[12:35 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[68 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
సామూహిక నమాజ్:
ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)
పంక్తుల విషయం:
ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి
వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః لاَ صَلاَةَ لِفَردٍ خَلفَ الصَّف
“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).
వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).
మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).
ఖస్ర్:
ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.
ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.
స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.
ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.
జమ్అ:
జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).
ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.
అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.
అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.
[1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.
[2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[32 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
వ్యాదిగ్రస్తుని నమాజ్:
నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).
జుమా ప్రత్యేకతలు:
స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.
జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.
జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”.(అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).
ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).
ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.
ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.
పండుగ నమాజ్
పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.
పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).
పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[49 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
నమాజులో మరచిపోవుట:
ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.
మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.
ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).
మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.
మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.
ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.
సున్నతె ముఅక్కద
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).
విత్ర్ నమాజ్
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. (బుఖారి 991, ముస్లిం 749).
అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
ఫజ్ర్ సున్నతులు
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:
“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).
మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.
ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.
చాష్త్ నమాజ్
దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).
దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.
[1]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.
[2]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత https://youtu.be/_eBuDfQT_qU [27 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించే మార్గాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలు మరియు జిక్ర్ యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. 10 సార్లు తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్), తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్), మరియు తక్బీర్ (అల్లాహు అక్బర్) పఠించడం ద్వారా స్వర్గ ప్రవేశం మరియు ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయని ఒక హదీసు ఉటంకించబడింది. అలాగే, నిద్రపోయే ముందు 33 సార్లు తస్బీహ్, 33 సార్లు తహ్మీద్, 34 సార్లు తక్బీర్ పఠించడం వల్ల 1000 పుణ్యాలు వస్తాయని చెప్పబడింది. మరో హదీసు ప్రకారం, ప్రతి నమాజ్ తర్వాత 33 సార్లు ఈ జిక్ర్లు చేయడం హజ్, ఉమ్రా, దానధర్మాలు మరియు జిహాద్ చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని, మరియు 100వ సారిగా “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం సముద్రపు నురుగు అంత పాపాలను కూడా క్షమింపజేస్తుందని వివరించబడింది. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్ల తర్వాత 10 సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం ద్వారా లభించే ప్రత్యేకమైన లాభాలు, షైతాన్ నుండి రక్షణ మరియు స్వర్గాన్ని వాజిబ్ చేసే పుణ్యాల గురించి కూడా చర్చించబడింది.
బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్
మహాశయులారా! ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయవల్ల, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు పొందే అటువంటి కొన్ని సత్కార్యాల గురించి ఇన్షాఅల్లాహ్ తెలుసుకుందాము.
ఇందులో ప్రత్యేకంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దుఆలు మనకు నేర్పారు. వాటి యొక్క ఘనత అనేది మహా గొప్పగా ఉంది. ఒకవేళ మనం ఫర్ద్ నమాజ్ తర్వాత రెండు నిమిషాలు, మూడు నిమిషాలు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ఆ దుఆలను మనం చూసి చదివినా గానీ, ఇన్షాఅల్లాహ్ మహా గొప్ప పుణ్యాలు మనం పొందగలుగుతాము.
ఉదాహరణకు, చాలా చిన్నపాటి కార్యం. అందులో ఒక నిమిషం కాదు, అర నిమిషం కూడా పట్టదు. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల పుణ్యాలు అనేటివి మహా గొప్పగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ హదీస్ పై గమనించండి, సునన్ అబీ దావూద్ లో ఈ హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
خَصْلَتَانِ [ఖస్ లతాని] రెండు అలవాట్లు/గుణాలు
لَا يَعْمَلُ بِهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ [లా య’అమలు బిహిమా అబ్దున్ ముస్లిమున్ ఇల్లా దఖలల్ జన్నహ్] ఏ ముస్లిం దాసుడైతే వాటిని ఆచరిస్తాడో, తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు.
గమనించండి. రెండు మంచి అలవాట్లు, రెండు సత్కార్యాలు, ఏ ముస్లిం దాసుడు వాటిని పాటిస్తాడో తప్పకుండా స్వర్గంలో పోతాడు. అల్లాహు అక్బర్. ఆ రెండిటినీ పాటించిన వారు వారికి ఏం శుభవార్త ఇవ్వబడింది? స్వర్గ ప్రవేశం.
وَهُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ [వహుమా యసీరున్, వమన్ య’అమలు బిహిమా ఖలీలున్] అవి చాలా సులభమైనవి, కానీ వాటిని ఆచరించేవారు చాలా తక్కువ.
అవి రెండూ చాలా స్వల్పమైనవి. కానీ వాటిని ఆచరించే వారు చాలా అరుదు, చాలా తక్కువ మంది.
ఇప్పుడు రెండు విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒకటి, ఆ రెండు సత్కార్యాల ఘనత తెలిసింది. ఏంటి ఘనత? స్వర్గ ప్రవేశం. అంటే ఆ రెండు పనులు, ఆ రెండు కార్యాలు చేస్తే మనకు స్వర్గం లభిస్తుంది అని చెప్పారు ప్రవక్త. కానీ వెంటనే ఏం చెప్పారు? అవి చూడడానికి చాలా చిన్నగానే ఉన్నాయి, స్వల్పంగానే ఉన్నాయి. కానీ దాని మీద ఆచరించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
అందులో ఒకటి ఏమిటంటే, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవడం.
ఇంత చెప్పిన తర్వాత ప్రవక్త గారు దాని యొక్క మరో లాభం చెప్పారు. అదేమిటి? చెప్పారు, ఈ 10, 10 సార్లు చదివితే ఎన్ని అయినాయి? 30. ఐదు నమాజుల్లో ఐదు 30 లు, 150. ప్రవక్త చెప్పారు, నాలుకపై ఇవి 150. కానీ ప్రళయ దినాన ఎప్పుడైతే తూకం చేయబడతాయో అప్పుడు 1500. 1500 పుణ్యాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సత్కార్యం చేయడం వల్ల మనకు ఒకటి, స్వర్గ ప్రవేశ శుభవార్త లభించింది. రెండవది, 1500 సత్కార్యాలు, 1500 పుణ్యాలు మనకు లభిస్తాయి అని కూడా మనకు తెలిసింది. ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత 10, 10 సార్లు ఇలా చదవడం ఏమైనా కష్టమవుతుందా? ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏ మాత్రం కష్టం కాదు. కానీ దానికి చదివే అలవాటు అనేది ఉండాలి.
ఇందులోనే రెండో విషయం ఏంటిది? పడుకునే ముందు 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ఎన్ని అయినాయి? 100. కానీ ప్రళయ దినాన ఇవి 1000 కి సమానంగా ఉంటాయి, అంటే మనకు 1000 పుణ్యాలు లభిస్తాయి.
అయితే ప్రవక్త గారి సహచరులు ఈ ఘనతలు విని ఊరుకుండలేదు. మరో ప్రశ్న అడిగారు. అదేమిటి? ప్రవక్తా, ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది, ఇంత చిన్నటి సత్కార్యం. కానీ మీరు ఒక మాట చెప్పారు, వాటిపై ఆచరించేవాళ్ళు చాలా తక్కువ మంది అని. అలా ఎందుకు చెప్పారు? వీటిని ఆచరించడంలో ఏంటి కష్టం? మాకేం కష్టం అనిపించడం లేదు కదా.
గమనించండి, ప్రవక్త గారు చెప్పారు, మనిషి ఎప్పుడైతే నమాజ్ పూర్తి ప్రవక్త చెప్పిన ఈ జిక్ర్ చేయడానికి కూర్చుంటాడో, షైతాన్ వాడు వచ్చి అతనికి ఏదో ఒక విషయం గుర్తు చేస్తాడు. డ్యూటీలో లేట్ అవుతుంది. అయ్యో వర్క్ షాప్ లో తొందరగా వెళ్ళేది ఉంది. ఆ, కూరగాయలు తీసుకొచ్చేది ఉంది. అరె, ఇంట్లో భార్య గుర్తు చేస్తుంది. ఏదో ఒక మాట. షైతాన్ వాడు గుర్తు చేస్తాడు, మనిషి ఈ జిక్ర్ చేయకముందే లేచి వెళ్ళిపోతాడు. పడుకునే ముందు మనిషి తన పడక మీదికి వెళ్ళిపోతాడు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది, ఈ జిక్ర్ చేయడం మరిచిపోతాడు. ఈ విధంగా చూడండి సోదరులారా! షైతాన్ వాడు మనకు అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి ఎలా దూరం చేస్తాడో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు.
అయితే ఫర్ద్ నమాజ్ తర్వాత చేయవలసిన జిక్ర్, ఏ అజ్కార్, స్మరణలైతే ఉన్నాయో, దుఆలైతే ఉన్నాయో అందులో ఒక విషయం మనకు తెలిసింది. ఏం తెలిసింది? ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఏం చేయాలి మనం? 10, 10 సార్లు, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవాలి. ఇక రండి.
