యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

జాదు (చేతబడి) [వీడియో & టెక్స్ట్]

జాదు (చేతబడి) 
https://youtu.be/Jq8qXPHgDLc [ 11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో చేతబడి (సిహ్ర్) యొక్క స్థానం, దాని ప్రభావం మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాల గురించి చర్చించబడింది. ధర్మ పండితులు చేతబడిని ‘అఖీదా’ (విశ్వాసం) కు సంబంధించిన విషయంగా మరియు ‘షిర్క్’ (బహుదైవారాధన) గా పరిగణించారని వక్త స్పష్టం చేశారు. చేతబడి చేయడం, చేయించడం, నేర్చుకోవడం మరియు నేర్పించడం వంటివన్నీ ఘోరమైన పాపాలు మరియు హరామ్ (నిషిద్ధం) అని ఉద్ఘాటించారు. చేతబడి ప్రభావం వాస్తవమే అయినప్పటికీ, అది అల్లాహ్ అనుమతితో మాత్రమే సంభవిస్తుందని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. చేతబడి ప్రభావాన్ని తిరస్కరించే వారి వాదనలను ఖండిస్తూ, దాని నివారణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అల్-బఖరా పారాయణం, ఉదయం-సాయంత్రం దువాలు (అజ్కార్) వంటి మార్గాలను సూచించారని తెలిపారు. చేతబడి ద్వారా సంపాదించిన ధనం నిషిద్ధమని మరియు ఇస్లామీయ రాజ్యంలో చేతబడి చేసేవారికి మరణశిక్ష విధించబడుతుందని కూడా పేర్కొన్నారు.

చేతబడి గురించి ఇక్కడ మనకు సంక్షిప్తంగా కొన్ని విషయాలు వస్తాయి. అల్లాహ్ యొక్క దయతో ఈరోజు దీన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చేతబడిని ధర్మ పండితులు అఖీదా (విశ్వాసం) విషయాలలో చేర్చారు. మరియు చేతబడి చేయడం అన్నది షిర్క్ లో వస్తుంది అని కూడా స్పష్టపరిచారు. అందుకొరకు మీరు చూడగలుగుతారు, అఖీదాకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకాలు ఏవైతే వ్రాయబడ్డాయో, వాటిలో చేతబడి (సిహ్ర్) ను ప్రస్తావించడం జరిగింది.

అయితే సోదర మహాశయులారా, చేతబడి చేయుట, చేయించుట, నేర్పుట మరియు నేర్చుకొనుట, ఇవన్నీ కూడా హరాంలో వస్తాయి. మరియు ఇవన్నీ కూడా అవిశ్వాసంలో లెక్కించబడతాయి. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసులో తెలిపారు, బుఖారీ మరియు ముస్లింలో, వినాశనానికి గురిచేసే విషయాలలో ఒకటి ఇది అని కూడా తెలిపారు.

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
[ఇజ్తనిబుస్ సబ్ అల్ మూబిఖాత్]
(ఏడు) వినాశకరమైన పాపాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మరియు చేతబడి అన్నది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. ఇక్కడ నష్టం అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఇది నేర్చుకోవడం గాని, నేర్పటం గాని, చేయడం గాని, చేయించడం గాని, ఈ విషయంలో ప్రత్యేకంగా.

అలాగే సోదర మహాశయులారా, ఒకవేళ ఖురాన్ ఆయతులు మనం గమనించామంటే, అక్కడ ఇది ఇహలోకంలో ఒక ఆజ్మాయిష్, ఒక పరీక్ష మాదిరిగా ఉంది. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 102 ఏదైతే కొంచెం సుమారు ఒక 15 పేజీల ఖురాన్ లలో సుమారు సగం పేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈ పూర్తి ఆయత్. అందులో

إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ
[ఇన్నమా నహ్ను ఫిత్నతున్ ఫలా తక్ ఫుర్]
నిశ్చయంగా, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, కనుక మీరు అవిశ్వాసానికి పాల్పడకండి.

సోదర మహాశయులారా, చేతబడి చేయడం, చేయించడం, నేర్పడం, నేర్పించడం, దీని గురించి ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

చేతబడి గురించి ఈ రోజుల్లో కొందరు దాని యొక్క ప్రభావమే లేదు ఏమాత్రం అని నిరాకరిస్తున్నారు. కానీ ఈ మాట కూడా నిజమైనది కాదు. దాని ప్రభావం ఉంది. కానీ అది అల్లాహ్ తలచినప్పుడే జరుగుతుంది. దానివల్ల నష్టం జరగవచ్చు, ఎవరిపై చేతబడి చేయబడుతుందో వారిపై. కానీ అది ఎప్పుడు? అల్లాహ్ యొక్క అనుమతి తో.

