[4:26 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[13:31 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
నమాజ్ చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః
1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[3:23 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –4
4– అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు: అల్లాహ్ ఆరాధన సంబంధమైన భయంలో, లేదా మృత్యువునిచ్చుట, ఏదైనా పాపం పై పట్టి శిక్షించుట లాంటివి కేవలం అల్లాహ్ శక్తిలోనే ఉన్న వాటి గురించి అల్లాహ్ తప్ప ఇతరులతో భయపడకూడదు.
అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్యం పొందే అవకాశం ఉంది. (సూరె బఖర 2: 150).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).
జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:
నియ్యత్ (సంకల్పం).
ఖిబ్లా దిశలో నిలబడుట.
సత్ర్ (అచ్ఛాదన).
వుజూ.
జనాజ నమాజ్ విధానం:
ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.
భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో జనాజా నమాజ్ (అంత్యక్రియల ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, పద్ధతి మరియు ధర్మశాస్త్రపరమైన ఆదేశాలను వివరిస్తారు. ఇస్లాం ఒక వ్యక్తిని మరణించిన తర్వాత కూడా ఎలా గౌరవిస్తుందో, వారిపై జీవించి ఉన్నవారికి ఉన్న హక్కులను గుర్తుచేస్తూ ప్రసంగం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలలో పాల్గొనడం, మృతదేహానికి స్నానం చేయించడం (ఘుస్ల్), మరియు కఫన్ (శవ వస్త్రం) తొడిగించడం వంటి చర్యలకు లభించే గొప్ప పుణ్యఫలాల గురించి హదీసుల ఆధారంగా చర్చిస్తారు. జనాజా నమాజ్ చెల్లుబాటు కావడానికి అవసరమైన నియమాలు (నియ్యత్, ఖిబ్లా, సత్ర్, వుదూ) మరియు నమాజ్ చేసే విధానం (నాలుగు తక్బీర్లు, సూరహ్ ఫాతిహా పారాయణం, దరూద్ ఇబ్రాహీం, మృతుని కోసం ప్రత్యేక దుఆ) వివరంగా చెప్పబడింది. నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భస్రావం జరిగితే, ఆ పిండానికి కూడా జనాజా నమాజ్ చేయాలనే ముఖ్యమైన ఆదేశాన్ని నొక్కి చెబుతారు. ప్రసంగం చివరలో, జనాజా నమాజ్కు సంబంధించిన సఫ్ (వరుసలు) ఏర్పాటు, గాయబానా నమాజ్ (పరోక్ష ప్రార్థన), స్త్రీ-పురుషుల కోసం దుఆలో తేడాలు మరియు చిన్న పిల్లల జనాజా వంటి అంశాలపై శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
సోదర మహాశయులారా! అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవల్ల మనం కొన్ని రోజుల నుండి శుద్ధి మరియు నమాజ్ అనే అంశంపై ఏ మంచి పాఠాలు అయితే మొదలు పెట్టామో, అల్హందులిల్లాహ్ దాని యొక్క చివరిలో ఈ రోజు చేరుకున్నాము. ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల జనాజా నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము.
ఇందులో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, జనాజా నమాజ్ దీని యొక్క వివరణ, దీని యొక్క పద్ధతి తెలుసుకునే ముందు, ఇస్లాం యొక్క మంచితనాన్ని, మేలును, గొప్పతనాన్ని, స్వయంగా మీరు విని అర్థం చేసుకొని ప్రత్యేకంగా అవిశ్వాసులకు ఇస్లాం యొక్క ఈ మంచి విషయాన్ని బోధించండి.
అదేమిటంటే, ఇస్లాం యొక్క సంబంధం ఎవరితో ఏర్పడుతుందో వారి యొక్క హక్కు మనపై వారు బ్రతికి ఉన్నంతవరకే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనపై ఉంటుంది. మన ఒక ముస్లిం సోదరుడు బ్రతికి ఉన్నంతవరకే అతని హక్కు మనపై కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉన్నాము, మన యొక్క ముస్లిం సోదరుడు లేదా సోదరీమణి చనిపోయింది, అప్పుడు కూడా అతని యొక్క హక్కు మనపై ఉంటుంది.
ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు అంటే స్నానం చేపించడం, కఫన్ దుస్తులు ధరింపజేయడం, సమాధిలో దించడం, అంతకుముందు నమాజ్ చేయడం, అతని గురించి, ఆమె గురించి అల్లాహ్ తో క్షమాభిక్ష, పాపాల మన్నింపు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై కురుస్తూ ఉండాలి అని అల్లాహ్ ను వేడుకోవడం, ఆ తర్వాత ఇంకా వారి కొరకు దుఆ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఎలాంటి సత్కార్యాలు? అల్లాహు అక్బర్.
