ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం, వీడియో పాఠాలు] [మర్కజ్ దారుల్ బిర్ర్]

బిస్మిల్లాహ్


Usool-Thalatha & Qawaid-al-Arba
Shaykh Muhamamd bin AbdulWahhab (rahimahullah)
మూల రచయిత షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
అనువాదం: అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

[Download the Book]
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

[47 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వీడియో పాఠాలు:

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

మనవి 

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈపుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి. 

పాఠకులారా.. 

12వ శతాబ్ధము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కుతీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యే భయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది. 

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తే… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”. 

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్’ హిజ్రి శకం 1115 సంవత్సరంలో “ నజ్ద్” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో “ముహమ్మద్ బిన్ సఊద్” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్నీ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవారాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 

  • 1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు? 
  • 2. నీ ధర్మం ఏది? 
  • 3. నీ ప్రవక్త ఎవరు? 

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది. అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. 

ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వారా  ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలుపంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను… ఆమీన్. 

ధార్మిక సేవలో……… 
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి,M.A. 
తెలుగు అనువాదకులు , మర్కజుల్ హిదాయ, బహ్రేన్. 3-4-2007. 

అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తుపెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి. 

మొదటి విషయం :విద్యాభ్యాసన 

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట. 

రెండవ విషయం : ఆచరణ 

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట. 

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం 

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. 

నాలుగో విషయం : ఓర్పు, సహనం 

ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట. 

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

وَالْعَصْرِ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ . إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 

అర్ధం: “కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప”. (అల్ అస్103:1-3) 

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు: 

لَو مَا أَنْزَلَ اللهُ حُجَّةً عَلى خَلْقِهِ الْاهْذِهِ السُّورَةِ لَكَفَتُهُم 

అర్ధం : అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు. 

మాట, బాటకు ముందు జ్ఞానం‘ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట) 

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే : 

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ

అర్ధం: “తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) 

فَبُدَأَ بِالْعِلْمِ. 

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు. 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి. 

మొదటి సమస్య: 

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గవాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. 

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

అర్ధం : “మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16) 

రెండవ సమస్య: 

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) 

అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు: 

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

అర్ధం : “నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (అల్ జిన్న్ 72:18) 

మూడవ సమస్య: 

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీపబంధువులైన సరె. 

ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం: 

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ

అర్ధం : “అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను  ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు.ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆవనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యే వారు”. (అల్ ముజాదలహ్ 58:22) 

పాఠకులారా.. 

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే ” హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”.(అజ్జారియాత్ 51:56) 

يَعْبُدُونِ : అనేపదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి. 

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్”. అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”.(అన్నిసా 04:36)  

బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

ప్రతి మానవుడికి ఏ మూడు సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి: 

  • 1. ప్రతి వ్యక్తి తనప్రభువు గురించి అవగాహన పొందడం. 
  • 2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం. 
  • 3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గురించి అవగాహన పొందడం. 

ప్రధమ సూత్రం : విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన 

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి “నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దేవుడు. ఆయన తప్పమరోక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం. 

ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి : 

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

అర్ధం : “సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01:02) 

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి. మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వారా కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి. 

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి. 
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆ రెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ. 

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు: 

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు: 

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి (ఫుస్సిలత్ 41:37) 

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు”. (అల్ ఆరాఫ్ 7: 54) 

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది: 

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَالَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

అర్ధం : ఓమానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మిమ్మల్నీ, మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు.దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూకూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22) 

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు: 

الْخَالِقُ لِهذِهِ الأشْيَاءَ هُوَ الْمُسْتَحِقُ لِلْعِبَادَةِ (تفسير ابن كثير : ۱ : ۵۷ طبع مصر) 

అర్ధం : పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు (తఫ్సీర్ ఇబ్నెకసీర్) 

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబివ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి. 

ఆరాధనల అరబి నామాలు:

ఇస్లాం, ఈమాన్ ,ఇహ్సాన్ ,దుఆ ,ఖవ్ ఫ్ ,ఉమ్మీద్ వ రజా ,తవక్కుల్ ,రఘ్బత్ ,ఖుషూ ,ఖషియత్,  రుజూ ,ఇస్తి ఆనత్ ,ఇస్తి ఆజహ్ ,ఇస్తిఘాసహ్, జబహ్ ,ఖుర్బాని ,నజర్ వ మిన్నత్ మొదలైనవి. 

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కు పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. (అల్ జిన్న్ 72:18) 

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైనా అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ను గమనించండి : 

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ – అల్లాహ్‌ తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు”.  (అల్ మొమినూన్ 23:117) 

గమనిక : 

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ నుండి పేర్కొనడం జరిగింది గమనించండి. 

దుఆ (ప్రార్ధన) : అన్ని రకాల వేడుకోలు, మొరలు

మన అవసరాలను తీర్చుటకు సృష్టికర్తయిన అల్లాహ్ నే వేడుకుంటాము. కాబట్టి అది (మొరపెట్టుకునే) ఆరాధన. ‘దుఆ’యే ఆరాధన అని చెప్పటానికి దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) హదీసులో దీని గురించి ఇలా ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

الدُّعَاءُ مُخُ الْعِبَادَةِ . (ترمذی) 

అర్ధం : “ దుఆయే ఆరాధనలోని అసలైన పౌష్టికం”. (తిర్మిజి) 

దీనికై దైవ గ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించడం జరిగింది: 

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

అర్ధం: “మీ ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు- నన్ను పిలవండి. నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. ఎవరైన అహంకారంతో నా ఆరాధనను తిరస్కరిస్తే వారు తప్పకుండా హీనులై నరకములో ప్రవేశిస్తారు”. (అల్ మొమిన్ 40:60) 