ధనవంతులతో సమానమైన పుణ్యం
మరో హదీస్ లో ఉంది, సహీహ్ బుఖారీ లోని హదీస్ అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకసారి బీద సహచరులు వచ్చారు. వచ్చి చెప్పారు, ప్రవక్తా ఈ ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు పుణ్యాలు సంపాదించడంలో, ఉన్నత స్థానాలు పొందడంలో, సదాకాలం ఉండే అటువంటి వరాలు పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ డబ్బు ఉన్నవాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు అని అనట్లేదు. మాకంటే ఎక్కువ భూములు సంపాదించారు అని అనట్లేదు. ఏమంటున్నారు? వీళ్ళు తమ డబ్బు కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు
وَالنَّعِيمِ الْمُقِيمِ [వన్న’యీమిల్ ముఖీమ్] మరియు శాశ్వతమైన అనుగ్రహాలు (పొందడంలో)
ఎల్లకాలం ఉండే అటువంటి నేమతులు, వరాలు, అనుగ్రహాలు వాటిని పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ప్రవక్త గారు అడిగారు, అదెలా? ఇప్పుడు వారు అన్నారు, మేము ఎలా నమాజ్ చేస్తున్నామో వారు కూడా చేస్తున్నారు. మేము ఎలా ఉపవాసం ఉంటున్నామో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ వారికి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు కారణంగా వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు, దానధర్మాలు చేస్తున్నారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు.
ఈ నాలుగు రకాల పుణ్యాలు, హజ్, ఉమ్రా, సామాన్య దానధర్మాలు మరియు జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు. మా దగ్గర డబ్బు లేదు గనుక హజ్ లో, ఉమ్రాలో, దానధర్మాలో, జిహాద్ లో మేము ఖర్చు చేసి చేయలేకపోతున్నాము గనుక ఆ పుణ్యాలు మేము పొందుతలేము. డబ్బు ఉన్నందువల్ల వారు ఇలాంటి పుణ్యాలు చేసి కూడా మాకంటే చాలా ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? నేను ఒక విషయం మీకు తెలుపుతాను. మీరు దానిని పాటించారంటే, ఆ విషయాన్ని మీరు పాటించారంటే మీకంటే ముందుకు ఎవరైతే వెళ్ళిపోయారో పుణ్యాల్లో, వారి వద్దకు మీరు చేరుకుంటారు. మరి ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు ఎన్నటికీ కూడా మీకు సమానంగా రాలేరు. మరియు మీకంటే ఉత్తమమైన వారు మరెవరూ ఉండరు, కేవలం మీ లాంటి ఈ ఆచరణ, ఈ పని చేసేవారు తప్ప.
అదేంటి? మీరు ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ 33, 33 సార్లు చదువుతూ ఉండండి.
ఈ రెండో విషయంలో, మొదటి హదీస్ లో 10 సార్ల ప్రస్తావన వచ్చింది. దానికి రెండు శుభవార్తలు మనకు దొరికాయి. ఒకటి స్వర్గ ప్రవేశం, రెండవది 1500 పుణ్యాలు. గుర్తుంచుకోండి. 10, 10 సార్లు చదివితే ఏంటి లాభం? స్వర్గ ప్రవేశం మరియు 1500 పుణ్యాలు. ఈ రెండో హదీస్ లో, సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం లోని హదీస్ ఇది. ఇందులో ఏముంది? ప్రతి ఒకటి 33, 33 సార్లు చదవాలి. దాని యొక్క లాభం ఏంటి? హజ్ చేయడం తో సమానం, ఉమ్రా చేయడం తో సమానం, సదకా దానధర్మాలు చేయడం తో సమానం, అల్లాహ్ యొక్క మార్గం జిహాద్ లో ధనం ఖర్చు పెట్టినంత సమానం. ఎంత గొప్ప పుణ్యం గమనించండి.
అంటే ప్రతిరోజు ఐదు హజ్ ల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఐదు ఉమ్రాల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఎంతో డబ్బు ఉన్నవారు డబ్బు ఖర్చు పెట్టి దానధర్మాలు చేసి పుణ్యాలు సంపాదిస్తున్నారో, అంత మనం ఈ 33, 33 సార్లు చదివి పుణ్యం సంపాదించవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే జిహాద్ లో ఖర్చు పెడుతున్నారో, వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనం ఇన్షాఅల్లాహ్ పొందవచ్చు.
ఈ 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి, 33, 33, 33 – 99 అయినాయి కదా, ఒక్కసారి
لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ [లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
చదివితే, ముస్లిం షరీఫ్ లో మరో ఘనత తెలుపబడింది. ఈ విషయం ముస్లిం షరీఫ్ లో ఉంది. అదేమిటి? ఒకవేళ మీ పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించబడుతుంది. అల్లాహు అక్బర్. అన్ని పాపాలు తొలగించబడతాయి అని ప్రవక్త గారు శుభవార్త ఇస్తున్నారు.
ఇక రండి, మరోసారి మీకు గుర్తుండడానికి వాటిని సంక్షిప్తంగా చేస్తూ, ఫర్ద్ నమాజ్ తర్వాత ఒక కార్యం కానీ రెండు విధానాలు తెలుసుకున్నాం. ఏంటి ఒక కార్యం? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ మూడు పదాలు. కానీ ఒక పద్ధతి ఏంటిది? 10, 10 సార్లు చెప్పడం. ఇంకొకటి? 33, 33, 33, ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్… వీటన్నిటినీ కలిపి లాభాలు ఎన్ని మనం తెలుసుకున్నాము? ఒకటి లాభం, స్వర్గ ప్రవేశం. రెండవ లాభం, 1500 పుణ్యాలు. మూడవ లాభం, హజ్ చేసినంత పుణ్యం. నాలుగవ లాభం, ఉమ్రా చేసినంత పుణ్యం. ఐదవ లాభం, దానధర్మాలు చేసినంత పుణ్యం. ఆరవ లాభం, జిహాద్ లో ఖర్చు పెట్టినంత పుణ్యం. ఏడవ లాభం, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ తొలగించబడతాయి. ఎన్ని లాభాలు? ఏడు లాభాలు. ఏడు రకాల లాభాలండి.
కేవలం 10 రియాల్ ల ఓవర్ టైం మనకు దొరుకుతుంది ఒక గంటకు అని అంటే మనం వెనకాడతామా? మరి ఏడు రకాల పుణ్యాలు మనకు దొరుకుతున్నాయి. దీనికి ఒక గంట కాదు, టోటల్ నిమిషం, నిమిషంన్నర టైం పడుతుంది అంతే. మీరు ఒకసారి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, టైం పెట్టి, గడియారం పెట్టి మీరు చూడండి. మహా ఎక్కువ అంటే ఇది ఉంటే టోటల్ ఎంత? నిమిషంన్నర టైం పడుతుంది అంతే.
కొందరు పండితులు చెప్పారు, ఎంతవరకు వాస్తవం అల్లాహ్ కు తెలుసుగాక, ఒకవేళ మీరు 10 యొక్క ఉద్దేశంతో టోటల్ 33, 33 అనుకున్నా గానీ సరిపోతుంది, ఎందుకు? 33 లో 10 సరిపోతాయి కదా. అలా కూడా కొందరు అన్నారు.
ఈ విధంగా చూడడానికి మనం ఒక రకమైన కార్యం. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనడం. కానీ ఎన్ని లాభాలు తెలుసుకున్నాము? ఒకసారి లెక్కించగలుగుతారా? ఏంటి చెప్పండి? ఒకటి, స్వర్గ ప్రవేశం. రెండవది, 1500 పుణ్యాలు. మూడవది, హజ్ చేసినంత. నాలుగవది, ఉమ్రా చేసినంత. ఐదవది, దానధర్మాలు, సదకా. ఆరవది, జిహాద్ లో ఖర్చు పెట్టినంత. ఏడవది, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా అవన్నీ తొలగించబడతాయి. ఇవి ఏడు.
ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత
ఇక రండి, స్వర్గం విషయంలో మరొక గొప్ప శుభవార్త కూడా మనకి ఇవ్వబడింది ఆయతుల్ కుర్సీ విషయంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సహీహ్ హదీస్ లో ఉంది. ఇమాం నసాయి రహమతుల్లాహి అలైహి అమలుల్ యౌమి వల్ లైలా లో ప్రస్తావించారు. షేఖ్ అల్బాని రహమతుల్లాహి అలైహి కూడా తమ గ్రంథాలలో దీన్ని ప్రస్తావించారు. ఎవరైతే,
مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا الْمَوْتُ [మన్ ఖర’అ ఆయతల్ కుర్సీ దుబుర కుల్లి సలాతిన్ మక్తూబతిన్, లమ్ యమ్న’అహు మిన్ దుఖూలిల్ జన్నతి ఇల్లల్ మౌత్] ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీ చదువుతారో, వారు స్వర్గంలో ప్రవేశించడానికి కేవలం చావు మాత్రమే అడ్డు ఉన్నది
.ఎంత గొప్ప శుభవార్త గమనించండి. ఆయతుల్ కుర్సీ అంటే ఏంటి?
اللهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ [అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’ఖుదుహూ సినతున్ వలా నౌమ్] అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వలోకాల నిర్వాహకుడు. ఆయనకు కునుకు రాదు, నిద్రపోడు. చివరి వరకు ఇది ఒక ఆయత్.
ఈ విధంగా ఆయతుల్ కుర్సీ ద్వారా కూడా మనకు చాలా గొప్ప లాభాలు లభిస్తాయి, వాటిని చదివే అలవాటు మనం చేసుకోవాలి.
ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్ ల తర్వాత జిక్ర్
ఇంకా ఫజ్ర్ నమాజ్ తర్వాత, అప్పుడైతే డ్యూటీ ఉండదు కదా వెంటనే. కనీసం ఒక రెండు నిమిషాలు మనం సలాం తిప్పిన తర్వాత మస్జిద్ లో కూర్చోవచ్చు కదా. కూర్చొని
لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ [లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
పదిసార్లు చదవాలి. ఎన్నిసార్లు? పదిసార్లు. ఏంటి లాభం? ప్రవక్తగారు చెప్పారు, అల్లాహ్ త’ఆలా
كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ [కతబల్లాహు లహూ అషర హసనాత్] అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు రాస్తాడు
లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదవాలి. లాభాలు ఏంటి? ఇంకా ఉన్నాయి, దాన్ని గుర్తుంచుకోవాలి. పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే, మొదటి లాభం పది పుణ్యాలు అల్లాహ్ రాస్తాడు.
وَمَحَا عَنْهُ عَشْرَ سَيِّئَاتٍ [వమహా అన్హు అషర సయ్యిఆత్] మరియు అతని నుండి పది పాపాలను తుడిచివేస్తాడు
రెండో లాభం ఏంటంటే, పది పుణ్యాలు అల్లాహ్ మాఫ్ చేస్తాడు, తొలగిస్తాడు. మూడో లాభం ఏంటంటే,
رَفَعَ لَهُ عَشْرَ دَرَجَاتٍ [రఫ’అ లహూ అషర దరజాత్] అతని కొరకు పది స్థానాలు పెంచుతాడు
وَكَانَ يَوْمَهُ ذَلِكَ كُلَّهُ فِي حِرْزٍ مِنْ كُلِّ مَكْرُوهٍ [వకాన యౌమహు దాలిక కుల్లుహూ ఫీ హిర్జిన్ మిన్ కుల్లి మక్రూహ్] మరియు ఆ రోజంతా అతను ప్రతి అసహ్యకరమైన దాని నుండి రక్షణలో ఉంటాడు
మరియు ఆ దినమంతా, ఆ రోజంతా అతని గురించి ప్రతి కీడు నుండి, చెడు నుండి, అసహ్య విషయాల నుండి అతన్ని కాపాడుకోబడుతుంది. ఎన్ని లాభాలు అయినాయి? లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదివితే ఎన్ని లాభాలు విన్నాము? పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు,
وَحُرِسَ مِنَ الشَّيْطَانِ [వహురిస మినష్ షైతాన్] మరియు షైతాన్ నుండి కాపాడబడతాడు
షైతాన్ నుండి కూడా కాపాడబడతాడు. షైతాన్ నుండి కూడా అతన్ని కాపాడడం జరుగుతుంది. ఐదు. ఆరవది,
وَلَمْ يَنْبَغِ لِذَنْبٍ أَنْ يُدْرِكَهُ فِي ذَلِكَ الْيَوْمِ إِلَّا الشِّرْكَ بِاللهِ [వలం యంబగీ లిజంబిన్ అన్ యుద్రికహూ ఫీ దాలికల్ యౌమి ఇల్లష్ షిర్క బిల్లాహ్] షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది
మరియు ఒకవేళ షిర్క్ కు పాల్పడేది ఉంటే మహా వినాశనం ఉంటుంది. కానీ షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది. దానివల్ల అల్లాహ్ త’ఆలా అతన్ని పట్టుకోడు. తొందరగానే వెంటనే శిక్షించడు. ఈ విధంగా లా ఇలాహ ఇల్లల్లాహ్.. పదిసార్లు చదవడం ద్వారా మనకు ఎన్ని లాభాలు కలిగాయి? ఒకటి, పది పుణ్యాలు లభిస్తాయి. రెండవది, పది పాపాలు తొలగించబడతాయి. పది స్థానాలు పెంచబడతాయి. ఇంకా, ఆ రోజంతా అతన్ని కాపాడబడుతుంది. మరియు షైతాన్ నుండి కూడా అతన్ని రక్షించడం జరుగుతుంది ఐదు. ఆరవది, ఏదైనా పాపం జరిగినా గానీ అల్లాహ్ వెంటనే శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి. అంటే షిర్క్ లాంటి పాపం అనేది కాకూడదు.
ఇది దేనివల్ల మనకు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే. కానీ ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. అప్పుడేంటి లాభం మనకు దొరుకుద్ది?
గమనించండి. ఈరోజు ఎన్ని లాభాలు మనం తెలుసుకుంటున్నామో అవన్నీ గుర్తున్నాయా లేవా? ఆ? మరోసారి రిపీట్ చేయాలా? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ దీని గురించి మనం ఏడు లాభాలు తెలుసుకున్నాం. గుర్తున్నాయా? ఏంటెంటి? స్వర్గ ప్రవేశం, 1500 పుణ్యాలు, ఇంకా హజ్ చేసినంత పుణ్యం, ఉమ్రా చేసినంత పుణ్యం, దానధర్మాలు చేసినంత పుణ్యం, ఇంకా జిహాద్ చేసినంత పుణ్యం మరియు సముద్రపు నురుగంత పుణ్యాలు ఉన్నా గాని తొలగించబడతాయి. ఇవి ఏడు.
ఇక ఆయతుల్ కుర్సీ లాభం ఒకటి విన్నాం, అదేమిటి? ఎవరైతే ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో, అతనికి మరియు స్వర్గానికి మధ్య అడ్డు ఏముంది? చావు. అతని మరణం తప్ప వేరేది అడ్డు లేదు. ఇక ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు ఏం చదవాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎన్ని లాభాలు? ఆరు లాభాలు తెలుసుకున్నాము. ఒకటి, పది పుణ్యాలు దొరుకుతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు, షైతాన్ నుండి కాపాడబడతాడు, ఇంకా ఏ పాపం వల్ల కూడా అతన్ని అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి.
ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత చదివితే ఏంటి లాభం? ఈ హదీస్ మీరు వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
بَعَثَ اللهُ لَهُ مُسَلَّحَةً يَحْفَظُونَهُ مِنَ الشَّيْطَانِ حَتَّى يُصْبِحَ [బ’అసల్లాహు లహూ ముసల్లహతన్ యహ్ ఫదూనహూ మినష్ షైతాని హత్తా యుస్బిహ్] అతను ఉదయం అయ్యేవరకు షైతాన్ నుండి అతన్ని కాపాడే ఆయుధాలు ధరించిన వారిని అల్లాహ్ పంపుతాడు.
మగ్రిబ్ తర్వాత చదివితే తెల్లారే వరకు, హత్తా యుస్బిహ్, తెల్లారే వరకు షైతాన్ నుండి అతన్ని కాపాడడానికి ఆయుధంతో నిండి ఉన్న దైవదూతలను పంపుతాడు. ఇది మొదటి లాభం. ఎప్పుడు చదివితే? మగ్రిబ్ తర్వాత. రెండవది,
وَكَتَبَ اللهُ لَهُ بِهَا عَشْرَ حَسَنَاتٍ مُوجِبَاتٍ [వకతబల్లాహు లహూ బిహా అషర హసనాతిన్ మూజిబాత్] మరియు దాని ద్వారా అల్లాహ్ అతని కొరకు తప్పనిసరి చేసే పది పుణ్యాలను రాస్తాడు.
అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు ఎలాంటివి రాస్తాడో తెలుసా? స్వర్గానికి తీసుకువెళ్ళే పుణ్యాలు. సామాన్య పుణ్యాలు కాదు, స్వర్గం అతనిపై విధి చేసే అటువంటి పుణ్యాలు అల్లాహ్ అతని గురించి రాస్తాడు. ఎన్ని లాభాలు అయినాయి? మొదటిది ఏంటిది? షైతాన్ నుండి కాపాడడానికి అల్లాహ్ ఎవరిని పంపుతాడు? ఆయుధంతో ఉన్న దైవదూతలను పంపుతాడు. రెండవ లాభం ఏంటి? పది పుణ్యాలు రాస్తాడు, ఎలాంటి పది పుణ్యాలు? స్వర్గాన్ని విధి చేసే అటువంటి పుణ్యాలు. మూడవ లాభం, పది పాపాలని తొలగిస్తాడు, ఎలాంటి పాపాలు? మూబిఖాత్, అతన్ని నాశనం చేసే అటువంటి పది పాపాలు. మనిషి ఏదైనా పాపం చేసి ఉన్నాడు, ఎలాంటి పాపం? అతన్ని ఆ మనిషిని వినాశనానికి గురి చేస్తాయి. అలాంటి పాపం చేసి ఉన్నాడు. కానీ అల్లాహ్ అలాంటి పాపాన్ని కూడా మన్నించేస్తాడు. ఎందుకు మన్నిస్తాడు? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎప్పుడు చదవాలి? మగ్రిబ్ తర్వాత ఎన్ని పుణ్యాలు, ఎన్ని లాభాలు దొరికినాయి? మూడు. ఆయుధంతో ఉన్న దైవదూతలు షైతాన్ నుండి అతన్ని కాపాడుతారు. అల్లాహ్ స్వర్గంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పుణ్యాలు అతని గురించి రాస్తాడు, మరియు అతన్ని వినాశనానికి గురి చేసే, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు అతని నుండి మన్నించేస్తాడు. ఇంకా
وَكَانَتْ لَهُ بِعَدْلِ عَشْرِ رَقَبَاتٍ مُؤْمِنَاتٍ [వకానత్ లహూ బి’అద్లి అష్రి రఖబాతిన్ ము’మినాత్] మరియుపది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది
పది విశ్వాసులను, విశ్వాస బానిసలను, పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది. ఈ నాలుగు లాభాలు. మగ్రిబ్ తర్వాత చదివితే నాలుగు లాభాలు. కానీ నాలుగు అని తక్కువ భావించొద్దు. మహా గొప్ప లాభాలు ఉన్నాయి ఇవి కూడా. పొద్దున చదివితే కూడా షైతాన్ నుండి రక్షించడం జరుగుతుంది అని చెప్పబడి ఉంది. కానీ సాయంత్రం చదివితే ఏముంది? దైవదూతలు, ఆయుధంతో ఉన్నటువంటి దైవదూతలను అల్లాహ్ త’ఆలా పంపుతాడు అని చెప్పడం జరిగింది. పొద్దున చదివితే కూడా పది పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ సాయంకాలం దాంట్లో ఏముంది? మూజిబాత్, అంటే స్వర్గానికి తీసుకెళ్ళే అటువంటి పుణ్యాలు అని. పొద్దున చదివితే కూడా పది పాపాలు తొలగించబడతాయి, కానీ సాయంత్రం చదివితే, సాయంత్రం చదివితే ఆ, ఘోరమైన, మనిషిని వినాశనానికి గురి చేసే అటువంటి, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు మన్నించబడతాయి. కానీ ఇక్కడ మరో కొత్త విషయం వచ్చింది. పొద్దున చదివిన దాంట్లో రాలేదు. అదేంటి? పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది.
ఈ విధంగా సోదరులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈరోజు మనం ఫర్ద్ నమాజుల తర్వాత ఏ జిక్ర్ అయితే మనం చేయవలసి ఉందో, ప్రవక్త గారు నేర్పారో వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకున్నాము, వాటి యొక్క లాభాలు కూడా తెలుసుకున్నాము. ఇన్ని గొప్ప లాభాలు ఉన్నాయో మీరే శ్రద్ధగా గమనించి వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జిక్ర్ మాత్రమే ఉన్నాయని భావం కాదు, ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కొన్ని జిక్ర్ ల గురించి నేను మీ ముందు ఈ మాట ఉంచాను. అల్లాహ్ త’ఆలా వీటిని అర్థం చేసుకుని, వీటిని ఆచరించే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)
9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)
أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.
మస్బూఖ్:
ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.
జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజ్ యొక్క వాజిబులు:
1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
7- మొదటి తషహ్హుద్ చదవడం.
8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు:
1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
2- తక్బీరె తహ్రీమ.
3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
9- చివరి తషహ్హుద్.
10- దాని కొరకు కోర్చోవడం.
11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
12- సలాం తింపడం.
13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[43:07 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
నమాజ్ ఆదేశాలు
నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఏకీభవించారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:
“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”.
(ముస్లిం 82).
నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).
అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారు:
“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః ” (1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 251).
[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.
“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).
2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.
3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).
اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).
4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.
عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).
5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము,చేతులు తప్ప.
6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదా: వ్యాది లేదా మరేదైనా కారణం.
7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.
8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).
عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).
నమాజ్ సమయాలు:
జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.
నమాజ్ చేయరాని స్థలాలు:
1- ఖననవాటిక (స్మశాన వాటిక): ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[4:26 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[13:31 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
నమాజ్ చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః
1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).
జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:
నియ్యత్ (సంకల్పం).
ఖిబ్లా దిశలో నిలబడుట.
సత్ర్ (అచ్ఛాదన).
వుజూ.
జనాజ నమాజ్ విధానం:
ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.
భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో జనాజా నమాజ్ (అంత్యక్రియల ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, పద్ధతి మరియు ధర్మశాస్త్రపరమైన ఆదేశాలను వివరిస్తారు. ఇస్లాం ఒక వ్యక్తిని మరణించిన తర్వాత కూడా ఎలా గౌరవిస్తుందో, వారిపై జీవించి ఉన్నవారికి ఉన్న హక్కులను గుర్తుచేస్తూ ప్రసంగం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలలో పాల్గొనడం, మృతదేహానికి స్నానం చేయించడం (ఘుస్ల్), మరియు కఫన్ (శవ వస్త్రం) తొడిగించడం వంటి చర్యలకు లభించే గొప్ప పుణ్యఫలాల గురించి హదీసుల ఆధారంగా చర్చిస్తారు. జనాజా నమాజ్ చెల్లుబాటు కావడానికి అవసరమైన నియమాలు (నియ్యత్, ఖిబ్లా, సత్ర్, వుదూ) మరియు నమాజ్ చేసే విధానం (నాలుగు తక్బీర్లు, సూరహ్ ఫాతిహా పారాయణం, దరూద్ ఇబ్రాహీం, మృతుని కోసం ప్రత్యేక దుఆ) వివరంగా చెప్పబడింది. నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భస్రావం జరిగితే, ఆ పిండానికి కూడా జనాజా నమాజ్ చేయాలనే ముఖ్యమైన ఆదేశాన్ని నొక్కి చెబుతారు. ప్రసంగం చివరలో, జనాజా నమాజ్కు సంబంధించిన సఫ్ (వరుసలు) ఏర్పాటు, గాయబానా నమాజ్ (పరోక్ష ప్రార్థన), స్త్రీ-పురుషుల కోసం దుఆలో తేడాలు మరియు చిన్న పిల్లల జనాజా వంటి అంశాలపై శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
సోదర మహాశయులారా!
అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవల్ల మనం కొన్ని రోజుల నుండి శుద్ధి మరియు నమాజ్ అనే అంశంపై ఏ మంచి పాఠాలు అయితే మొదలు పెట్టామో, అల్హందులిల్లాహ్ దాని యొక్క చివరిలో ఈ రోజు చేరుకున్నాము. ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల జనాజా నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము.
ఇందులో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, జనాజా నమాజ్ దీని యొక్క వివరణ, దీని యొక్క పద్ధతి తెలుసుకునే ముందు, ఇస్లాం యొక్క మంచితనాన్ని, మేలును, గొప్పతనాన్ని, స్వయంగా మీరు విని అర్థం చేసుకొని ప్రత్యేకంగా అవిశ్వాసులకు ఇస్లాం యొక్క ఈ మంచి విషయాన్ని బోధించండి.
అదేమిటంటే, ఇస్లాం యొక్క సంబంధం ఎవరితో ఏర్పడుతుందో వారి యొక్క హక్కు మనపై వారు బ్రతికి ఉన్నంతవరకే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనపై ఉంటుంది. మన ఒక ముస్లిం సోదరుడు బ్రతికి ఉన్నంతవరకే అతని హక్కు మనపై కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉన్నాము, మన యొక్క ముస్లిం సోదరుడు లేదా సోదరీమణి చనిపోయింది, అప్పుడు కూడా అతని యొక్క హక్కు మనపై ఉంటుంది. అల్లాహు అక్బర్.
ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు అంటే స్నానం చేపించడం, కఫన్ దుస్తులు ధరింపజేయడం, సమాధిలో దించడం, అంతకుముందు నమాజ్ చేయడం, అతని గురించి, ఆమె గురించి అల్లాహ్ తో క్షమాభిక్ష, పాపాల మన్నింపు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై కురుస్తూ ఉండాలి అని అల్లాహ్ ను వేడుకోవడం, ఆ తర్వాత ఇంకా వారి కొరకు దుఆ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఎలాంటి సత్కార్యాలు? అల్లాహు అక్బర్.