సహీహ్ హదీసులో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ అహ్కాముల్ జనాయిజ్ లో ప్రస్తావించారు, ఒక బ్రతికి ఉన్న ముస్లిం, చనిపోయిన ఒక ముస్లింకి స్నానం చేపించాడు, స్నానం చేపిస్తున్న సందర్భంలో ఏమైనా లోపాలు, దోషాలు, ఏమైనా విషయాలు చూశాడు, , కప్పి ఉంచాడు, ఎవరికీ చెప్పలేదు,
غَفَرَ اللَّهُ لَهُ أَرْبَعِينَ مَرَّةً (గఫరల్లాహు లహు అర్బయీన మర్ర) అల్లాహ్ అతన్ని నలభై సార్లు క్షమిస్తాడు.
ఎవరైతే ఒక ముస్లింకి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో, అల్లాహు త’ఆలా స్వర్గంలో మంచి అక్కడి స్వర్గపు పట్టు వస్త్రాలు ఇలాంటి వ్యక్తికి ధరింపజేస్తాడు.
ఇక అతని కొరకు నమాజ్ చేశాడంటే, సహీహ్ బుఖారీలోని హదీస్. ఇప్పుడు కూడా ఇన్ షా అల్లాహ్ ఆ హదీస్ వస్తుంది, రెండు పెద్ద కొండలు. ఇక రెండు పెద్ద పర్వతాలు అంటే మీ ఇష్టం. మీలో ఎంత ఇఖ్లాస్, మీలో ఎంత ముతాబా’అ. ఈ పదాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చి ఉన్నాయి. గుర్తుంది కదా? ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం. ముతాబా’అ అంటే exactly, perfectly ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించడం. ఎంత ఇఖ్లాస్, ఎంత ముతాబా’అ ఉంటుందో అంతే పెద్ద పర్వతాలు. ఈ హిమాలయా కూడా చిన్నదే. అలా మీరు ఊహించారంటే, నమాజ్ చేయడం మరియు అతన్ని సమాధిలో పెట్టేవరకు ఖబరిస్తాన్ లో, స్మశాన వాటికలో ఉండటం ఎంత గొప్ప పుణ్యాలో ఒకసారి గ్రహించండి.
ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా? ఒకటి, ఒక ముస్లిం చనిపోయాడు అంటే, చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క బాధ్యత మనపై ఎంత గొప్పగా ఉందో. ఒక విషయం ఇది. ఈ బాధ్యతను గనక మనం కరెక్ట్ ఇఖ్లాస్ మరియు ముతాబా’అ ప్రకారంగా నెరవేర్చామంటే, అల్లాహ్ వైపు నుండి మనకు ఎన్ని అనుగ్రహాలు, వరాలు, పుణ్యాలు, సత్ఫలితాలు, మంచి ప్రసాదాలు ఉన్నాయో గమనించండి.
జనాజా నమాజ్
రండి. జనాజా యొక్క చాలా వివరాలతో కూడిన పాఠం. అది కూడా బహుశా ఎంత లేకున్నా గానీ ఒక 10 పాఠాలు కావచ్చు. ఇన్ షా అల్లాహ్, త్వరలో ఎప్పుడైనా మనం వివరాలతో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సంక్షిప్తంగా నమాజ్ విషయం మీకు తెలియజేస్తున్నాము.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే జనాజాలకు హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో, అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును.”
“రెండు ఖీరాతులు అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నారు, రెండు ఖీరాతులు అంటే ఏంటి, ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం? రెండు పెద్ద పర్వతాలు, పెద్ద కొండలు అని. జబలైనీ అజీమైనీ, అజీం అజీం. ఇది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.
అయితే వేరే కొన్ని మరి సహీహ్ హదీసులో ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతం అని కూడా ప్రస్తావన వచ్చి ఉంది. ఏంటి? మదీనా నగరంలో ఉన్నటువంటి ఉహుద్ పర్వతం. అయితే ఇక్కడ విరుద్ధం, విభేదం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే సత్కార్యానికి వేరువేరు రకాలుగా మనం పుణ్యాలు లేదా పుణ్యాల ప్రస్తావన చూస్తూ ఉంటే ఇది విరుద్ధం అనరు. దీని యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఎంత స్వచ్ఛంగా, ఇఖ్లాస్ మరియు ముతాబా’అ. ఆ రెండు పదాలు మీరు మరిచిపోకండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవి. చిత్తశుద్ధి మరియు ప్రవక్త విధానాన్ని అనుసరించడం. ఇఖ్లాస్, ముతాబా’అ ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా వారు ఆ పుణ్యాన్ని పొందుతారు అనే భావం.
జనాజా నమాజ్ లో నాలుగు విషయాలు తప్పనిసరి. ఏమిటి అవి?
జనాజా నమాజ్ యొక్క నిబంధనలు
నియ్యత్ (సంకల్పం), ఖిబ్లా దిశలో నిలబడుట, సతర్ (అచ్ఛాదన), వుజూ.