‘ఖవ్ ఫ్ : భయ భీతి 

కేవలం అల్లాహ్ పట్ల భయభీతి కలిగివుండాలి తప్ప ఇతరుల భయభీతి మనసులో వుంచకూడదు. కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. అల్లాహ్ భయభీతి (అల్లాహ్ కు భయపడటం) కూడ ఆరాధనే. పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ 03:175) 

ఉమ్మీద్ వ రజా: ఆశా & భీతి 

దాసుడు అల్లాహ్ పట్ల విశ్వాసుడై ఆయనపై ఆశలు పెట్టుకుంటాడు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

అర్ధం : “ఎవరైన తన ప్రభువుతో కలవాలని ఆశిస్తున్నప్పుడు అతను సత్కార్యాలు చెయ్యాలి, 

మరియు ఆరాధనల్లో తన ప్రభువుకు సాటి కల్పించకూడదు. (అల్ కహఫ్18:110) 

తవక్కుల్: అల్లాహ్ పై నమ్మకం 

నమ్మకం అంటే ఏదైన కార్యం జరగాలని ఆయన (అల్లాహ్) పైనే నమ్మకం, భారం మోపుతారు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి“. (అల్ మాయిదా 5:23) 

దైవ గ్రంధములో మరో చోట ఇలా తెల్పబడింది: 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు”. (అత్తలాఖ్ 65:3) 

రగ్బత్, రహ్బత్, ఖుషూ: ఆయన వైపే మరలుతూ భయపడాలి 

అంటే ఆశ, భయభీతి తోను, వినమ్రత తోనూ ఆయన వైపే మరలుతారు. ఇదీ ఆరాధనే. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు”. (అల్ అంబియా 21:90) 

ఖష్యత్ : భయ భక్తులు కలిగి వుండటం 

ఎవరైన దౌర్జన్యం చేసినప్పుడు భయపడతాం. కాని అటువంటి సందర్భాల్లో కూడ అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. ఇదీ ఒక ఆరాధనే. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా ప్రస్తావించాడు: 

 فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي

మీరు వారితో భయపడకండి, నా తోనే భయపడండి”. (అల్ బఖర 2:150) 

ఇనాబత్, రుజు : మరలటం 

తప్పు జరిగిన ప్రతిసారి అల్లాహ్ వైపు మరలాలి. ఇదీ ఒక ఆరాధనే. 

దీనికై పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి”. (అజ్జుమర్ 39:54) 

ఇస్తిఆనత్ : సహాయం కొరకు అర్ధించుట 

సర్వశక్తులు కలవాడైన అల్లాహ్ నుండి సహాయం కోరాలి. ఇదికూడ ఒక ఆరాధన. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

మేము నిన్నే ఆరాధిస్తున్నాము, మరియు నీతోనే సహాయాన్ని కోరుతున్నాము”. (అల్ ఫాతిహ 01:05) 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో కూడ ప్రత్యేకించి దీని గురించి చెప్పబడింది. 

إِذَا سُتَعَدُتَ فَاسْتَعِنُ بِاللَّهِ 

అర్ధం : “మీరు సహాయం కోరాలనుకున్నప్పుడు అల్లాహ్ సహాయాన్నే అర్ధించండి”. (తిర్మిజి, హసన్ సహీహ్) 

ఇస్తిఆజాహ్: శరణం, ఆశ్రయం కోరుట 

పరిపూర్ణంగా ఆశ్రయమిచ్చే అల్లాహ్ ఆశ్రయాన్నే కోరాలి. ఇదీ ఒక ఆరాధనే. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ اَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ 

నేను మానవుల ప్రభువుతో, శరణు కోరుతున్నాను. మానవుల చక్రవర్తి (అల్లాహ్) తో (శరణు కోరుతున్నాను)”. (అన్నాస్ 114:1-2) 

ఇస్తిగాస: నిర్బంధత్వంలో అల్లాహ్ సహాయాన్ని అర్జించుట

 ఇదీ ఒక ఆరాధనే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ

అర్ధం : “ఆ సందర్భాన్ని తలచుకొండి అప్పుడు మీరు మీ ప్రభువును మొరపెడుతూ వేడుకున్నారు అప్పుడు ఆయన మీ బాధను విన్నాడు (మీమొరను ఆలాకించాడు)”. (అల్  అన్ ఫాల్  08:09) 

జిబాహ్, ఖుర్బాని : సమర్పణ, బలిదానం 

ఇదికూడ అల్లాహ్ కొరకే చేయాలి. 

అల్లాహ్ పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.” (అల్ అన్ఆమ్ 06:162,163) 

దీనిగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ఇలా ప్రస్తావించారు: 

لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ 

ఎవరైన అల్లాహ్ ను తప్ప మరే ఇతర ఆరాధ్య దేవుళ్ళ (ప్రవక్త, వలి, పీర్, ముర్షద్, బాబా, సమాధిలోని వాడు) సన్నిధి కోరాలని దేనినైనా బలిస్తే, అతని పై అల్లాహ్ శాపం కలుగుతుంది”. (ముస్లిం) 

నజర్ : మొక్కుబడి 

ఇది కూడ అల్లాహ్ కోసమే చేయాలి. ఇది కూడా ఒక ఆరాధనే. దీని గురించి ఖుర్ఆన్ గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అద్దహర్ 76:7) 

رَبِّ زِدْنِي عِلْمًا 

ద్వితీయ సూత్రం: 

ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో తెలుసుకోవడం తప్పని సరి 

అల్లాహ్ ఏకత్వాన్ని సహృదయముతో అంగీకరిస్తూ తమకు తాము అల్లాహ్ కు విధేయులుగా సమర్పించుకోవాలి. ఆయన ఆదేశాలకు అణుగుణంగా విధేయతపాటిస్తూ అనుసరించాలి. ఆయనతో పాటు మరెవ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాటి కల్పించకూడదు. ఇదే సత్య ధర్మం (దీన్). 

