“నేనా? కువైట్లో ఉండేందుకు వెళ్లాలా? అస్సలు ఆ ప్రశక్తే లేదు!” – ఆన్ రోనైన్ (Ann Ronayne) ఇస్లాం స్వీకరించిన కథ

ఆమె తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం

ఇస్లాం ధర్మం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మమని తరచుగా వార్తలలో వస్తూ ఉంటుంది. ఇస్లాం స్వీకరించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక ప్రత్యేకమైన గాథ మరియు ప్రత్యేక కారణాలు ఉంటాయి. ఇస్లాంలో స్త్రీల గురించిన అపోహలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మమనీ మరియు ఉత్తమ జీవన విధానమనీ విశ్వసించే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్ రోనైన్ (Ann Ronayne) కథ క్రింద పేర్కొనబడింది.

“నేనా? కువైట్లో ఉండేందుకు వెళ్లాలా? అస్సలు ఆ ప్రశక్తే లేదు!” నా మేనేజర్ నన్ను కువైట్లో ఉద్యోగం చేయమని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పుడు నా స్పందన అది. కానీ నా విధివ్రాతలో మరో విధంగా ఉంది, {… మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం: (ఖుర్ఆన్ 33: 38)

నేను వాషింగ్టన్, D.C. నగర పరిసర ప్రాంతాలలో ఒక కాథలిక్ కుటుంబంలో పుట్టి పెరిగాను మరియు క్యాథలిక్ పాఠశాలలకు హాజరయ్యాను. 1960వ దశకంలో, మరింత ఆధునికంగా ఉండాలనే ప్రయత్నంలో కాథలిక్ చర్చి తన బోధనలలో పెద్ద మార్పులు చేసింది; ఇది సానుకూల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మరియు ప్రతికూల అంశాలను విడిచి పెట్టడానికి ప్రయత్నించింది: ఉదారహణకు శిక్షలు, నిబంధనలు, నిర్దిష్ట సమయాల్లో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మొదలైనవి. (అదలా ఉన్నప్పటికీ, ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లోని కాథలిక్కులు ఉనికిలో ఉన్న గర్భనిరోధకాలపై నిషేధం వంటి అనేక నియమాలను విస్మరించింది.) లాటిన్లో ఎప్పుడూ చెప్పబడే ‘ప్రార్థనకు’కు బదులుగా ఇప్పుడు ఆంగ్లంలో చెప్పబడుతున్నది. చిన్నప్పుడు మాకు మత బోధనలు నేర్పిన క్రైస్తవ సన్యాసినులు (నన్సు) వారి అలవాట్లను (ధర్మపరమైన దుస్తులను) ఆధునిక దుస్తులతో మార్చుకున్నారు. మా ధార్మిక తరగతులలో ఎప్పుడూ బైబిల్ పఠనం జరగ లేదు, ఇప్పుడైతే వారు మత విశ్వాసాలపై దృష్టి సారించే బదులు, సామాజిక సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కొత్త జనాల మాదిరిగానే చాలా వరకు సమకాలీన జానపద పాటలతో కాలం గడుపు తున్నారు. మా కాలంలో బోధించ బడిన సత్యం ఇప్పుడు పూర్తిగా మారిపోవడం వింతగా అనిపించింది. ఏదేమైనప్పటికీ, మేము మా మొదటి హోలీ కమ్యూనియన్కు సిద్ధమైనప్పుడు, పూజారి (Priest) మా నోటిలో పెట్టే రొట్టె యేసు యొక్క అసలు శరీరమని మాకు బోధించబడింది (అది మనం కొరికితే రక్తస్రావం అవుతుంది). దీని వలన మరియు ఇలాంటి అనేక ఇతర కారణాల వలన, నేను నా మతంపై సందేహాలు పెంచుకున్నాను మరియు చిన్నప్పటి నుండి అలాంటి క్రైస్తవ మత విశ్వాసాలను తిరస్కరించాను.

యేసు జీవిత సత్యాలు [పుస్తకం]

ఖుర్ఆన్ చెబుతున్న యేసు జీవిత సత్యాలు
The truths about Jesus (alaihissalam) (Telugu)
సంకలనం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ, ముహమ్మద్ హమ్మాద్ ఉమరీ
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

ఖుర్ఆన్ చెబుతున్న యేసు జీవిత సత్యాలు
The truths about Jesus (alaihissalam) (Telugu)
సంకలనం: ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ, ముహమ్మద్ హమ్మాద్ ఉమరీ
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [135 పేజీలు] [20 MB] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

[డెస్క్ టాప్ వెర్షన్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]

అవును! ముమ్మాటికీ ఆయన ఓ దైవప్రవక్త. గొప్ప దైవసందేశహరులు. ప్రజలు ఆయన గురించి ఏవేవో ఊహించుకున్నారు. లేనిపోని అసత్యాలు సృష్టించారు. నామమాత్రపు అనుయాయులు ఆయన స్థానాన్ని ఆకాశాలకు ఎత్తేస్తే….. ఆయనంటే గిట్టనివారు ఆయన స్థాయిని పాతాళానికి దిగజార్చారు. నిజానికి ఈ రెండూ అతివాదాలే. ఈ రెండింటికి నడుమ ఓ మధ్యే మార్గం ఉంది. అదే ఇస్లాం మార్గం.

* ఈసా ప్రవక్త (ఆయనపై అల్లాహ్ శాంతి కురుయు గాక!)ను మన`తెలుగు నాట ‘యేసు’గా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచ మానవులకు సన్మార్గం చూపటానికి సర్వ సృష్టికర్త అల్లాహ్ పంపిన చిట్టచివరి ఆకాశగ్రంథమే దివ్య ఖుర్ఆన్. దీని అవతరణ ముఖ్యలక్ష్యం మానవులందరికీ ధర్మ జ్యోతిని పంచటం. మానవులందరికీ సన్మార్గాన్ని, స్వర్గానికి పోయే దారిని చూపటం. సత్యం – అసత్యం, ధర్మం – అధర్మం, సన్మార్గం – దుర్మార్గం…. ఇలా ప్రతి దానిలో మంచీ చెడులను స్పష్టంగా వేరుపరచే గీటురాయి ఈ దివ్య ఖుర్ఆన్.

యేసు (అల్లాహ్ ఆయనపై శాంతిని కురిపించు గాక!) ఓ గొప్పదైవప్రవక్త. ఆయన ఆకాశలోకాలకు వెళ్ళిపోయిన కాలం నుంచే క్రైస్తవ ప్రపంచంలో ఆయన కనుమరుగవటం గురించి ఎన్నో అపోహలు అవాస్తవాలు చెలామణిలోకి వచ్చాయి. యేసు (ఈసా) ప్రవక్త ఆ దివ్య లోకాలకు తరలివెళ్ళిన తొలినాటి నుంచే క్రైస్తవులు సందేహాస్పద అవిశ్వాసాలకు లోనై ఉన్నారు.

మరోవైపు ప్రస్తుత బైబిలు గ్రంథం –

యూద, క్రైస్తవ మత పెద్దలు పదే పదే చేస్తూ వచ్చిన సవరణలకూ, చర్చీ వ్యవస్థ మాటిమాటికీ చేపడుతూ వచ్చిన మార్పులు చేర్పులకూ గురై ఏనాడో తన వాస్తవిక రూపాన్ని కోల్పోయింది. కనుక అలనాటి గ్రంథాలకు ఇక అది ప్రతిరూపం కానేకాదు. తౌరాతు (*), ఇంజీలు (**) మరి అలాంటి సమయంలో-

ఇటు యేసు (ఈసా) గురించి ఎన్నో విషయాల్లో విభేదాలకు, అనుమానాలకు లోనై ఉన్న క్రైస్తవ సోదరులకూ, అటు ప్రపంచ మానవులందరికికూడా – యేసుకు పూర్వం జరిగిన సంఘటనల దగ్గరి నుంచి, ఆయన పుట్టుకను, ప్రవక్త పదవీ బాధ్యతలను, సందేశ ప్రచారాన్ని, చివరకు ఆయన కనుమరుగవటాన్ని గురించి విపులంగా, ప్రామాణికంగా తెలియజేసే దైవ గ్రంథం ఈనాడు దివ్య ఖుర్ఆన్ ఒక్కటే.

నిర్మల మనసుతో సత్యాన్ని అన్వేషించే ప్రతి వ్యక్తికీ దివ్య ఖుర్ఆన్ గ్రంధంలో సన్మార్గం ఉంది. అటువంటి సన్మార్గం వైపు పాఠకులకు మార్గదర్శకత్వం అందించాలన్న సత్సంకల్పంతో రూపొందించబడినదే ఈ చిరు పుస్తకం.

మరి దివ్యఖుర్ఆన్ చిలికించే ఆ సత్యామృతాన్ని ఆస్వాదించటానికి అందరూ సమాయత్తమే కదా?!

– ప్రకాశకులు

[*] తౌరాత్ – దైవప్రవక్త మోషే (మూసా) ప్రవక్త (అలైహిస్సలాం)పై అవతరించిన దివ్యగ్రంథం.
[**] ఇంజీల్ – దైవప్రవక్త ఈసా (యేసు) ప్రవక్త (అలైహిస్సలాం)పై అవతరించిన దివ్య గ్రంథం.

1. ఆయన ఎవరు?
2. దైవప్రవక్తల పుట్టుక పరమార్థం
3. యేసు వంశావళి
4. ఈసా (యేసు) ప్రవక్త పుట్టుపూర్వోత్తరాలు
5. శుభవార్తలు
6. జననం
7. ఇది అద్భుతమైతే అది మహా అద్భుతం కదా!
8. దైవప్రవక్తగా…..
9. మోషే ప్రవక్తకు-ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంధానకర్త
10. “అహ్మద్…..నా తర్వాత రాబోయే ప్రవక్త”
11. సహచరులు, మద్దతుదారులు (హవారీలు)
12. మహిమలు, అనుగ్రహాలు
13. గత ప్రవక్తల మార్గంలోనే
14. యేసు చనిపోలేదు, చంపబడనూ లేదు
15. శిలువ
16. ప్రళయానికి పూర్వం మళ్ళీ వస్తారు
17. యేసు ప్రవక్త బోధించని క్రైస్తవ వైరాగ్యం…
18. యూదుల, క్రైస్తవుల అనాలోచిత మాటలు…
19. మనుషులు కల్పించే కల్లబొల్లి మాటల నుంచి…
20. నిజ ప్రభువు అల్లాహ్ మాత్రమే
21. యేసు ప్రవక్త స్వయంగా ప్రకటిస్తారు
22. క్రైస్తవులకు అల్లాహ్ హితబోధ
23. ముగింపు

నిజమైన ప్రభువు ఎవరు ? ఆయనను ఎలా గుర్తించాలి ?

నిజమైన ప్రభువు ఎవరు ? ఆయనను ఎలా గుర్తించాలి ?
https://youtu.be/QT4n1LDIPiw [26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుభానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

అభిమాన సోదరులారా! ఈనాటి ప్రసంగంలో మనం ప్రభువు గురించి పరిచయం చేసుకుందాం. ప్రభువు అనే పదం వినగానే చాలా మంది ప్రభువు అంటే ఏసు అని అనుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన క్రైస్తవ సోదరులు ఎక్కువగా ప్రభువు, ప్రభువు, ప్రభువు అని ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి, ప్రభువు అంటే ఏసు, ఏసు అంటే ప్రభువు అన్నట్టుగా బాగా ప్రచారం అయిపోయి ఉంది కాబట్టి, ప్రభువు అనగానే వెంటనే మనిషి ఆలోచనలో ఏసు అనే ఒక పేరు వచ్చేస్తాది.