ఈ నాలుగు విషయాలు మీకు అర్థమయ్యాయి. నియ్యత్ అంటే మనసులో మనం సంకల్పించుకుంటాము. నోటితో నియ్యత్ చేయడం ఇది ప్రవక్త పద్ధతి కాదు. రెండవది, ఖిబ్లా దిశలో నిలబడటం. ఖిబ్లా వైపునకు. ఇది కూడా విషయం అర్థమైనదే. సత్ర్, అచ్ఛాదన అంటే నమాజ్ చేసే సందర్భంలో మన శరీరంపై ఎంత దుస్తులు ఉండాలో అంత దుస్తులు ఉండడం. ఇది కూడా తప్పనిసరి. జనాజా నమాజ్ కొరకు వుజూ చేసుకొని ఉండటం కూడా తప్పనిసరి. ఇవి నాలుగు షరతులు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా గానీ అతను నమాజ్ చేసినప్పటికీ అతని నమాజ్, నమాజ్ కాదు. అంగీకరింపబడదు.
జనాజా నమాజ్ విధానం
ఇమామ్ (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు దగ్గరగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమామ్ వెనక నిలబడాలి.
అల్లాహు అక్బర్ అని
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ పూర్తిగా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ గమనించారు కదా? నమాజ్ యొక్క విధానం, జనాజా నమాజ్ ఎలా చేయాలి అనే విధానం ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే గమనించండి, ఇమామ్ ఎవరైతే నమాజ్ చేయిస్తారో, వారు ఎలా ఎక్కడ నిలబడాలి అనే విషయం ఇక్కడ ముందు చెప్పడం జరిగింది.
మయ్యిత్, శవం పురుషునిది అయ్యేదుంటే, అతని యొక్క తలకు సమానంగా ఇలా నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఒకవేళ స్త్రీ అయ్యేది ఉంటే, ఆమె యొక్క మధ్యలో, నడుము కాడ. ఈ విషయం అర్థమైపోయింది కదా? ఇక ముక్తదీలు అందరూ కూడా ఇమామ్ వెనక నిలబడతారు. అయితే ఇమామ్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఎందుకంటే, జనాజా నమాజ్ కు సంబంధించి హదీసులు ఏవైతే వచ్చాయో, జనాజా నమాజ్ కు సంబంధించిన హదీసుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనా చదివారా, చదవలేదా, ఏ ప్రస్తావన లేదు. చదివారు అని లేదు, చదవలేదు అని లేదు. అందుకొరకే ఇక్కడ ధర్మవేత్తలు ఎంతో మంది ఏమని అభిప్రాయపడ్డారు? ఒకవేళ ప్రవక్త చదివి ఉండేది ఉంటే, ప్రస్తావన ఉండేది. కానీ వేరే ఎంతో మంది సర్వసామాన్యంగా ధర్మవేత్తలు అంటారు, నమాజు ఆరంభంలో సనా చదవడం సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇక్కడ దాని ప్రస్తావన ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ చదవడమే మంచిది. అయితే మీ ఇష్టం. చదివినా అల్హందులిల్లాహ్, చదవకపోతే ఎలాంటి పాపం లేదు. కానీ ఏం చదవాలి? అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే,
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
చదివి సూరె ఫాతిహా పూర్తిగా చదవాలి. సూరె ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివినా అల్హందులిల్లాహ్. చదవకపోయినా అల్హందులిల్లాహ్. ఆ తర్వాత రెండవసారి అల్లాహు అక్బర్ అని మళ్ళీ చేతులు కట్టుకొని దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం… మనం తషహ్హుద్ లో చదువుతాము కదా? అది పూర్తిగా చదవాలి. మళ్ళీ మూడోసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని మయ్యిత్ కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో సహీహ్ హదీసుల్లో నాలుగు రకాల దుఆలు వచ్చి ఉన్నాయి. ఆ నాలుగింటిలో కూడా చాలా మంచి లాభదాయకమైన, శవానికి, మయ్యిత్ కు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించగలుగుతారా?
ఒక సందర్భంలో ఒక సహాబీ బ్రతికి ఉన్నారు. ప్రవక్త వెనక ఉండి ఒక మయ్యిత్, ఒక శవం యొక్క, ఒక ముస్లిం జనాజా నమాజ్ చేస్తున్నారు. ప్రవక్త ఈ దుఆ, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీకు, ఈ దుఆ ఏదైతే చదివారో వెనక ఉన్న ఆ సహాబీ ఏమంటున్నారు? ఆ దుఆ విని నాకు అనిపించింది, అయ్యో! ఆ శవం కాడ నా శవం ఉండేది ఉంటే ఎంత బాగుండేది. ప్రవక్త వారి దుఆలు అన్నీ కూడా నాకు ప్రాప్తమయ్యేవి అని. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, ఇలాంటి దుఆలు మనం నేర్చుకోవాలి. మన గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో చాలా, చాలా బాధాకరమైన విషయం నా కొరకు. ఏంటో తెలుసా? చాలా మంది ఈ జనాజా నమాజ్ లో చదివే దుఆ వారికి తెలిసే ఉండదు. అడిగారు నేను ఎన్నో సందర్భాలలో. సంవత్సరం క్రితం కూడా నేను ఏదైతే ఇండియాకు వెళ్లానో ఒక నెల గురించి, అక్కడ సుమారు రెండు, మూడు జనాజాలలో చదవడం, చదివించే అవసరం పడింది. ఇక మన వద్ద చిన్నపాటి ఇఖ్తిలాఫ్ కూడా. ఈ జనాజా నమాజ్ చదివించే వారు శబ్దంగా చదవాలా? మనసులో చదువుకోవాలా? మెల్లగా నిశ్శబ్దంగా? లేదా శబ్దంగా చదవాలా? సర్వసామాన్యంగా మన వద్ద హనఫీ సోదరులు మెల్లగా చదువుతారు. హనాబిలా వద్ద కూడా మెల్లగానే చదవాలి అని ఉంది. అహ్లుల్ హదీస్ వారు శబ్దంగా చదువుతారు. అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లను నేను. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పిన విషయం సహీహ్ బుఖారీలో, నేను శబ్దంగా ఇప్పుడు ఇక్కడ మీకు చదివింది ఎందుకంటే, ఈ సూరె ఫాతిహా కూడా జనాజాలో చదవడం ప్రవక్త వారి సున్నత్ అని మీకు తెలియాలి.