ధర్మంలో 3 స్థానాలున్నాయి: 

  • 1. మొదటి స్థానం : ఇస్లాం 
  • 2. రెండవ స్థానం : ఈమాన్ 
  • 3. మూడవ స్థానం : ఇహ్సాన్ 

ఈ మూడింటిలోనూ ప్రతి దానికి కొన్ని మూలాలున్నాయి.

ఇస్లాం – దీనికి 5 మూలాలున్నాయి. 

  • 1. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడని, (తౌహీద్) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్య ప్రవక్త అని సాక్షమివ్వటం. 
  • 2. నమాజు స్థాపించటం. 
  • 3. జకాత్ (ధర్మ దానం) ఇవ్వటం. 
  • 4. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం. 
  • 5. హజ్ (కాబా గృహ దర్శనం) చేయటం. 

పై పేర్కొనబడిన “ఇస్లాంకు గల 5 మూలాల” గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

1. తౌహీద్: అల్లాహ్ ఏకత్వానికి సాక్షమివ్వటం 

అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యదేవుడు. ఆయనకు సాటి ఎవరూలేరు అని నమ్మి, ఉచ్చరించడం. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు”. (ఆలి ఇమ్రాన్ 03:18) 

తౌహీద్ గురించి సాక్ష్యం అంటే అల్లాహ్ తప్ప మరెవరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు. ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ వాక్యపరంగా కలిగివున్న అర్ధం ఏమిటంటే, ‘లాఇలాహ‘ ఏ దేవుడు లేడని, “అల్లాహ్ తప్ప మరిదేనిని ఆరాధించిన, పూజించిన నిరాకరించ బడుతుందనే అర్ధం కలిగివుంది”. మరి ‘ ఇల్లల్లాహ్ ‘ కేవలం ఏకైక అల్లాహ్ కొరకే సమస్త ఆరాధనలు ఉన్నాయనే అర్ధం కల్గియుంది. ఆయన సామ్రాజ్యంలో, ఎలాగైతే ఎవరూ భాగస్వాములు లేరో, అలాగే ఆయన ఆరాధనల్లో ఆయనకు ఎవరూ సాటిలేరు. 

దీని గురించి పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను.“నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.”మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి. (అజ్ జుఖ్ రుఫ్ 43:26-28) 

మరొక చోట ఖుర్ఆన్ గ్రంధములోఇలా ప్రస్తావించబడింది. 

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ

(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి. (ఆలి ఇమ్రాన్ 03:64) 

దైవ సందేశరునికి సాక్ష్యం : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ ప్రవక్త అని సాక్షమివ్వాలి. అందుకు పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు”. (అత్ తౌబా 9:128) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం అంటే ఆయన ఇచ్చిన ఆదేశాలను సంపూర్ణంగా పాటించటం. ఆయన దేనినైతే తెలియచేశారో దానిని సత్యం అని అంగీకరించాలి. దేని గురించైతే నిరాకరించారో దానికి పూర్తిగా కట్టుబడి వుండాలి. అల్లాహ్ ఆరాధన కేవలం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడుగు జాడల్లోనే ఆచరించాలి. 

నమాజ్, జకాత్, తౌహీద్ మూడింటికి సంబంధించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం”. (అల్ బయ్యిన 98:05) 

పవిత్ర రమజాన్ మాసములో ఉపవాసాలు పాఠించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”. (అల్ బఖర 2:183) 

కాబా గృహాన్ని సందర్శించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు: 

فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ

అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఆలి ఇమ్రాన్ 03:97) 

రెండవ స్థానం: ఈమాన్ 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

“ఈమాన్ (విశ్వాసం) కు సంబంధించి డెబ్భైకు పైగా స్థానాలున్నాయి. అందులో ఉన్నత స్థానం “లాఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు) అని సాక్ష్యం పలకటం. అన్నిటి కంటే అల్ప స్థానం దారి నుండి హాని కల్గించే వస్తువు (ముళ్ళు వంటివి)ను దూరం చేయడం.సిగ్గు, వ్రీడ, శీలం కూడ విశ్వాసానికి సంబంధించిన విషయాలే”. (సహీహ్ ముస్లిం). 

ఈమాన్ కు 6 కోణాలున్నాయి 

  • 1. అల్లాహ్ ను విశ్వసించుట.
  • 2. అల్లాహ్ దూతలను విశ్వసించుట.
  • 3. అల్లాహ్ గ్రంధాలను విశ్వసించుట.
  • 4. అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించుట.
  • 5. ప్రళయ దినాన్ని విశ్వసించుట. 
  • 6. విధి వ్రాత చెడైన, మంచిదైన దానిని విశ్వసించుట. 

ఈమాన్ (విశ్వాసం)కు గల 6 కోణాలకు ఆధారాలు : 

పైన పేర్కొనబడిన ఆరింటిలో ఐదు గురించి దైవగ్రంధం పవిత్ర పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం” (అల్ బఖర 2:177) 

6వ కోణం విధి వ్రాత (మంచి, చెడు) గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా పేర్కొనబడింది: 

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ

నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము”. (అల్ ఖమర్ 54:49) 

మూడవ స్థానం: ఇహ్సాన్: ఉత్తమం 

‘ఇహ్సాన్’కు సంబంధించి ఒకే ఒక మూలం ఉంది. అది మీరు అల్లాహ్ ను  అభిమానంతో, భయభక్తితో, ఆయన వైపు ఏకాగ్రతతో,మరలుతూ ప్రార్ధించాలి. మనస్పూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నట్టు ఆరాధించాలి. మనము చూడలేక పోయినా ఆయన మమ్మల్ని చూస్తునే ఉన్నాడని గ్రహించాలి. 

