَ (వ అస్లహ) తన నడవడికను సరిదిద్దుకున్న వాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడు. ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్ దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.
సోదర మహాశయులారా! మనం ఏ అంశంపై చదవదలుచుకున్నా, వినదలుచుకున్నా, ఏ అంశం పైనైనా మనం మాట్లాడదలుచుకున్నా, ఖురాన్ మరియు హదీసులో దాని గురించి ఏముంది? సహాబాలు ఆ అంశాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? దీనిని మనం అన్నింటికంటే ముందు పెట్టి ఆ అంశాన్ని పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి.
ఈ ఆయత్ యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మరి కొన్ని క్షణాల్లో ముందుకు రానున్నది. అయితే రండి. మన ఈనాటి అంశం దొంగతనం మరియు ఇస్లాం బోధనలు. ఈ రోజుల్లో ఎన్నో రకాల రంగాలలో దొంగతనం యొక్క ఎన్నో రకాలు చాలా ప్రబలిపోయి ఏవైతే ఉన్నాయో, దానిని అంతమొందించి, ఈ చెడు గుణాన్ని నిర్మూలించాలంటే ఇస్లాం మాత్రమే సరియైన మంచి పరిష్కారం. అయితే ఒక రెండు పలుకుల్లో చెప్పాలంటే దొంగతన నిర్మూలానికి, దొంగతనం లాంటి చెడు గుణం దూరం కావడానికి ఇస్లామే సరియైన పరిష్కారం.
ఎందుకంటే ఇస్లాం ధర్మం అన్ని రకాల ప్రజలపై ఉన్నటువంటి భారాలను దించి వేయడానికి, వారు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక రుగ్మతలను, వారు ఏ సామాజిక రుగ్మతలలో కొట్టుమిట్టాడుతున్నారో చాలా ఇబ్బందికి మరియు కష్టానికి గురై ఉన్నారో వాటి మంచి ఉత్తమ పరిష్కారం ఇస్లాం తెలియజేసింది. ఇస్లాం కొన్ని హద్దులు, ఉదాహరణకు, దొంగతనానికి, వ్యభిచారానికి, ఏ ఆధారం లేకుండా ఒకరిపై వారి మానభంగం, వారి యొక్క పరువు విషయంలో జోక్యం చేసుకొని అపనిందలు వేసే వారిపై కొన్ని రకాల శిక్షలు ఏదైతే విధించినదో, మరియు ఇస్లామీయ పరిభాషలో వాటిని الْحُدُود (అల్ హుదూద్) అని అంటారో, ఈ హద్దులు ఏవైతే నిర్ణించబడ్డాయో, ఈ శిక్షలు ఏవైతే నిర్ణయించబడ్డాయో, ఎవరి మనసులలో రోగాలు ఉన్నాయో అవి బాగుపడడానికి, జనులపై అల్లాహ్ వైపు నుండి కరుణగా అవి వచ్చాయి. మరియు చివరికి హత్యకు బదులుగా హత్య అన్నటువంటి ఏ హక్కైతే ఇస్లాం ప్రభుత్వాలకు ఇచ్చినదో, ఇందులో కూడా బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు ఎంతో గొప్ప గుణపాఠం ఉన్నది.
وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ (వలకుమ్ ఫిల్ ఖిసాసి హయాతున్ యా ఉలిల్ అల్బాబ్) ఇందులో వాస్తవానికి ఒక జీవనం ఉన్నది. దీనిని బుద్ధిమంతులు మాత్రమే గ్రహించగలరు.
అని అల్లాహుతాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే, ఎవరైతే ఒకరి సొమ్మును దొంగతనంగా, ఒకరి హక్కును దొంగతనంగా కాజేసుకుంటారో, అలాంటి వారి యొక్క చేతులను నరకాలి అని ఏదైతే శిక్ష వచ్చిందో, అది కూడా ప్రజల యొక్క సొమ్ము, వారి యొక్క ధనం, వారి యొక్క హక్కులు భద్రంగా ఉండాలని. అలాగే మనం ఇంకా ఇతర ఎన్నో రకాల హద్దులను ఏదైతే చూస్తున్నామో, వాస్తవానికి ఇందులో ప్రజల కొరకు ఎంతో మేలు ఉంది.
కొన్ని సందర్భాల్లో మనకు ఇస్లాం యొక్క జ్ఞానం తక్కువ ఉండడం వల్ల ఏదైనా ఒక శిక్ష గురించి అయ్యో, ఇంత చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్షనా అన్నట్లుగా కొందరు భావిస్తారు. కానీ దాని యొక్క సంపూర్ణ జ్ఞానం లభించినదంటే అది వాస్తవానికి మేలు అన్న విషయాన్ని గ్రహిస్తారు.
సమాజంలో దొంగతనం అనే చెడు
సోదర మహాశయులారా! సోదరీమణులారా! సమాజంలో ప్రబలి ఉన్నటువంటి ఎన్నో రకాల చెడులలో ఒకటి, ఒక చెడు దొంగతనం. దొంగతనం ఇళ్లల్లో పిల్లలు వారి చిన్న వయసు నుండి చేయడం ఏదైతే మొదలు పెడతారో, ఈ దురలవాటు వారు వయసు వారైన తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. చివరికి ఇది సమాజానికే ఎంతో వినాశకరంగా మారుతుంది.
అయితే దొంగతనం గురించి మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇది ఘోర పాపాల్లోని ఒక పాపం. ఎవరైతే దొంగతనానికి పాల్పడుతున్నారో, వారు గ్రహించాలి. ఆ దొంగతనం ఏదైనా చిన్న వస్తువుది చేసినా, ఏదైనా పెద్ద వస్తువుది చేసినా, దొంగతనం చేయబడినటువంటి ఆ వస్తువు దానికి ఎంతో పెద్ద రేట్ ప్రైస్ వెల ఉన్నా లేకపోయినా, ఇక్కడ ముందు గమనించవలసిన విషయం అల్లాహ్ దొంగతనాన్ని నిషిద్ధపరిచాడు. ఎందుకంటే ఇస్లాం ధర్మం, ధర్మాన్ని, మానవుల యొక్క మానాన్ని, పరువును, వారి యొక్క ధనాన్ని అన్ని రకాలుగా వారికి భద్రత ఇస్తుంది. మరియు దొంగతనం అనేది వారి ఆర్థిక విషయాల్లో ఇంకా వేరే రకంగా కూడా వారికి అన్యాయం ఇందులో జరుగుతుంది గనక ఇస్లాం దీనిని నిషిద్ధపరిచింది.