ఈ విధంగా సోదర మహాశయులారా, కనీసం జనాజా సందర్భాలలో మనం ప్రజలకు చెప్పాలి. అయ్యలారా, అవ్వలారా, కొంచెం నేర్చుకోండి దుఆలు. ఓ కొడుకా, ఓ నా బిడ్డా, నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏమి లాభం నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం “అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా” చదవలేకపోతే. నీవు బంగళాలు కట్టించి, మీ నాన్న సమాధి మీద ఎంత పెద్ద గోపురం కట్టినా గానీ ఏమి లాభం, నీవు నీ తండ్రి గురించి క్షమాభిక్ష ఎలా కోరాలో నీకు తెలియకుంటే.
సోదర మహాశయులారా, వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. సౌదీ అరబ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒకేషన్ లో వెళ్ళాడు, సెలువులో. కానీ కరోనా కారణంగా చిక్కిపోయాడు అక్కడే. రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న నాలుగు రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. “షేఖ్, ఎందుకో నాకు ఇక్కడ ఇండియాలో భార్యా పిల్లలు అందరిలో కలిసి ఉన్నాను కానీ ఉండబుద్ధి అయితే లేదు. అటే రావాలి అనిపిస్తుంది.” నేనన్నాను, ఇది కూడా నువ్వు అదృష్టంగా భావించు. అల్లాహ్ ఏదైనా పరీక్షలో మనల్ని పడవేసాడు అంటే అందులో కూడా ఏదైనా మేలు ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. “షేఖ్, ఇప్పటికి సుమారు నేను ఇక్కడికి వచ్చేసి ఏడు నెలలు అయిపోయినాయి, కేవలం ఎవరితోనైనా కలిసినప్పుడు అస్సలాము అలైకుమ్ అంటే వ అలైకుమ్ అస్సలాం. ఇంతే కానీ, అక్కడ అరబులో ఉండి పరస్పరం దుఆలు ఇచ్చుకోవడం, జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీక్, అహ్సనల్లాహు ఇలైక్, కైఫల్ హాల్, ష్లోనక్, అల్లా యహ్ఫజక్, అల్లా యర్హమక్, ఇలాంటి దుఆలు ఏదైతే ఇచ్చుకుంటారో పరస్పరం అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు చాలా బాధ కలుగుతుంది” అని అన్నాడు.
ఇంతకుముందు కూడా నేను ఒక విషయం మీకు తెలియజేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందు వచ్చే ఎన్నో సూచనలు తెలుపుతూ, ధర్మం ఎంత బలహీనంగా అయిపోతుందో తెలియజేస్తూ, వారిలో కొందరిని ప్రశంసించారు. ఎవరు? అల్ హమ్మాదూన్, అధికంగా అల్లాహ్ ను ప్రశంసించే వారు, అల్లాహ్ తో వేడుకునే వారు.
క్షమించండి, జనాజా నమాజ్ కు సంబంధించిన పద్ధతులు, దుఆల గురించి మనం తెలుసుకుంటున్నాము. కానీ మనం ఈ రోజుల్లో ధర్మం నేర్చుకోకుండా, దుఆలు నేర్చుకోకుండా ప్రపంచ విషయాలు రోజు ఎంత తిరిగేస్తా ఉంటామో మనం, కానీ మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక విషయం మనం నేర్చుకోము. రండి, ముందు నేను మీకు దీని యొక్క అనువాదం వినిపిస్తాను, ఆ తర్వాత ఈ దుఆ చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను దుఆ ముందు చదివేశాను, అరబీలో ఉంది. భావం తెలిస్తే కదా మీకు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి భావం.
ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్న వారిని, దూరముగా ఉన్న వారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమించుము. ఓ అల్లాహ్! మాలో ఎవరిని సజీవంగా ఉంచదలచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము.ఓ అల్లాహ్! అతని చావుపై మేము వహించిన ఓపిక, పుణ్యాలు మాకు లేకుండా చేయకుము.