నిజం ఏమిటంటే అభిమాన సోదరులారా, ప్రభువు అనే పదానికి నిఘంటువు ప్రకారంగా చాలా అర్థాలు వస్తాయి. ప్రభువు అంటే సృష్టికర్త, ప్రభువు అంటే యజమాని, ప్రభువు అంటే చక్రవర్తి. ఇలా చాలా అర్థాలు వస్తాయి. సందర్భానుసారంగా ప్రభువు అనే పదానికి అర్థము కూడా మారుతూ ఉంటుంది. రాజదర్బార్లో ఉన్న సిపాయిలు రాజుని మహాప్రభు, మహాప్రభు అంటూ ఉంటారు. అక్కడ అర్థము దేవుడు అని కాదు, చక్రవర్తి, రాజు అని.

ఆ ప్రకారంగా అభిమాన సోదరులారా, ప్రభువు అంటే చాలా అర్థాలు ఉన్నాయి, సందర్భానుసారంగా దాని అర్థం మారుతూ ఉంటుంది. అయితే, ఈ రోజు నేను ప్రభువు అనే అర్థం వచ్చే అర్థాలలో ఒక అర్థము సృష్టికర్త. సృష్టికర్త అయిన ప్రభువు గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు మీ ముందర ఉంచదలచాను. ఇన్షా అల్లాహ్, మనము ధార్మిక గ్రంథాల వెలుగులో మన సృష్టికర్త, మన ప్రభువు ఎవరు? ఆయనను మనము ఎలా గుర్తించాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అధిక శాతం ప్రజలు సృష్టికర్త ఉన్నాడు అని, ప్రభువు ఉన్నాడు అని నమ్ముతారు, విశ్వసిస్తారు. అయితే కొంతమంది హేతువాదులుగా మారి, నాస్తికులుగా మారి, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వ్యతిరేకిస్తారు. అయితే అభిమాన సోదరులారా, నిజం ఏమిటంటే సృష్టికర్త లేనిదే సృష్టి ఉనికిలోకి రాదు. నేడు ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఈ సృష్టిలో గొప్ప గొప్ప విషయాలు మన కళ్లారా మనం చూస్తున్నాం. ఎలాంటి స్తంభము లేని ఆకాశాన్ని చూస్తున్నాం, ప్రపంచం మొత్తాన్ని వెలుగునిచ్చే సూర్యుడిని చూస్తున్నాం, చల్లని జాబిల్లిని పంచే చంద్రుడిని చూస్తున్నాం. మనిషి జీవితానికి క్షణం క్షణం ఉపయోగపడే గాలి ఉంది. మనిషి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి, భూమి మీద నడిచే అనేక జీవులు ఉన్నాయి, నీటిలో ఈదే జలచరాలు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఇవన్నీ సృష్టిలో ఎలా వచ్చాయి? ఏదైనా దేశంలో ఒక ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవుతున్నాయా? ఏదైనా దేశస్థుడు వీటన్నింటినీ తయారు చేసి మార్కెట్లోకి వదిలేటట్టుగా ఈ భూమి మీద వదులుతున్నాడా? లేదు. ఇవన్నీ మానవుని ద్వారా సృష్టించబడినవి కావు. మానవుని కంటే ఈ సృష్టిలో ఉన్న ఆకాశాలు, భూమి, సూర్య చంద్రుల కంటే గొప్ప శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ప్రభువు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు అభిమాన సోదరులారా.

అందుకోసమే సృష్టికర్త ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, “సృష్టికర్తను గుర్తించడానికి మీరు సృష్టిలోని విషయాలను చూడండి, సృష్టిలోని విషయాలను చూసి మీరు సృష్టికర్తను గుర్తుపట్టండి. అంతెందుకు, మీ శరీరాన్నే ఒకసారి చూడండి, మీ శరీరంలో అనేక నిదర్శనాలు సృష్టికర్త ఉన్నాడు అని చెప్పటానికి ఉన్నాయి” అంటున్నాడు.

మనం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం. మన శరీరంలో గుండె ఒకటి ఉంది, ప్రతి క్షణము రక్తాన్ని మన శరీరంలో సరఫరా చేస్తూ ఉంది. మనము వాయువును పీలుస్తూ ఉన్నాము. గుండె ఒక్క నిమిషం కోసం ఆగిపోతే మనిషి చనిపోతాడు. ఐదు నిమిషముల కోసము ఈ ప్రపంచంలో నుంచి గాలి తీసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ చనిపోతాయి.

అభిమాన సోదరులారా, ఇవన్నీ దేవుడు ఉన్నాడు, ఇవన్నీ దేవుని ద్వారా ఉనికిలోకి వచ్చాయి, మనకు ఇవన్నీ శక్తులు, మన కోసం ఇవన్నీ ఏర్పాటులు ఆ సృష్టికర్త చేశాడు అని చెప్పడానికి ఇవన్నీ సాక్షాలు అభిమాన సోదరులారా. సరే, సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ద్వారానే ఇదంతా ఉనికిలోకి వచ్చింది, మనము కూడా ఉనికిలోకి వచ్చాము అని మనము అర్థం చేసుకున్నాం.

ఇక రండి అభిమాన సోదరులారా, సృష్టికర్త ఈ ప్రపంచానికి ఒకడు ఉన్నాడా లేదా చాలా మంది ఉన్నారా అనేది ముందు మనం తెలుసుకుంటే ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. సృష్టికర్త గురించి ధార్మిక గ్రంథాలలో వెతికితే విషయాలు తెలుస్తాయి. గణిత శాస్త్రంలో వెళ్లి సృష్టికర్త గురించి పరిశీలిస్తే ఏమైనా దొరుకుతాదండి అక్కడ? గణిత శాస్త్రంలో లెక్కలు ఉంటాయి అక్కడ. కాబట్టి సృష్టికర్త గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు, ఆకాశ గ్రంథాలు వాటిని మనం పరిశీలించాలి. ఆ గ్రంథాలలో సృష్టికర్త గురించి స్పష్టమైన విషయాలు తెలుపబడి ఉన్నాయి.

ఏమని తెలుపబడి ఉన్నాయి అంటే, ముందుగా మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథము, ఇది కూడా దైవ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, ఎలాంటి మార్పు చేర్పులకు గురి కాని గ్రంథము. ఈ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వతఆలా, సృష్టికర్త తెలియజేస్తున్నాడు:

أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم
(అఊజు బిల్లాహి మినష్-షైతా నిర్రజీమ్, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, కరుణామయుడు మరియు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

اِنَّمَاۤ اِلٰهُكُمُ اللّٰهُ
(ఇన్నమా ఇలాహుకుముల్లాహు)
నిశ్చయంగా మీ ఆరాధ్యుడు అల్లాహ్ ఒక్కడే.

మనము చూసినట్లయితే ఖురాన్ లోని సూరా బఖరా, రెండవ అధ్యాయం, 163 వ వాక్యంలో ఈ విధంగా తెలుపబడింది:

وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ
(వ ఇలాహుకుమ్ ఇలాహున్ వాహిద్)
మీ ప్రభువు ఒక్కడే.

ఇక మనం వేరే గ్రంథాలను కూడా పరిశీలించినట్లయితే, ఋగ్వేదంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం తెలుపబడింది: “ఒక్కడు, సాటి సమానము లేని ఆయన నే స్తుతించండి. ఎవరైతే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో, ఆ దేవుడు ఒక్కడే.”

అలాగే, మన క్రైస్తవ సోదరులు విశ్వసించే గ్రంథాన్ని మనం చూచినట్లయితే, బైబిల్ గ్రంథము మత్తయి సువార్తలో ఈ విధంగా తెలుపబడి ఉంది: “ఒక్కడే మీ తండ్రి. ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు.”

అభిమాన సోదరులారా, ఖురాన్ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథము నుండి, వేదాల నుండి మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక్కడే మన సృష్టికర్త, ఒక్కడే మన ప్రభువు, ఒక్కడే మన దేవుడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అయితే అభిమాన సోదరులారా, సృష్టికర్త ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత, సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత, ఆ సృష్టికర్త ఎవరు? అనేది తెలుసుకోవాలి, ఇది ముఖ్యమైన విషయం.

మనం సాధారణంగా ప్రపంచం నలుమూలలా ఎక్కడ వెళ్లి ఎవరిని ప్రశ్నించినా, ఏమండీ దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారా అంటే “అవును” అంటాడు. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు నమ్ముతున్నారు అండి అంటే “ఒక్కడే” అంటాడు. అతను చదువుకున్న వ్యక్తి అయినా సరే, చదువు రాని వ్యక్తి అయినా సరే. “దేవుడు అందరికీ ఒక్కడే అండి, అందరికీ ప్రభువు ఒక్కడే అండి” అని ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే, ఒక్కడే దేవుడు అయినప్పుడు, న్యాయంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కలిసి ఒకే దేవుడిని పూజించుకోవాలి కదా? సృష్టికర్త ఒక్కడే అని చెప్పేటప్పుడు, న్యాయంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకే సృష్టికర్తని పూజించాలి కదా? మరి ప్రపంచంలో అలా జరుగుతూ ఉందా? దేవుడు ఒక్కడే అని అందరూ చెబుతారు, కానీ ఒకే దేవుడిని పూజించకుండా అనేక దేవుళ్ళను పూజిస్తున్నారు. సృష్టికర్త ఒక్కడే అని అందరూ చెబుతారు, కానీ ఒకే సృష్టికర్తని పూజించకుండా అనేక సృష్టికర్తలు ఉన్నారు అని పూజిస్తున్నారు. ఇది అన్యాయం కదా? ఏకంగా సృష్టికర్త, దేవుని విషయంలో మానవులు అన్యాయం చేస్తున్నారా లేదా అభిమాన సోదరులారా? మనము ఏకంగా దేవుని విషయంలోనే అన్యాయానికి పాల్పడుతున్నాం. సృష్టికర్త ఒక్కడని నమ్ముతూ అనేక దేవుళ్ళను పూజించేస్తున్నాము కాబట్టి మనము దైవానికి ద్రోహం చేస్తున్నాము. అలా చేయడం తగదు అభిమాన సోదరులారా.