అయ్యో చిన్నదే కదా అని ఎవరైతే కొందరు అనుకుంటారో, ఇక్కడ వారు గమనించాలి. గొప్పవాడైనటువంటి అల్లాహ్ అజ్జవజల్లా యొక్క ఆదేశానికి వ్యతిరేకం చేస్తున్నారు. అతని ఆజ్ఞ పాలన చేయడం లేదు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న విషయాన్ని గ్రహించాలి.
అందుకొరకే సుమారు మొత్తమొక సూరాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో సుమారు చివరిగా అవతరించినటువంటి సూరతుల్ మాయిదా, దాని ఆయత్ నెంబర్ 38లో అల్లాహుతాలా ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడే వారి చేతులను నరకాలి. ఆ దొంగతనం చేసేవారు పురుషుడైనా, స్త్రీ అయినా, ఇద్దరికీ ఈ శిక్ష పడాలి అని చాలా స్పష్టం చేశారు.
మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఆయత్ యొక్క చివరిలో:
وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ (వల్లాహు అజీజున్ హకీమ్) అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.
నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను కదా. ఖురాన్లో ఎక్కడైతే అల్లాహ్ యొక్క పేర్లు వస్తున్నాయో, ఆయత్ యొక్క చివరిలో ఆ పూర్తి ఆయత్ యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లాహ్ యొక్క పేర్లు ఏవైతే వచ్చాయో, వాటిపై అవగాహన, పరిశీలన, దూరపు ఆలోచన, తదబ్బుర్, తఫక్కుర్ చాలా అవసరం.
ఎందుకంటే, ఇందులోనే గమనించండి. అల్లాహుతాలా దొంగతనం చేసేవారు పురుషులైనా, స్త్రీ అయినా వారి యొక్క చేతులను నరకండి. ఇది వారు చేసినటువంటి పాపానికి ఒక శిక్ష అని ఏదైతే అంటున్నాడో, వెంటనే ఏమన్నాడు? వల్లాహు అజీజున్ అంటే ఏంటి? అల్లాహుతాలా చాలా అధికారం గలవాడు. ఎలాంటి? అతనికి ఎలాంటి సర్వాధికారం ఉన్నది అంటే అతడు ఒక ఆదేశం ఇచ్చాడంటే దానికి తిరుగు అనేది ఉండదు. ఎవరైతే అతని ఆ ఆదేశానికి వ్యతిరేకంగా చేస్తాడో అతడే నష్టంలో పడిపోతాడు. ఇక హకీం, చూడడానికి ఇక్కడ ఒక మనిషి చెయ్యిని నరికి వేయడం జరుగుతుంది. ఇలాంటి ఆదేశం అల్లాహ్ ఇస్తాడా? హకీం అతడు సంపూర్ణ వివేకం గలవాడు. అతడు ఇచ్చినటువంటి ఈ ఆదేశంలో ఎన్నో వివేకవంతమైన విషయాలు, బోధనలు ఉన్నాయి. ఇందులో చాలా గొప్ప హితోపదేశాలు ఉన్నాయి. వాటిని గమనించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ మాట పలకరాదు.
దొంగతనం సమాజానికి చాలా నష్టం చేకూర్చునది గనక ఇస్లాంలో వచ్చే వారితో ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్ చేయకూడదు అన్నటువంటి వాగ్దానం ఏదైతే తీసుకునేవారో, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఇలాంటి చెడు గుణాలు చేయకుండా పవిత్రంగా ఉంటారన్నటువంటి వాగ్దానం కూడా తీసుకునేవారు.
దీనికి సంబంధించి సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో చాలా స్పష్టంగా హదీస్ వచ్చి ఉంది. సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 18, సహీ ముస్లింలోని 1709 హదీసులు గమనిస్తే ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు తెలుపుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ సహాబాలు కూర్చుని ఉన్నారు. ప్రవక్త వారు చెప్పారు,
“బైఅత్ చేయండి, శపదం చేయండి, మీరు ఏ మాత్రం అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయరు, షిర్క్ చేయరు అని. దొంగతనం చేయరు అని. వ్యభిచారం చేయరు అని. మీ సంతానాన్ని హతమార్చరని. మీరు ఎవరిపై ఎలాంటి అపనింద వేయరు అని. మరియు మేలు విషయాల్లో ఏ ఆదేశం నేను మీకు ఇస్తున్నానో, దానికి మీరు అవిధేయత పాటించరని కూడా వాగ్దానం చేయండి“
గమనిస్తున్నారా? ఎలా వాగ్దానం తీసుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ వాగ్దానం కేవలం పురుషులతోనే కాదు, స్త్రీలతో కూడా తీసుకునేవారు. ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ని గమనించండి, 1866. అల్లాహుతాలా సూరతుల్ ముమ్తహినా ఆయత్ నెంబర్ 12లో దీని ప్రస్తావన చేశారు.
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. (60:12)
ఆయిషా రదియల్లాహు తాలా అన్హా తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలతో కూడా ఇలాంటి శపదం తీసుకునేవారు. కానీ ఏం జరిగేది? ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులతో వాగ్దానం తీసుకునే సందర్భంలో చేతిలో చేయి వేసి వారితో శపదం తీసుకునేవారు. కానీ స్త్రీలతో ఏ మాత్రం చేయి ముట్టుకునేవారు కాదు. ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు,
وَاللَّهِ مَا مَسَّتْ يَدُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَ امْرَأَةٍ قَطُّ (వల్లాహి మా మస్సత్ యదు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యదంరఅతిన్ కద్) ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ హస్తం ఏ పరాయి స్త్రీని తాకలేదు, ఏ పరాయి స్త్రీ యొక్క చేతిని అంటుకోలేదు, ముట్టలేదు.