గమనిస్తున్నారా, ఎంత మంచి భావాలు ఉన్నాయి? ఏం తెలుస్తుంది? మనకు ఎంత దగ్గరి బంధువు అయినా గానీ, భార్య కొరకు ఒక భర్త చనిపోయినా, భార్య విధవ అయిపోయినా, తండ్రి చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయినా, భార్య చనిపోయి భర్త ఒంటరిగా అయిపోయాడు అన్నటువంటి వ్యధకు, బాధకు గురి అయినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహించాలి. ఓపిక సహనాలు వహిస్తూ, అల్లాహ్ దానికి సరియైన ఫలితం కూడా ప్రసాదించాలి అని ఆశిస్తూ ఉండాలి. “ఫల్ తస్బిర్ వల్ తహ్తసిబ్” అదే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సొంత కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా వారికి నసీహత్ చేసింది? ఇంకా ఆ దుఆలోని మరో పదం గుర్తుంచుకోండి: “అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.” ఎంత మంచి భావం ఉందో ఇక్కడ గమనిస్తున్నారా మీరు? సోదర మహాశయులారా,
اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాఇబినా వ సగీరినా వ కబీరినా వ దకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫ అహ్యిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్ అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు వ లా తుదిల్లనా బ’అదహు)
ఈ దుఆ యొక్క అనువాదం మీరు విన్నారు. మరొక దుఆ ఉంది, అది కూడా అందులో ఎంత గొప్ప భావం ఉంది?
اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్ హమ్హు వ ఆఫిహి వ’అఫు అన్హు) ఓ అల్లాహ్, అతన్ని క్షమించు, అతన్ని కరుణించు. ఓ అల్లాహ్, అతన్ని సుఖంగా, శాంతిగా ఉంచు. అతనిని నీవు అన్ని రకాలుగా అతని పాపాలను తుడిచివేసి నీవు మన్నించేసెయ్.
وَأَكْرِمْ نُزُلَهُ (వ అక్రిమ్ నుజులహు) అతడు ఇప్పుడు నీకు అతిథిగా అయ్యాడు. నీవు అతన్ని మంచిగా చూసుకో.
وَوَسِّعْ مُدْخَلَهُ (వ వస్సి’అ ముద్ఖలహు) అతడు సమాధిలో ప్రవేశించాడు, సమాధిని నీవు విశాలపరచు.
وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ (వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బరద్) నీవు అతని యొక్క పాపాలను నీటితో, బర్ఫ్ (ఐస్)తో, కడగండ్లతో పూర్తిగా కడిగి వేసెయ్. ఏమి పాపాలు లేకుండా చేయి అతన్ని.
وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ (వ అబ్ దిల్హు దారన్ ఖైరమ్ మిన్ దారిహి) ఈ ఇక్కడి గృహం కంటే, నీవు ఉత్తమమైన గృహం అక్కడ అతనికి ప్రసాదించుము.
وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ (వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహి) ఇక్కడ ఉన్న అతని జంట కంటే, మంచి ఓ జంట నీవు అతనికి ప్రసాదించు.
وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ (వ అహْلన్ ఖైరమ్ మిన్ అహ్లిహి) ఇక్కడ ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, ఇంతకంటే మంచి కుటుంబం నీవు అతనికి ప్రసాదించుము.
وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ (వ అ’ఇద్హు మిన్ అదాబిల్ ఖబ్ర్) ఇతన్ని నీవు సమాధి శిక్ష నుండి కాపాడు, శరణు ప్రసాదించు.
وَعَذَابِ النَّارِ (వ అదాబిన్నార్) నరక శిక్ష నుండి కూడా ఇతనికి శరణు ప్రసాదించు.
وَأَدْخِلْهُ الْجَنَّةَ (వ అద్ఖిల్హుల్ జన్నహ్) మరియు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము.
గమనిస్తున్నారా ఎంత గొప్ప భావాలు ఉన్నాయో?
అయితే సోదర మహాశయులారా, ఈ దుఆ ఏదైతే ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉందో, మళ్లీ అంటే ఈ మూడు తక్బీర్, మూడోసారి అల్లాహు అక్బర్ అని చేయి కట్టుకున్న తర్వాత ఈ దుఆ చదివాము కదా, గుర్తుంది కదా మీకు? మరోసారి కొత్తగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మధ్యలో చాలా విషయాలు, మాటలు వచ్చాయి కదా?
మొదటిసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, సనా చదివితే చదవచ్చు లేకపోతే పర్వాలేదు. అ’ఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్, సూరె ఫాతిహా మొత్తం చదివి, ఆ తర్వాత ఏదైనా సూరా చదివితే చదవచ్చు లేకపోయినా పర్వాలేదు.
మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ ఇబ్రాహీం పూర్తిగా చదవాలి, ఏదైతే మనం తషహ్హుద్ లో చదువుతామో.
మూడోసారి అల్లాహు అక్బర్ అని ఈ దుఆలు చదవాలి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న దుఆలు.
నాలుగోసారి అల్లాహు అక్బర్ అని అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్, ఒకవైపున సలాం తింపినా సరిపోతుంది, సహీహ్ హదీస్ తో రుజువు అయి ఉంది. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని రెండో వైపున కూడా ఒకవేళ సలాం తెంపితే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రెండు సలాముల విషయం కూడా ఒక సలాం అయినా, రెండు సలాములైనా, ఈ రెండు విషయాలు సహీహ్ హదీసులతో రుజువు అయి ఉన్నాయి.