‘ఇహ్సాన్ ‘కు సంబంధించిన ఆధారాలు : 

‘ఇహ్సాన్’ గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ

నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు” (అన్ నహ్ల్ 16:128) 

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగ పడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు”.  (ఆష్ షుఅరా 26: 217-220). 

మరో చోట ఇలా పేర్కొన్నాడు: 

وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ

(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము” (యూనుస్ 10:61)

పై మూడింటికి సున్నత్ ఆధారాలు: 

ధర్మంలో పై మూడు స్థానాలు ఉన్నాయని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రముఖ, ప్రఖ్యాత హదీసు ‘హదీసె జిబ్రయీల్ ‘ను గమనించండి: 

” عن عمر بن الخطاب رضی الله عنه قال: بينما نحن جلوس عند النبى الله اطلع علينا رجلٌ 

شديد بياض الثياب، شديد سواد الشعر، لأيرى عليه أثر السفر، ولا يعرفه منا احد. فجلس 

الى فـأسـنــدركبتيه إلى ركبتيه ووضع كـفيـه عـلـى فـخـذيــه وقال: يا محمد، أخبرني عن الإسلام، فقال: أن تشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله ، وتقيم الصلوة، وتؤتي الزكاة،وتصوم 

رمضان، وتحج البيت إن استطعت اليه سبيلاً. قال : صدقت. فعجبناله يسأله ويصدقه. قال: أخبرني عن الإيمان، قال أن تؤمن بالله وملائكته وكتبه ورسله واليوم الآخر وبالقدر خيره وشره.قال: أخبرني عن الاحسان، قال: أن تعبد الله كأنك تراه فان لم تراه فانه يراك. قال أخبرني عن الساعة،قال: ما المسؤل عنها بأعلم من السائل. قال أخبرني عن أمارتها، قال: ان تلد الامة ربتها وأن ترى الحفاة العراة العالة رعاء 

الشاء، يتطاولون في البنيان قال : فمضى فلبثنامليا . قال : يا عمر أتدرون من السائل؟ قلنا: الله ورسوله 

أعلم، قال: هذا جبريل أتاكم يعلمكم أمر دينكم .” (صحیح بخاری و صحیح مسلم 

అర్ధం : హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) కధనం: 

“ఒక సారి మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి మా సమావేశంలో వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. తరువాత ఇలా ప్రశ్నించసాగాడు: 

ఓ ముహమ్మద్..! (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్లాం గురించి వివరించండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప మరేఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తూ, ‘నమాజు’ స్థాపించాలి. ధర్మదానం చేయాలి(జకాత్ చెల్లించాలి). పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసాలను పాటించాలి. సిరి, సంపదలు కల్గివుంన్నప్పుడు పవిత్ర ‘ కాబా’ (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే.. అన్నాడు. అతని జవాబుకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తునాడు, తనే నిజమంటున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు: ‘ఈమాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “అల్లాహ్ ను , ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మంచి, చెడు)ను విశ్వసించాలి. 

ఇది విన్న ఆ వ్యక్తి మళ్ళి ఇలా ప్రశ్నించాడు: ‘ఇహ్సాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు మనస్ఫూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నటు ఆరాధించు.. నీవు చూడక పోయిన ఆయన నిన్ను గమనిస్తున్నాడని గ్రహించు”. అనంతరం మళ్ళీ ప్రశ్నించాడా వ్యక్తి: మరి ప్రళయం ఎప్పుడోస్తుందో తెల్పండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ప్రళయం ఎప్పుడోస్తుందో ప్రశ్నించదగిన వానికంటే ప్రశ్నించే వాడికే బాగా తెలుసు” అని అన్నారు. ఆ వ్యక్తి మరల ప్రశ్నించాడు: అయితే దాని చిహ్నాలను చెప్పండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “బానిసరాలు తమ యజమానిని కంటారు. చెప్పులు, వస్త్రాలు లేని మెకల కాపర్లు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”. 

హజ్రత్ ఉమర్(రజి అల్లాహు అను) ఇలా తెలిపారు: ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము కొద్దిసేపు మౌనంగా వున్నాము. అంతలోనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- ఓ ఉమర్..! (రజి అల్లాహు అన్హు) ఆ ప్రశ్నికుడేవరో తెలుసా..? అన్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (బుఖారి, ముస్లిం). 

మూడవ సూత్రం: దైవప్రవక్త ﷺ గురించి అవగాహన 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన తండ్రి పేరు అబ్దుల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల మహా వృక్షము ఇలా ఉంది:  ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం

‘హాషిం’ వంశం పరువు, ప్రతిష్ఠ పేరు ప్రఖ్యాతలకు నిలయం. ఇది ఖురైష్ వంశానికి చెందింది. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అరేబియులు (అరబ్బులు) ప్రవక్త ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) సంతానం. 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) పూర్తి జీవిత కాలం 63సంవత్సరాలు. అందులో 40సంవత్సరాలు దైవ వాణి అవతరించక ముందువి. దైవ వాణి అవతరించి దైవ సందేశహరులుగా సంవత్సరాలు జీవించారు. ఆయన పవిత్ర మక్కా నగరంలో జన్మించారు. ఆయన పై తొలి దైవ వాణిలో ఈ వాక్యాలు అవతరింపబడ్డాయి. 

