ముస్లిం వనిత – పార్ట్ 01: స్త్రీల హక్కులు, భర్తలపై భార్యల హక్కులు [వీడియో]

బిస్మిల్లాహ్

[21:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

ముస్లిం వనిత

స్త్రీ యొక్క సామాన్య హక్కులు

స్త్రీలకు కొన్ని సామాన్య హక్కులున్నాయి. వాటిని స్వయంగా స్త్రీలు తెలుసుకొనుట మరియు పురుషులు వాటిని వారి కొరకు అంగీకరించుట ఎంతయినా అవసరం. స్త్రీలు తమ ఈ హక్కలను తమిష్టానుసారం వినియొగించుకోవచ్చును.

సంక్షిప్తంగా ఆ హక్కులు ఇవి

1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యాజమాన్యంలో ఉంచుకో వచ్చును. స్త్రీ భార్య, తల్లి, బిడ్డ మరియు చెల్లి, ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారంలో ఉండ వచ్చును.

2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు. భర్తతో జీవితం గడపడంలో నష్టం ఏర్పడినపుడు వివాహ బంధాన్ని తెంచుకొని, విడాకులు కోరే హక్కు. ఇది స్త్రీ యొక్క ప్రత్యేక హక్కు అనడంలో ఏ సందేహం లేదు.

3- విద్య: తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం తెలుసుకొనుట తనపై విధిగా ఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తన అవలంభించాలి, ఏలాంటి సంస్కారం, సభ్యత పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ హక్కు. అల్లాహ్ ఆదేశం:

[فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ …]. {محمد:19}

{అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైనవాడు ఎవడు లేడని బాగా తెలుసుకో}. (ముహమ్మద్ 47: 19). ప్రవక్త ఇలా చెప్పారుః

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ. {ابن ماجة }

విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యుంది“. (ఇబ్ను మాజ 224).

4- దానధర్మం: తన స్వంత ధనము నుంచి తను కోరుకున్నట్లు తనపైగాని, ఇతరులపై గానిః వారు తన భర్త అయినా, సంతానమ యినా, తండ్రి లేక తల్లి అయినా ఖర్చు చేయవచ్చును. హద్దుకు మించి, వ్యర్థమైన ఖర్చు చేయకూడదు. (చేసినచో, దాన్ని నిరోధించడం ఆమె బాధ్యుని విధి). ఖర్చు చేయడంలో పురుషునికి ఉన్నంత అధికారం స్త్రీలకూ ఉంది.

5- వాంగ్మూలం: తన స్వంత ధనం నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వాజ్మూలం) చేయ వచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించ వచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయం. పురుషులకున్న విధంగానే స్త్రీలకు కూడా ఆ హక్కుంది. ప్రతి ఒక్కరు అల్లాహ్ నుంచి సత్ఫలితం కోరుట చాలా ముఖ్యం. కాని ఈ వసియ్యత్ మొత్తం ఆస్తిలో మూడిట్లో ఒక వంతుకన్న ఎక్కువ ఉండకూడదు.

6- దుస్తులు ధరించడంలో తినిష్టానుసారం పట్టు బట్టలు, బంగారము ధరించవచ్చును. ఇవి రెండూ పురుషులపై నిషిద్ధము. కాని ధరించి కూడా నగ్నంగా ఉన్నట్లనిపించే దుస్తులు ధరించ కూడదు. అంటే శరీర సగభాగం లేక నాల్గవ భాగం మాత్రమే ధరించుట, లేక తలను, మెడను మరియు ఛాతిని కొంగుతో, పైటతో కప్పియుంచక పోవుట. ఈ స్థితిలో కేవలం తన భర్త ఎదుట మాత్రం ఉండవచ్చును.

7- భర్త కొరకు సింగారం చేయుట, సుర్మా, కాటిక పెట్టుకొనుట, ఇతర యోగ్యమైన వస్తువులతో సింగారించుకొనుట, భర్త ఇష్టపడే మంచి దుస్తులు ధరించుట యోగ్యమే. కాని అవిశ్వాస స్త్రీలు మరియు వేశ్యలు ధరించే డ్రెస్సులు ధరించక, సందేహాత్మక వస్త్రాల నుండి దూరముండుటయే మంచిది.