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ
[వమా హుమ్ బి దార్రీన బిహీ మిన్ అహదిన్ ఇల్లా బి ఇజ్ నిల్లాహ్]
అల్లాహ్ అనుమతి లేకుండా వారు దాని ద్వారా ఎవరికీ ఎలాంటి హాని చేయలేరు.

ఇప్పుడు ధూమపానం, బీడీ సిగరెట్లు తాగడం, మత్తు పానీయాలు సేవించడం, ఇవి హరామ్ ఉన్నాయి. వీటి యొక్క నష్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ సారాయి త్రాగేవారు, బీడీ సిగరెట్లకు అలవాటు పడినవారు ఎంతోమంది ఇప్పటికీ ఏమంటున్నారు? అరె ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుండి తాగుతున్నా. ఇప్పటికీ నేను 40 సంవత్సరాల నుండి తాగుతున్నా. ఏదో అడ్వర్టైజ్ లు, ఏదేదో పేపర్లు, ఏదేదో పిక్చర్లు, వీడియోలు చూపిస్తారు. అది లంగ్స్ పాడైపోతాయని, ఆ కిడ్నీలు పాడైపోతాయని, ఇంతవరకు నాకేమీ కాలేదు. ఇప్పటివరకు నేను మంచిగానే ఉన్నాను. అయితే ఇక్కడ వాటి ప్రభావం లేదు, వాటి నష్టం లేదు అని భావమా?

సోదర మహాశయులారా, అల్లాహు త’ఆలా స్వయంగా ఆ చేతబడి యొక్క నష్టాల గురించి ప్రస్తావించాడు. ఎవరికైనా ఆ నష్టం జరిగితే దాని నుండి ఎలా కోలుకోవాలి, ఎలా చికిత్స పొందాలి, ఆ మార్గం కూడా చూపాడు, దువాల ద్వారా. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నేర్పారు. ఇవన్నీ కూడా మనకు ఖురాన్ మరియు సహీ హదీసుల ద్వారా మరియు సహాబాలు, సలఫుస్ సాలిహీన్ రహిమహుముల్లాహ్ ద్వారా మనకు కనబడుతున్నాయి, గ్రంథాలలో రాసి ఉన్నాయి. అందుకొరకే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది ధర్మవేత్తలు, చేతబడికి సంబంధించిన హదీసులు ఏవైతే వచ్చాయో అవి తవాతుర్ కు చేరినవి. తవాతుర్, ఇది హదీస్ పరిభాషలో, ఇస్తిలాహాతె హదీస్ లో ఒక పదం. దాని భావం సంక్షిప్తంగా ఏంటి? ఏ హదీసులైతే ఎన్ని పరంపరాల ద్వారా, ఎన్ని ఉల్లేఖనాల ద్వారా వస్తాయో, వాటిని తిరస్కరించడం, వాటిలో అబద్ధం అని చెప్పడం అసాధ్యం. ఆ సంఖ్యకు చేరినటువంటి హదీసులను తవాతుర్ అని అంటారు.

మరియు దీని గురించి ఎందరో ధర్మవేత్తలు ఇజ్మా, అందరూ ఏకీభవించిన విషయం. సహాబాల కాలంలో, తాబియీన్ల కాలంలో, తబె తాబియీన్ల కాలంలో, ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాల వరకు ఏకీభవించిన దీనిని తిరస్కరిస్తూ ఈ రోజుల్లో కొందరి మాటలు మనం ఎలాగైతే వింటున్నామో, చేతబడి యొక్క ఏదీ లేదు అని. మరికొందరైతే మూర్ఖత్వంలో ఒక హద్దును మించి నాపై చేసి చూపించండి. ఒకరు నన్ను అడిగారు కూడా, షేఖ్ మరి వానిపై మనం ఒకసారి చేద్దామా? నేను అన్నాను, షరియత్ ధర్మం మనకు అనుమతి ఇవ్వదు. ఒక మూర్ఖుడు ఇలా వాదులాడుతుంటే అతని మూర్ఖత్వంలో మనం పడే అవసరం లేదు. మనం అలాంటి పాపంలో ఎందుకు పడాలి? ఎందుకంటే చేతబడి చేయడం, చేయించడం, నేర్పడం, నేర్చుకోవడం ఇవన్నీ కూడా హరామ్. ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలలో వస్తాయి.