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ

(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (అల్ అలఖ్ 96:1) 

(వాటి ద్వార దైవప్రవక్తగా నియమితులయ్యారు.)

రెండో సారి దైవ వాణిలో అవతరించిన వాక్యాలు (ఆయతులు): 

يَا أَيُّهَا الْمُدَّثِّرُ

قُمْ فَأَنذِرْ


ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు”. (అల్ ముద్దస్సిర్ 74:1-2) 

ఈ వాక్యాల ద్వార దైవసందేశహరులుగా నియమితులయ్యారు. ప్రజలకు షిర్క్(బహుదైవారాధన) గురించి వారించి, హెచ్చరించి, తౌహీద్ (ఏకదైవారాధన) వైపునకు పిలవటానికి, అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. 

దీని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الْمُدَّثَرُ قُمْ فَانْذِرُ. وَرَبَّكَ فَكَبْرِ ، وَثِيَابَكَ فَطَهِّرُ وَالرُّجُزَ فَاهْجُر. 

وَلَا تَمْنُنْ تَسْتَكْسِرُ. وَلِرَبِّكَ فَاصْبِر) (سورة المدثر: ۱-۷۲) 

అర్ధం : “ ఓ దుప్పటి కప్పుకొని నిద్రించేవాడా..! మేలుకో (నిలబడు), (ప్రజలను)హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. నీ వస్త్రాలను పరిశుభ్రముగా ఉంచుకో. చెడు నుండి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే అత్యాశతో ఉపకారము చేయకు. నీ ప్రభువుకై సహనం వహించు”. 

(అల్ ముద్దస్సిర్74:1-7) 

దైవ వాణిలోని పదాల వివరణ:- 

2 قُمْ فَأَنذِرْ. మీరు ప్రజలను ‘షిర్క్ (బహుదైవారాధన) గురించి హెచ్చరించి భయపెట్టండి. అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవండి. 

3. وَرَبَّكَ فَكَبْرِ అల్లాహ్ ఏకత్వం తోపాటు అతని గొప్పతనాన్ని చాటి చెప్పండి. 

4. وَثِيَابَكَ فَطَهِّرُ  తమ కర్మలను షిర్క్ (బహుదైవారాధన) తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచండి. 

5. وَالرُّجُزَ అంటే విగ్రహాలు. 

6 فَاهْجُر అంటే దానిని విడనాడుట. 

వివరణ: 

విషయం ఏమనగా ఇంత కాలం మీరు ఎలాగైతే దానికి దూరంగా ఉన్నారో, అలాగే దాన్ని తయారు చేసి పూజించే వారితో కూడా దూరంగా ఉండండి. వారితో తమకు ఎటువంటి సంబంధములేదని చాటి (విజ్ఞప్తి చేయండి) చెప్పండి. 

ఈ ఒక్క అంశాన్నే మాటనే కేంద్రీకరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10సంవత్సరాలు అంకితం చేశారు. ప్రజలను ‘తౌహీద్’ (ఏకత్వం) వైపునకు పిలుస్తూవున్నారు. 10సంవత్సరాల తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు గగనయాత్ర (మేరాజ్) చేయించబడింది. ఆ శుభ సందర్భములో ఆయనపై అయిదు పూటల నమాజ్ విధిగా నిర్ణయించబడింది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 3 సంవత్సరాల వరకు పవిత్ర మక్కా నగరంలో నమాజు చేస్తూవున్నారు. ఆ తర్వాత పవిత్ర మదీనా వైపు వలస చేయమని ఆజ్ఞా పించటం జరిగింది. 

హిజ్రత్:(వలసత్వం) 

వలసచేయుట. అంటే షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశము నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ చేయగలిగే ప్రదేశమునకు వలసపోవుట అని అర్ధం. (బహుదైవారాధకుల ప్రదేశంలో ఏకదైవరాధన (అల్లాహ్ ఆరాధన) పట్ల కష్టాలు ఎదురై, సమస్యలు ముదిరినప్పుడు ఆ ప్రదేశం నుండి కేవలం ధార్మికత కోసమే వలస చేయాలి) ఈవిధముగా వలసచేయుట, ప్రదేశాలు మారుట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్ (జాతి) పై విధిగా పరిగణించబడింది. ఇది ప్రళయం వరకు సాగే విధి. దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది: 

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا

فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا

“(ఎవరైతే) తమ ఆత్మలపై అన్యాయం చేసుకుంటు ఉండేవారో, వారి ఆత్మలను దైవదూతలు (తమ) ఆధీనంలో తీసుకున్నప్పుడు (వారిని ప్రశ్నిస్తారు) మీరు ఈ స్థితిలో వున్నారేమిటని? (దానికి వారు బదులు పలుకులో) మేము భూమి పై బలహీనులుగా వున్నాము. దైవ దూతలు అంటారు. అల్లాహ్ యొక్క భూమి విశాలముగా లేదా? మీరు అందులో వలసచేయటానికి? వీరే ఆవ్యక్తులు! వీరి నివాసమే నరకము. అది మహా చెడ్డనివాసం. కాని నిజంగా అవస్థలో పడివున్న ఆ పురుషులు, స్త్రీలు, చిన్నారులు వలస పోవుటకు ఎటువంటి దారి పొందనప్పుడు, అల్లాహ్ వారిని క్షమించే అవకాశం ఉంది.అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు. మన్నించేవాడు”. (అన్నిసా 04:97-99) 

అల్లాహ్ మరొచోట అల్లాహ్ పేర్కుంటున్నాడు: 