కాబట్టి, నిజమైన సృష్టికర్త ఎవరు? ఇంతమంది దేవుళ్ళలో, ప్రపంచంలో నేడు ఎవరెవరైతే పూజించబడుతున్నారో వాళ్ళందరూ నిజమైన ప్రభువులు కాజాలరు. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే కాబట్టి. ఇక రండి, ఇంతమంది ప్రపంచంలో పూజించబడుతున్న దేవుళ్ళందరిలో నిజమైన ప్రభువు, నిజమైన సృష్టికర్త ఎవరు అనేది మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఏదైనా ఒక వస్తువు, అది మంచిదా లేదా చెడ్డదా, నిజమైనదా లేదా కల్పితమైనదా, ఒరిజినలా లేదా డూప్లికేటా అని తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని గుర్తులు చెబుతూ ఉంటారు. ఫలానా ఫలానా లక్షణాలు అందులో ఉంటేనే అది వాస్తవమైనది, అది ఒరిజనల్. ఆ లక్షణం అందులో కనిపించకపోతే అది డూప్లికేట్ అని తేల్చేస్తూ ఉంటారు. అంతెందుకండీ, మనము డబ్బును తీసుకొని వెళితే కూడా, ఆ డబ్బుని కూడా కొన్ని లక్షణాల ద్వారా, కొన్ని గుర్తుల ద్వారా ఆ నోటు ఒరిజినలా, డూప్లికేటా అని పరిశీలిస్తూ ఉంటారు. అంటే లక్షణాల ద్వారా ఒరిజినల్, డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవచ్చు. దేవుని విషయంలో కూడా మనము కొన్ని లక్షణాల ద్వారా, దేవుడు ఎవరు నిజమైన వాడు, ఎవరు కల్పిత దేవుడు అనేది మనము తెలుసుకోవచ్చు.

సాధారణంగా దేవుని లక్షణాలను ప్రస్తావిస్తూ, దేవుని గుణాలను ప్రస్తావిస్తూ ఏమంటూ ఉంటారంటే, “ఆకాశాలను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఆకాశాల భూమి మధ్య ఉంటున్న జీవరాశులన్నింటినీ సృష్టించినవాడు, సంతానం ప్రసాదించేవాడు, వర్షాలు కురిపించేవాడు, మరణం ప్రసాదించేవాడు.” ఇతనే, ఈ లక్షణాలు కలిగినవాడు దేవుడు అని చెబుతూ ఉంటారు. ఇలా చెబితే చాలామంది ఏమంటారంటే, “ఎవరినైతే నేను దేవుడిని అని నమ్ముతున్నానో, అతనిలో కూడా ఈ శక్తులు ఉన్నాయి” అని అనేస్తారు.

కాబట్టి రండి అభిమాన సోదరులారా, ఓ రెండు గుర్తులు నేను చెబుతాను, రెండు లేదంటే మూడు గుర్తులు. రెండు లేదా మూడు లక్షణాలు, అవి ఎలాంటి లక్షణాలు అంటే, ఆ లక్షణాలు “నా దేవుడిలో కూడా ఉన్నాయి, ఎవరినైతే నేను దేవుడని నమ్ముతున్నానో అతనిలో కూడా ఉన్నాయి” అని వెంటనే మనిషి చెప్పలేడు. కాసేపు ఆగి పరిశీలించాల్సి వస్తాది. ఆ మూడు లక్షణాలు ఏమిటంటే:

మొదటి లక్షణం: ఈ ప్రపంచాన్ని పుట్టించిన, సృష్టించిన ఆ ఏకైక అద్వితీయ ప్రభువు ఎవరి కంటికీ కనిపించడు. కనిపిస్తాడా? ఎవరికైనా కనిపించాడా? మానవుల మాట పక్కన పెట్టండి, ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయో అది కూడా చూడండి. దేవుడు కనిపిస్తాడా, కనిపించడా అనే విషయాన్ని ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయంటే, ఖురాన్ లోని సూరా అన్ఆమ్, ఆరవ అధ్యాయం, 103 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

لَّا تُدۡرِكُهُ الۡاَبۡصَارُ وَهُوَ يُدۡرِكُ الۡاَبۡصَارَ وَهُوَ اللَّطِيۡفُ الۡخَبِيۡرُ
(లా తుద్రికుహుల్ అబ్సార్, వ హువ యుద్రికుల్ అబ్సార్, వ హువల్ లతీఫుల్ ఖబీర్)
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.

అంటే, మానవులు గానీ, ప్రపంచంలో ఉన్న ఏ జీవి గానీ తమ కళ్ళతో ఆ సృష్టికర్తను, ఆ దేవుడిని చూడలేదు అని స్పష్టంగా అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఖురాన్ లో తెలియజేశాడు.

ఇదే విషయం మనం వేరే గ్రంథాలలో కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఏమని తెలియబడి ఉంది అంటే: “దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు, కన్నులతో ఆయన్ను ఎవరూ చూడలేరు.” ఈ విషయం మన హిందూ సోదరులు ఎవరైతే ఉపనిషత్తుల్ని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో అందులో కూడా తెలుపబడి ఉంది.

అలాగే, మన క్రైస్తవ సోదరులు విశ్వసించే బైబిల్ గ్రంథంలో కూడా, దేవుడు కనిపిస్తాడా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ కొత్త నిబంధన యోహాను గ్రంథంలో ఈ విధంగా తెలుపబడింది: “మీరు ఏ కాలమందైననూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.”

చూశారా? ఇటు ఖురాను, అటు ఉపనిషత్తులు, అటు బైబిలు, ఈ ముఖ్యమైన గ్రంథాలు ఏమని తెలియజేస్తున్నాయి అంటే మానవులు ఆ సృష్టికర్తను కళ్ళతో చూడలేరు. అంటే దేవుడు కనిపించడని స్పష్టం అయిపోయింది కదా? ఇది మొదటి లక్షణం.

ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎవరెవరైతే దేవుళ్ళు అని పూజించబడుతున్నారో, వారు మానవులకు కనిపించిన వారా, కాదా? ప్రతి దేవుడికి ఒక చరిత్ర ఉంది. ఆయన ఫలానా దేశంలో, ఫలానా ప్రదేశంలో, ఫలానా అమ్మ నాన్నల ఇంట్లో అతను పుట్టాడు, అతని బాల్యాన్ని ఫలానా ఫలానా వ్యక్తులు చూశారు, అతని యవ్వనాన్ని ఫలానా ఫలానా వ్యక్తులు చూశారు, అతను ఫలానా మహిళతో వివాహం చేసుకున్నాడు, అతనికి ఇంతమంది సంతానం కలిగారు అని చరిత్ర చెబుతూ ఉంది, అతను కనిపించాడు అని. గ్రంథాలు చెబుతున్నాయి దేవుడు కనిపించడు అని. కనిపించేవాడు దేవుడు ఎలా అవుతాడండీ? కాబట్టి మనం ఎవరినైతే పూజిస్తున్నామో, అతను కనిపించిన వాడా, కనిపించని వాడా అనేది తెలుసుకోవాలి.

అలాగే, సృష్టికర్తకు ఉన్న మరొక ముఖ్యమైన రెండవ లక్షణం: సృష్టికర్త, సృష్టిని సృష్టిస్తాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి జన్మిస్తుంది, మళ్ళీ మరణించి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. మన తాత ముత్తాతలు అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చి వెళ్ళిపోయారా లేదా? మనము కూడా ఇప్పుడు వచ్చాము, జీవిస్తున్నాము, ఏదో ఒక రోజు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే ప్రతి జీవి ఈ సృష్టిలోకి వస్తుంది, తన జీవితాన్ని ముగించుకుని మళ్ళీ ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే, సృష్టికర్త మరణిస్తాడా? సృష్టికర్తకు మరణం ఉందా? ప్రభువుకి, దేవునికి మరణం ఉందా? చదువు వచ్చినవాడు గానీ, చదువు రాని వాడు గానీ, “దేవునికి మరణం లేదండి” అని చెప్తాడు. “దేవుడే చనిపోతే మరి ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తాడండి?” అని చెప్తాడు. గ్రంథాలు ఏమంటున్నాయి అభిమాన సోదరులారా? ఈ గ్రంథాలు ఏమంటున్నాయి? సృష్టికర్తకు, ప్రభువుకి మరణం ఉందా? రండి చూద్దాం గ్రంథాలలో ఏమని ఉందో.

ఇంతకు ముందు చెప్పినట్టే, ఖురాన్ లోని సూరా రహ్మాన్, 55వ అధ్యాయం, 26, 27 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ۖ وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
(కుల్లు మన్ అలైహా ఫాన్. వ యబ్ ఖా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్)
భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే.

అంటే, భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కటి నశించిపోతుంది గానీ, ఆ అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా యొక్క అస్తిత్వం ఎన్నటికీ నశించిపోదు. ఆయన ఎన్నటికీ అలాగే ఉంటాడు. ఇది ఖురాన్ చెబుతున్న విషయం.

అలాగే మనము ఇతర గ్రంథాలలో కూడా ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, ఇతర గ్రంథాలలో కూడా అదే విషయం తెలుపబడి ఉంది. ఏమని తెలుపబడి ఉంది? “జననము, మరణము అనే దోషములు లేనివాడే శుభప్రదుడైన దేవుడు.” ఈ విషయం యోగ శిఖోపనిషత్ లో తెలుపబడి ఉంది.

అలాగే బైబిల్ ని మనం చూసినట్లయితే, యిర్మీయా గ్రంథంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: “యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల చావు లేని దేవుడు.”

చూడండి, ఇటు ఖురాను, అటు ఉపనిషత్తులు, అటు బైబిలు ఈ ప్రధానమైన గ్రంథాలు ఏమని చెబుతున్నాయి అంటే, దేవునికి, సృష్టికర్తకి మరణము లేదు.

ఇప్పుడు ఒక్కసారి మనం ఆగి పరిశీలించాలి. ఎవరిని మనం పూజిస్తున్నాం? చనిపోయిన వాడిని పూజిస్తున్నామా? చనిపోకుండా సజీవంగా ఉన్న దేవుడిని పూజిస్తున్నామా? ప్రపంచంలో ఒకసారి అభిమాన సోదరులారా, ఎవరెవరైతే దేవుళ్ళు అని ప్రచారంలో ఉన్నారో, ఎవరెవరైతే దేవుళ్ళు అని పూజించబడుతూ ఉన్నారో, వారి చరిత్రలు చూడండి. ఫలానా దేవుడు ఫలానా ప్రదేశంలో మరణించాడు, ఆయన సమాధి ఫలానా చోట ఉంది. ఫలానా దేవుడు ఫలానా చోట శిల్పం లాగా మారిపోయాడు. ఫలానా దేవుడు ఫలానా చోట ఆ విధంగా మారిపోయాడు, ఈ విధంగా మారిపోయాడు అంటున్నారు. అంటే చనిపోయిన వాడు దేవుడు కాదు అని గ్రంథాలు చెబుతూ ఉంటే, చనిపోయిన వారిని మనము దేవుళ్ళని పూజిస్తున్నాము. ఇది వివేకవంతమైన విషయమా అభిమాన సోదరులారా?

గ్రంథాల ద్వారా రెండు విషయాలు మనకు తెలుపబడ్డాయి. అదేమిటంటే, దేవుడు కనిపించడు, దేవుడు మరణించడు. ఈ విషయం తెలియక చాలామంది ప్రజలు ప్రతి సంవత్సరము మోసిపోతున్నారు, ప్రతి కాలంలో మోసిపోతున్నారు. ఎలాగండీ? ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి ఎవరూ తప్పుగా అనుకోకండి.