గర్భిణీల గర్భస్రావంపై ఆదేశం
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భము పడిపోయినచో, దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాకముందు గర్భము పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ విషయం కూడా చాలా అవసరం. అనేక మంది ఈ ఆదేశం పట్ల కూడా చాలా అశ్రద్ధగా ఉన్నారు. కొందరి గురించి అయితే తెలుస్తుంది, తొమ్మిది నెలలు పూర్తి నిండి పుట్టిన వెంటనే లేదా పుట్టినప్పుడే చనిపోయాడు అని తెలిస్తే కూడా జనాజా నమాజ్ చదవకుండానే తీసుకెళ్లి దఫన్ చేసి వచ్చేస్తారు. కానీ అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ఆధారంగా అనేక ధర్మవేత్తలు, ప్రస్తుత కాలంలోని ఎందరో మషాయిఖ్ ఇదే ఫత్వా ఇచ్చారు. ఏంటి? నాలుగు నెలలు గర్భం పూర్తి అయింది, 120 రోజులు పూర్తిగా నిండిపోయాయి, ఆ తర్వాత తల్లి గర్భంలో పిండం చనిపోతే అతని యొక్క జనాజా నమాజ్ తప్పకుండా చదవాలి. ఎందుకు? ఇంతకు ముందు నేను మీకు చూపించాను ‘Z Daroos’ అని మా YouTube ఛానల్ ఏదైతే ఉందో ఆఫీస్ వైపు నుండి, అందులో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కొంచెం వివరంగా ఉన్నాయి, తప్పకుండా వినండి అక్కడ. సంక్షిప్తం ఏమిటి? సుమారు 80 నుండి 90 రోజుల తర్వాత తల్లి గర్భంలో పిండం సంపూర్ణ మానవ ఆకారం పొందుతాడు. కళ్ళు, చేతులు, మొత్తం శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి ఒక మానవ రూపంలో వచ్చేస్తాడు. అంతకుముందు 40 రోజులు నుత్ఫా, 40 రోజులు అలకా, తర్వాత 40 రోజులు ముద్గా, ఈ విధంగా 120 రోజులు పూర్తి అయిపోయేసరికి ఇక అతడు సంపూర్ణ ఒక మనిషి, మనిషి రూపం దాల్చేశాడు. 120 రోజుల తర్వాత అతనిలో రూహ్, ఆత్మ కూడా వేయడం జరిగింది. ఇక అతడు ఒక సంపూర్ణ ఒక మనిషిగా ఉన్నాడు, చిన్న సైజులో, తల్లి గర్భంలో. ఆ తర్వాత మరణిస్తే తప్పకుండా అతని యొక్క జనాజా నమాజ్ చేయాలి. “అస్సిక్తు యుసల్లా అలైహ్” హదీసులో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఇక నాలుగు నెలల కంటే ముందు, నాలుగు నెలలు పూర్తి కాకముందే చనిపోతే, జనాజా నమాజ్ చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇక్కడ వరకు సోదర మహాశయులారా, అల్హందులిల్లాహ్ జనాజా నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు పూర్తి అయ్యాయి.
ప్రశ్న-జవాబులు
షేఖ్, జనాజా నమాజ్ కొరకు సఫ్ ఎలా ఏర్పాటు చేయాలి షేఖ్?
సర్వసామాన్యంగా నమాజుల కొరకు ఎలాగైతే సఫ్ ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ కొందరు అంటారు మూడు, ఐదు, ఏడు లైన్లు, ఇలా తప్పనిసరి ఏమీ లేదు కానీ ఉంటే మంచిది. కానీ సఫ్ కంప్లీట్ కూడా ఉండాలి. ఇది మంచి విషయం. సఫ్ కంప్లీట్ కాకుండా ఎక్కువ సఫ్ లు చేయడం మరియు బేసి సంఖ్యలో చేయడం ఇది అంత తప్పనిసరి కాదు. సఫ్ కంప్లీట్ గా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం.
షేఖ్, ఈ కువైట్ లో రాజు చనిపోయాడు కదా, అయితే అతని యొక్క జనాజా నమాజ్ అన్ని మస్జిద్ లలో చదివించడం జరిగింది. ఇలా ఎక్కడైనా నమాజ్ చదివించవచ్చా? లేక జనాజా ముందరనే జనాజా నమాజ్ చదవాలా షేఖ్?
జనాజా ముందట కూడా చదివించడం జరిగింది. జనాజా ముంగట పెట్టుకొని అక్కడ కూడా చదివించడం జరిగింది. కానీ దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఆధారంగా ముస్లిం ప్రభుత్వంలోని నాయకుడు ఎవరి జనాజా నమాజ్ గాయబానా వేరేచోట చదివించడానికి ఆదేశం ఇస్తాడో, అక్కడ చదవచ్చు. ఇక్కడ సౌదీ అరబ్ లో కూడా ఇక్కడి రాజు ఆదేశం ఇచ్చారు. అందుకని కువైత్ రాజు యొక్క జనాజా నమాజ్ గాయబానా ఇక్కడ మక్కా, మదీనాలో, హరమైన్ లో కూడా చేయడం జరిగింది.