చేతబడి ఉంది, దాని ప్రభావం ఉంది, అల్లాహ్ తలచినప్పుడు దాని యొక్క నష్టం జరుగుతుంది. మరియు దాని నుండి మనం రక్షింపబడటానికే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎన్నో మార్గాలు కూడా చూపారు. ఖర్జూర్ (అజ్వా) విషయంలో కూడా తెలిపారు. హబ్బతుస్ సౌదా (కలోంజి నల్ల జీలకర్ర విషయంలో) విషయంలో కూడా తెలిపారు. ఇంకా సూరా సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఇలాంటి ఆయతులు.

అయితే సోదర మహాశయులారా, అందుకొరకే నేను అంటాను, ఖురాన్ హదీసులను మనం సహాబాలు అర్థం చేసుకున్న విధంగా చేసుకోవాలి, అప్పుడే మనం నిజమైన ఇస్లాంపై స్థిరంగా ఉండగలుగుతాము.

ఇక ఎవరైనా మాంత్రికులు, చేతబడి చేసేవారు, ఏదైతే తమ చేతబడి ద్వారా సంపాదిస్తారో ధనం, అదంతా కూడా వారి కొరకు నిషిద్ధం. ఇది వారి కొరకు ఏమాత్రం హలాల్ కాదు. వారు త్వరగా తౌబా చేసుకొని మానుకోవాలి. లేదా అంటే చాలా ఘోర పాపంలో పడిపోతారు.

అందుకొరకే హజరత్ హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైన విషయం, ఏ మాంత్రికుని గురించి అయితే తెలుస్తుందో అతడు చేతబడి చేస్తున్నాడు, చేతబడి చేసేవాడు అని, అతడిని పిలిచి ఇస్లామీయ ప్రభుత్వంలో, ముస్లిం యజమాని, ముస్లిం హాకిమ్ పరిపాలకుని వద్ద తౌబా చేయించాలి. ఆ పనిని వదులుకోవాలి అని చెప్పాలి. ఒకవేళ అతడు వదులుకోకుంటే, తౌబా చేయకుంటే అతడిని హత్య చేసేయాలి. హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా స్వయంగా హత్య చేసిన సంఘటన హదీసుల్లో మనకు ఉంది.

ఇక్కడ మన ఇండియా లాంటి ప్రాంతంలో అలాంటి వారికి చట్టపరంగా వారి పట్ల తగిన చర్య తీసుకోవడం జరగాలి. అయితే ఇక్కడ రెండు విషయాల ప్రస్తావన మనకు వచ్చింది. ఒకటి, చేతబడి గురించి ఈ రోజుల్లో ఎవరైతే తిరస్కరిస్తున్నారో ప్రభావం లేదు అంటున్నారో, వారి గురించి కూడా మనం మాట్లాడాము. కానీ చేతబడి నేర్చుకోవడం, నేర్పడం, మరి చేయించడం, చేయడం, అలాంటి వారి వద్దకు వెళ్లడం ద్వారా మన యొక్క పుణ్యాలు కూడా నశించిపోతాయి అన్న విషయం తెలుసుకోవాలి. తర్వాత సామాన్యంగా ఈ రోజుల్లో పగలు తీర్చుకుంటూ ఒకరిపై ఒకరు ఏదైతే భూమి విషయంలో గాని, పొలాల విషయంలో గాని, లేదా ఇంకా వేరే పరస్పరం సంబంధాలలో ఏవైతే వ్యతిరేకతలు వస్తాయో వాటి కారణంగా ఎదుటి వారికి నష్టం చేకూర్చే ఉద్దేశంతో చేతబడి చేయించి వారికి నష్టం చేయించాలి అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటి సందర్భంలో ఎవరైతే సూరె బఖరా యొక్క పాబందీగా తిలావత్ (పారాయణం) చేస్తూ ఉంటారో, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

وَلَا تَسْتَطِيعُهَا الْبَطَلَةُ
[వలా తస్తతీవుహల్ బతలహ్]
మాంత్రికులు దానిని (సూరహ్ అల్-బఖరాను) ఎదుర్కోలేరు.