చాలామంది బాబాలు ఉనికిలోకి వస్తున్నారు. ప్రజలు అంధులైపోయి వారిని దేవుళ్ళని పూజిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత, టీవీ ఛానెళ్ళ వాళ్ళ కెమెరా దృష్టిలో వారి అగత్యాలన్నీ బయటపడుతున్నాయి, వారి రాసలీలలన్నీ బయటపడుతున్నాయి. ఆ తర్వాత అతను కన్య పిల్లల్ని హతమార్చాడని, ఎంతోమంది మహిళలతో రాసలీలలు గడిపాడని, అతని ఆశ్రమంలో కండోములు, సారాయి సీసాలు ఇవన్నీ దొరికాయని పట్టుబడుతున్నాడు. ఆ తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తా ఉంది. అలాంటి చాలామంది బాబాలు మనకు కనిపిస్తూ ఉన్నారు.

అలాంటి వ్యక్తులు వచ్చి “నేను దేవుడిని, దేవుని స్వరూపాన్ని” అని చెప్పగానే ప్రజలు ఎందుకు వాళ్ళ మోసపోతున్నారంటే ఈ రెండు విషయాలు మర్చిపోయారు కాబట్టి. కనిపించేవాడు దేవుడు కాదు, మరణించేవాడు దేవుడు కాదు అని తెలియదు కాబట్టి, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి, కనిపిస్తున్న ఆ వ్యక్తిని దేవుడు అని చెబుతున్నారు, మరణిస్తున్న ఆ సమాధిని దేవుడు అని నమ్ముతున్నారు. కనిపిస్తున్న వాడు దేవుడు కాదు అని నమ్మితే ఇలాంటి బాబాల మాటలు చెల్లవు, వారి ఏ ప్రయత్నము చెల్లదు.

అయితే అభిమాన సోదరులారా, దేవుడు కనిపించడు, దేవుడు మరణించడు. కనిపించకుండా, మరణించకుండా మరి ఎక్కడ ఉంటాడు ఆయన?

ٱلرَّحْمَـٰنُ عَلَى ٱلْعَرْشِ ٱسْتَوَىٰ
(అర్రహ్మాను అలల్ అర్షిస్తవా)
ఆ కరుణామయుడు (అల్లాహ్) సింహాసనం (అర్ష్) మీద ఆశీనుడయ్యాడు.

ఆ కరుణామయుడు, ఆ సృష్టికర్త పైన సింహాసనం మీద, అర్ష్ మీద ఆశీనుడై ఉన్నాడు. ఇదే విషయం ఇతర గ్రంథాలలో కూడా తెలుపబడి ఉంది, ఆయన పరలోకమందు ఉన్నాడని తెలుపబడి ఉంది.

ఇప్పుడు ఒక్కసారి జల్లెడ పట్టండి అభిమాన సోదరులారా. ఈ మూడు లక్షణాలు చాలు. ఈ మూడు లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి జల్లెడ పట్టండి. కనిపించకుండా, మరణించకుండా, పైనుండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరో ఒకసారి జల్లెడ పట్టి చూడండి. మన ముందరికి వచ్చే సారాంశం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, ఈ లక్షణాలు కలిగిన ఒకే ఒక సృష్టికర్త, నిజమైన సృష్టికర్త ఆయనే అల్లాహ్. ఒక అల్లాహ్ లో మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి. అల్లాహ్ ఎవ్వరికీ కనిపించడు, అల్లాహ్ కి మరణము లేదు, అల్లాహ్ పైనుంటాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, గ్రంథాల ద్వారా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే, మన ప్రభువు, మన సృష్టికర్త, మన ఆరాధ్యుడు, నిజమైన దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా.

ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత ఏమిటంటే, మనం ఎవరైనా సరే, ఎవరి ఇంట్లో పుట్టిన వాళ్ళమైనా సరే, ఏ దేశంలో పుట్టిన వాళ్ళమైనా సరే, ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో మన నిజమైన సృష్టికర్త, ఆరాధ్యుడు, ప్రభువు కనిపించని వాడు, మరణించని వాడు, సజీవుడు, పైనున్న అల్లాహ్ అని తెలిసిపోయిందో, ఆ అల్లాహ్ ని మనము ప్రభువు అని నమ్మాలి, ఆ అల్లాహ్ నే ఆరాధించాలి, ఆ అల్లాహ్ చూపిన మార్గంలో నడుచుకోవాలి. ఆ అల్లాహ్ చూపిన మార్గమే ఇస్లాం మార్గం.

ఆ ఇస్లాం మార్గాన్ని ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అనేక ప్రవక్తలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఆ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేసి వెళ్లారు. వారి తర్వాత మనం పుట్టిన వాళ్ళము కాబట్టి, మనము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ప్రకారంగా ఇస్లామీయ ఆచారాలను పాటించాలి. ఇది మన బాధ్యత.

ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఎవరైతే ఎంత బాగా ఈ విషయాలను అమలుపరుస్తారో, వారు రేపు పరలోకంలో అల్లాహ్ దగ్గర అంత ఉన్నతమైన గౌరవ స్థానాలను పొందుతారు. ఎవరైతే ఎంతగా ఈ విషయాలను చెవిజాడను పెట్టేసి వదిలేస్తారో, కనుమరుగైపోయేటట్టు చేసేస్తారో, వారు ఆ విధంగా రేపు పరలోకంలో కఠినమైన శిక్షలకు గురవుతారు.

కాబట్టి, ఇంతటితో నా మాటను ముగిస్తూ, నేను ఆ నిజమైన సృష్టికర్త, నిజమైన ప్రభువు అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, నీవే నిజమైన ప్రభువు అన్న విషయాన్ని మనందరికీ అర్థమయ్యేటట్టు చేసి, నిన్నే పూజించే వారిలాగా, నిన్నే ఆరాధించే వారిలాగా మార్చు.” ఆమీన్.

أقول قولي هذا وأستغفر الله لي ولكم ولسائر المسلمين، فاستغفروه، إنه هو الغفور الرحيم.
(అఖూలు ఖవ్లీ హాజా వ అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ఫిరూహు, ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్)
నేను ఈ మాట చెప్పి, నా కోసం, మీ కోసం, మరియు సమస్త ముస్లింల కోసం అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆయన నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా, ఆయనే క్షమాశీలుడు, కరుణామయుడు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

మోక్షానికి మార్గం: జ్ఞానం, ఆచరణ, ప్రచారం – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

మోక్షానికి మార్గం – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/Hf6tdEiLp2I [68 నిముషాలు]

ఈ ప్రసంగం మోక్షానికి మార్గాన్ని వివరిస్తుంది, దీనిని మూడు ప్రాథమిక సూత్రాలుగా విభజించారు: జ్ఞానం (ఇల్మ్), ఆచరణ (అమల్), మరియు ప్రచారం (దావత్). మొదటిది, ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ఖురాన్ మరియు హదీసుల నుండి సరైన అవగాహన పొందడం విశ్వాసానికి పునాది అని వివరిస్తుంది. రెండవది, పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, స్థిరత్వంతో ధర్మ మార్గంలో నడవడం యొక్క ఆవశ్యకతను చర్చిస్తుంది. మూడవది, నేర్చుకున్న సత్యాన్ని ఇతరులకు వివేకంతో, ఉత్తమ రీతిలో అందజేయడం కూడా మోక్ష మార్గంలో ఒక ముఖ్యమైన భాగమని స్పష్టం చేస్తుంది. ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, వీటిని అనుసరించడం ద్వారానే ఇహపరలోకాల సాఫల్యం సాధ్యమవుతుందని ప్రసంగం సారాంశం.

أَعُوذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)

అభిమాన సోదరులారా, సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

హమ్ద్ మరియు సనా తర్వాత, అభిమాన సోదర సోదరీమణులారా, ఈ రోజు నా ప్రసంగాంశం ‘మోక్షానికి మార్గం’ అని మీకందరికీ తెలిసిన విషయమే.ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలు, వివరాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నేను ఈ అంశానికి సంబంధించిన ముఖ్యమైన మూడు విషయాలు చెప్పదలిచాను.

ఒకటి – أَلتَّعَلُّمُ بِالدِّينْ (అత్తఅల్లుము బిద్దీన్) – ధర్మ అవగాహనం.
రెండవది– أَلْإِلْتِزَامُ بِهَا (అల్ ఇల్తిజాము బిహా) – దానికి కట్టుబడి ఉండటం, స్థిరత్వం.
మూడవది – أَلدَّعْوَةُ إِلَيْهَا (అద్దఅవతు ఇలైహా) – ఇతరులకు అందజేయటం.

మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన ముఖ్యమైన ఈ మూడు విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. సారాంశం చెప్పాలంటే, ఇల్మ్, అమల్, దావత్. (జ్ఞానం, ఆచరణ, ప్రచారం)

మొదటగా జ్ఞానం గురించి. జ్ఞానం మహిమను చాటే ఖురాన్ ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం) అంటే, జ్ఞానాన్ని ఆర్జించడం ప్రతి ముస్లిం పై విధి అని అన్నారు. పురుషులైనా, స్త్రీలైనా. ఈ హదీస్ సహీహ్ ఇబ్నె మాజాలో ఉంది మరియు ఈ హదీస్ సహీహ్ హదీస్.

జ్ఞానం అంటే కేవలం సర్టిఫికెట్లను సంపాదించడం కాదు. అల్లాహ్ పట్ల భీతిని హృదయంలో జనింపజేసేదే నిజమైన జ్ఞానం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28లో ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ
(ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా)
నిస్సందేహంగా అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28)

జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ తల్లి ఒడి నుంచి మొదలై సమాధి వరకు కొనసాగుతుంది. జ్ఞానం అధ్యయనం ద్వారా, అనుసరణ ద్వారా, ధార్మిక పండితుల సాహచర్యం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, సజీవంగా ఉంటుంది. అలాగే, జ్ఞాన అధ్యయనం చేయటం, పుస్తక పఠనం, జ్ఞానుల సాహచర్యాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞానం అనేది అంతరిస్తుంది. ఈ విషయం మనము గమనించాలి. కావున, మానవుడు ఎల్లప్పుడూ తన జ్ఞానాన్ని పెంచుకునేందుకై కృషి చేస్తూనే ఉండాలి.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నేర్పిన దుఆ, సూరా తాహా ఆయత్ నంబర్ 114:

رَّبِّ زِدْنِي عِلْمًا
(రబ్బీ జిద్నీ ఇల్మా)
ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. అదేమంటే, మానవులలో అందరికంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ప్రవక్తలకి. ప్రవక్తలలో ప్రథమంగా ఎవరు ఉన్నారు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, విశ్వాసం గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, అన్ని విషయాల గురించి ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయినప్పటికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సొంతం కోసం చేసుకునేందుకు ఏ దుఆ నేర్పించాడు? ‘రబ్బీ జిద్నీ ఇల్మా’ జ్ఞానం గురించి దుఆ నేర్పించాడు. ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు. అంటే మహాజ్ఞాని అయిన, ఇమాముల్ అంబియా అయిన, రహ్మతుల్లిల్ ఆలమీన్ అయిన మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ చేస్తున్నారు తన కోసం? జ్ఞానం పెరగటానికి దుఆ చేస్తున్నారు. దీంతో మనకు అర్థం అవుతుంది, మోక్షానికి మార్గం కోసం జ్ఞానం ప్రథమంగా ఉంటుంది.

పూర్వ కాలానికి చెందిన మహానుభావులు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు. ఈ విషయాన్నీ మరొకసారి గమనించి వినండి , పూర్వ కాలానికి చెందిన మహానుభావులు, మన పూర్వీకులు, సలఫ్ సాలెహీన్లు, ముహద్దసీన్లు, అయిమ్మాలు, సహాబాలు, తాబయీన్లు, వారు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు.

ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ఏ వ్యక్తి వద్దైతే జ్ఞానం ఉన్నదో, ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నదో, అతడు జ్ఞానాన్ని ఆర్జించడాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానాన్ని ఆర్జించుకుంటూనే ఉండాలి అని ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.

అలాగే, ఇమాం అబూ అమ్ర్ బిన్ అల్-అలా రహమతుల్లాహి అలైహిని ఎవరో ప్రశ్నించారు: ఏమని? మానవుడు ఎప్పటి వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అని అడిగితే ఆ మహానుభావుడు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎప్పుడు వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అతడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, ఆరోగ్యవంతునిగా, శక్తిమంతునిగా ఉన్నంత వరకు జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉండాలి.

అలాగే, ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి, ఇబ్నె అబీ గస్సాన్ రహమతుల్లాహి అలైహి యొక్క వ్యాఖ్యను ఈ విధంగా ఉల్లేఖించారు: ఎప్పుడైతే మీరు జ్ఞానం పట్ల నిరపేక్షాపరులైపోతారో, అప్పుడు అజ్ఞానులైపోతారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే జ్ఞానం పట్ల నిరపేక్షాపరులు అవుతామో, అప్పుడు వారు ఏమైపోతారు? అజ్ఞానులు అయిపోతారని ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.

అలాగే, ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్న గమనించి వినండి. ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? అని ఇమాం సుఫియాన్ బిన్ ఉయైనా రహమతుల్లాహి అలైహిను ఎవరో ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, వారిలో అందరికంటే గొప్ప పండితుడు అయిన వ్యక్తి. గొప్ప పండితుడు, ఎవరి దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉందో అటువంటి వ్యక్తి ఇంకా జ్ఞానాన్ని ఆర్జించాలి అని అన్నారు ఆయన. ఎందుకు అని మళ్ళీ ప్రశ్నిస్తే, ఎందుకంటే అటువంటి వ్యక్తి తన జ్ఞానం వలన ఏదైనా చిన్న తప్పు చేసినా, అది ఎంతో పెద్ద చెడ్డ విషయంగా పరిగణించబడుతుంది. కనుక, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ఆర్జించేందుకై నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉండాలి.

అభిమాన సోదరులారా, ఇక ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా ధార్మిక విద్య గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ఇస్లాం ధర్మం విద్యపై స్థాపించబడింది. విద్య లేనిదే ఇస్లాం లేదు. ఇస్లాం పై నడిచే ప్రతి వ్యక్తికి విద్య అవసరం. ధార్మిక విద్య అంటే ఖురాన్, హదీసుల అవగాహన. అదే మనకు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆరాధన పద్ధతి నేర్పుతుంది. అసలు అల్లాహ్ అంటే ఎవరు? సృష్టికర్త అంటే ఎవరు? అల్లాహ్ పట్ల విశ్వాసం అంటే ఏమిటి? ఇంకా ఏ ఏ విషయాల పైన విశ్వసించాలి? ఏ విధంగా విశ్వసించాలి? ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? అల్లాహ్ మనతో ఏమి కోరుతున్నాడు? మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? మన జీవిత లక్ష్యం ఏమిటి? మరణానంతర జీవితం ఏమిటి? అనేది ధార్మిక విద్య వలనే తెలుస్తుంది.

అభిమాన సోదరులారా, స్వర్గానికి పోయే దారి, మోక్షానికి మార్గం చూపేది కూడా ధార్మిక విద్యే. ఇస్లాం ధర్మం గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి షిర్క్, కుఫ్ర్, బిద్అత్, ఇతర దురాచారాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, పాపాలు వాటి నుంచి తెలుసుకుంటాడు, వాటితో దూరంగా ఉంటాడు. సారాంశం ఏమిటంటే ఇహపరలోకాల సాఫల్యం ధార్మిక విద్య వల్లే దక్కుతుంది. ఈ విషయం మనము గ్రహించాలి.

అలాగే, అభిమాన సోదరులారా, ధార్మిక విద్య రెండు రకాలు. ధార్మిక విద్య రెండు రకాలు. ఒకటి ఇల్మె ఖాస్, ప్రత్యేకమైన విద్య. రెండవది ఇల్మె ఆమ్. ఇల్మె ఖాస్ అంటే అది ఫర్జె కిఫాయా. ఉమ్మత్‌లో కొంతమంది నేర్చుకుంటే సరిపోతుంది, అది ప్రతి ఒక్కరికీ సాధ్యం కూడా కాదు. ప్రతి వ్యక్తికి అది సాధ్యం కాదు. ఉమ్మత్‌లో కొంతమంది దానిని నేర్చుకుంటే సరిపోతుంది. అంటే, ఖురాన్ మరియు హదీసుల లోతుకి వెళ్ళడం. తఖస్సుస్ ఫిల్ లుగా, భాషలో ప్రావీణ్యత, తఫ్సీర్, ఉసూలె తఫ్సీర్, హదీస్, ఉసూలె హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, నహూ, సర్ఫ్ అంటే అరబీ గ్రామర్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, అల్-బలాగా, ఇల్ముల్ మఆనీ, ఇల్ముల్ బయాన్, ఇల్ముల్ ఫరాయిజ్, వగైరా మొదలగునవి.

అలాగే, ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా ఆయత్ నంబర్ 122లో ఇలా సెలవిచ్చాడు:

فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ
ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి ధర్మ అవగాహనను పెంపొందించుకోవాలి. పెంపొందించుకుని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరుచుకునేందుకు గాను వారికి భయబోధ చేయాల్సింది.

ధర్మ జ్ఞానాన్ని ఆర్జించాలని ఈ ఆయత్ మనకు నొక్కి చెబుతుంది. ధర్మ విద్య కోసం ప్రతి పెద్ద జన సమూహం నుంచి, ప్రతి తెగ నుంచి కొంతమంది తమ ఇల్లు వాకిలిని వదలి జ్ఞాన పీఠాలకు, ధార్మిక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి. ధర్మ జ్ఞానానికి సంబంధించిన వివిధ విభాగాలలో పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ తర్వాత తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్లి ప్రజలకు ధర్మ ధర్మాలను విడమరిచి చెప్పాలి, మంచిని ప్రబోధించాలి, చెడుల నుంచి వారించాలి. ధర్మ అవగాహన అంటే ఇదే.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు ఆలి ఇమ్రాన్‌లో ఆయత్ నంబర్ ఏడు, సూరా ఆలి ఇమ్రాన్.

هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ

నీపై గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలు ఉన్నాయి, స్పష్టమైన వచనాలు, ఆయతులు ఉన్నాయి, అవి గ్రంథానికి మూలం. వ ఉఖరు ముతషాబిహాత్. మరికొన్ని ముతషాబిహాత్ ఆయతులు ఉన్నాయి, అంటే బహువిధ భావంతో కూడిన వచనాలు. ఫ అమ్మల్లజీన ఫీ కులూబిహిమ్ జైగున్, ఎవరి హృదయాలలో వక్రత ఉంటుందో, వారు ఏం చేస్తారు? ఫయత్తబిఊన మా తషాబహ మిన్హుబ్తిగా అల్ ఫిత్నతి వబ్తిగా అతఅవీలిహి, వారు అందులోని అంటే ఆ ముతషాబిహాత్‌లోని బహువిధ భావ వచనాల వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు చేస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప మరెవరికీ తెలియదు. కాకపోతే ఆ తర్వాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యకూలూన ఆమన్నా బిహి కుల్లుమ్ మిన్ ఇంది రబ్బినా వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. అంటే, అయితే జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు, ధర్మ అవగాహనం కలిగిన వారు, జ్ఞానంలో పరిపక్వత కలిగిన వారు, పొందిన వారు మాత్రం, మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరపు నుంచి వచ్చినవే అని అంటారు. వాస్తవానికి బుద్ధిజ్ఞానులు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ఇది ఇల్మె ఖాస్ గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను, ఇంకా వివరణకి అంత సమయం లేదు కాబట్టి.

ఇక ఇల్మె ఆమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇల్మె ఆమ్. ఇది ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన జ్ఞానం. ప్రతి వ్యక్తి, ప్రతి ముస్లిం నేర్చుకోవలసిన జ్ఞానం ఇల్మె ఆమ్. దీని గురించే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ముస్లిం అయిన ప్రతి స్త్రీ పురుషునిపై జ్ఞానాన్ని ఆర్జించటం విధి, తప్పనిసరి అన్నారు. అంటే, తౌహీద్ అంటే ఏమిటి? షిర్క్ అంటే ఏమిటి? బిద్అత్ అంటే ఏమిటి? సున్నత్ అంటే ఏమిటి? నమాజ్ విధానం, దాని వివరాలు, ఉపవాసం, దాని వివరాలు, హజ్, ఉమ్రా, హలాల్ సంపాదన, వ్యవహార సరళి, జీవన విధానం, ధర్మ సమ్మతం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, హలాల్ సంపాదన ఏమిటి, హరామ్ సంపాదన దేనిని అంటారు? అమ్మ నాన్నకి సంబంధించిన హక్కులు, భార్యాభర్తలకు సంబంధించిన హక్కులు, సంతానానికి సంబంధించిన హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, జంతువుల హక్కులు, ఈ విధంగా ఈ విషయాలు ఇల్మె ఆమ్‌ కిందికి వస్తాయి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముహమ్మద్ ఆయత్ 19లో ఇలా సెలవిచ్చాడు:

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ
ఓ ప్రవక్తా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, ఏకదైవ ఆరాధన గురించి, ఏకత్వం గురించి, షిర్క్ ఖండన గురించి బాగా తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో, నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. ఈ ఆయత్ ఆధారంగా ఇమాముల్ ముహద్దసీన్, ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి తన సహీహ్ బుఖారీలో ఈ చాప్టర్ ఈ విధంగా ఆయన తీసుకొని వచ్చారు:

بَابُ الْعِلْمِ قَبْلَ الْقَوْلِ وَالْعَمَلِ
చెప్పకంటే ముందు, ఆచరించటం కంటే ముందు జ్ఞానం అవసరం అని ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి సహీహ్ బుఖారీలో ఒక చాప్టర్ తీసుకొని వచ్చారు.

అభిమాన సోదరులారా, జ్ఞానం, ధర్మ అవగాహన విశిష్టత గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముజాదలా, ఖురాన్‌లోని 28వ భాగంలోని మొదటి సూరా, ఆయత్ 18లో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారి, జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు.

అంటే ఈ ఆయత్‌లో ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు విషయాలు తెలియజేశాడు. ఒకటి విశ్వాసం, ఆ తర్వాత జ్ఞానం ప్రసాదించబడిన వారు. వారిద్దరి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు.

అలాగే, సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ
(షహిదల్లాహు అన్నహూ లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాఇకతు వ ఉలుల్ ఇల్మి కాఇమం బిల్ కిస్త్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు, జ్ఞానులు, ధార్మిక పండితులు, ధర్మ అవగాహన కలిగిన వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిచి ఉంచాడు, నిలిపి ఉంచాడు.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్‌కబూత్ ఆయత్ 43లో ఇలా సెలవిచ్చాడు:

وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
ప్రజలకు బోధ పరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు.