ఇంకొక ప్రశ్న షేఖ్. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే దుఆ చదవవచ్చా లేక వేరే దుఆలు చదవవచ్చా షేఖ్, జనాజా నమాజ్ లో?
పర్వాలేదు, ఒకే దుఆ చదివితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రెండో దుఆ ఏదైతే నేను చదివానో, అందులో “అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు” ఈ ఏదైతే పదాలు ఉన్నాయో చివరిలో హూ, హీ అని, అక్కడ, “అల్లాహుమ్మగ్ఫిర్ లహా వర్హమ్హా వఆఫిహా వఅఫు అన్హా వఅక్రిమ్ నుజులహా” ఈ విధంగా చదవడం మంచిది. కానీ ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం మయ్యిత్, మయ్యిత్ పదం ముజక్కర్. ఇది ఆహ్, మేల్ వర్డ్. అందుకొరకు “అల్లాహుమ్మగ్ఫిర్ లహు” చదివినా ఎలాంటి అభ్యంతరం లేదు.
షేఖ్, జనాజా నమాజ్ చదివేటప్పుడు ఎవరికైనా దుఆ పూర్తిగా రాకపోతే అలాంటి నమాజ్ నెరవేరుతుందా? లేకపోతే అది మరలా వచ్చిన వాళ్ళు చదవాలా? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరు నమాజ్ చదివించడానికి దుఆలు వచ్చిన వాళ్ళు ఉండరు.
ఇక్కడ ఎవరు ఫత్వా ఇచ్చారో ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు కానీ నేను ఎవరో ఎవరిదో ఫత్వా చదివాను. జనాజా నమాజ్ లో ఒకవేళ ఎవరికైనా దుఆ కంఠస్థం లేకపోతే వారు రాసుకొని ఏదైనా మొబైల్ లో గానీ లేదా కాగితంలో గానీ చూసి చదవడంలో ఇబ్బంది లేదు ఇన్ షా అల్లాహ్. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కనీసం ఒక్క దుఆనైనా. అల్లాహు ఆ’లమ్.
షేఖ్, అరబీలో దుఆ రాకపోతే, జనాజా సలాత్ లో, వేరే ఇంకా వేరే భాషలో ఏమైనా చేసుకోవచ్చా షేఖ్ దుఆ?
నేను చెప్పాను కదా ఇంతకుముందు, రాసి ఉండాలి అరబీలో. దాన్ని చూసి చదివితే ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది “హాదా అహ్వను అలైక మిన్ గైరిల్ అరబియ్యా”. అరబీ భాషలో కాకుండా వేరే భాషలో చదవడం కన్నా చూసి నమాజ్ లో అరబీలో ఆ దుఆ చదవడం ఉత్తమం. అల్లాహు ఆ’లమ్.
షేఖ్, ఇక్కడ మన ఇండియాలో చాలా జనాజాలు నేను చేశాను. రెండు నిమిషాల్లో జనాజా నమాజ్ పూర్తి చేసేస్తారు షేఖ్. అది ఎలాగ అనేది నాకు అర్థం కావడం లేదు. ఏం దుఆలు చదువుతారు? ఏం పఠిస్తారు?
చెప్తాను, వినండి. మన వద్ద సర్వసామాన్యంగా మన హనఫీ సోదరులు అల్లాహ్ మాకు, వారికి అందరికీ హిదాయత్ ఇవ్వుగాక, హనఫీ సోదరులు సూరతుల్ ఫాతిహా చదవరు. సనా చదువుతారు. ఇదే చాలా విచిత్ర విషయం అనిపిస్తుంది. అందుకొరకే అంధానుసరణ ఉండకూడదు. అంటే ఈ అంధానుసరణ, తక్లీద్ ఏదైతే ఉందో, దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు సనా ప్రస్తావన లేదు, అది చదువుతున్నారు. సూరె ఫాతిహా ప్రస్తావన ఉంది, దాన్ని వదులుతున్నారు. అందుకొరకు కూడా వారి యొక్క నమాజ్ సంక్షిప్తంగా అయిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఎవరైనా వేరే కారణాలతో సంక్షిప్తంగా చేస్తే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అల్లాహు ఆ’లమ్. ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, సూరె ఫాతిహా కూడా జనాజా నమాజ్ లో చేయాలి.
ఇంకొక విషయం షేఖ్. ఎందుకు జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు ఉండవు? శవం ముందర ఉన్నదానా? లేకపోతే ఎందుకు షేఖ్?