బతలహ్ (మాంత్రికులు) ఈ సూరాను ఎదుర్కొనేటువంటి శక్తి ఏమాత్రం కలిగి ఉండరు. మరియు అజ్కార్, ఉదయం సాయంకాలం, నమాజుల తర్వాత, పడుకునే ముందు, ఇంట్లో వస్తూ పోతూ వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా పాటించేది ఉంటే, అలాంటి వారిపై కూడా చేతబడి ప్రభావం అల్లాహ్ యొక్క దయతో కలగదు.

అయితే సోదర మహాశయులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయవల్ల చేతబడి వరకు మూడు అంశాలు ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంకా మిగతా విషయాలు అల్లాహ్ యొక్క దయతో తర్వాత పాఠాల్లో వస్తాయి.

అల్లాహు త’ఆలా మనందరికీ అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక. ముహర్రమాత్, నిషిద్ధతలు ఏమిటో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకొని వాటికి దూరం ఉండే సౌభాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా వ బారకల్లాహు ఫీకుమ్ వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా?
https://www.youtube.com/watch?v=XY5Wq4ZiYU8 [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ చేయాలా?

అవునండి. స్త్రీలు కూడా ఈ నమాజ్ చేయాలి. దీనికి సంబంధించి దలీల్ ఉందా? అవును, బుఖారీ, ముస్లింలో ఉంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 184. అలాగే సహీ ముస్లిం హదీస్ నెంబర్ 905. అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు.

أَتَيْتُ عَائِشَةَ زَوْجَ النَّبِيِّ صلى الله عليه وسلم
(అతైతు ఆయిషత జౌజిన్ నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం)
[నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయిన ఆయిషా వద్దకు వచ్చాను]

حِينَ خَسَفَتِ الشَّمْسُ
(హీన ఖసఫతిష్ షమ్స్)
[సూర్య గ్రహణం పట్టినప్పుడు].

సూర్య గ్రహణం సందర్భంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వద్దకు వచ్చాను.

فَإِذَا النَّاسُ قِيَامٌ يُصَلُّونَ
(ఫ ఇదన్ నాస్ కియామున్ యుసల్లూన్)
[అక్కడ ప్రజలు నిలబడి నమాజ్ చేస్తూ ఉన్నారు].

ప్రజలను చూశాను మస్జిద్ లో, వారు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు.

وَإِذَا هِيَ قَائِمَةٌ تُصَلِّي
(వ ఇదా హియ ఖాయిమతున్ తుసల్లీ)
[ఆమె కూడా నిలబడి నమాజ్ చేస్తూ ఉంది].

అప్పుడు నేను ఆయిషాను చూశాను, ఆమె కూడా ఆ జమాత్ లో పాల్గొని, మగోళ్ళ వెనకా, మగవారి వెనక నమాజులో నిలబడి ఉంది.

فَقُلْتُ مَا لِلنَّاسِ
(ఫకుల్తు మాలిన్ నాస్)
[అప్పుడు నేను అడిగాను, ప్రజలకు ఏమైంది?].

ఏంటి ఇది? ఇది ఏ నమాజ్ సమయం? ఇప్పుడు ఎందుకు నమాజ్ చేస్తున్నారు ప్రజలు? ఏంటి విషయం? అయితే నమాజులో ఉన్నారు గనక ఆయిషా రదియల్లాహు తాలా అన్హా,

فَأَشَارَتْ بِيَدِهَا نَحْوَ السَّمَاءِ
(ఫ అషారత్ బియదిహా నహ్వస్ సమా)
[ఆమె తన చేతితో ఆకాశం వైపునకు సైగ చేసింది].

ఆకాశం వైపునకు వేలు చూపించింది. అప్పుడు, سُبْحَانَ اللَّهِ (సుబ్హానల్లాహ్) [అల్లాహ్ పవిత్రుడు]. అప్పుడు ఆమెకు అర్థమైంది. సూర్య గ్రహణం యొక్క నమాజ్ చేయడం జరుగుతుంది అని.

ఇది, ఈ హదీస్ ద్వారా దలీల్ ఏంటి? అర్థమైంది కదా? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కూడా జమాత్ తో ఈ నమాజ్ చేస్తూ ఉన్నది. అందుకొరకు, స్త్రీలు జమాత్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటే, మస్జిద్ లో వారికొరకు ప్రత్యేకమైన సురక్షితమైన, శాంతివంతమైన, అన్ని ఫితనాల నుండి రక్షణ అటువంటి స్థలం కేటాయించబడి ఉండేది ఉంటే, అక్కడికి వచ్చి జమాత్ తో చేసుకోవాలి. లేదా అంటే, వారు ఒంటరిగా చేసుకోవచ్చు. తమ తమ ఇండ్లల్లో.