غَيْرَ أَنَّهُ يُبَايِعُهُنَّ بِالْكَلَامِ (గైర అన్నహు యుబాయి ఉహున్న బిల్ కలాం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి మాట ద్వారానే వారితో శపదం తీసుకునేవారు.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి? దొంగతనం ఎంతటి చెడ్డ దురలవాటు, కొన్ని సందర్భాలలో ఇస్లాంలో ప్రవేశించే స్త్రీ పురుషులందరితో కూడా దీని గురించి వాగ్దానం తీసుకోబడేది. దీని ద్వారా ఈ చెడు గుణం యొక్క చెడుతనం అర్థమవుతుంది కదా? అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ దొంగతనం అన్నది ఎంతటి చెడ్డ గుణం అంటే,
وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ (వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్) సర్వ లోకాల కొరకు మేము మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపాము
అని ఎవరి గురించైతే అల్లాహ్ తెలుపుతున్నాడో, అలాంటి కారుణ్య మూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేసే వారిని لَعْنَة (లఅనత్) చేశారు, శపించారు, ఏం చెప్పారు? సహీ హదీసులో వచ్చి ఉంది. సహీ బుఖారీ 6783 మరియు సహీ ముస్లిం 1687.
لَعَنَ اللَّهُ السَّارِقَ (లఅనల్లాహు స్సారిక్) దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించాడు.
ఇలా కూడా వస్తుంది దీని భావం. దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించుగాక.
అల్లాహ్ శపించుగాక అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? అల్లాహ్ అతన్ని తన కారుణ్యం నుండి దూరం చేయుగాక. అల్లాహ్ యొక్క కారుణ్యం ఇలాంటి చెడు గుణానికి పాల్పడే వారికి అల్లాహ్ యొక్క దయ, కరుణ ఏదీ కూడా లభించకుండా ఉండాలి.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం) అని మాటిమాటికి మనం చదువుతుంటాము. ఏంటి? అల్లాహ్ యొక్క రెండు గుణాలు అందులో వచ్చాయి. الرَّحْمَٰن (అర్రహ్మాన్) الرَّحِيم (అర్రహీం). ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం رَءُوفٌ رَحِيمٌ (రఉఫుర్రహీం). కానీ దొంగతనం ఎంత చెడ్డ గుణం, అలాంటి వారి గురించి ప్రవక్త శపించారు, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం పడుతుంది.
ఇక ఇంత విన్న తర్వాత ఎవరైనా తనకు తాను అల్లాహ్ యొక్క శాపానికి గురి చేసుకోవడం ఇది మంచిదేనా ఒకసారి గమనించండి. దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీనికి పాల్పడే వారికి ఇతర పాపాలు, ఇతర నేరాలతో పాటు ఈ దొంగతనానికి పాల్పడినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరికి ఎలాంటి శిక్ష ఇచ్చారో ఒక్కసారి గనక మీరు గమనించారంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో వారి ప్రస్తావన వచ్చి ఉంది.
ఉకల్ లేదా ఉరైనా కబీలాకు సంబంధించిన కొంత మంది మదీనాలో వచ్చారు. అక్కడి వాతావరణం వారికి అనుకూలంగా లేకుండినది. అనారోగ్యానికి పాలయ్యారు. వారి యొక్క రోగాన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు కట్టే చోట ఏదైతే ఉంటుందో, మదీనా సిటీకి కొంచెం దూరంలో, అక్కడికి వారిని పంపి కొంచెం బయటి ప్రాంతంలో, బయటి వాతావరణంలో అక్కడ ఉండండి, ఆ ఒంటె యొక్క పాలు మరియు దాని యొక్క మూత్రం మీ ఈ రోగానికి ఒక మంచి చికిత్స అని తెలియజేశారు. అయితే వారు కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆరోగ్యవంతులైపోయారు. వారికి స్వస్థత కలిగింది. చూడండి, ఉపకారానికి అపకారము చేయరాదు అని చదువుకుంటూ ఉంటాము కదా మనం. కానీ దీనికి విరుద్ధంగా వారేం చేశారు? ఆ ఒంటెల కాపరి అక్కడ ఎవరైతే ఉన్నారో, ఆ ఒంటెల కాపరిని హతమార్చి, ఒంటెలు దొంగతనం చేసి మరియు అరాచకం చేసి అక్కడి నుండి పారిపోయారు. పొద్దు పొద్దున్న ఈ నేరాలు, ఈ ఘోర పాపాలకు గురై అక్కడి నుండి పారిపోయారు అన్న విషయం ప్రవక్తకు తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది వీరులను వారిని పట్టుకోవడానికి పంపారు. సహాబాలు, వీరులు వారిని గాలించి, వెతికి పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పగటి పూట రాకముందే వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి ఒక చెయ్యిని, ఒక కాలును నరికి వేయడంతో పాటు వారికి ఘోరమైన శిక్ష విధించడం జరిగింది. మరియు ఒకచోట ఎక్కడైతే సౌకర్యాలు లేవో అక్కడ వారిని వదలడం జరిగింది.
అబూ కిలాబా రహిమహుల్లాహ్ ఈ హదీస్ ను ఉల్లేఖించిన వారు, ఒక తాబియీ చెబుతున్నారు, فَهَؤُلَاءِ (ఫహా ఉలా) ఈ ముజ్రిమీన్, ఈ క్రిమినల్ పర్సన్స్,
سَرَقُوا (సరకూ) దొంగతనానికి పాల్పడ్డారు,
وَقَتَلُوا (వకతలూ) హత్య నేరానికి పాల్పడ్డారు,
وَكَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ (వకఫరూ బాద ఈమానిహిం) విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు,
وَحَارَبُوا اللَّهَ وَرَسُولَهُ (వహారబుల్లాహ వరసూల) అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమయ్యారు.
గమనిస్తున్నారా? ఈ నేరాలలో ఒకటి ఏముండినది? దొంగతనం కూడా ఉండినది. ఇక అల్లాహుతాలా వారికి ఎలాంటి శిక్ష ఇచ్చాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎలాంటి శిక్ష విధించారో విన్నారు.