8- తినే త్రాగే విషయాల్లో తమకు నచ్చినది తినత్రాగ వచ్చును. పురుషులకు వేరు స్త్రీలకు వేరు అని ఏమీ లేదు. పురుషులకు యోగ్యమున్నదే స్త్రీలకు ఉంది. పురుషులకు నిషిద్ధమున్నదే స్త్రీలకు నిషిద్ధమున్నది. అల్లాహ్ (సూరె ఆరాఫ్ 7: 31)లో ఈ విధంగా బోధించాడుః

[…وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا إِنَّهُ لَا يُحِبُّ المُسْرِفِينَ].

{తినండి త్రాగండి, మితిమీరకండి. అల్లాహ్ మితి- మీరేవారిని ప్రేమించడు}. (సూర ఆరాఫ్ 7: 31).

భర్తపై భార్య హక్కులు

స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో ఆమె పట్ల ఆమె భర్తపై ఉన్న హక్కులు. ఇవి తన భర్త హక్కులు ఆమెపై ఉన్న విధంగనే ఉన్నవి. ఉదా: అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి చేయని భర్త ఆజ్ఞలు పాటించడం. అతనికి భోజనాలు వండి పెట్టడం. పడకను బాగుంచడం. సంతానాన్ని పోషించి, మంచి శిక్షణ ఇవ్వడం. అతని ధన, మానమును కాపాడడం. తన మానాన్ని కాపాడుతూ, యోగ్యమైన అలంకరణ వస్తువులను ఉపయోగించి అతని కొరకు సింగారించుకొనడం. ఇవి స్త్రీపై ఉన్న తన భర్త హక్కులు.

ఒక స్త్రీ పట్ల తన భర్తపై ఉన్న హక్కుల్లో అల్లాహ్ ఆదేశాను సారం సంక్షిప్తంగా కొన్ని హక్కులు క్రింద తెలుసుకుందాము.

[…وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالمَعْرُوفِ …].

{మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (బఖర 2: 228).

ప్రతి విశ్వాస స్త్రీ తన ఈ హక్కులను గుర్తెరిగి ఏలాంటి సిగ్గు పడకుండా, భయపడకుండా తన హక్కులను పొందాలని మేము ఇచ్చట పేర్కొన్నాము. భర్త ఆమెకి ఈ హక్కులను పూర్తిగా ఇవ్వడం అతనిపై విధిగా ఉంది. ఒక వేళ ఆమె స్వయంగా తన ఈ హక్కులను వదులుకుంటే పర్వాలేదు.

భర్తపై ఉన్న భార్య హక్కులు ఇవి:

1- కలిమిలోనైనా, లేమిలోనైనా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ వసతులు మొదలగునవి తను ఏర్పాటు చేయాలి.

2- ఆమె ధన, ప్రాణ, మానములను మరియు ఆమె ధర్మాన్ని కాపాడాలి. పురుషునికి స్త్రీపై అధికారమివ్వబడింది గనుకు అధికారి విధి ఏమనగా తనకు దేనిపై అధికారమివ్వబడిందో దాన్ని రక్షించటం, కనిపెట్టి ఉండటం.

3- ఆమె తప్పనిసరిగా పాటించవలసిన ధర్మాదేశాలు ఆమెకు నేర్పే బాధ్యత భర్తది. అతనిలో నేర్పే శక్తి లేకుంటే, స్త్రీల విద్య బోధన ప్రత్యేక సమావేశాల్లోః మస్జిదులో లేక బడిలో వెళ్ళి నేర్చుకొనుటకు అనుమతివ్వాలి. అచ్చట ఉపద్రవం లేకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఏలాంటి నష్టం కలిగే భయం ఉండకూడదు.

4- భార్యతో సద్వర్తనతో మెలగాలి.

అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:

وَعَاشِرُوْهُنَّ بِالمعْرُوْفِ
వారితో సద్భావంతో జీవితం గడపండి]. (నిసా 4: 19).