ఈ విషయంలో కూడా హనఫియా, మాలికీయా, షాఫియా, హంబలియా ప్రతీ ఒక్కరి ఏకాభిప్రాయం ఉన్నది. ఈ విధంగా సోదర మహాశయులారా, సలాతుల్ కుసూఫ్, సలాతుల్ ఖుసూఫ్, సూర్య గ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని, వీటి యొక్క నమాజ్ విషయం మనకు తెలిసింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0wjHmWPFU4R2_gIgP3F5vP

స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? [వీడియో]

స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది?
https://youtu.be/CUe9Npet1FQ [68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

78. తఫ్సీర్ సూరా నబా (Tafsir Surah Naba) [వీడియోలు]

తఫ్సీరె సూర నబా (Tafsir Surah Naba) [వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0bQpVcUnGot1P7G5t8KIv8

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

[78] సూరా అన్ నబా

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 40 ఆయతులు ఉన్నాయి. ప్రళయాన్ని, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని, తీర్పుదినాన్ని, శిక్షా బహుమానాలను ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరాలోని రెండవ ఆయతులో ప్రస్తావించబడిన ‘అన్ నబా’ (గొప్పవార్త) అన్న పేరునే దీనికి పెట్టడం జరిగింది.

అవిశ్వాసులు ముఖ్యంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్న విషయమై ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో వాదించేవారు. వారు మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని తిరస్కరించేవారు, ఎగతాళి చేసేవారు. ఈ సూరా అవిశ్వాసులకు వారు వినడానికి ఇష్టపడని గొప్పవార్తను తెలియజేసింది. ఆ వార్త… మనిషి చేసిన పనులకు బాధ్యత వహించవలసి ఉంటుంది, జవాబు చెప్పుకోవలసి ఉంటుందన్న వార్త. తీర్పుదినం తప్పనిసరిగా వస్తుందని ఈ సూరా నొక్కి చెప్పింది.

సత్యతిరస్కారుల వాదనను తిప్పికొట్టడానికి ఈ సూరాలో అల్లాహ్ శక్తిసామర్ధ్యాలను, ప్రకృతిలో కనిపించే దృష్టాంతాలను వివరించింది. అల్లాహ్ భూమిని పరచి మనిషికి నివాసయోగ్యంగా చేసాడు. భూమి తొణకకుండా దానిపై పర్వతాలను నిలబెట్టాడు. ఆయన మనలను జంటలుగా సృష్టించాడు. నిద్రను విశ్రాంతికోసం సృష్టించాడు. ఆయన మనపై ఏడు ఆకాశాలను నిలబెట్టాడు. ఆకాశంలో దీపంగా సూర్యుడిని ఉంచాడు. మేఘాల నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తీర్పుదినం స్వచ్ఛమైన సత్యం. మంచిచెడులను వేరు చేసే రోజు. ప్రతి ఒక్కరు తప్పక చవిచూడవలసిన రోజు. ఈ విషయాలు తెలుపుతూ నరకాగ్నిని వర్ణించడం కూడా జరిగింది. సత్యాన్ని తిరస్కరించిన వారికి, తీర్పుదినాన్ని కాదన్న వారికి నరకాగ్ని ఒక మాటు వంటిదని చెప్పడం జరిగింది. నరకంలో వారికి నల్లని, జుగుప్సాకరమైన, సలసలకాగే ద్రవంఇవ్వబడుతుంది. అక్కడ చల్లని నీడ కాని, చల్లని పానీయం కాని దొరకదు. మరోవైపు స్వర్గవనాలను వర్ణిస్తూ మనోహరమైన ఉద్యానవనంగా పేర్కొనడం జరిగింది. అక్కడివారికి సమవయస్కులైన కన్యలు, ప్రశాంతత లభిస్తాయి.

రమజాన్ లాంటి పుణ్యాలు ఇలా పొందండి [వీడియో]

రమజాన్ లాంటి పుణ్యాలు ఇలా పొందండి
https://youtu.be/S6b4zMRkBYY [37 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రమదాన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/


మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/IhemGw8DCWI4sULYTvST1y

మా టెలిగ్రామ్ గ్రూప్: https://t.me/teluguislam


107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/eeOM0ICPkPo [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

(1) తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు.