అభిమాన సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆయతులు, ప్రామాణిక హదీసులు ఉన్నాయి. మోక్షానికి మార్గం, స్వర్గానికి దారి, నరకము నుంచి కాపాడుకోవటం దీనికి ప్రథమంగా ఉండేది జ్ఞానం. నేను రెండు ఉదాహరణలు ఇచ్చి రెండవ అంశం పైన నేను పోతాను.

మొదటి ఉదాహరణ ఆదం అలైహిస్సలాం ఉదాహరణ. సూరా బఖరా ప్రారంభంలోనే మనకు ఆ ఆయతులు ఉంటాయి.

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత మొదటి పని ఏమిటి? ఆదం అలైహిస్సలాంకు జ్ఞానాన్ని నేర్పించాడు. వఅల్లమ ఆదమల్ అస్మా కుల్లహా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత, అంటే మొదటి మానవుడు, మొదటి వ్యక్తి. సృష్టి తర్వాత ప్రథమంగా అల్లాహ్ చేసిన పని ఏమిటి? జ్ఞానం నేర్పించాడు. ఆ జ్ఞానం కారణంగానే ఆదం అలైహిస్సలాం మస్జూదే మలాయికా అయ్యారు. ఆ వివరానికి నేను పోవ దల్చుకోలేదు. ఇది ఒక ఉదాహరణ.

రెండవ ఉదాహరణ, ఇమాముల్ అంబియా, రహమతుల్లిల్ ఆలమీన్, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి వాణి, దేనికి సంబంధించిన వాణి వచ్చింది? జ్ఞానం గురించే వచ్చింది. సూరా అలఖ్ మొదటి ఐదు ఆయతులు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఇఖ్రాతో ఖురాన్ మొదటి ఆయత్ అవతరించింది. జ్ఞానంతో.

అభిమాన సోదరులారా, ఇవి ఉదాహరణగా నేను చెప్పాను. మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన మొదటి ముఖ్యమైన విషయం జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం లేనిదే ఇస్లాం లేదు, ఇస్లాం విద్య పైనే స్థాపించబడింది. ఇది మొదటి విషయం, సరైన అవగాహన కలిగి ఉండాలి. దేని గురించి? ధర్మం గురించి, ఖురాన్ గురించి, అల్లాహ్ గురించి, విశ్వాసాల గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.

ఇక ఈ రోజుకి అంశానికి సంబంధించిన రెండవ అంశం, రెండవ విషయం, అది అల్ ఇల్తిజాము బిహా. అమల్, ఆచరణ, స్థిరత్వం. అంటే దానికి కట్టుబడి ఉండటం. ఏదైతే ఆర్జించామో, నేర్చుకున్నామో దానిపై స్థిరంగా ఉండాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَالْعَصْرِ إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
(వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి వతవాసవ్ బిల్ హక్కి వతవాసవ్ బిస్సబ్ర్)
నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒండొకరికి సహనం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు.

ఈ సూరా యొక్క తఫ్సీర్, వివరణలోకి నేను పోవటం లేదు. ఈ సూరాలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాలుగు విషయాలు వివరించాడు. ఈమాన్, విశ్వాసం. రెండవది ఆచరణ, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణ, అమల్. మూడవది, సత్యం, ఒకరి గురించి ఒకరికి చెప్పుకోవటం, అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్, ప్రచారం చేయటం. నాలుగవది, సబర్, సహనం. అంటే విద్యను, జ్ఞానాన్ని ఆర్జించే సమయంలో, విషయంలో, ఆ ప్రక్రియలో, విశ్వాసపరంగా జీవించే సందర్భంలో, ఆచరించే విషయంలో, అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్ విషయంలో ఆపదలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, సహనంతో ఉండాలి అనేది ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు అల్లాహ్ ఈ సూరాలో తెలియజేశాడు. అంటే జ్ఞానం తర్వాత, విశ్వాసం తర్వాత, ఆచరణ, కట్టుబడి ఉండటం, ఆచరించటం.

ఈ విషయం గురించి ఖురాన్‌లో ఒకచోట కాదు, రెండు సార్లు కాదు, పది సార్లు కాదు, అనేక సార్లు, 40-50 సార్ల కంటే ఎక్కువ ఆయతులు ఉన్నాయి దీనికి సంబంధించినవి. నేను ఒక ఐదు ఆరు ఉదాహరణగా చెప్తాను. సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107. ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది సూరా కహఫ్‌లోని చివరి నాలుగు ఆయతుల పారాయణంతో. ఈ ఆయత్, సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉంటాయి.

అభిమాన సోదరులారా, ఇక్కడ ఒక గమనిక, ఇప్పుడు నేను ఆచరణ అనే విషయానికి చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. విశ్వాసం అంటే ధర్మ పండితులు, జ్ఞానం జ్ఞానంతో పోల్చారు. విశ్వాసం అంటే జ్ఞానం అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, విశ్వాసం, జ్ఞానం. ఆ తర్వాత ఆచరణ. ఈ ఆయత్‌లో అల్లాహ్ ఏం సెలవిచ్చాడు? విశ్వసించి, విశ్వాసం తర్వాత, జ్ఞానం తర్వాత, సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉన్నాయి. ఫిరదౌస్ వనం అనేది స్వర్గంలోని అత్యున్నత స్థానం. అందుకే మీరు అల్లాహ్‌ను స్వర్గం కోరినప్పుడల్లా జన్నతుల్ ఫిరదౌస్‌ను కోరండి, ఎందుకంటే అది స్వర్గంలోని అత్యున్నత స్థలం, స్వర్గంలోని సెలయేరులన్నీ అక్కడి నుంచే పుడతాయి అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ కితాబుత్తౌహీద్‌లో ఉంది.

అలాగే, సూరా కహఫ్‌లోనే ఆయత్ నంబర్ 30లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం, నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృథా కానివ్వము.

ఎవరి కర్మలు, ఎవరి ప్రతిఫలం వృథా కాదు? ఈ ఆయత్ యొక్క అనువాదం గమనించండి. ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాత్. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, ఆచరించే వారు, ఏదైతే నేర్చుకున్నారో, ధర్మ అవగాహనం కలిగి ఉన్నారో, ఆ తర్వాత జ్ఞానం తర్వాత దానిపై కట్టుబడి ఉన్నారో, స్థిరంగా ఉన్నారో వారి ప్రతిఫలాన్ని అల్లాహ్ వృథా చేయడు. ఈ ఆయత్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు.

అలాగే, సూరా బఖరా ఆయత్ నంబర్ 277లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించి (సున్నత్‌ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని గమనించండి. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి, విశ్వసించిన తర్వాత, ఆర్జించిన తర్వాత, అవగాహన కలిగిన తర్వాత, దానిపైన స్థిరంగా ఉండేవారికి, కట్టుబడి ఉండేవారికి, నమాజులను నెలకొల్పే వారికి, జకాతులను చెల్లించే వారికి, తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది, వారికి ఎలాంటి భయం గానీ, చీకూచింత గానీ ఉండదు. అభిమాన సోదర సోదరీమణులారా,

ఈ ఆయత్‌లో నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలిచాను, బాగా గమనించి వింటారని ఆశిస్తున్నాను, గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆయత్‌లో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ఉంది ఖౌఫ్, రెండవది ఉంది హుజ్న్. ఖౌఫ్ అంటే ఉర్దూలో డర్, తెలుగులో భయం. హుజ్న్ అంటే ఉర్దూలో గమ్, తెలుగులో దుఃఖం, చింత. ఇక దీనికి మనము అసలు ఖౌఫ్ దేనిని అంటారు, హుజ్న్ దేనిని అంటారు? భయం అంటే ఏమిటి, హుజ్న్, దుఃఖం, చింత అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి.

ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించినది. భవిష్యత్తులో, రాబోయే కాలంలో. ప్రమాదానికి సంబంధించినది. గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధను హుజ్న్ అంటారు. తేడా చూడండి. ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించిన విషయం. హుజ్న్ అంటే చింత అంటే, దుఃఖం అంటే, గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధకు సంబంధించినది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ధర్మ పండితుల వివరణ ఏమిటంటే, భయం, ఖౌఫ్ అనేది గ్రహించిన ప్రమాదం వల్ల కలిగే ఆటంకం. హుజ్న్, గమ్, చింతన అంటే మానసిక క్షోభ లేదా గుండె యొక్క డిప్రెషన్ ని అంటారు. అల్లాహు అక్బర్. అంటే, ధర్మ అవగాహన తర్వాత, జ్ఞానం తర్వాత, కట్టుబడి ఉంటే ఈ రెండు ఉండవు. ఖౌఫ్ ఉండదు, హుజ్న్ ఉండదు. భయము ఉండదు, దుఃఖం ఉండదు. గతం గురించి, భవిష్యత్తు గురించి. ఇంత వివరం ఉంది ఈ ఆయత్‌లో.

అభిమాన సోదరులారా, అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూనుస్, సూరా యూనుస్ ఆయత్ నంబర్ తొమ్మిదిలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గ వనాలలోకి.

అభిమాన సోదరులారా, సమయం అయిపోతా ఉంది నేను తొందర తొందరగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు. (సూరా మర్యం ఆయత్ 96)

సుబ్ హా నల్లాహ్. విశ్వసించి, దానిపై కట్టుబడి ఉంటే, స్థిరత్వంగా ఉంటే, ఆచరిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమానురాగాలను సృజిస్తాడు. అంటే, ప్రజల హృదయాలలో వారి పట్ల ప్రేమను, గౌరవ భావాన్ని జనింపజేస్తాడు అన్నమాట.

అలాగే సూరా బయినా ఆయత్ ఏడులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.(98:7)

మానవులలో, ప్రజలలో, మనుషులలో అందరికంటే ఉత్తమమైన వారు, గొప్పమైన వారు, ఉన్నత స్థాయికి చేరిన వారు ఎవరు? విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు. నిశ్చయంగా సృష్టిలో వారే అందరికంటే ఉత్తములు అని సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అభిమాన సోదరులారా, అబూ అమర్ లేదా అబీ అమ్రా సుఫియాన్ బిన్ అబ్దుల్లా కథనం, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను. ఆయన ఏం అడిగారు ప్రవక్త గారితో? నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి. అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకళ్ళని అడగవలసిన అవసరం రాకూడదు. ఒక విషయం చెప్పండి అది విని నేను ఆచరించిన తర్వాత ఇంకెవ్వరికీ అడిగే నాకు అవసరమే రాకూడదు, అటువంటి విషయం ఏమైనా బోధించండి అని ఆయన కోరితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు: ఒకే ఒక వాక్యం. దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి.

آمَنْتُ بِاللهِ ثُمَّ اسْتَقِمْ
(ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్)

అంటే, నేను అల్లాహ్‌ను నమ్ముతున్నాను, నేను అల్లాహ్‌ను విశ్వసిస్తున్నాను, అల్లాహ్ పట్ల విశ్వాసం, ఈమాన్ కలిగి ఉన్నాను అని చెప్పు. తర్వాత ఆ మాట పైనే స్థిరంగా, నిలకడగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. అంటే చివరి శ్వాస వరకు ఈమాన్ పైనే స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అన్నమాట. అభిమాన సోదరులారా, ఈ విధంగా దీనికి సంబంధించిన ఆయతులు, ఖురాన్ ఆయతులు, హదీసులు చాలా ఉన్నాయి.