సద్వర్తనతో మెలిగుట, మంచి విధంగా సంసారం చేయుట అనగా భార్యతో కాపురం చేయుట ఒక హక్కు. దాన్ని పూర్తి చెయ్యాలి. ఆమెను దూషించి, తిట్టి బాధ కలిగించరాదు. ఏలాంటి నష్టం లేకుంటే ఆమె బంధువులతో కలుసుకోవడం నుండి ఆపరాదు. ఆమె మోయలేని భారాన్ని ఆమెకు అప్పగించరాదు. మాట మరియు తన ప్రవర్తన ద్వారా మంచిగా వ్యవహరించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహహి వసల్లం ఇలా చెప్పారు:

మీలో మంచివారు ఎవరయ్యా అంటే తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారే. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి“. (తిర్మిజి 3895).

ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]

బిస్మిల్లాహ్

[48:57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: మల మూత్ర విసర్జన పద్ధతులు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

మలమూత్ర విసర్జన:

మలమూత్ర విసర్జన పద్దతులు ఇలా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలి:

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి

بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ

(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).
(బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

గుఫ్రానక
غُفْرَانَكَ  
నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).

2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు. 

4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల

చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

ప్రశ్నలు & సమాధానాలు (Q&A) – మల మూత్ర విసర్జన పద్ధతులు

[29:11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన వీడియో పాఠాలు

అపానవాయువు (గ్యాస్, గాలి వెళ్లడం,పిత్తు) వెళ్లిందో లేదో అన్న డౌట్ (సందేహం) ఉంటే ఏమి చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[3:06 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో]

బిస్మిల్లాహ్

[51:22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: పరిశుభ్రత, అపరిశుభ్రత, నజాసత్‌ (అశుద్దత) రకాలు, నజాసత్‌ (అశుద్దత) ఆదేశాలు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

శుచి శుభ్రత ఆదేశాలు

పరిశుభ్రత మరియు అపరిశుభ్రత

‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.

ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.

పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.

అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.

‘నజాసత్’ రకాలు:

(1,2) మలమూత్రం.

(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.

(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.

*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.

(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.

పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.

(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.

‘నజాసత్’ ఆదేశాలు:

1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.

2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.

3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.

అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని కోరుతాడో అతనికి ధర్మ అవగాహన, ధర్మాన్ని అర్ధం చేసుకొనే భాగ్యం ప్రసాదిస్తాడు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

మరణాంతర జీవితం – పార్ట్ 10: ప్రళయదినం రోజు అవిశ్వాసులు మరియు వారి పూజించిన మిధ్యా దైవాల మధ్య జరిగే వాదన [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 10 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 10. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఆ మహా మైదానంలో ఒక వైపున ఆరాధ్యనీయులు, మరోవైపు ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఏ పుణ్యాత్ములనైతే ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో, అలాంటి వారికి ఏమి సమాధానం ఇస్తారు? వినండి “షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాహ్ తో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు అల్లాహ్ వైపునకు తిరిగి ఓ మా ప్రభువా! వీరు! వీరే, వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి, నిన్ను వదిలి వీరిని మేము ఆరాధిస్తూ ఉంటిమి. వీరితో మేము దుఆలు చేస్తూ ఉంటిమి, వీరిని మేము అర్థిస్తూ ఉంటిమి. అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి, మీరు అసత్యం పలుకుతున్నారు, మీరు అసత్యం పలుకుతున్నారు“. మరోచోట ఆయత్ ఉంది. “మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు“. ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది. వారు వీరిని తిరస్కరిస్తారు.

ఎవరైనా గాని, ఈ రోజుల్లో ఎందరో కలిమా చదివిన ముస్లిం సోదర సోదరీమణులు కూడా అల్లాహ్ ను కాకుండా ఎవరెవరితో దుఆ చేస్తున్నారు. ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాహ్ ను కాకుండా, ఎవరెవరితో ఆ ఆరాధన యొక్క కొన్ని భాగాలు, కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ ఉన్నారు. అయితే పరలోకమున మైదానే మెహ్ షర్ లో వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది? ఈ ఆయతులను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొందే ప్రయత్నం చేయాలి.