(2) కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచి పనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://youtu.be/f3JxMD2bySA [33 నిముషాలు]
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

మదయన్ ప్రాంత వాసులు అరబ్బులు. వారు మఆన్ రాజ్యంలో నివసించే వారు. నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది. వారు అత్యాశ పరులైన ప్రజలు. వారికి అల్లాహ్ ఉనికి పట్లఎలాంటి నమ్మకం ఉండేది కాదు. అన్ని విధాల చెడులతో నిండిన జీవితాన్ని వారు గడిపేవారు. తూనికలు కొలతలో మోసాలు చేసేవారు. తాము అమ్మే వస్తువులలోని లోపాలు దాచి చాలా గొప్ప వస్తువులుగా పొగిడే వారు. వినియోగదారులకు అబద్దాలు చెప్పి మోసగించే వారు.

వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం).ఆయనకు అల్లాహ్ కొన్ని మహత్తులు కూడా ఇచ్చి పంపాడు. షుఐబ్ (అలైహిస్సలాం) వారికి హితబోధ చేయడం ప్రారంభించారు. అల్లాహ్ అనుగ్రహాలను ఎల్లప్పుడుగుర్తుంచుకోవాలని, దుర్మార్గానికి పాల్పడితే తీవ్రమైన ఫలితాలు చవి చూడవలసి వస్తుందని వారికి బోధించారు. కాని వారు ఆయన్ను ఎగతాళి చేశారు. అపహసించారు. షుఐబ్ (అలైహిస్సలాం) సహనంగా, తనకు వారితో ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేస్తూ, తాను చేస్తున్నది తన స్వంత ప్రయోజనంకో సం కాదని వారికి నచ్చజెప్పడానికిప్రయత్నించారు.

వారు ఆగ్రహించి షుఐబ్ (అలైహిస్సలాం),ఆయన అనుచరుల వస్తు సంపద మొత్తం లాక్కున్నారు. వారిని పట్టణం నుంచి బయటకు తరిమి వేశారు. ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) దేవుని సహాయం కోసం ప్రార్థించారు. ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. అల్లాహ్ ఆ పట్టణం పైకి బొబ్బలెక్కించే వేడిని పంపాడు. ఈ వేడికి వారు అల్లాడి పోయారు. ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి హమ్మయ్య ఇక చల్లగా వర్షం పడుతుందని భావించారు.కాని ఆ మేఘం తీవ్ర గర్జనలతో పిడుగులు కురిపించింది. పైనుంచి గుండెలవిసే ఉరుములు వినబడ్డాయి. వాటి శబ్దానికి వారి కాళ్ళ క్రింది భూమి కంపించింది. భయభీతులతో దుర్మార్గులు నాశనమయ్యారు. దుర్మార్గుల అంతాన్ని దూరంగా నిలబడి షుఐబ్ (అలైహిస్సలాం) చూశారు.

ఓ ప్రజలారా! ప్రభువు సందేశాన్ని నేను మీకు చేరవేశాను. మీకు మంచిసలహాలు ఇచ్చాను. సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలాసానుభూతి చూపగలను” అన్నారు.

(ఇంకా చదవండి దివ్యఖుర్ఆన్: 7:85-93, 11:84-95, 26-176-191, 29:36-37)

(1) సంస్కరణ కర్త ఎల్లప్పుడు ప్రజలకు నచ్చజెబుతూ ఉండాలి. హోదా, పదవి, సంపద వగైరాలు పొందాలన్న ఉద్దేశ్యాలు అతనిలో ఉండరాదు.కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పనిచేయాలి.

(2) తూనికలు కొలతల్లో ప్రజలు మోసాలు చేయకుండా వారిని మార్చడానికి షుఐబ్ (అలైహిస్సలాం) చాలా ప్రయత్నించారు. వస్తువులను వాటి వాస్తవ పరిస్థితికి మించి పొగడడాన్ని ఇస్లామ్ అంగీకరించదు. వాటిలో లోపాలను స్పష్టంగా తెలియ జేయాలని ఆదేశిస్తుంది. నిజాయితీ అన్నది ఇస్లామ్ లో ఒక విధానం మాత్రమే కాదు, అన్ని వ్యవహారాల్లోనూ ఇదే ముఖ్యమైన సూత్రం.

(3) అవినీతికరమైన వ్యవహారాల్లో అల్లాహ్ తన అనుగ్రహాన్ని చూపడు.నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తాడు. అల్లాహ్ యొక్క శిక్ష విభిన్న విధాలుగా ఉంటుంది.

ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]

లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర
https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.

ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.