సహీహ్ హదీసులో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ అహ్కాముల్ జనాయిజ్ లో ప్రస్తావించారు, ఒక బ్రతికి ఉన్న ముస్లిం, చనిపోయిన ఒక ముస్లింకి స్నానం చేపించాడు, స్నానం చేపిస్తున్న సందర్భంలో ఏమైనా లోపాలు, దోషాలు, ఏమైనా విషయాలు చూశాడు, , కప్పి ఉంచాడు, ఎవరికీ చెప్పలేదు,
غَفَرَ اللَّهُ لَهُ أَرْبَعِينَ مَرَّةً (గఫరల్లాహు లహు అర్బయీన మర్ర) అల్లాహ్ అతన్ని నలభై సార్లు క్షమిస్తాడు.
ఎవరైతే ఒక ముస్లింకి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో, అల్లాహు త’ఆలా స్వర్గంలో మంచి అక్కడి స్వర్గపు పట్టు వస్త్రాలు ఇలాంటి వ్యక్తికి ధరింపజేస్తాడు.
ఇక అతని కొరకు నమాజ్ చేశాడంటే, సహీహ్ బుఖారీలోని హదీస్. ఇప్పుడు కూడా ఇన్ షా అల్లాహ్ ఆ హదీస్ వస్తుంది, రెండు పెద్ద కొండలు. ఇక రెండు పెద్ద పర్వతాలు అంటే మీ ఇష్టం. మీలో ఎంత ఇఖ్లాస్, మీలో ఎంత ముతాబా’అ. ఈ పదాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చి ఉన్నాయి. గుర్తుంది కదా? ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం. ముతాబా’అ అంటే ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించడం. ఎంత ఇఖ్లాస్, ఎంత ముతాబా’అ ఉంటుందో అంతే పెద్ద పర్వతాలు. ఈ హిమాలయా కూడా చిన్నదే. అలా మీరు ఊహించారంటే, నమాజ్ చేయడం మరియు అతన్ని సమాధిలో పెట్టేవరకు ఖబరిస్తాన్ లో, స్మశాన వాటికలో ఉండటం ఎంత గొప్ప పుణ్యాలో ఒకసారి గ్రహించండి.
ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా? ఒకటి, ఒక ముస్లిం చనిపోయాడు అంటే, చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క బాధ్యత మనపై ఎంత గొప్పగా ఉందో. ఒక విషయం ఇది. ఈ బాధ్యతను గనక మనం కరెక్ట్ ఇఖ్లాస్ మరియు ముతాబా’అ ప్రకారంగా నెరవేర్చామంటే, అల్లాహ్ వైపు నుండి మనకు ఎన్ని అనుగ్రహాలు, వరాలు, పుణ్యాలు, సత్ఫలితాలు, మంచి ప్రసాదాలు ఉన్నాయో గమనించండి.
జనాజా నమాజ్
రండి. జనాజా యొక్క చాలా వివరాలతో కూడిన పాఠం. అది కూడా బహుశా ఎంత లేకున్నా గానీ ఒక 10 పాఠాలు కావచ్చు. ఇన్ షా అల్లాహ్, త్వరలో ఎప్పుడైనా మనం వివరాలతో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సంక్షిప్తంగా నమాజ్ విషయం మీకు తెలియజేస్తున్నాము.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే జనాజాలకు హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో, అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును.”
“రెండు ఖీరాతులు అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నారు, రెండు ఖీరాతులు అంటే ఏంటి, ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం? రెండు పెద్ద పర్వతాలు, పెద్ద కొండలు అని. జబలైనీ అజీమైనీ, అజీం అజీం. ఇది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.
అయితే వేరే కొన్ని మరి సహీహ్ హదీసులో ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతం అని కూడా ప్రస్తావన వచ్చి ఉంది. ఏంటి? మదీనా నగరంలో ఉన్నటువంటి ఉహుద్ పర్వతం. అయితే ఇక్కడ విరుద్ధం, విభేదం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే సత్కార్యానికి వేరువేరు రకాలుగా మనం పుణ్యాలు లేదా పుణ్యాల ప్రస్తావన చూస్తూ ఉంటే ఇది విరుద్ధం అనరు. దీని యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఎంత స్వచ్ఛంగా, ఇఖ్లాస్ మరియు ముతాబా’అ. ఆ రెండు పదాలు మీరు మరిచిపోకండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవి. చిత్తశుద్ధి మరియు ప్రవక్త విధానాన్ని అనుసరించడం. ఇఖ్లాస్, ముతాబా’అ ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా వారు ఆ పుణ్యాన్ని పొందుతారు అనే భావం.
జనాజా నమాజ్ లో నాలుగు విషయాలు తప్పనిసరి. ఏమిటి అవి?
జనాజా నమాజ్ యొక్క నిబంధనలు
నియ్యత్ (సంకల్పం), ఖిబ్లా దిశలో నిలబడుట, సతర్ (అచ్ఛాదన), వుజూ.
ఈ నాలుగు విషయాలు మీకు అర్థమయ్యాయి. నియ్యత్ అంటే మనసులో మనం సంకల్పించుకుంటాము. నోటితో నియ్యత్ చేయడం ఇది ప్రవక్త పద్ధతి కాదు. రెండవది, ఖిబ్లా దిశలో నిలబడటం. ఖిబ్లా వైపునకు. ఇది కూడా విషయం అర్థమైనదే. సత్ర్, అచ్ఛాదన అంటే నమాజ్ చేసే సందర్భంలో మన శరీరంపై ఎంత దుస్తులు ఉండాలో అంత దుస్తులు ఉండడం. ఇది కూడా తప్పనిసరి. జనాజా నమాజ్ కొరకు వుజూ చేసుకొని ఉండటం కూడా తప్పనిసరి. ఇవి నాలుగు షరతులు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా గానీ అతను నమాజ్ చేసినప్పటికీ అతని నమాజ్, నమాజ్ కాదు. అంగీకరింపబడదు.
జనాజా నమాజ్ విధానం
ఇమామ్ (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు దగ్గరగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమామ్ వెనక నిలబడాలి.
అల్లాహు అక్బర్ అని
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ పూర్తిగా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ గమనించారు కదా? నమాజ్ యొక్క విధానం, జనాజా నమాజ్ ఎలా చేయాలి అనే విధానం ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే గమనించండి, ఇమామ్ ఎవరైతే నమాజ్ చేయిస్తారో, వారు ఎలా ఎక్కడ నిలబడాలి అనే విషయం ఇక్కడ ముందు చెప్పడం జరిగింది.
మయ్యిత్, శవం పురుషునిది అయ్యేదుంటే, అతని యొక్క తలకు సమానంగా ఇలా నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఒకవేళ స్త్రీ అయ్యేది ఉంటే, ఆమె యొక్క మధ్యలో, నడుము కాడ. ఈ విషయం అర్థమైపోయింది కదా? ఇక ముక్తదీలు అందరూ కూడా ఇమామ్ వెనక నిలబడతారు. అయితే ఇమామ్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఎందుకంటే, జనాజా నమాజ్ కు సంబంధించి హదీసులు ఏవైతే వచ్చాయో, జనాజా నమాజ్ కు సంబంధించిన హదీసుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనా చదివారా, చదవలేదా, ఏ ప్రస్తావన లేదు. చదివారు అని లేదు, చదవలేదు అని లేదు. అందుకొరకే ఇక్కడ ధర్మవేత్తలు ఎంతో మంది ఏమని అభిప్రాయపడ్డారు? ఒకవేళ ప్రవక్త చదివి ఉండేది ఉంటే, ప్రస్తావన ఉండేది. కానీ వేరే ఎంతో మంది సర్వసామాన్యంగా ధర్మవేత్తలు అంటారు, నమాజు ఆరంభంలో సనా చదవడం సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇక్కడ దాని ప్రస్తావన ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ చదవడమే మంచిది. అయితే మీ ఇష్టం. చదివినా అల్హందులిల్లాహ్, చదవకపోతే ఎలాంటి పాపం లేదు. కానీ ఏం చదవాలి? అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే,
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
చదివి సూరె ఫాతిహా పూర్తిగా చదవాలి. సూరె ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివినా అల్హందులిల్లాహ్. చదవకపోయినా అల్హందులిల్లాహ్. ఆ తర్వాత రెండవసారి అల్లాహు అక్బర్ అని మళ్ళీ చేతులు కట్టుకొని దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం… మనం తషహ్హుద్ లో చదువుతాము కదా? అది పూర్తిగా చదవాలి. మళ్ళీ మూడోసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని మయ్యిత్ కొరకు దుఆ చేయాలి.
ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో సహీహ్ హదీసుల్లో నాలుగు రకాల దుఆలు వచ్చి ఉన్నాయి. ఆ నాలుగింటిలో కూడా చాలా మంచి లాభదాయకమైన, శవానికి, మయ్యిత్ కు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించగలుగుతారా?