ఇంకా ఈ ఇహలోకంలో ఆరాధనా సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి, సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి, కొందరి నాయకులను, కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ప్రళయ దినాన, ఆ మహా మైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి, మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని ఇహలోకంలో పురికొల్పి, అల్లాహ్ ను వదిలి అల్లాహ్ పంపిన మార్గాన్ని వదిలి మీ వెనుక నడవాలి అని చెప్పారు. కానీ ఏమిటి? ఈ రోజు మాకు ఏమి సహాయం చేయడం లేదు.?

ఒకసారి మీరు సూర సాఫ్ఫాత్ ఆయత్ నెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు చదివి చూడండి. ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క వాగ్విదానాన్ని, ప్రశ్నోత్తరాలని, వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) తెలియజేసాడు. పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరి పోతుందో, దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఎవరు ఎవరినైతే పూజించడం జరిగిందో, ఎవరెవరి వెనుక నడవడం జరిగిందో, వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు. మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో, బలహీనులు, బలహీన వర్గాలు, ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారో, ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారో, ఏ ఏ ఆరాధించేవారు తమతమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వాళ్ళందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని యెడల శాపనార్థాలు కూడా మొదలుపెడతారు ఆ మైదానే మెహ్ షర్ లో, ఆ మహా మైదానంలో. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

ఒకసారి సూరయే ఇబ్రహీం ఆయత్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి. “వారందరూ అల్లాహ్ ఎదుట స్పష్టంగా హాజరవుతారు. బలహీనులు, బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్ళతో అంటారు. మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి. మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి. అయితే, ఈ రోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేఅటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా? అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా? ఆ నాయకులు, ఆ పెద్ద వారందరూ ఏమంటారు? అల్లాహ్ మాకు మార్గం చూపి ఉండేది ఉంటే, మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారిమి. అస్తగ్ ఫిరుల్లా! అబద్దం ఇది. అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు. ఇహలోకంలో అల్లాహ్ (తఆలా) సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా? ఇప్పుడు ఇక్కడ మనకు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా సమానమే“. అనుసరించే వాళ్లు, బలహీనులు, ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలు అయితే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఖురాన్ లో మీరు చూడండి.

సూరయే అహ్ జాబ్ ఆయత్ నెంబర్ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు – “ఆనాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ, తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో, అయ్యో! మేము అల్లాహ్ ను, అల్లాహ్ కు విధేయత చూపి, ప్రవక్తకు విధేయత చూపి ఉండేది ఉంటే ఎంత బాగుండును! వారంటారు – ఓ మా ప్రభువా! మేము మా నాయకులను, మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వం లో పడవేశారు. ఓ ప్రభువా! ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు. పెద్ద పెద్ద శాపనార్థాలు వారిపై కురిపించు. ఇలా శపిస్తూ ఉంటారు.

ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు, మా నాయకులు సత్యాన్ని స్వీకరించ వద్దు అంటున్నారు. ఈవిధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరమవుతాము. కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు. మనసుకు శాంతి ఏర్పడదు. ఆ సందర్భంలో అప్పుడు ఏమంటారు? మీరే స్వయంగా చదవండి, గమనించండి, శ్రద్ధగా వినండి.

సూరయే హామీమ్ వస్సజ్దా, ఫుస్సిలత్ అని కూడా దానిని అంటారు. ఆయత్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంది. “ఓ మా ప్రభువా! జిన్నాతులలో, మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు. మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము. వారు నీచులుగా అయిపోవాలి“. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

సోదరులారా! ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది. అవన్నీ వివరాలు అల్లాహ్ మనకు తెలియజేశాడు. ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా? మహాశయులారా! సోదర సోదరీమణులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత, ఆ మైదానంలో సమీకరింపబడిన తరువాత ఏ పరిస్థితులు దొరుకుతాయి? ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు? ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప దయ, కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలు అన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే, ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకు పోతామో మీరే ఆలోచించండి. ఈనాడు ఈ మాటలు, పనికిమాలినవి, ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ మనకు ఈ విషయాలు తెలిపాడు గనుక తప్పకుండా ఇది సంభవించనున్నాయి.