నమాజులో ప్రవక్తకు చూపబడిన దృశ్యాలు
అందుకే సోదర మహాశయులారా, ఇక్కడి వరకే సరిపోదు, ఒకవేళ దొంగతనం చేసే వ్యక్తి స్వచ్ఛమైన తౌబా చేసి తన మనసును పరిశుభ్రం చేసుకొని అల్లాహ్ తో భయపడి ఈ తప్పిదాన్ని, ఈ పాపాన్ని వదలలేదు అంటే అతడు మరీ ఘోరాతి ఘోరమైన శిక్షకు గురి అవుతాడు. ఏంటి ఆ శిక్ష? అల్లాహు అక్బర్. గమనించండి. ఆ శిక్ష ఏమిటో, ఎలాంటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజులో ఉండగా ఇలాంటి పాపానికి పాల్పడే వారి శిక్ష నరకంలో ఏముందో అది చూపించబడింది అంటే ఆ సిచువేషన్, ఆ సందర్భాన్ని మీరు గ్రహించండి. ఈ దొంగతనం లాంటి చెడ్డ గుణం ఎంత చెడ్డదో అర్థం చేసుకోండి.
అనేక హదీసుల్లో వచ్చిన విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్య గ్రహణం అయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దీర్ఘంగా ఖియాం, రుకూ, సజ్దాలు చేస్తూ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గం మరియు స్వర్గ యొక్క భోగ భాగ్యాలు పొందే కొందరు స్వర్గ వాసులను చూపించడం జరిగింది. ఏ సదాచరణ, సత్కార్యాల వల్ల ఎవరు ఏ స్వర్గ భాగ్యం పొందారో, స్వర్గంలో ఏ స్థానం పొందారో అది చూపించడం జరిగింది ప్రవక్తకు. అలాగే కొన్ని ఘోరమైన పాపాలు, నేరాలకు పాల్పడే వారిని కూడా వారు నరకంలో ఎలాంటి శిక్ష పొందుతున్నారో చూపించడం జరిగింది.
సోదర మహాశయులారా, ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒకసారి మీరు గమనించారంటే ఎంత భయాందోళన కలిగే విషయం. ఆ హదీస్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో ఎవరెవరిని చూశారో, ఏ ఏ పాపాలు చేసే వారిని చూశారో, కొందరి గురించి ప్రస్తావించారు. అందులో ఒకరు ఎవరు?
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండు ఒంటెలను దొంగతనం చేశాడు. అతన్ని చూపించడం జరిగింది. అలాగే హజ్ కొరకు వచ్చిన వారు, అల్లాహ్ యొక్క గృహం, దాని యొక్క దర్శనం కొరకు, తవాఫ్ చేయడానికి వచ్చిన వారిని దొంగలించే దొంగను కూడా అందులో చూశారు. మరియు కొందరు దొంగతనంలో కూడా తమకు తాము ఎంత హుషారీతనం, ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో అన్నటువంటి గర్వానికి గురవుతారు. అలాంటి ఒక ప్రస్తావన కూడా అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏంటి? ఒక దొంగ ఒక కట్టె తీసుకుని ఉంటాడు, దాని యొక్క చివరిలో కొంచెం ఇలా వంగి ఉంటుంది. హజ్ చేసే సందర్భంలో కొందరు తమ యొక్క ఏదైనా సామాన్, ఆ సామానుకు తన యొక్క ఆ కట్టెను ఇలా మెల్లగా తగిలించి, అతడు ఆ సామాను యొక్క వ్యక్తి గ్రహించకుండానే దాన్ని కింద పడేసుకొని లాక్కునే ప్రయత్నం చేసేవాడు. ఒకవేళ సామాను గల వ్యక్తి చూశాడు, గమనించాడు అంటే అయ్యో సారీ నా యొక్క కట్టె తగిలిపోయిందండి మీ సామానులో అనేవాడు. ఒకవేళ గమనించకుంటే దొంగలించి తీసుకెళ్లేవాడు. పవిత్రమైన స్థలం, సామాన్య నేరాల యొక్క పాపము, దాని యొక్క స్థానం అక్కడ ఎక్కువ పెరిగిపోతుంది హరంలో. అలాంటి చోట ఈ దొంగతనం చేసే వ్యక్తి మరియు ఇలాంటి సాకులు చెప్పుకుంటూ తనకు తాను ఎంతో హుషారీతనం చేస్తున్నాడు అన్నట్లుగా భావిస్తూ ఉన్న అలాంటి వారిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో చూశారు.
అంటే ఏం తెలుస్తుంది? ఎవరైతే దొంగతనానికి పాల్పడతారో స్వచ్ఛమైన తౌబా చేసి ఆ చెడు గుణానికి దూరంగా ఉండరో, ప్రళయ దినాన కూడా వారికి ఎలాంటి శిక్ష ఉందో ప్రవక్తకు ఈ లోకంలోనే చూపించడం జరిగింది.
అంతే కాదు సోదర మహాశయులారా, దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, రవ్వంత విశ్వాసం ఉన్న వ్యక్తి కూడా వెంటనే తౌబా చేయాలి. దొంగతనం చేసిన సామాను అతని దగ్గర ఉంటే ఏదో ఒక రకంగా ఆ హక్కు గల వారికి, ఎవరి నుండి దొంగలించాడో వారికి ఇచ్చేసేయాలి. మరియు తన విశ్వాసాన్ని స్వచ్ఛమైనదిగా, బలమైనదిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదా అంటే చాలా ప్రమాదంలో పడిపోతాడు. ఏంటి విషయం? సహీ బుఖారీ 2475, సహీ ముస్లిం 57 హదీద్ నంబర్:
وَلاَ يَسْرِقُ حِينَ يَسْرِقُ وَهْوَ مُؤْمِنٌ (వలా యస్రికు హీన యస్రికు వహువ ముమిన్) దొంగతనం చేసే సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు.