ఒక సందర్భంలో ఒక సహాబీ బ్రతికి ఉన్నారు. ప్రవక్త వెనక ఉండి ఒక మయ్యిత్, ఒక శవం యొక్క, ఒక ముస్లిం జనాజా నమాజ్ చేస్తున్నారు. ప్రవక్త ఈ దుఆ, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీకు, ఈ దుఆ ఏదైతే చదివారో వెనక ఉన్న ఆ సహాబీ ఏమంటున్నారు? ఆ దుఆ విని నాకు అనిపించింది, అయ్యో! ఆ శవం కాడ నా శవం ఉండేది ఉంటే ఎంత బాగుండేది. ప్రవక్త వారి దుఆలు అన్నీ కూడా నాకు ప్రాప్తమయ్యేవి అని. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, ఇలాంటి దుఆలు మనం నేర్చుకోవాలి. మన గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో చాలా, చాలా బాధాకరమైన విషయం నా కొరకు. ఏంటో తెలుసా? చాలా మంది ఈ జనాజా నమాజ్ లో చదివే దుఆ వారికి తెలిసే ఉండదు. అడిగారు నేను ఎన్నో సందర్భాలలో. సంవత్సరం క్రితం కూడా నేను ఏదైతే ఇండియాకు వెళ్లానో ఒక నెల గురించి, అక్కడ సుమారు రెండు, మూడు జనాజాలలో చదవడం, చదివించే అవసరం పడింది. ఇక మన వద్ద చిన్నపాటి ఇఖ్తిలాఫ్ కూడా. ఈ జనాజా నమాజ్ చదివించే వారు శబ్దంగా చదవాలా? మనసులో చదువుకోవాలా? మెల్లగా నిశ్శబ్దంగా? లేదా శబ్దంగా చదవాలా? సర్వసామాన్యంగా మన వద్ద హనఫీ సోదరులు మెల్లగా చదువుతారు. హనాబిలా వద్ద కూడా మెల్లగానే చదవాలి అని ఉంది. అహ్లుల్ హదీస్ వారు శబ్దంగా చదువుతారు. అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లను నేను. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పిన విషయం సహీహ్ బుఖారీలో, నేను శబ్దంగా ఇప్పుడు ఇక్కడ మీకు చదివింది ఎందుకంటే, ఈ సూరె ఫాతిహా కూడా జనాజాలో చదవడం ప్రవక్త వారి సున్నత్ అని మీకు తెలియాలి.
ఈ విధంగా సోదర మహాశయులారా, కనీసం జనాజా సందర్భాలలో మనం ప్రజలకు చెప్పాలి. అయ్యలారా, అవ్వలారా, కొంచెం నేర్చుకోండి దుఆలు. ఓ కొడుకా, ఓ నా బిడ్డా, నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏమి లాభం నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం “అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా” చదవలేకపోతే. నీవు బంగళాలు కట్టించి, మీ నాన్న సమాధి మీద ఎంత పెద్ద గోపురం కట్టినా గానీ ఏమి లాభం, నీవు నీ తండ్రి గురించి క్షమాభిక్ష ఎలా కోరాలో నీకు తెలియకుంటే.
సోదర మహాశయులారా, వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. సౌదీ అరబ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒకేషన్ లో వెళ్ళాడు, సెలువులో. కానీ కరోనా కారణంగా చిక్కిపోయాడు అక్కడే. రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న నాలుగు రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. “షేఖ్, ఎందుకో నాకు ఇక్కడ ఇండియాలో భార్యా పిల్లలు అందరిలో కలిసి ఉన్నాను కానీ ఉండబుద్ధి అయితే లేదు. అటే రావాలి అనిపిస్తుంది.” నేనన్నాను, ఇది కూడా నువ్వు అదృష్టంగా భావించు. అల్లాహ్ ఏదైనా పరీక్షలో మనల్ని పడవేసాడు అంటే అందులో కూడా ఏదైనా మేలు ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. “షేఖ్, ఇప్పటికి సుమారు నేను ఇక్కడికి వచ్చేసి ఏడు నెలలు అయిపోయినాయి, కేవలం ఎవరితోనైనా కలిసినప్పుడు అస్సలాము అలైకుమ్ అంటే వ అలైకుమ్ అస్సలాం. ఇంతే కానీ, అక్కడ అరబులో ఉండి పరస్పరం దుఆలు ఇచ్చుకోవడం, జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీక్, అహ్సనల్లాహు ఇలైక్, కైఫల్ హాల్, ష్లోనక్, అల్లా యహ్ఫజక్, అల్లా యర్హమక్, ఇలాంటి దుఆలు ఏదైతే ఇచ్చుకుంటారో పరస్పరం అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు చాలా బాధ కలుగుతుంది” అని అన్నాడు.
ఇంతకుముందు కూడా నేను ఒక విషయం మీకు తెలియజేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందు వచ్చే ఎన్నో సూచనలు తెలుపుతూ, ధర్మం ఎంత బలహీనంగా అయిపోతుందో తెలియజేస్తూ, వారిలో కొందరిని ప్రశంసించారు. ఎవరు? అల్ హమ్మాదూన్, అధికంగా అల్లాహ్ ను ప్రశంసించే వారు, అల్లాహ్ తో వేడుకునే వారు.
క్షమించండి, జనాజా నమాజ్ కు సంబంధించిన పద్ధతులు, దుఆల గురించి మనం తెలుసుకుంటున్నాము. కానీ మనం ఈ రోజుల్లో ధర్మం నేర్చుకోకుండా, దుఆలు నేర్చుకోకుండా ప్రపంచ విషయాలు రోజు ఎంత తిరిగేస్తా ఉంటామో మనం, కానీ మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక విషయం మనం నేర్చుకోము. రండి, ముందు నేను మీకు దీని యొక్క అనువాదం వినిపిస్తాను, ఆ తర్వాత ఈ దుఆ చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను దుఆ ముందు చదివేశాను, అరబీలో ఉంది. భావం తెలిస్తే కదా మీకు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి భావం.
ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్న వారిని, దూరముగా ఉన్న వారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమించుము. ఓ అల్లాహ్! మాలో ఎవరిని సజీవంగా ఉంచదలచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము.ఓ అల్లాహ్! అతని చావుపై మేము వహించిన ఓపిక, పుణ్యాలు మాకు లేకుండా చేయకుము.
గమనిస్తున్నారా, ఎంత మంచి భావాలు ఉన్నాయి? ఏం తెలుస్తుంది? మనకు ఎంత దగ్గరి బంధువు అయినా గానీ, భార్య కొరకు ఒక భర్త చనిపోయినా, భార్య విధవ అయిపోయినా, తండ్రి చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయినా, భార్య చనిపోయి భర్త ఒంటరిగా అయిపోయాడు అన్నటువంటి వ్యధకు, బాధకు గురి అయినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహించాలి. ఓపిక సహనాలు వహిస్తూ, అల్లాహ్ దానికి సరియైన ఫలితం కూడా ప్రసాదించాలి అని ఆశిస్తూ ఉండాలి. “ఫల్ తస్బిర్ వల్ తహ్తసిబ్” అదే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సొంత కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా వారికి నసీహత్ చేసింది? ఇంకా ఆ దుఆలోని మరో పదం గుర్తుంచుకోండి: “అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.” ఎంత మంచి భావం ఉందో ఇక్కడ గమనిస్తున్నారా మీరు? సోదర మహాశయులారా,
اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాఇబినా వ సగీరినా వ కబీరినా వ దకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫ అహ్యిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్ అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు వ లా తుదిల్లనా బ’అదహు)
ఈ దుఆ యొక్క అనువాదం మీరు విన్నారు. మరొక దుఆ ఉంది, అది కూడా అందులో ఎంత గొప్ప భావం ఉంది?
اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ (అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్ హమ్హు వ ఆఫిహి వ’అఫు అన్హు) ఓ అల్లాహ్, అతన్ని క్షమించు, అతన్ని కరుణించు. ఓ అల్లాహ్, అతన్ని సుఖంగా, శాంతిగా ఉంచు. అతనిని నీవు అన్ని రకాలుగా అతని పాపాలను తుడిచివేసి నీవు మన్నించేసెయ్.
وَأَكْرِمْ نُزُلَهُ (వ అక్రిమ్ నుజులహు) అతడు ఇప్పుడు నీకు అతిథిగా అయ్యాడు. నీవు అతన్ని మంచిగా చూసుకో.
وَوَسِّعْ مُدْخَلَهُ (వ వస్సి’అ ముద్ఖలహు) అతడు సమాధిలో ప్రవేశించాడు, సమాధిని నీవు విశాలపరచు.
وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ (వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బరద్) నీవు అతని యొక్క పాపాలను నీటితో, బర్ఫ్ (ఐస్)తో, కడగండ్లతో పూర్తిగా కడిగి వేసెయ్. ఏమి పాపాలు లేకుండా చేయి అతన్ని.
وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ (వ అబ్ దిల్హు దారన్ ఖైరమ్ మిన్ దారిహి) ఈ ఇక్కడి గృహం కంటే, నీవు ఉత్తమమైన గృహం అక్కడ అతనికి ప్రసాదించుము.
وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ (వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహి) ఇక్కడ ఉన్న అతని జంట కంటే, మంచి ఓ జంట నీవు అతనికి ప్రసాదించు.
وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ (వ అహْلన్ ఖైరమ్ మిన్ అహ్లిహి) ఇక్కడ ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, ఇంతకంటే మంచి కుటుంబం నీవు అతనికి ప్రసాదించుము.
وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ (వ అ’ఇద్హు మిన్ అదాబిల్ ఖబ్ర్) ఇతన్ని నీవు సమాధి శిక్ష నుండి కాపాడు, శరణు ప్రసాదించు.
وَعَذَابِ النَّارِ (వ అదాబిన్నార్) నరక శిక్ష నుండి కూడా ఇతనికి శరణు ప్రసాదించు.
وَأَدْخِلْهُ الْجَنَّةَ (వ అద్ఖిల్హుల్ జన్నహ్) మరియు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము.
గమనిస్తున్నారా ఎంత గొప్ప భావాలు ఉన్నాయో?
అయితే సోదర మహాశయులారా, ఈ దుఆ ఏదైతే ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉందో, మళ్లీ అంటే ఈ మూడు తక్బీర్, మూడోసారి అల్లాహు అక్బర్ అని చేయి కట్టుకున్న తర్వాత ఈ దుఆ చదివాము కదా, గుర్తుంది కదా మీకు? మరోసారి కొత్తగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మధ్యలో చాలా విషయాలు, మాటలు వచ్చాయి కదా? మొదటిసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, సనా చదివితే చదవచ్చు లేకపోతే పర్వాలేదు. అ’ఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్, సూరె ఫాతిహా మొత్తం చదివి, ఆ తర్వాత ఏదైనా సూరా చదివితే చదవచ్చు లేకపోయినా పర్వాలేదు. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ ఇబ్రాహీం పూర్తిగా చదవాలి, ఏదైతే మనం తషహ్హుద్ లో చదువుతామో. మూడోసారి అల్లాహు అక్బర్ అని ఈ దుఆలు చదవాలి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న దుఆలు. నాలుగోసారి అల్లాహు అక్బర్ అని అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్, ఒకవైపున సలాం తింపినా సరిపోతుంది, సహీహ్ హదీస్ తో రుజువు అయి ఉంది. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని రెండో వైపున కూడా ఒకవేళ సలాం తెంపితే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రెండు సలాముల విషయం కూడా ఒక సలాం అయినా, రెండు సలాములైనా, ఈ రెండు విషయాలు సహీహ్ హదీసులతో రుజువు అయి ఉన్నాయి.
సోదర మహాశయులారా, ఆ తర్వాత…
ఎవరైనా పాఠాలు వింటున్నారు కదా?
షేఖ్, వింటున్నాం షేఖ్. జజాకుముల్లాహు ఖైరన్ షేఖ్.
జజాకుముల్లాహు ఖైరన్. వాస్తవానికి ఇది ఒక క్లాసే. కానీ సమయం సరిపోవడం లేదు. డిస్టర్బెన్స్ కూడా చాలా అవుతుంది అని అందరినీ సైలెంట్ చేసి మ్యూట్ చేసి పాఠం చెప్పడం జరుగుతుంది. లేదా అంటే క్లాస్ అన్నప్పుడు క్లాస్ గా ఒక మాట చెప్పి, ఆ అబ్దుల్లా, అర్థమైందా? ఖాజా, ఆ చెప్పండి. అస్మా గారు చెప్పండి. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడుగుకుంటూ వెళితే చాలా బాగుండేది. కానీ క్షమించండి, అల్లాహు త’ఆలా మన సమయంలో బరకత్ ప్రసాదించుగాక. చదవండి అబ్దుల్ ఖాదిర్ గారు.
గర్భిణీల గర్భస్రావంపై ఆదేశం
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భము పడిపోయినచో, దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాకముందు గర్భము పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
ఈ విషయం కూడా చాలా అవసరం. అనేక మంది ఈ ఆదేశం పట్ల కూడా చాలా అశ్రద్ధగా ఉన్నారు. కొందరు కొందరి గురించి అయితే తెలుస్తుంది, తొమ్మిది నెలలు పూర్తి నిండి పుట్టిన వెంటనే లేదా పుట్టినప్పుడే చనిపోయాడు అని తెలిస్తే కూడా జనాజా నమాజ్ చదవకుండానే తీసుకెళ్లి దఫన్ చేసి వచ్చేస్తారు. కానీ అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ఆధారంగా అనేక ధర్మవేత్తలు, ప్రస్తుత కాలంలోని ఎందరో మషాయిఖ్ ఇదే ఫత్వా ఇచ్చారు. ఏంటి? నాలుగు నెలలు గర్భం పూర్తి అయింది, 120 రోజులు పూర్తిగా నిండిపోయాయి, ఆ తర్వాత తల్లి గర్భంలో పిండం చనిపోతే అతని యొక్క జనాజా నమాజ్ తప్పకుండా చదవాలి. ఎందుకు? ఇంతకు ముందు నేను మీకు చూపించాను ‘Z Daroos’ అని మా YouTube ఛానల్ ఏదైతే ఉందో ఆఫీస్ వైపు నుండి, అందులో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కొంచెం వివరంగా ఉన్నాయి, తప్పకుండా వినండి అక్కడ. సంక్షిప్తం ఏమిటి? సుమారు 80 నుండి 90 రోజుల తర్వాత తల్లి గర్భంలో పిండం సంపూర్ణ మానవ ఆకారం పొందుతాడు. కళ్ళు, చేతులు, మొత్తం శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి ఒక మానవ రూపంలో వచ్చేస్తాడు. అంతకుముందు 40 రోజులు నుత్ఫా, 40 రోజులు అలకా, తర్వాత 40 రోజులు ముద్గా, ఈ విధంగా 120 రోజులు పూర్తి అయిపోయేసరికి ఇక అతడు సంపూర్ణ ఒక మనిషి, మనిషి రూపం దాల్చేశాడు. 120 రోజుల తర్వాత అతనిలో రూహ్, ఆత్మ కూడా వేయడం జరిగింది. ఇక అతడు ఒక సంపూర్ణ ఒక మనిషిగా ఉన్నాడు, చిన్న సైజులో, తల్లి గర్భంలో. ఆ తర్వాత మరణిస్తే తప్పకుండా అతని యొక్క జనాజా నమాజ్ చేయాలి. “అస్సిక్తు యుసల్లా అలైహ్” హదీసులో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఇక నాలుగు నెలల కంటే ముందు, నాలుగు నెలలు పూర్తి కాకముందే చనిపోతే, జనాజా నమాజ్ చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇక్కడ వరకు సోదర మహాశయులారా, అల్హందులిల్లాహ్ జనాజా నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు పూర్తి అయ్యాయి.
ప్రశ్న-జవాబులు
సలాం అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అడగండి, మాట్లాడండి.
షేఖ్, నమాజ్, జనాజా నమాజ్ కొరకు సఫ్ ఎలా ఏర్పాటు చేయాలి షేఖ్?
సర్వసామాన్యంగా నమాజుల కొరకు ఎలాగైతే సఫ్ ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ కొందరు అంటారు మూడు, ఐదు, ఏడు, ఇలా తప్పనిసరి ఏమీ లేదు కానీ ఉంటే మంచిది. కానీ సఫ్ కంప్లీట్ కూడా ఉండాలి. ఇది మంచి విషయం. సఫ్ కంప్లీట్ కాకుండా ఎక్కువ సఫ్ లు చేయడం మరియు బేసి సంఖ్యలో చేయడం ఇది అంత తప్పనిసరి కాదు. సఫ్ కంప్లీట్ గా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం.
జజాకల్లాహు ఖైరన్ షేఖ్.
వ ఇయ్యాక.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, ఈ కువైట్ లో రాజు చనిపోయాడు కదా, అయితే అతని యొక్క జనాజా నమాజ్ అన్ని మస్జిద్ లలో చదివించడం జరిగింది. ఇలా ఎక్కడైనా నమాజ్ చదివించవచ్చా? లేక జనాజా ముందరనే జనాజా నమాజ్ చదవాలా షేఖ్?