అల్లాహ్ ను కాకుండా, ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు. ఆ రోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు, భూమిని తన పిడికిలిలో పట్టుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ ఉన్నారు? ఇహలోకంలో గర్వం, అహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఎంత గొప్పది? నన్ను ఎదిరించే వారు ఎవరూలేరుగా భావించేవారు ఎక్కడున్నారు? ఎవరి వైపు నుండి ఏ యొక్క శబ్దం కూడా రాదు. ఎవరి నుండి ఏ మాట వినబడరాదు. అప్పుడు స్వయంగా అల్లాహ్ అంటాడు. “నేను మాత్రమే ఈరోజు రాజును. నాకే సర్వాధికారం ఉన్నది“.

సర్వ సృష్టిలో ప్రవక్తలు, అల్లాహ్ కు అతి ప్రియులైన వారు. ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిచిపోతుంది. ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు? అని వేచిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పదండి మనమందరం కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్దాము. ఆయన అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని వెళ్తే, ఆదమ్ (అలైహిస్సలాం), ఎవరినైతే అల్లాహ్ స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో, ఆ ఆదమ్ (అలైహిస్సలాం) కూడా చాలా బాధలో ఉంటారు. నాతో జరిగిన తప్పు, ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు. కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ సమయంలో నేను అల్లాహ్ యందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు కలిగి లేను. నేను చేయలేను. మీరు వెళ్ళండి, కావాలంటే ప్రవక్త నూహ్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి ఈ మహా మైదానం, అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము? ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మోసే, ప్రవక్త యేసు అలైహిముస్సలాం అజ్మయీన్ ఎవరు కూడా అల్లాహ్ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు. మరి ఈ రోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకం తో పాటు ఉన్న ఈ పేపర్ ని తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు. డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి. ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ విశ్వాసమే ఇహలోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది.

సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ ఇరవై తొమ్మిది, అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సాయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుడ్ని కలుస్తాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నేను నీకో హోదా, అంతస్తు ఇచ్చి పెళ్లి, పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఇహలోకంలో నీకు ప్రసాదించలేదా? గుర్రాలు, ఒంటెలు, ఎన్నో రకాల జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా? నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి, హోదా ఇవ్వలేదా? ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలని స్వీకరిస్తాడు. అవును అల్లాహ్! నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు. అప్పుడు అల్లాహ్ మరో ప్రశ్న అడుగుతాడు. ఈ రోజు నాతో కలిసే రోజు ఒక రోజు ఉంది అని నీవు నమ్మేవానివా? అప్పుడు అతను సమాధానం పలుకుతాడు – ఓ అల్లాహ్ లేదు. ఇహలోకంలో లభించిన ఈ హోదా, అంతస్తులు, ఇహలోకంలో లభించిన ఈ వరాలు, ఇవన్నిటినీ చూసుకొని మురిసిపోయి ఎక్కడ పరలోకం? ఎక్కడ అల్లాహ్ ను కలుసుకోవడం? ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం? ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా! మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురిఅయి ఉన్నాముకదా? లేదు అల్లాహ్ నీతో కలిసే ఒక రోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుఇహ లోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను. అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు. ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు, వరాలు కొందరు పుణ్యాత్ములకు, విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏభాగము లభించదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు. మూడో వ్యక్తితో కలుస్తాడు. నాలుగు వ్యక్తితో కలుస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇహలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు. నేను నిన్ను విశ్వసించాను. నీ ప్రవక్తను విశ్వసించాను. నువ్వు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను. నేను నమాజ్ చేశాను. ఉపవాసాలు ఉన్నాను. దానధర్మాలు కూడా చేశాను. సాధ్యమైనంతవరకు ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్ని అంతా చెప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు. మా యొక్క సాక్షిని మీ ముందుకు తీసుకు రావాలా? అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు. అప్పుడు. ఎవ్వరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని. అప్పుడు అతని మూతి మీద ముద్ర వేయబడుతుంది. ఆ తరువాత అతని తొడ మాట్లాడుతుంది, అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు, కపటవిశ్వాసుడు అని స్పష్టం అవుతుంది. కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు. ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో ఏమో అని”.