ఇక, మోక్షానికి మార్గం ఈ అంశానికి సంబంధించిన నేను మూడు విషయాలు చెప్తానని ప్రారంభంలో అన్నాను. ఒకటి జ్ఞానం, కొన్ని విషయాలు తెలుసుకున్నాము. రెండవది దానిపై కట్టుబడి ఉండటం. ఇల్మ్ తర్వాత అమల్. జ్ఞానం తర్వాత ఆచరణ. ఇక ఈ రోజు నా మూడవ విషయం ఏమిటంటే,

أَلدَّعْوَةُ إِلَيْهَا (అద్దఅవతు ఇలైహా) – ఇతరులకు అందజేయటం. దావత్.

ఇల్మ్, అమల్, దావత్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ 104లో ఇలా సెలవిచ్చాడు:

وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా నహల్‌లో ఆయత్ 125లో ఇలా సెలవిచ్చాడు:

ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోను, చక్కని ఉపదేశంతోను పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. అంటే, ధర్మ పరిచయ, దావత్ కార్యక్రమానికి సంబంధించిన మూల సూత్రాలు తెలుపబడ్డాయి. ఏ విధంగా ఆహ్వానించాలి? అది వివేకం, మంచి హితబోధ, మృదుత్వంతో కూడుకున్నవి. అత్యుత్తమ రీతిలో మాట్లాడాలి. నగుమోముతోనే విషయాన్ని విడమరిచి చెప్పాలి. మీరు వారి శ్రేయాన్ని అభిలషించే వారన్న అభిప్రాయాన్ని ఎదుటి వారితో కలిగించాలి. దురుసు వైఖరి ఎంత మాత్రం తగదు.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫుస్సిలత్ ఆయత్ 33లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్ వైపు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, నేను విధేయులలో ఒకడను అని పలికే వాని మాట కంటే మంచి మాట మరెవరిది కాజాలదు, కాగలదు. అంటే ఎవరైతే అల్లాహ్ వైపు పిలుస్తాడో, అంటే దావత్ పని చేస్తాడో, ఇతరులకు అందజేస్తాడో, అటువంటి మాట కంటే మంచి మాట, గొప్ప మాట, ఉత్తమమైన మాట ఎవరిది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు.

అభిమాన సోదరులారా, సూరా మాయిదా ఆయత్ నంబర్ 78. ఈ విషయం చాలా ముఖ్యమైనది.

لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
బనీ ఇస్రాయీల్‌లోని అవిశ్వాసులు దావూద్ నోట, మర్యం పుత్రుడైన ఈసా అలైహిస్సలాం నోట, దావూద్ అలైహిస్సలాం నోట, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శాపానికి గురయ్యారు. ఎందుకంటే, ఎందుకు? కారణం ఏమిటి? వారు అవిధేయతకు పాల్పడేవారు, హద్దు మీరి ప్రవర్తించేవారు. అంతేకాకుండా చివర్లో అల్లాహ్ ఈ ముఖ్యమైన కారణం చెప్పాడు. అది ఏమిటి? కానూ లా యతనాహౌన అమ్ మున్కరిన్ ఫఅలూహు లబిఅస మా కానూ యఫ్అలూన్. వారు తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించే వారు కారు. వారు చేస్తూ ఉండినది బహు చెడ్డది. ఈ ఆయత్‌లో బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గానికి దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శపించబడటం జరిగింది, ఒక వర్గం శపించబడ్డారు. కారణం ఏమిటి? ముఖ్యమైన మూడు కారణాల వల్ల వారు శాపానికి గురయ్యారు, ప్రవక్తల ద్వారా. ఆ ముఖ్యమైన మూడు విషయాలు ఏమిటి? ఒకటి, అల్లాహ్ విధిని నెరవేర్చకుండా ఉండటం. ఒకటి అల్లాహ్ విధిని వారు నెరవేర్చలేదు. అంటే ఆచరించలేదు. వారికి ఏ ధర్మ జ్ఞానం అల్లాహ్ ఇచ్చాడో, ఏ జ్ఞానాన్ని అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ ఆదేశాలు అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ జ్ఞానం వారికి తెలుసో దానిపైన వారు ఆచరించలేదు, జ్ఞానం తర్వాత ఆచరణ లేదు.

రెండవ కారణం ఏమిటి? ధర్మం విషయంలో అతిశయించటం, గులూ చేయటం. మూడవ విషయం ఏమిటి? చెడుల నుంచి ఆపే పని చేయకపోవటం. అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావా పని వారు చేయలేదు. ముఖ్యమైన ఈ మూడు కారణాల వల్ల బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గం దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు. ఇది మనము గ్రహించాల్సిన విషయం.

అభిమాన సోదరులారా, ఇక దావత్ విషయంలో, ఇతరులను, ధర్మాన్ని, జ్ఞానాన్ని అందజేసే విషయంలో, ముఖ్యమైన ఒక విషయం ఉంది. అది మనం గమనించాలి. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూసుఫ్ ఆయత్ 108లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
అల్లాహు అక్బర్. ఈ ఆయత్ యొక్క పూర్తి నేను వివరణలోకి పోను అంత సమయం కూడా లేదు. క్లుప్తంగా దీని అర్థం తెలుసుకుందాము. ఓ ప్రవక్తా, ఇలా చెప్పు, నా మార్గం అయితే ఇదే. నేను, నా అనుయాయులు పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే వారిలోని వాడిని కాను, అంటే నేను ముష్రిక్‌ను కాను. అంటే, తౌహీద్ మార్గమే నా మార్గం, మొదటి విషయం. రెండవది, నేనే కాదు ప్రవక్తలందరి మార్గం కూడా ఇదే. మూడవది, నేను ఈ మార్గం వైపు ప్రజలని ఆహ్వానిస్తున్నాను, దావా పని చేస్తున్నాను కదా, పూర్తి విశ్వాసంతోను, ప్రమాణబద్ధమైన ఆధారాలతోను, నేను ఈ మార్గం వైపునకు పిలుస్తున్నాను. నేను మాత్రమే కాదు, నన్ను అనుసరించే వారు కూడా ఈ మార్గం వైపుకే పిలుస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు, దోషరహితుడు, సాటిలేని వాడు, ప్రజలు కల్పించే భాగస్వామ్యాలకు, పోలికలకు ఆయన అతీతుడు. అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దావత్ విధానం, గూగుల్ సార్‌ని ఆధారంగా తీసుకొని, నాలుగు పుస్తకాలు లేకపోతే నాలుగు విషయాల, నాలుగు సబ్జెక్టుల, నాలుగు సబ్జెక్టులు కంఠస్థం చేసుకొని లేదా నాలుగు ఆడియోలు, వీడియోల క్లిప్పులు చేసి అది కంఠస్థం చేసుకొని సూటు బూటు వేసుకొని ధర్మ పండితులు అవ్వరు. సరైన ధర్మ అవగాహనం కలిగి ఉండాలి. అదఊ ఇలా ఇలల్లాహి అలా బసీరతిన్, పూర్తి విశ్వాసం తర్వాత ప్రమాణబద్ధమైన ఆధారాలతోను.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో నేను ఒక్క హదీస్ చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. చిన్న హదీస్, మూడే మూడు పదాలు ఉన్నాయి ఆ హదీస్‌లో. అది ఏమిటంటే, కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

بَلِّغُوا عَنِّي وَلَوْ آيَةً
(బల్లిగూ అన్నీ వలవ్ ఆయహ్)

నా తరఫు నుండి ఒక్క ఆయత్ అయినా సరే మీకు తెలిస్తే, అది ఇతరులకు అందజేసే బాధ్యత మీ పైన ఉంది. ఈ హదీస్‌లో మూడు ముఖ్యమైన విషయాలు ఇమాం హసన్ బసరీ రహమతుల్లాహి అలైహి వివరించారు. బల్లిగూ అనే పదంలో తక్లీఫ్ ఉంది. అన్నీ అనే పదంలో తష్రీఫ్ ఉంది. వలవ్ ఆయహ్ అనే పదంలో తస్హీల్ ఉంది. తక్లీఫ్ అంటే బాధ్యత. బల్లిగూ అనే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆదేశం అది, ఆర్డర్. బల్లిగూ. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత ఇస్తున్నారు, ముకల్లఫ్ చేస్తున్నారు. ఇతరులను అందజేసే బాధ్యత మీపై ఉంది, మీపై మోపుతున్నాను, ఈ విషయం గ్రహించండి. ఈ పదంలో తక్లీఫ్ ఉంది. ఆ బాధ్యతను మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. రెండవది అన్నీలో తష్రీఫ్ ఉంది. తష్రీఫ్ అంటే గౌరవం. నా తరఫు నుంచి వచ్చిన విషయాలు, నా తరఫు నుంచి, గమనించాలి, వివరణకి పోవటానికి సమయం లేదు, నా తరఫు నుంచి అంటే ఖురాన్, ప్రామాణికమైన హదీసులు మాత్రమే. అన్నీ. ఏ హదీస్ కి ప్రామాణికం లేదో, ఆ విషయాలు చర్చించకూడదు. మౌజూ హదీస్, మన్ఘడత్ హదీస్, ఖురాఫాత్, ఇస్రాయీలియాత్, వారి వెంట పడకూడదు. అన్నీ నా తరఫు నుంచి స్పష్టంగా ఈ వాక్యం నేను చెప్పాను. ఖురాన్ గురించి సందేహం లేదు. కాకపోతే ఖురాన్ యొక్క అవగాహన, ఈ వాక్యానికి భావం ఏమిటి? ఈ వాక్యానికి అర్థం సహాబాలు ఎలా చేసుకున్నారు? ఈ వాక్యానికి అర్థం ప్రవక్త గారు ఎలా చెప్పారు? ఆ వాక్యానికి అర్థం సహాబాలు, తాబయీన్లు, ముహద్దసీన్లు, సలఫ్‌లు ఏ అర్థం తీసుకున్నారో ఆ అర్థమే మనం తీసుకోవాలి. హదీస్ విషయంలో, ప్రవక్త గారి ప్రవచనాల విషయంలో అన్నీ, నా తరఫు నుంచి, ఈ హదీస్ సహీహ్, ఈ హదీస్ ప్రామాణికమైనది, ఇది హసన్ అని మీకు నమ్మకం అయితేనే మీరు చెప్పాలి. అన్నీ ఎందుకంటే అది గౌరవంతో పాటు ప్రవక్త గారు కండిషన్ పెట్టారు, నా తరఫు నుంచి వచ్చే హదీసులు చెప్పండి. అంటే ఏ విషయం గురించి స్పష్టత లేదో, ఇది ప్రవక్త గారి వాక్యం కాదు, స్పష్టత లేదు, మౌజూ హదీస్, మున్కర్ హదీస్, జయీఫ్ హదీస్, మన్ఘడత్ హదీస్ అంటే ఏంటి? అది ప్రవక్త గారు చెప్పారని రుజువు లేదు. అటువంటి విషయాలు మనం చెప్పకూడదు. బల్లిగూ అన్నీ వలవ్ ఆయాలో మొదటిది బాధ్యత ప్రవక్త గారు మాకు అప్పగిస్తున్నారు. అల్లాహు అక్బర్. రెండవది అన్నీ, ప్రవక్త గారు మాకు గౌరవాన్ని ప్రసాదిస్తున్నారు. వలవ్ ఆయహ్ ఈ పదం చెప్పి ప్రవక్త గారు మాకు సులభం చేశారు. శక్తికి మించిన బరువు మోపలేదు. మీకు ఎంత శక్తి ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత స్తోమత ఉందో, ఎంత జ్ఞానం ఉందో అంతవరకే మీరు బాధ్యులు. ఈ మూడు విషయాలు ఈ హదీస్‌లో చెప్పబడింది.