అల్లాహు అక్బర్. ఎవరైనా తనకు తాను ముస్లిం గా భావించి దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే దొంగతనం చేసే ఆ సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు, అతని నుండి దూరమైపోతుంది. గమనిస్తున్నారా? విశ్వాసం అతనిలో ఉండజాలదు. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని యొక్క వివరాల్లోకి వెళ్లేది ఉంటే నా యొక్క అంశాన్ని పూర్తి చేయలేను. కానీ ఇంత విషయం కూడా మనం విన్నామంటే భయపడిపోవాలి. ఇది ఎంతటి చెడ్డ గుణం, ఆ పనికి ఆ చెడుకు పాల్పడిన సందర్భంలో విశ్వాసం మనలో ఉండదు.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక హదీసుల్లోని వివరాల్లోకి వెళ్లి మనం చూశామంటే, అల్లాహు అక్బర్. కొన్ని కొన్ని దొంగతనాలకు ఎలాంటి శిక్షలు ఉన్నాయో, అది కూడా ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలపడం జరిగింది, ప్రవక్త వారు వాటి నుండి మనల్ని హెచ్చరించారు.
ఒకసారి ఈ హదీస్ ను వినండి. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది ఇలాంటి దొంగతనానికి పాల్పడుతున్నారు. చాలా విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద హోదాలలో ఉన్నవారు, రాజకీయాల్లో ఉన్నవారు, డబ్బు ధనం గలవారు, ఇంకా సామాన్య ప్రజలు కూడా ఎంతో మంది ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారు. మరి వారికి ఎంత ఘోరమైన శిక్ష ఉందో, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3198, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1610, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
مَنْ أَخَذَ شِبْرًا مِنَ الأَرْضِ ظُلْمًا فَإِنَّهُ يُطَوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ مِنْ سَبْعِ أَرَضِينَ ఎవరైతే మరో వ్యక్తి భూమిలో నుండి జానెడైనా అన్యాయంగా తీసుకొంటాడో, ప్రళయ దినాన ఏడు భూముల బరువు అతని మెడలో వేయబడుతుంది.
జుల్మన్ (అతని హక్కు కాదు అది కానీ అన్యాయంగా తీసుకుంటున్నాడు, దౌర్జన్యంగా తీసుకుంటున్నాడు), ఏమవుతుంది? అతని యొక్క మెడలో ఏడు భూముల ఒక హారం లాంటిది చేసి, ఒక తౌఖ్, బంధన్ లాంటిది చేసి అతని మెడలో వేయబడుతుంది. కదిలించలేడు.
గమనించండి. జానెడు, జానెడు భూమి అన్యాయంగా తీసుకున్న వారికి ఇంత ఘోరమైన శిక్ష ఉంటే ఇక ఎవరైతే అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారో వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో గమనించండి. పంట భూముల్లో, పొలాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లలో అక్కడనైతే అన్యాయంగా ఎవరిదైతే అసలు భూమి ఉంటుందో వారిపై నానా రకాలుగా ఇండైరెక్ట్ గా ఎవరెవరితో ఎన్నో లంచాలు తినిపించి ఏదో అది సెంటర్ సిటీలో ఉంది, దాని యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఓ రెండు లక్షలు వారి మూతిపై పారేస్తే ఎక్కడైనా వెళ్లి బతుకుతారు అన్నటువంటి సాకులతో, ఇంకా ఎన్నెన్నో సాకులతో భూములను కాజేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా ఇల్లు కట్టడానికి పునాది తవ్వుతున్నారు అంటే అయ్యో పక్క వానిలో భూమి నుండి ఓ జానెడే కదా వానికి ఏం తెలుస్తుంది? ఇలాంటి అన్యాయాలకు కూడా పాల్పడతారు. కానీ గమనించండి, ఎల్లవేళల్లో ఈ హదీసును దృష్టిలో ఉంచుకోవాలి. ఇది సమాధి శిక్షల్లోని ఓ శిక్ష. అంతేకాదు, ఈ దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, మనిషి ఒకవేళ ఈ చెడు గుణం నుండి ఇహలోకంలోనే తౌబా చేసుకొని దూరం కాకపోతే, తాను స్వయంగా ఎంతో పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. తన చావు సమయంలో, సమాధిలో మరియు ఆ తర్వాత ప్రళయ దినాన లేపబడినప్పుడు దీనికి సంబంధించి సహీ ముస్లింలోని ఒక హదీస్ను గమనించండి. హదీసు నెంబర్ : 1013, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు :
భూమి తన గర్భంలోని నిధులను బంగారు, వెండి స్తంభాల రూపంలో బయటకు కక్కుతుంది. అప్పుడు హంతకుడు వచ్చి, ‘దీని కోసమే నేను హత్య చేశాను’ అంటాడు. బంధుత్వాలను తెంచుకున్నవాడు వచ్చి, ‘దీని కోసమే నేను బంధుత్వాలను తెంచుకున్నాను’ అంటాడు. దొంగ వచ్చి, ‘దీని కోసమే నా చెయ్యి నరకబడింది’ అంటాడు. ఆ తర్వాత వారంతా దానిని వదిలేస్తారు, దాని నుండి ఏమీ తీసుకోరు.
ఆ తర్వాత పరలోక దినాన వచ్చినప్పుడు, హంతకుడు వచ్చి ఏమంటాడు? నేను ఈ డబ్బు ధనం కొరకే, దీని ఆశలోనే అన్యాయంగా ఒకరిని హత్య చేశాను కదా అని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. డబ్బు ధనాల కోసం బంధుత్వాలను తెంచుకున్నవాడు ఎంతో రోదిస్తాడు, బాధపడతాడు, పశ్చాత్తాప పడతాడు. ఈ డబ్బు ధన పేరాశలో పడి నేను నా బంధుత్వాలను తెంచుకున్నాను కదా. దొంగతనం చేసి చేసిన వ్యక్తి వస్తాడు, ఏమంటాడు? ఈ డబ్బు ధన ఆశలో నేను దీనికి పాల్పడి దొంగతనం చేసినందుకు నా చేతులు నరికి వేయబడ్డాయి కదా. వారి కండ్ల ముంగట డబ్బు ధనం అంతా కనబడుతూ ఉంటుంది. అప్పుడు వారికి పశ్చాత్తాపం ఏర్పడుతుంది. దానిలో నుండి ఏ మాత్రం ఏ రవ్వంత తీసుకోరు. కానీ ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా పనికి వస్తుందా? ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా లాభం చేకూరుస్తుందా? లేదు.