చెప్పే విషయం ఏమిటంటే, చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది. అల్లాహ్ ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతారు.

అల్లాహ్ (తఆలా) మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక! ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి? అక్కడ ఏమి జరగనుంది? ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాలలో మనం వింటూ ఉందాము. అల్లాహ్ (తఆలా) మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక. ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాసమార్గం మీద నడిచేటటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

జకాత్ హక్కుదారులు – జకాత్ ఎవరికి ఇవ్వవచ్చు? [వీడియో]

బిస్మిల్లాహ్

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది
జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో] [28:03 నిముషాలు]

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ – 9:60

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ”. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము కన్నా తక్కువ పొందేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందుతాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయడానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులైనప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలి:

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

జకాతు & సదఖా ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ – 1వ భాగం : సూరతుల్ కహఫ్ పరిచయం, ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

[28:48 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో]

బిస్మిల్లాహ్

[28:03 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్

నిల్వ మరియు తూకము చేయుగల ఖర్జూరం, ఎండిన ద్రాక్ష, గోధుమ, జొన్న, బియ్యం లాంటి ఆహారధాన్యాల, ఫలాలపై జకాత్ విధిగా ఉంది. కాని పండ్లు, కూరగాయలపై జకాత్ విధిగా లేదు. పై వాటిలో జకాత్ విధి కావడానికి అవి నిసాబ్ కు చేరి ఉండాలి. వాటి నిసాబ్ 612 కిలోలు. వాటిపై ఒక సంవత్సరం గడవాలన్న నిబంధన లేదు. కోతకు వచ్చినప్పుడు వాటిలో నుండి ఈ క్రింది పద్ధతిలో జకాత్ చెల్లించాలిః

ప్రకృతి పరమైన వర్షాలు, నదుల మూలంగా పండిన పంటల్లో పదవ వంతు జకాత్ చెల్లించాలి. కృత్రిమ కాలువలు, బావుల మూలంగా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు జకాత్ చెల్లించాలి.

ఉదాః ఒక వ్యక్తి తన భూమిలో గోధుమ విత్తనం వేశాడు. అతనికి 800 కిలోల పంట పండింది. ఇప్పుడు అతనిపై జకాత్ విధిగా ఉంది. ఎందుకనగా దీని నిసాబ్ 612 కిలోలు, అయితే దీనికంటే ఎక్కువగా పండింది. ఇక ఆ పంట వర్షంతో పండితే అందులో పదో వంతు అంటే 80 కిలోల జకాత్ చెల్లించాలి. ఒకవేళ కృత్రిమ కాలువల, బావుల ఆధారంగా పండితే అందులో ఇరవయ్యో వంతు అంటే 40 కిలోలు జకాత్ చెల్లించాలి.

పశువుల జకాత్

ఇక్కడ పశువులు అంటేః ఆవు, మేక, గొర్రె మరియు ఒంటె లని భావం. వీటి జకాతు కొరకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయిః

1- నిసాబ్ కు చేరి ఉండాలి. ఒంటెల నిసాబ్ 5. మేకలు, గొర్రెల నిసాబ్ 40. ఆవుల నిసాబ్ 30. వీటికి తక్కువ ఉన్నవాటిలో జకాత్ లేదు.

2- వాటి యజమాని వద్ద అవి సంవత్సరమెల్లా ఉండాలి.

3- అవి ‘సాయిమా’ అయి ఉండాలి. అంటే సంవత్సరంలో అధిక శాతం పచ్చిక మైదానాల్లో మేసేవి అయి ఉండాలి. శాలలో ఒక చోట ఉండి తమ ఆహారం తినునవి, లేదా వాటి యజమాని వాటి కొరకు మేత ఖరీదు చేసి, లేదా స్టోర్ చేసి ఉంచేవాడైతే వాటిలో జకాత్ లేదు.

4- పరివహణ సాధనంగా, లేదా వ్యవసాయ పరంగా పని చేయునవై ఉండకూడదు.