అభిమాన సోదరులారా, ఈ విధంగా ఈ రోజు నేను మోక్షానికి మార్గం, సాఫల్యం, ఇహపరలోకాల సాఫల్యం, స్వర్గానికి పోయే దారి, నరకం నుండి ఎలా కాపాడుకోవాలి, మోక్షానికి మార్గం సారాంశం, దానికి సంబంధించిన మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాను. ఒకటిది జ్ఞానం, ఇల్మ్, అమల్, దావత్. జ్ఞానం, ఆచరణ, దావత్. క్లుప్తంగా చెప్పాలంటే నా ఈ రోజు ప్రసంగానికి సారాంశం ఏమిటి? అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్, ఆర్జించటం, ధార్మిక విద్య నేర్చుకోవటం. వల్ ఇల్తిజాము బిహా, నేర్చుకున్న తర్వాత కట్టుబడి ఉండటం, స్థిరత్వం కలిగి ఉండటం, ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ముఖ్యంగా ఎంత ఎక్కువ స్థానంలో మనము ఇస్లాంని ఆచరిస్తామో, ఎంత ఉన్నత స్థాయిలో మన విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాస పరంగానే మనకు బాధలు వస్తాయి. అప్పుడు ఆ బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. చాలా, దానికి మనకు ఆదర్శం ప్రవక్తలు, సహాబాలు, తాబయీన్లు. వారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి, వారికి ఏ విధంగా కష్టాలు వచ్చాయి. వారికి వచ్చే కష్టాలలో ఒక్క శాతం కూడా మాకు రావు, అయినా కూడా వారు, సుమయ్యా రదియల్లాహు అన్హా. మోక్షానికి మార్గం మేము సుమయ్యా రదియల్లాహు అన్హా యొక్క ఉదాహరణ మనం వివరిస్తే సరిపోతుంది కదా. సుమయ్యా రదియల్లాహు అన్హా ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. సన్మార్గ భాగ్యం దక్కింది. ఆ తర్వాత ఆవిడ పైన ఎన్ని కష్టాలు వచ్చాయి. ఒక పక్కన భర్త, ఒక పక్కన తనయుడు. వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, మనం ఊహించలేము. కానీ వారి విశ్వాసంలో కొంచెమైనా తేడా వచ్చిందా? కొంచెమైనా తేడా? చివరికి కొడుకు చూస్తున్నాడు, తనయుడు అమ్మార్ రదియల్లాహు అన్హా కళ్ల ఎదుట సుమయ్యా రదియల్లాహు అన్హాను దుర్మార్గుడైన అబూ జహల్ నాభి కింద పొడిచి హత్య చేశాడు. కానీ వారి విశ్వాసంలో తేడా వచ్చిందా? ఈ రోజు మనము చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న ప్రాపంచిక లబ్ధి కోసము, చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన విశ్వాసంలో తేడా జరిగిపోతా ఉంది.

అభిమాన సోదరులారా, ఆ విధంగా, మొదటి విషయం, అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్. రెండవది, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణం, కట్టుబడి ఉండటం. మూడవది, వద్దఅవతు ఇలైహా, ధర్మ ప్రచారం చేయటం. ఈ మూడు విషయాల సారాంశం, ఇవాళ తెలుసుకున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం కంటే ఎక్కువ, వినటం కంటే ఎక్కువ, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకుని, సరైన అవగాహన కలిగి, ఆ విధంగా ఆచరించి, అలాగే ఇతరులకు ప్రచారం చేసే, అందజేసే సద్బుద్ధిని, శక్తిని, యుక్తిని అల్లాహ్ ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ):
https://teluguislam.net/others/ilm-knowledge

ప్రియమైన అమ్మకు .. [పుస్తకం]

సంకలనం: నసీమ్ గాజీ

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF] 

అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ పేరుతో

ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్‌ ఫలాహ్‌, బిలేరియా గంజ్‌ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్‌ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్‌ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్‌ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.

నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.

ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.

ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్‌ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్‌ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్‌ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.

ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.

నసీమ్‌ గాజి
జూన్‌: 1980

సత్కార్య వనాలు: ధర్మ ప్రచారం, శిక్షణ

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలుతొమ్మిదవ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

నవ వనం – ప్రచారం, శిక్షణ

అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయవంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.

ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.

సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.

[فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ المُتَوَكِّلِينَ] {آل عمران:159}

(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).

నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.

నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.

నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالحِكْمَةِ وَالمَوْعِظَةِ الحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالمُهْتَدِينَ {النحل:125}

నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో. (నహ్ల్ 16: 125).

నీ బాధ్యత సందేశం అందజెయ్యడమే.

وَمَا عَلَينَا إِلَّا الْبَلَاغُ الْـمُبِين. {يس 17}
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత (యాసీన్ 36: 17).

హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.

ذَلِكَ هُدَى اللهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ وَمَنْ يُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ] {الزُّمر:23}
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు. (జుమర్ 39: 23).

నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.

ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ( రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారుః

(كَانَ غُلَامٌ يَهُودِيٌّ يَخْدُمُ النَّبِيَّ ﷺ فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ ﷺ يَعُودُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُ أَسْلِمْ فَنَظَرَ إِلَى أَبِيهِ وَهُوَ عِنْدَهُ فَقَالَ لَهُ أَطِعْ أَبَا الْقَاسِمِ ﷺ فَأَسْلَمَ فَخَرَجَ النَّبِيُّ ﷺ وَهُوَ يَقُولُ الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْقَذَهُ مِنْ النَّارِ)

ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) “అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు” అన్నారు. (బుఖారి 1356).

తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ ( రదియల్లాహు అన్హు) కు ఖైబర్ రోజున ఇలా చెప్పారు:

(ادْعُهُمْ إِلَى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ فَوَالله لَأَنْ يُهْدَى بِكَ رَجُلٌ وَاحِدٌ خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ)

“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం”. (బుఖారి 2942).

ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.

ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కార్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.

అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini).:- నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని. ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః

وَمَنْ يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الآَخِرَةِ مِنَ الخَاسِرِينَ {آل عمران:85}

ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85).

అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.


ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.

  • సత్కార్య వనాలు (Hadayiq)
    అంశాల నుండి
     : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
    అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఇతర లింకులు:

తౌహీద్ మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము – ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

6 వ అధ్యాయం
తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ

ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57). 

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ

“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ

“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).

తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది. 

ముఖ్యాంశాలు: 

1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది 

2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది. 

3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు. 

4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు. 

ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది. 

ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28). 

5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి! 

6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.” 

ఇది రెండు రకాలు: 

ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. 

రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. 

దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించ బడుతుంది

బిస్మిల్లాహ్

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم : (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)

13- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు. (నిసాయీ 4912).

عَنْ ابْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم أَنُؤَاخَذُ بِمَا عَمِلْنَا فِي الْجَاهِلِيَّةِ؟ قَالَ: (مَنْ أَحْسَنَ فِي الْإِسْلَامِ لَمْ يُؤَاخَذْ بِمَا عَمِلَ فِي الْجَاهِلِيَّةِ وَمَنْ أَسَاءَ فِي الْإِسْلَامِ أُخِذَ بِالْأَوَّلِ وَالْآخِرِ).

14- ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ‘ప్రవక్తా! మేము అజ్ఞాన కాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు) చేసిన దుష్కార్యాల గురించి పట్టుబడతామా?’ అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. “ఎవరు ఇస్లాం స్వీకరించి తర్వాత సత్కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, అతను అజ్ఞాన కాలంలో చేసిన దుష్కర్మల గురించి నిలదీయడం జరగదు. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కార్యాలు చేస్తూ ఉంటే, అతను గతంలో చేసినవాటితో పాటు మొత్తం పాపకార్యాల విషయంలో పట్టుబడిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. (బుఖారి 6921, ముస్లిం 120).

عَن حَكِيم بْن حِزَامٍ أَنَّهُ قَالَ لِرَسُولِ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم أَيْ رَسُولَ اللهِ أَرَأَيْتَ أُمُورًا كُنْتُ أَتَحَنَّثُ بِهَا فِي الْجَاهِلِيَّةِ مِنْ صَدَقَةٍ أَوْ عَتَاقَةٍ أَوْ صِلَةِ رَحِمٍ أَفِيهَا أَجْرٌ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم : (أَسْلَمْتَ عَلَى مَا أَسْلَفْتَ مِنْ خَيْرٍ).

15- హకీం బిన్ హిజాం ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ ‘ప్రవక్తా! నేను నా అవిశ్వాస జీవితంలో దానధర్మాలు, బానిసల విముక్తి, బంధువుల పట్ల దయాదాక్షిణ్యాలు మొదలైన సత్కార్యాలు చేశాను. మరి నాకు వాటి సుకృతఫలం లభిస్తుందా? అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు: “నీవు ఇస్లాం స్వీకరించిన కారణంగా నీ గత సత్కార్యాలకు కూడా ఇప్పుడు పుణ్యఫలం లభిస్తుంది”. (బుఖారి 1436, ముస్లిం 123).

హదీసుల కూర్పు & తెలుగు అనువాదం:
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

From Saheeh Muslim: Book of Emaan
https://abdurrahman.org/2014/09/04/sahih-muslim-book-001/

Chapter 54: WOULD (PEOPLE) BE HELD RESPONSIBLE FOR THE DEEDS COMMITTED DURING THE STATE OF IGNORANCE?


Book 001, Number 0217:

It is narrated on the authority of Abdullah b. Mas’ud that some people said to the Messenger of Allah (may peace be upon him): “Messenger of Allah, would we be held responsible for our deeds committed in the state of ignorance (before embracing Islam)?

Upon his he (the Holy Prophet) remarked:

He who amongst you performed good deeds in Islam, He would not be held responsible for them (misdeeds which he committed in ignorance) and he who committed evil (even after embracing Islam) would be held responsible or his misdeeds that he committed in the state of ignorance as well as in that of Islam.”


Book 001, Number 0218:

It is narrated on the authority of Abdullah b. Mas’ud: We once said: Messenger of Allah, would we be held responsible for our deeds committed in the state of ignorance? He (the Holy Prophet) observed:

He who did good deeds in Islam would not be held responsible for what he did in the state of ignorance, but he who committed evil (after having come within the fold of Islam) would be held responsible for his previous and later deeds.”

అఖీదా ప్రచారంలో సలఫ్ వారి త్యాగాలు & ప్రశ్నోత్తరాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[75 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

క్రైస్తవులకు దావా (ధర్మ ప్రచారం) ఏ పద్దతిలో ఇవ్వాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[48:23 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

దావా : ఇస్లాం ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/