సోదర మహాశయులారా! దొంగతనం ఎంత చెడ్డ గుణం అన్నది గమనించండి. ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురైష్ లో ఒక సంఘటన జరిగినది.
మఖ్జూం కబీలా అని ఒక వంశం ఉండినది. ఆ వంశాన్ని చాలా గౌరవంగా ప్రజలు చూసేవారు. అయితే వారిలో ఒక స్త్రీ ఉండినది. ఆమె ప్రజల యొక్క సామానులు అమానతుగా ఉంచుకునేది. కానీ ఎక్కడ ఏ చెడ్డ గుణం కలిగిందో, షైతాన్ ప్రేరణలో వచ్చేసింది, దొంగతనానికి పాల్పడింది. అయితే పేరుకు అంత మంచి స్త్రీ, ఎన్ని రోజుల నుండి చాలా పలుకుబడి ఉన్నది, మరియు వంశం కూడా ఆమెది చాలా పెద్ద వంశం. ఏమంటారు? అరే ఎంత పెద్ద మినిస్టర్ కదండీ, అగ్ర కులానికి చెందిన వారు కదండీ అని ఈ రోజుల్లో కూడా శిక్షలు పడకుండా తమ హోదా అంతస్తు, తమ వంశం పేరు మీద తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా మరి ఎవరి చేతిలోనైతే అధికారాలు ఉన్నాయో కేవలం కింది వారికి శిక్షలు ఇచ్చి పెద్దవారిని వదులుతూ ఉంటారో ఈ హదీసును వినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆమె ప్రస్తావన వచ్చేసింది. ఇక ప్రవక్త ఆమె యొక్క చేతులు నరికి వేయడానికి శిక్ష ఇవ్వకూడదు అని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రవక్తకు చాలా ప్రియాతి ప్రియులైన వారిని ప్రవక్త వద్దకు పంపి సిఫారసులు చేయించడం మొదలు పెట్టారు. ప్రవక్త యొక్క ప్రియుడైన కొడుకు, అతను కూడా చాలా ప్రియుడు, ఉసామా బిన్ జైద్, అతన్ని పంపడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కరాఖండిగా నిరాకరించారంటే ఉసామా భయపడిపోయారు. ఎందుకంటే ప్రవక్త వద్ద ఈ సిఫారసు గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు, ప్రవక్త ఇతని మాట విన్న తర్వాత ప్రవక్త యొక్క ముఖ కవళికలు మారిపోయాయి. ఆగ్రహానికి గురయ్యారు ప్రవక్త. ఏం చెప్పారు ప్రవక్త?
أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللَّهِ؟ (అతష్వఫీ హద్దిన్ మిన్ హుదూదిల్లాహ్) అల్లాహ్ నిర్ణయించిన హద్దులో, అల్లాహ్ ఏ శిక్ష విధించాడో అది పడకుండా ఉండడానికి నీవు సిఫారసు చేయడానికి వచ్చావా?
ఉసామా చాలా చాలా సిగ్గుపడి, పశ్చాత్తాపపడి ప్రవక్తతో వెంటనే
اسْتَغْفِرْ لِي يَا رَسُولَ اللَّهِ (ఇస్తగ్ఫిర్లీ యా రసూలల్లాహ్) నేను ఇలాంటి పాపానికి, ఇలాంటి తప్పుకు గురి కాను. మీరు నా గురించి క్షమాపణ కోరండి అని చెప్పారు.
అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య, ఉమ్ముల్ ముమినీన్, ఉమ్మె సలమా రదియల్లాహు తాలా అన్హా వారి వద్దకు కూడా ఆమె వచ్చింది. ప్రవక్తకు సిఫారసు చేయాలన్నట్లుగా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య యొక్క మాట కూడా వినలేదు. ఆ సందర్భంలోనే ప్రవక్త వారు ఒక మాట చెప్పారు, స్వర్ణాక్షరాలతో రాయబడేవి. ఏంటి?
لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا (లవ్ అన్న ఫాతిమత బిన్త ముహమ్మదిన్ సరఖత్ లఖతఅతు యదహా) ముహమ్మద్ కుమార్తె అయినటువంటి ఫాతిమా కూడా ఒకవేళ దొంగతనం చేసింది అంటే, నేను ఆమె చేతులు కూడా నరికేవాన్ని.
ఆ తర్వాత ఆ మఖ్జూమియా కబీలాకు చెందినటువంటి స్త్రీ యొక్క చేతులు నరికేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆమె చేతులు నరికి వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శిక్షను గ్రహించండి. మరియు ఈ రోజుల్లో కూడా తారతమ్యాలు ఏదైతే చేస్తారో శిక్ష విధించడంలో, అలాంటి వారు కూడా ప్రవక్త వారి ఈ మాటలు శ్రద్ధ వహించాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెపై శిక్ష విధించారు. ఆమె ఆ శిక్ష పొందినది. కానీ తర్వాత స్వచ్ఛమైన తౌబా చేసినది. ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్నారు,
حَسُنَتْ تَوْبَتُهَا وَتَزَوَّجَتْ (హసనత్ తౌబతహా, వతజవ్వజత్) ఆ తర్వాత ఆమె వివాహం కూడా చేసుకున్నది, చాలా మంచి జీవితం ఆమె గడిపినది.