ఒంటెల జకాత్

ఒంటెల జకాత్ యొక్క నిసాబ్ 5 ఒంటెలు. ఏ ముస్లం వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అవి అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తయిందో అతను ఈ విధంగా జకాత్ చెల్లించాలి.

  •  5 నుండి 9 వరకుంటే 1 మేక.
  • 10 నుండి 14 వరకుంటే రెండు మేకలు.
  • 15 నుండి 19 వరకుంటే మూడు మేకలు.
  • 20 నుండి 24 వరకుంటే నాలుగు మేకలు.
  • 25 నుండి 35 వరకుంటే ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటె. అది గనక లేకుంటే రెండేళ్ళ మగ ఒంటె.
  • 36 నుండి 45 వరకుంటే రెండేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 46 నుండి 60 వరకుంటే మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 61 నుండి 75 వరకుంటే నాలుగేళ్ళ ఒక ఒంటె.
  • 76 నుండి 90 వరకుంటే రెండేళ్ళ రెండు ఒంటెలు.
  • 91 నుండి 120 వరకుంటే మూడెళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 120 ఒంటెలకు మించిపోతే ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటె. ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.

వీటికంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 40లో రెండేళ్ళ ఒక ఆడ ఒంటె, ప్రతి 50లో మూడేళ్ళ ఒక ఆడ ఒంటె జకాత్ గా ఇవ్వాలి.

ఆవుల జకాత్

 ఆవులు, ఎద్దులు అన్నిటి లెక్క ఒకటే. 1 నుండి 29 వరకుంటే జకాత్ లేదు

  • ఏ వ్యక్తి ఆధీనంలో 30 నుండి 39 వరకున్నాయో (వాటిపై సంవత్సరం గడిసిందో) అందులో ఏడాది వయస్సుగల ఒక ఆడ లేదా మగ దూడ జకాత్ గా ఇవ్వాలి.
  • 40 నుండి 59 వరకుంటే రెండేళ్ళ దూడ.
  • 60 నుండి 69 వరకుంటే ఏడాది వయస్సు గల రెండు దూడలు.
  • 70 నుండి 79 వరకుంటే ఏడాది వయసుగల 1 దూడ, రెండేళ్ళ వయస్సుగల మరొక దూడ.

ఆ తరువాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 30లో ఏడాది వయస్సుగల ఒక దూడ, ప్రతి 40లో రెండేళ్ళ వయస్సుగల ఒక దూడ జకాత్ గా ఇవ్వాలి.

మేకల జకాత్

(మేకలు, గొర్రెలు, పొట్టేలు అన్నిటి నిసాబ్ ఒకటే. అవి 1 నుండి 39  వరకుంటే జకాత్ విధిగా లేదు). ఏ వ్యక్తి  ఆధీనంలో 40 నుండి 120 వరకు మేకలున్నాయో అతను అందులో నుండి ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

  • 121 నుండి 200 వరకుంటే రెండు మేకలు.
  • 201 నుండి 399 వరకుంటే మూడు మేకలు.
  • 400 నుండి 499 వరకుంటే నాలుగు మేకలు.
  • 500 నుండి 599 వరకుంటే ఐదు మేకలు.
  • ఆ తర్వాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 100లో ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము- కన్నా తక్కువ పొందేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందు- తాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయ డానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులై- నప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలిః

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

నోట్స్:

1-  సముద్రం నుండి లభించే ముత్యాలు, పగడాలు మరియు చేపల్లో జకాత్ లేదు. వాణిజ్యసరుకుగా ఉన్నప్పుడు పైన తెలిపిన ప్రకారంగా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

2- అద్దెకివ్వబడిన బిల్డింగులు, ఫ్యాక్టరీల పై జకాత్ లేదు. కాని వాటి నుండి పొందుతున్న పైకం నిసాబ్ కు చేరుకొని, సంవత్సరం గడిస్తే అందులో జకాత్ విధిగా ఉంది.


జకాత్ ఆదేశాలు – 1: వెండి, బంగారం, డబ్బు, వ్యాపార సామాగ్రి మరియు షేర్స్ యొక్క జకాతు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:09 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)

ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.

2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.

3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.

4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.

5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.

బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.