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ

విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి”. (అన్కబూత్ 29:56) 

ఇమాం బగ్విఁ (రహ్మతుల్లాహి అలైహి) ఈ ఆయత్ అవతరణ సందర్భము గురించి ఇలా పేర్కొన్నారు: 

ఈ ఆయతు ఎవరైతే వలసచేయకుండా మక్కా ప్రదేశములో ఉన్నారో, ఆముస్లింల గురించి అవతరింపబడింది. అల్లాహ్ వారిని ఈమాన్ (విశ్వాస లక్షణం) తో పిలిచాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా ప్రస్తావించారు: 

لاتنقطع الهجرة حتى تنقطع التوبة ولا تنقطع التوبة حتى تطلع الشمس من مغربها 

“ తౌబా’ తలుపులు మూయబడే వరకు ‘హిజ్రత్’ వలసత్వం ఆగదు. మరి ‘తౌబా’ తలుపులు మూయబడాలంటే సూర్యుడు పడమర నుండి ఉదయిం చాలి. (ప్రళయ దినమే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు). 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. 

ఉదా : జకాత్ (ధర్మదానం), రోజా(ఉపవాసం), హజ్ (పవిత్ర మక్కా యాత్ర), అజాన్ (నమాజు కొరకు పిలుపు), జిహాద్ (ధార్మిక అంతులే కృషి) ‘అమర్ బిల్ మారూఫ్, నహి అనిల్ మున్కర్’ (మంచిని పెంచుట, చెడును త్రుంచుట) మొదలైనవి. 

పై ఆదేశాలపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం ప్రళయం వరకూ ఉంటుంది. దీనిని అల్లాహ్ యే ప్రళయం వరకు రక్షిస్తాడు. 

ఇస్లాం ధర్మం 

ప్రవక్త ﷺ శాసన సారాంశం 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపబడిన ఈ ధర్మం ఎంతో సంక్షిప్తమైనది, ఉత్తమమైనది. ప్రజలకు ఆ మంచి కార్యము అందలేదు అని చెప్పటానికి మంచిలోని ఏభాగము మిగలలేదు. మంచికార్యాలలో అమితముగా మార్గదర్శకత్వం వహించిన కార్యం ‘తౌహీద్’ (అల్లాహ్ ఏకత్వం) మరియు అల్లాహ్ మెచ్చుకునే ప్రతి మంచి కార్యంకూడ. ఈ పుణ్యకార్యాలు అల్లాహ్ ఇష్టాన్ని పొందుటకు మూలమైనవి. చెడు లో అతి ఎక్కువగా హెచ్చరించిన కార్యం ‘షిర్క్’ (అల్లాహ్ తోసాటి కల్పించడం, బహుదైవారాధన). మరి అల్లాహ్ ఇష్టపడని కార్యాలతో కూడ హెచ్చరించారు. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను అల్లాహ్ సర్వమానవాళి కొరకు దైవ సందేశహరులుగా పంపాడు. మానవులు జిన్నాతులు ఆయనకు విధేయత చూపాలని విధిగా నిర్ణయించాడు. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. (అల్ ఆరాఫ్ 7:158) 

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఇహ, పరలోకాలకు సంబంధించిన అన్ని విషయాల పరిష్కారాల్ని పెట్టాడు. ఎటువంటి లోపం మిగలలేదు. ఇందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అర్ధం : “ఈ రోజు నేను (అల్లాహ్) మీ ధర్మాన్ని మీకోసం పరి పూర్ణం చేశాను,మరి నా అనుగ్రహాన్ని మీపై పూర్తిచేశాను, ఇస్లాం మీ ధర్మంగా అంగీకరించాను”. (అల్ మాయిదా 05:3) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈలోకం నుండి పయనించారు (మరణించారు) అని చెప్పటానికి దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ ఆధారం: 

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

అర్ధం : “ప్రవక్తా..! మీరూ మరణించే వారే, మరియు వారు కూడ మరణించే వారే. చివరికి మీరందరు ప్రళయంలో మీ ప్రభువు ముందు తమ తమ ‘పేషీ’ (హాజరు ఇవ్వవలసి ఉన్నది) చేయవలసి యుంటుంది. (అజ్జుమర్ 39:30 – 31) 

ప్రజలందరూ మరణించిన తర్వాత తమకార్యకలాపాల ఫలితాలను పొందటానికి లేపబడతారు, దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ

“ఇదే భూమి నుండి మేముమిమ్మల్ని సృష్టించాము, మరియు ఇందులోకే తీసుకు వెళ్తాము, దీని నుండే మిమ్మల్ని మరల వెలికితీస్తాము. (మరోసారి సృష్టిస్తాము)”. (తాహా 20:55) 

మరణాంతర జీవితం గురించి మరోచోట ఇలా పేర్కొన్నాడు: 

وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

అల్లాహ్ మిమ్మల్ని ప్రత్యేకించి భూమి నుండి సృష్టించాడు, మరల ఆయన అదే భూమిలోకి తీసుకువెళ్తాడు. (ప్రళయంనాడు అదే భూమి నుండి) మిమ్మల్ని ఒక్కసారిగా లేవతీస్తాడు”. (సూరె నూహ్ 71:17-18) 

మలి విడత సృష్టించిన తర్వాత అందరితో లెక్క తీసుకుంటాడు. వారి పాప పుణ్యకర్మల ప్రకారం ప్రతిఫలాన్ని అందజేస్తాడు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

وَلِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاؤُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ 

الَّذِينَ أَحْسَنُوا بالحسنى (سورة النجم : ٣١) 

భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతిదానికి అల్లాహ్ యే అధిపతి. (ఎందుకంటే) పాపకార్యాలు చేసిన వారికి వారి కర్మఫలాన్ని ఇచ్చేందుకునూ, మరి పుణ్యవంతులకు మంచి ఫలితాన్ని ప్రసాదించేందుకునూ”. (అన్నజ్మ్  54:31) 

ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి, అతని గురించి దైవగ్రంధము ఇలా ప్రస్తావిస్తుంది: 

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.”. (అత్తఘాబున్ 64:7) 

అల్లాహ్ ప్రవక్తలందరికి ‘స్వర్గపు’ శుభవార్త ఇచ్చేవారుగా, ‘నరకము’ నుండి హెచ్చరించేవారుగా చేసి పంపాడు: 

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ

మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి”. (అనిస్సా 4:165) 

ప్రవక్తల్లో తొలి ప్రవక్త హజ్రత్ ‘నూహ్’ (అలైహిస్సలాం) చివరి ప్రవక్త హజ్రత్ ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయనే అంతిమ ప్రవక్త. ప్రవక్త ‘నూహ్’ (అలైహిస్సలాం) కంటే ముందు ఏ ప్రవక్త లేరు. అల్లాహ్ దీని గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ

ఓ ప్రవక్తా! మేము మీవైపు అలాగే దైవవాణి పంపాము, ఎలాగైతే నూహ్ వైపు మరియు వారి తర్వాత ప్రవక్తలవైపు పంపామో”. (అన్నిస్సా 4:163) 

‘నూహ్’ (అలైహిస్సలాం) మొదలుకొని ప్రవక్త ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ప్రతి జాతిలోను మేము సందేశహరులను పంపాము. (వారు) తమ జాతి వారికి అల్లాహ్ ఆరాధించమని, ‘తాఘత్ ‘ను పూజించవద్దని చెప్తూవచ్చేవారు.

అందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఆధారం: 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము”. (అన్ నహ్ల్ 16:36) 

అల్లాహ్ తన దాసులందరి (జిన్నాతులు, మానవులు) పై విధిగా నిర్ణయించింది ఏమనగా వారు ‘తాఘాత్ ‘ను నిరాకరించి, తనను (అల్లాహ్) విశ్వసించి తీరాలి. 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్ ) ‘తాఘాత్’ గురించి వివరిస్తూ ఇలా పెర్కొన్నారు: 

“అల్లాహ్ తప్ప మరి దేనిని ఆరాధించినా, లేక అనుసరించినా (అనుసరించే విధానంలో అల్లాహ్ అవిధేయతను కల్గివుంటే), మరి ‘హలాల్-హరామ్’ విషయాలలో మరొకరికి విధేయత చూపినా, అతడు దైవదాసుల పరిధిని దాటిన వాడవుతాడు. అదే (సమయం) లో వాడు ‘తాఘత్’ను అనుసరించిన వాడవుతాడు. 

లెక్కకు మించిన ‘తాఘాత్’లు ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో అయిదుగురున్నారు. 

1. ఇబ్లీస్ లయీన్. 

2. ఎవరైన వ్యక్తి తన పూజ జరుగుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు.
3. ప్రజలకు తనను పూజించమని ఆహ్వానించే వ్యక్తి. 

4. నేను అగోచర విషయాల(జ్ఞానము కలవాడిని)ను ఎరుగుదును అనే వ్యక్తి. 

5. అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధములో ఇలా సెలవిస్తున్నాడు: 

 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుట మయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు”. (అల్ బఖర 2:256) 

ఇదే ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు) కు అసలైన అర్ధము, వివరణ. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. 

رَاسُ الأمر الاسلامُ وَعَمُودُهُ الصَّلاةُ وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ” اعلم 

(طبرانی کبیر ، صححه السيوطى فى جامع صغير وحسنه المناوي في شرحه والله 

అర్ధం : “ఈ ధర్మానికి అసలు మూలం “ఇస్లాం” మరి దీనిని (పటిష్టంగా నిలబెట్టె బలమైన) స్థంభం నమాజ్. ఇందులో ఉన్నతమైన, ఉత్తమమైన స్థానం దైవ మార్గములో చేసే ధర్మ పోరాటం”. (తబ్రాని కబీర్) 

మరణాంతర జీవితం – పార్ట్ 10: ప్రళయదినం రోజు అవిశ్వాసులు మరియు వారి పూజించిన మిధ్యా దైవాల మధ్య జరిగే వాదన [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 10 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 10. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఆ మహా మైదానంలో ఒక వైపున ఆరాధ్యనీయులు, మరోవైపు ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఏ పుణ్యాత్ములనైతే ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో, అలాంటి వారికి ఏమి సమాధానం ఇస్తారు? వినండి “షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాహ్ తో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు అల్లాహ్ వైపునకు తిరిగి ఓ మా ప్రభువా! వీరు! వీరే, వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి, నిన్ను వదిలి వీరిని మేము ఆరాధిస్తూ ఉంటిమి. వీరితో మేము దుఆలు చేస్తూ ఉంటిమి, వీరిని మేము అర్థిస్తూ ఉంటిమి. అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి, మీరు అసత్యం పలుకుతున్నారు, మీరు అసత్యం పలుకుతున్నారు“. మరోచోట ఆయత్ ఉంది. “మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు“. ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది. వారు వీరిని తిరస్కరిస్తారు.

ఎవరైనా గాని, ఈ రోజుల్లో ఎందరో కలిమా చదివిన ముస్లిం సోదర సోదరీమణులు కూడా అల్లాహ్ ను కాకుండా ఎవరెవరితో దుఆ చేస్తున్నారు. ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాహ్ ను కాకుండా, ఎవరెవరితో ఆ ఆరాధన యొక్క కొన్ని భాగాలు, కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ ఉన్నారు. అయితే పరలోకమున మైదానే మెహ్ షర్ లో వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది? ఈ ఆయతులను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొందే ప్రయత్నం చేయాలి.