అంటే ఇస్లాంలో ఇలాంటి గొప్ప అవకాశం కూడా ఉన్నది. ఎవరైనా వాస్తవంగా మారిపోతే, తనలో మార్పు తెచ్చుకుంటే, సంస్కరించుకుంటే ఇస్లాంలో చాలా గొప్ప స్థానం కూడా ఉన్నది. అయితే ఇక్కడ మరో విషయం ఏం తెలుస్తుంది అంటే హాకిం, ఖాదీ, జడ్జ్, ఎవరైతే శిక్ష విధించే అధికారి ఉన్నాడో అతని వద్దకు విషయం రాకముందు, దొంగ తౌబా చేసుకొని ఎవరి హక్కు ఉన్నదో వారికి ఇచ్చేస్తే ఆ హక్కు గలవారు మాఫ్ చేసేస్తే ఇక ఆ విషయం అక్కడికే అయిపోతుంది. కానీ అధికారి వద్దకు వచ్చిన తర్వాత శిక్ష అనేది తప్పనిసరిగా పడవలసిందే. దీనికి సంబంధించి కూడా మన ముందు కొన్ని హదీసులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సునన్ నిసాయిలో వచ్చినటువంటి హదీస్, సఫ్వాన్ బిన్ ఉమయ్య చెబుతున్నారు. ఆయన కాబతుల్లాలో తవాఫ్ చేశారు, నమాజ్ చేశారు. ఆ తర్వాత తన వద్ద ఉన్నటువంటి ఒక దుప్పటి దాన్ని పెట్టుకొని తల కింద పడుకున్నారు. కానీ ఒక దొంగ వచ్చాడు. మెల్లగా దాన్ని తీశాడు.
ఎప్పుడైతే ఈ విషయం ప్రవక్త వద్దకు వచ్చిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దొంగను పిలిచి అడిగారు. అతను ఒప్పుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి శిక్ష పడాలి అని ఆదేశించేశారు. ఆ సందర్భంలో సఫ్వాన్ బిన్ ఉమయ్య అంటున్నారు, ప్రవక్తా, ఇతని చేతులు నరికి వేయబడతాయి అని నాకు తెలిసేది ఉంటే నేను మీ వద్దకు విషయం తీసుకురాకపోయేది, అతన్ని మన్నించేసేయండి, నా వస్తువు అయితే నాకు దొరికిపోయింది కదా. ప్రవక్త చెప్పారు, వస్తువు దొరికిపోవడమే కాదు, ఇలాంటి ఈ చెడుకు గురి కాకూడదు మరోసారి. అందుకొరకే ఈ శిక్ష. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అతనికి, నీవు ఇక్కడికి రాకముందే మాఫ్ చేసేసి, నీ హక్కులు తీసుకొని ఉండేది ఉంటే బాగుండు. కానీ ఇప్పుడు నీ యొక్క మాట చెల్లదు, అతనికి శిక్ష పడవలసిందే.
దీంతో తెలిసింది ఏమిటంటే మనిషి తౌబా చేసుకుంటాడు హాకిం వద్దకు రాకముందు. అలాంటప్పుడు అల్హందులిల్లాహ్ అతని విషయం, అతని మధ్యలో అల్లాహ్ మధ్యలోనే ఉంటుంది. కానీ ఎవరైతే జడ్జ్, ఎవరైతే అధికారి ఉంటాడో, అతని వద్దకు వచ్చిన తర్వాత సిఫారసు చెల్లదు. మరియు అతనికి ఏదైతే శిక్ష పడినదో వాస్తవంగా అతను ఒకవేళ తౌబా కూడా చేసుకున్నాడు, తన మనసును కూడా శుభ్రపరుచుకున్నాడు, ఇలాంటి చెడ్డ గుణాన్ని పూర్తిగా వదిలేశాడు అంటే ఒక గొప్ప లాభం ఏమిటో తెలుసా? పరలోక శిక్ష అనేది అతనికి ఉండదు. ఇంతకుముందు నేను మీకు ఒక హదీస్ వినిపించాను. సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 18, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1709. ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినది. అయితే ఆ హదీస్ లోనే వస్తుంది.
وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ (వమన్ అసాబ మిన్ దాలిక షైఅన్, ఫఊకిబ ఫిద్దున్యా, ఫహువ కఫ్ఫారతుల్లహ్) ఎవరైతే ఈ పాపాల్లో ఏదైనా ఒక పాపానికి గురవుతాడో, దాని యొక్క శిక్ష ఈ లోకంలో పొందుతాడో, ఇది అతని కొరకు కఫ్ఫారా అయిపోతుంది.
ముగింపు మరియు హెచ్చరికలు
సోదర మహాశయులారా, దొంగతనం చేసిన వ్యక్తి యొక్క చేయి నరికి వేసే విషయం ఏదైతే ఉందో, అది వ్యక్తిగతంగా కాదు. ఈ విషయం ముందు గుర్తుంచుకోవాలి. అంటే నా సొమ్ము ఎవరైనా దొంగతనం చేశాడు, నాకు తెలిసింది. నేను వెళ్లి అతని యొక్క చేయి నరకడం ఇది కాదు. ఇలాంటి శిక్షలు అనేటివి ఇస్లామీయ ప్రభుత్వం, ఇస్లామీయ ఖలీఫా మరియు నాయకులు ఎవరికైతే అధికారం ఇచ్చి ఉన్నాడో కోర్టులలో, ఇస్లామీయ అదాలతులలో ఏ జడ్జిలను నిర్ణయించాడో, అలాంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ విషయాన్ని ముందు గ్రహించాలి. లేదా అంటే హత్యకు బదులుగా హత్య, దొంగతనం చేసేదానికి బదులుగా శిక్ష, వ్యభిచారం చేసిన వారికి శిక్ష, ఇలాంటివి కొందరు ఏమంటారు? ఇస్లాంలో ఉన్నాయి కదా, నా చెల్లెలును వాడు, అతను అత్యాచారం చేశాడు అని, ఫలానా వారిపై అత్యాచారం చేశాడు అని వెంటనే ఎవరైనా వెళ్లి అతన్ని చంపడం, అతనికి ఏదైనా శిక్ష ఇవ్వడం, ఇది సరైన విషయం కాదు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఎంత పరిమాణంలో దొంగతనం చేస్తే చేతులు నరికి వేయబడతాయి? దీని గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఈరోజు దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీన్ని వదులుకోవాలి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం. మరియు ఎంత దొంగతనం చేస్తే ఎంత, ముందు ఏ చెయ్యి, చెయ్యిలో ఎంతవరకు?. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ లు ఉన్నాయి.
ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి నుండి సామాను దొంగలించబడినదో, అతడు తన ఒక సొమ్ము దొంగలించబడినది అని ఆ దొంగతనం కంటే ఎక్కువ పరిమాణంలో వేరే ఏదైనా అత్యాచారం, దౌర్జన్యం లాంటివి చేసే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు. తన హక్కు ఏదైతే దొంగలించబడినదో దాన్ని పొందడానికి ధర్మ హద్దుల్లో ఉండి అంతకంటే ఘోరమైన పాపానికి పాల్పడకూడదు. ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తారు? తన సైకిల్ మోటార్ ఏదైనా దొంగలించబడింది. తను నిలబెట్టి పోయాడు కార్, పార్కింగ్ చేసి వెళ్ళాడు. ఎవరైనా దాన్ని కొట్టి వెళ్లారు అంటే చూడడు, వెతకడు, రీసెర్చ్ చేయడు. అధికారులకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, వారికి తెలపాలి, అలాంటిది ఏమీ చేయకుండా ఆ రోడ్డు మీద ఉన్న బండ్లన్నిటిని కూడా నాశనం చేయడం, అన్నింటిని కూడా తగలబెట్టడం, ఇంకా ఇలాంటి కొన్ని పనులు ఏదైతే చేస్తారో, ఇది సరైన విషయం కాదు. ఇలాంటి వాటికి మనం చాలా దూరం ఉండాలి.
ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ మనం గుర్తుంచుకుంటే మన విశ్వాసం పెరుగుతుంది మరియు మనకు చాలా సంతోషం కలుగుతుంది. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు. ముస్లిం షరీఫ్ లోని హదీస్.
ఏ ముస్లిం అయినా ఒక మొక్కను నాటితే, దాని నుండి తినబడినది అతనికి సదకా (దానం) అవుతుంది, దాని నుండి దొంగలించబడినది అతనికి సదకా అవుతుంది, దాని నుండి క్రూరమృగం తిన్నది అతనికి సదకా అవుతుంది, పక్షి తిన్నది అతనికి సదకా అవుతుంది. ఎవరైనా దానిని తీసుకున్నా అది అతనికి సదకా అవుతుంది.
ఏ ముస్లిం అయినా ఒక ఏదైనా చెట్టు నాటాడు, ఇక ఆ చెట్టులో నుండి ఏ కొంచెం తినబడిన, లేక దొంగలించబడిన, లేదా ఆ మృగ జంతువులు వచ్చి వాటిని నాశనం చేసిన, లేక పక్షులు వచ్చి తిన్నా ఇదంతా కూడా ఒక్కొక్క విషయం చెబుతూ ప్రవక్త చెప్పారు. لَهُ صَدَقَةٌ (లహు సదకా) ఇది అతని కొరకు ఒక పుణ్యంగా రాయబడుతుంది. ఇది అతని కొరకు ఒక సదకాగా పరిగణించబడుతుంది.
అయితే మనకు దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్ వద్ద లభిస్తుంది. అల్లాహ్ వద్ద ప్రతిఫలం లభిస్తుంది. ధర్మ పరిధిలో ఉండి మనం ఓపిక సహనాలు వహించాలి. హక్కు తీసుకోవడానికి కూడా ఇస్లాం అనుమతిస్తుంది. కానీ ధర్మ హద్దులో ఉండి మాత్రమే ఇలా చేయాలి.
ఇక దొంగతనం అన్నది సోదర మహాశయులారా, ఏదైనా ఒక సామాను వరకే పరిమితం ఉండదు. కొన్ని ఉదాహరణలు వచ్చేసాయి మీ ముందు. భూములు దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగతనంలోని రూపాల్లో ఈ రోజుల్లో ఆన్లైన్ గా దొంగతనం, సోషల్ మీడియాలో దొంగతనాలు, ఎలక్ట్రానిక్ పరంగా దొంగతనాలు, ఇంకా పాస్వర్డ్లు అన్ని తెలుసుకొని ఏదైనా ఆ తప్పు లింకులు పంపి దాని ద్వారా ఒకరి అకౌంట్లో నుండి ఏదైనా లాక్కోవడం. దొంగతనానికి ఏ రూపు ఉన్నా కానీ. దొంగతనంలో ఈ రోజు కొందరు ఏం చేస్తారు? ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా పుస్తకం రాశాడు అంటే అతని పేరు తీసేసి మొత్తం తన పేరు పెట్టుకొని తాను రాసినట్లుగా చెప్పుకోవడం. ఇలా దొంగతనంలోని ఏ ఏ రూపం ఉన్నా గానీ ప్రతి ఒక్కటి దొంగతనంలో వస్తుంది, చెడ్డ గుణం, ప్రతి రకమైన దొంగతనం నుండి మనం దూరం ఉండాలి.
అల్లాహ్ మనందరికీ ఇలాంటి చెడు అలవాట్ల నుండి, చెడు గుణాల నుండి దూరం ఉంచుగాక. దీని యొక్క నష్టాలు, దీని యొక్క ఆ వినాశకరాలు ఏమైతే ఉన్నాయో ఖురాన్ హదీస్ ఆధారంగా మీరు విన్నారు. వీటిని ఇతరులకు తెలియజేయండి, సమాజాన్ని పవిత్ర పరిచే ప్రయత్నం చేయండి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క పరిచయం
అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.
అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ (అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్) ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)
ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ నిస్సందేహంగా అల్లాహ్యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.(7:54)
ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.
ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا (అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా) స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)
ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ (అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్) ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్దే. (14:2)
وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ (వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్) తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)
మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.
اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)
మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,
هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا (అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ) భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)
ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.
ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ (అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్) అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)
అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.
ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,
أَبَشَرٌ يَهْدُونَنَا (అ బషరున్ యహ్దూననా) ‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)
మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.
మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.
ఇస్లాం – సర్వ సృష్టి యొక్క ధర్మం
అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,
كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ (కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్) (ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)
సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.
స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)
ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.
అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,
يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا (యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ) “ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)
ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,
ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.
ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ (షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్) రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)
రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.
ఇస్లాం పై అపోహలు
కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.
అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.
ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.
أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ (అఫగైర దీనిల్లాహి యబ్గూన్) ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)
ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?
وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا (వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా) వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)
మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.
సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.
అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.
ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.
మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?
فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا (ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా) అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.
అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు) ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net