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో మనకు నేర్పిన విషయంలో జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు లేవు. కారణం ఏంటి? మీరు చెప్పినట్లు, ముందు ఒక శవం ఉంటుంది గనక చూసే వారికి మనం అతని కొరకు రుకూ చేస్తున్నట్లు, అతని కొరకు సజ్దా చేస్తున్నట్లు ఏర్పడకూడదు కావచ్చు. అల్లాహు ఆ’లమ్. ఇదే అల్లాహ్ యొక్క ఇష్టం. అందుకొరకే విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? తూచా తప్పకుండా ఎందుకు, ఎలా, ఇలా ఎందుకు, అలా ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్నలు లేకుండా అల్లాహ్ చెప్పిన మాటను, ప్రవక్త చూపిన పద్ధతిని మనం అనుసరించాలి. బారకల్లాహు ఫీకుమ్.
షేఖ్, ఈ జనాజా నమాజ్ లోని ఒక ప్రశ్న షేఖ్. చిన్న పిల్లలకు నమాజ్ చదివించవచ్చు, చదివించకూడదు ఎలాగైనా ఒకటే అంటారు షేఖ్. దీని గురించి. గర్భంలో నాలుగు నెలలు పూర్తి నిండితే చదివించాలి, పూర్తి నిండకపోతే చదివించకూడదు. ఇలాగేనా షేఖ్?
కరెక్ట్. ఈ విషయం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ నాలుగు నెలల గర్భం నిండిన తర్వాత ఒకవేళ చనిపోతే నమాజ్ చేయాలి అని అన్నప్పుడు, ఇక చిన్నపిల్లలు ఎవరైతే పుట్టి కొద్ది రోజులు బ్రతికి చనిపోయారో, వారి జనాజా నమాజ్ చదవకపోవడానికి ఏంటి దలీల్? ఏంటి కారణం? ఏంటి రీజన్? అర్థమైంది కదా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి[. (జిన్ 72: 18).
[1] సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం (ఖబ్రి- స్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ వాఖిద్ లైసి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైన్ యుద్ధానికి బయ- లుదేరాము. అప్పుడు మేము కొత్తగా ఇస్లాంలో చేరియుంటిమి. దారిలో ముష్రికులది ఒక రేగు చెట్టు ఉండింది. వారు శుభం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో దాని క్రింద కూర్చుండేవారు, తమ ఆయుధాలు దానికి తగిలించేవారు. దానిని ‘జాతు అన్వాత్’ అనేబడేది. మేము ఆ చెట్టు నుండి దాటుతూ, ‘ప్రవక్తా! వారికి ఉన్నటువంటి జాతు అన్వాత్ మాకు కూడా ఒక్కటి నిర్ణయించండి అని అన్నాము. ప్రవక్త చెప్పారు:
“అల్లాహు అక్బర్! ఇవే పద్ధతులు. నా ప్రాణం ఎవ్వని చేతులో ఉందో ఆయన సాక్షి! బనీ ఇస్రాఈల్ వారు ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్నటువంటి మాటే మీర-న్నారుః “మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు”. మూసా ఇలా అన్నాడు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు[. మీకు పూర్వికులు అవలంభించిన పద్ధతులు మీరూ అవలంభిస్తారు”. (అల్ మొఅజముల్ కబీర్ లిత్తబ్రానీ, సహీహ్ సునన్ తిర్మిజి 1771, ముస్నద్ అహ్మద్ 2/285).
[1] శుభం పొందే రకాలు:
1- ధార్మిక ఆధారం మూలంగా శుభం కోరడం. ఉదాః అల్లాహ్ యొక్క గ్రంథ (పారాయణం చేసి). అందులో అభ్యంతరం లేదు.
2- స్పృహగల విషయాల ద్వారా. ఉదాః ధార్మిక విద్య. స్వయం తమ కొరకు లేదా ఇతరులకు దుఆ. విద్యగల పుణ్యపురుషుని విద్య ద్వారా, అతని వద్ద కూర్చుండి, లేదా అతని దుఆ ద్వారా. అంతేకాని అతని వ్యక్తిత్వం వల్ల అని కాదు.
3- షిర్క్ సంబంధమైన శుభం. ఇది సమాధులతో, మజారులతో కోరడం. వాటిలో ఏలాంటి శుభం లేదు. దానికి ధార్మిక, లౌకిక ఏ ఆధారము లేదు. ఇందులో కొన్ని రకాలు గలవుః
A. ఆరాధనలో ఏ ఒక్క భాగమైన సమాధుల కోసం చేస్తే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ అవుతుంది.
B. ఆ సమాధులు అతని మరియు అల్లాహ్ మధ్యలో మధ్యవర్తిగా అని నమ్ముతే ఇది కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్.
C. అవి మధ్యవర్తిగా కావు, కేవలం శుభం ఉద్దేశం ఉంటే ఇది షిర్క్ సంబంధమైన బిద్అత్. ఇది విధిగా ఉన్న సంపూర్ణ తౌహీద్ కు వ్యతిరేకమైనది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[8:30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు –20
20– అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు. అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.
ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయ- నను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు[. (ఫాతిర్ 35: 13,14).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[7:44 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు –17
17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].
“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).
[1] సమాధి వద్ద నమాజు స్థితులు:
1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.
2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.
3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[44:53 నిముషాలు] హైజ్ వ నిఫాస్ (బహిష్టు & పురిటి రక్తం) ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.