జనాజా ముందట కూడా చదివించడం జరిగింది. జనాజా ముంగట పెట్టుకొని అక్కడ కూడా చదివించడం జరిగింది. కానీ దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఆధారంగా ముస్లిం ప్రభుత్వంలోని నాయకుడు ఎవరి జనాజా నమాజ్ గాయబానా వేరేచోట చదివించడానికి ఆదేశం ఇస్తాడో, అక్కడ చదవచ్చు. ఇక్కడ సౌదీ అరబ్ లో కూడా ఇక్కడి రాజు ఆదేశం ఇచ్చారు. అందుకని కువైత్ రాజు యొక్క జనాజా నమాజ్ గాయబానా ఇక్కడ మక్కా, మదీనాలో, హరమైన్ లో కూడా చేయడం జరిగింది.
ఇంకొక ప్రశ్న షేఖ్. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే దుఆ చదవవచ్చా లేక వేరే దుఆలు చదవవచ్చా షేఖ్, జనాజా నమాజ్ లో?
పర్వాలేదు, ఒకే దుఆ చదివితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రెండో దుఆ ఏదైతే నేను చదివానో, అందులో “అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు” ఈ ఏదైతే పదాలు ఉన్నాయో చివరిలో హూ, హీ అని, అక్కడ, “అల్లాహుమ్మగ్ఫిర్ లహా వర్హమ్హా వఆఫిహా వఅఫు అన్హా వఅక్రిమ్ నుజులహా” ఈ విధంగా చదవడం మంచిది. కానీ ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం మయ్యిత్, మయ్యిత్ పదం ముజక్కర్. ఇది ఆహ్, మేల్ వర్డ్. అందుకొరకు “అల్లాహుమ్మగ్ఫిర్ లహు” చదివినా ఎలాంటి అభ్యంతరం లేదు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, జనాజా నమాజ్ చదివేటప్పుడు ఎవరికైనా దుఆ పూర్తిగా రాకపోతే అలాంటి నమాజ్ నెరవేరుతుందా? లేకపోతే అది మరలా వచ్చిన వాళ్ళు చదవాలా? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరు నమాజ్ చదివించడానికి దుఆలు వచ్చిన వాళ్ళు ఉండరు.
ఏం చదువుతారు మరి ఆ సందర్భంలో?
అంటే ఏదైతే దుఆలు అయితే వాళ్లకు తెలిసి ఉంటాయో అలాంటి దుఆలు చదవవచ్చినా అనేది ప్రశ్న.
ఇక్కడ ఎవరు ఫత్వా ఇచ్చారో ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు కానీ నేను ఎవరో ఎవరిదో ఫత్వా చదివాను. జనాజా నమాజ్ లో ఒకవేళ ఎవరికైనా దుఆ కంఠస్థం లేకపోతే వారు రాసుకొని ఏదైనా మొబైల్ లో గానీ లేదా కాగితంలో గానీ చూసి చదవడంలో ఇబ్బంది లేదు ఇన్ షా అల్లాహ్. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కనీసం ఒక్క దుఆనైనా. అల్లాహు ఆ’లమ్.
జజాకల్లాహు ఖైర్ షేఖ్.
వ ఇయ్యాక, బారక ఫీక్.
ఈ అంశానికి సంబంధించి ఇంకా ప్రశ్న ఉంటే ఎవరిదగ్గరైనా మైక్ ఆన్ చేసుకొని అడగవచ్చు లేదా రేస్ హ్యాండ్ చేయవచ్చు.
అహ్సనల్లాహు ఇలైక్ షేఖ్.
వ ఇలైకుమ్, వ బారక ఫీకుమ్. తఫద్దల్, హయ్యాకల్లాహ్.
షేఖ్, అరబీలో దుఆ రాకపోతే, జనాజా సలాత్ లో, వేరే ఇంకా వేరే భాషలో ఏమైనా చేసుకోవచ్చా షేఖ్ దుఆ?
నేను చెప్పాను కదా ఇంతకుముందు, రాసి ఉండాలి అరబీలో. దాన్ని చూసి చదివితే ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది “హాదా అహ్వను అలైక మిన్ గైరిల్ అరబియ్యా”. అరబీ భాషలో కాకుండా వేరే భాషలో చదవడం కన్నా చూసి నమాజ్ లో అరబీలో ఆ దుఆ చదవడం ఉత్తమం. అల్లాహు ఆ’లమ్.
జజాకల్లాహు ఖైరన్ షేఖ్. బారకల్లాహు ఫీక్.
వ ఇయ్యాక.
షేఖ్, ఇక్కడ మన ఇండియాలో చాలా జనాజాలు నేను చేశాను. రెండు మూడు జనాజాలు. రెండు నిమిషాల్లో జనాజా నమాజ్ పూర్తి చేసేస్తారు షేఖ్. అది ఎలాగ అనేది నాకు అర్థం కావడం లేదు. ఏం దుఆలు చదువుతారు? ఏం పఠిస్తారు?
చెప్తాను, వినండి. మన వద్ద సర్వసామాన్యంగా మన హనఫీ సోదరులు అల్లాహ్ మాకు, వారికి అందరికీ హిదాయత్ ఇవ్వుగాక, హనఫీ సోదరులు సూరతుల్ ఫాతిహా చదవరు. సనా చదువుతారు. ఇదే చాలా విచిత్ర విషయం అనిపిస్తుంది. అందుకొరకే అంధానుసరణ ఉండకూడదు. అంటే ఈ అంధానుసరణ, తక్లీద్ ఏదైతే ఉందో, దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు సనా ప్రస్తావన లేదు, అది చదువుతున్నారు. సూరె ఫాతిహా ప్రస్తావన ఉంది, దాన్ని వదులుతున్నారు. అందుకొరకు కూడా వారి యొక్క నమాజ్ సంక్షిప్తంగా అయిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఎవరైనా వేరే కారణాలతో సంక్షిప్తంగా చేస్తే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అల్లాహు ఆ’లమ్. ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, సూరె ఫాతిహా కూడా జనాజా నమాజ్ లో చేయాలి.
జజాకుముల్లాహు ఖైర్ షేఖ్. ఇంకొక విషయం షేఖ్. ఎందుకు జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు ఉండవు? శవం ముందర ఉన్నదానా? లేకపోతే ఎందుకు షేఖ్?
ఎలా? జనాజా… ఏంటి ఏంటి? రుకూలు, రుకూ, సజ్దాలు. అల్లాహు ఆ’లమ్. ముందు ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో మనకు నేర్పిన విషయంలో జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు లేవు. కారణం ఏంటి? మీరు చెప్పినట్లు, ముందు ఒక శవం ఉంటుంది గనక చూసే వారికి మనం అతని కొరకు రుకూ చేస్తున్నట్లు, అతని కొరకు సజ్దా చేస్తున్నట్లు ఏర్పడకూడదు కావచ్చు. అల్లాహు ఆ’లమ్. ఇదే అల్లాహ్ యొక్క ఇష్టం. అందుకొరకే విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? తూచా తప్పకుండా ఎందుకు, ఎలా, ఇలా ఎందుకు, అలా ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్నలు లేకుండా అల్లాహ్ చెప్పిన మాటను, ప్రవక్త చూపిన పద్ధతిని మనం అనుసరించాలి. బారకల్లాహు ఫీకుమ్.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్, ఈ జనాజా నమాజ్ లోని ఒక ప్రశ్న షేఖ్. చిన్న పిల్లలకు నమాజ్ చదివించవచ్చు, చదివించవచ్చుకూడదు ఎలాగైనా ఒకటే అంటారు షేఖ్. దీని గురించి.
ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేకి బదులుగా, ఒకవేళ మీరు గ్రహించారంటే, ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇంతకు ముందే నేను ఇచ్చేసాను, ఇదే పాఠంలో, ఈ రోజే. కానీ అది కొందరికి డైరెక్ట్ గా అర్థం అయ్యింది కావచ్చు, మరి కొందరికి డైరెక్ట్ గా అర్థం కాలేదు కావచ్చు.
అయితే మీలోనే ఎవరైనా సమాధానం ఇవ్వాలి అని కోరుతున్నాను. సోదరుడు అబ్దుల్ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. అడపదడప మిమ్మల్ని కూడా అడగాలి కదా మరి నేర్చుకున్నది ఏం నేర్చుకుంటున్నారు మీరు అనేది తెలియాలి కదా.
అదే కదా షేఖ్, గర్భంలో నాలుగు నెలలు పూర్తి నిండితే చదివించాలి, పూర్తి నిండకపోతే చదివించకూడదు. ఇలాగేనా షేఖ్, ఇదేనా షేఖ్?
కరెక్ట్. ఈ విషయం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ నాలుగు నెలల గర్భం నిండిన తర్వాత ఒకవేళ చనిపోతే నమాజ్ చేయాలి అని అన్నప్పుడు, ఇక చిన్నపిల్లలు ఎవరైతే పుట్టి కొద్ది రోజులు బ్రతికి చనిపోయారో, వారి జనాజా నమాజ్ చదవకపోవడానికి ఏంటి దలీల్? ఏంటి కారణం? ఏంటి రీజన్? అర్థమైంది కదా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.