ఇంకా ఈ ఇహలోకంలో ఆరాధనా సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి, సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి, కొందరి నాయకులను, కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ప్రళయ దినాన, ఆ మహా మైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి, మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని ఇహలోకంలో పురికొల్పి, అల్లాహ్ ను వదిలి అల్లాహ్ పంపిన మార్గాన్ని వదిలి మీ వెనుక నడవాలి అని చెప్పారు. కానీ ఏమిటి? ఈ రోజు మాకు ఏమి సహాయం చేయడం లేదు.?

ఒకసారి మీరు సూర సాఫ్ఫాత్ ఆయత్ నెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు చదివి చూడండి. ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క వాగ్విదానాన్ని, ప్రశ్నోత్తరాలని, వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) తెలియజేసాడు. పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరి పోతుందో, దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఎవరు ఎవరినైతే పూజించడం జరిగిందో, ఎవరెవరి వెనుక నడవడం జరిగిందో, వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు. మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో, బలహీనులు, బలహీన వర్గాలు, ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారో, ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారో, ఏ ఏ ఆరాధించేవారు తమతమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వాళ్ళందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని యెడల శాపనార్థాలు కూడా మొదలుపెడతారు ఆ మైదానే మెహ్ షర్ లో, ఆ మహా మైదానంలో. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

ఒకసారి సూరయే ఇబ్రహీం ఆయత్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి. “వారందరూ అల్లాహ్ ఎదుట స్పష్టంగా హాజరవుతారు. బలహీనులు, బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్ళతో అంటారు. మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి. మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి. అయితే, ఈ రోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేఅటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా? అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా? ఆ నాయకులు, ఆ పెద్ద వారందరూ ఏమంటారు? అల్లాహ్ మాకు మార్గం చూపి ఉండేది ఉంటే, మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారిమి. అస్తగ్ ఫిరుల్లా! అబద్దం ఇది. అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు. ఇహలోకంలో అల్లాహ్ (తఆలా) సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా? ఇప్పుడు ఇక్కడ మనకు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా సమానమే“. అనుసరించే వాళ్లు, బలహీనులు, ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలు అయితే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఖురాన్ లో మీరు చూడండి.

సూరయే అహ్ జాబ్ ఆయత్ నెంబర్ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు – “ఆనాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ, తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో, అయ్యో! మేము అల్లాహ్ ను, అల్లాహ్ కు విధేయత చూపి, ప్రవక్తకు విధేయత చూపి ఉండేది ఉంటే ఎంత బాగుండును! వారంటారు – ఓ మా ప్రభువా! మేము మా నాయకులను, మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వం లో పడవేశారు. ఓ ప్రభువా! ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు. పెద్ద పెద్ద శాపనార్థాలు వారిపై కురిపించు. ఇలా శపిస్తూ ఉంటారు.

ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు, మా నాయకులు సత్యాన్ని స్వీకరించ వద్దు అంటున్నారు. ఈవిధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరమవుతాము. కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు. మనసుకు శాంతి ఏర్పడదు. ఆ సందర్భంలో అప్పుడు ఏమంటారు? మీరే స్వయంగా చదవండి, గమనించండి, శ్రద్ధగా వినండి.

సూరయే హామీమ్ వస్సజ్దా, ఫుస్సిలత్ అని కూడా దానిని అంటారు. ఆయత్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంది. “ఓ మా ప్రభువా! జిన్నాతులలో, మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు. మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము. వారు నీచులుగా అయిపోవాలి“. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

సోదరులారా! ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది. అవన్నీ వివరాలు అల్లాహ్ మనకు తెలియజేశాడు. ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా? మహాశయులారా! సోదర సోదరీమణులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత, ఆ మైదానంలో సమీకరింపబడిన తరువాత ఏ పరిస్థితులు దొరుకుతాయి? ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు? ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప దయ, కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలు అన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే, ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకు పోతామో మీరే ఆలోచించండి. ఈనాడు ఈ మాటలు, పనికిమాలినవి, ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ మనకు ఈ విషయాలు తెలిపాడు గనుక తప్పకుండా ఇది సంభవించనున్నాయి.

అల్లాహ్ ను కాకుండా, ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు. ఆ రోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు, భూమిని తన పిడికిలిలో పట్టుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ ఉన్నారు? ఇహలోకంలో గర్వం, అహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఎంత గొప్పది? నన్ను ఎదిరించే వారు ఎవరూలేరుగా భావించేవారు ఎక్కడున్నారు? ఎవరి వైపు నుండి ఏ యొక్క శబ్దం కూడా రాదు. ఎవరి నుండి ఏ మాట వినబడరాదు. అప్పుడు స్వయంగా అల్లాహ్ అంటాడు. “నేను మాత్రమే ఈరోజు రాజును. నాకే సర్వాధికారం ఉన్నది“.

సర్వ సృష్టిలో ప్రవక్తలు, అల్లాహ్ కు అతి ప్రియులైన వారు. ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిచిపోతుంది. ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు? అని వేచిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పదండి మనమందరం కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్దాము. ఆయన అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని వెళ్తే, ఆదమ్ (అలైహిస్సలాం), ఎవరినైతే అల్లాహ్ స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో, ఆ ఆదమ్ (అలైహిస్సలాం) కూడా చాలా బాధలో ఉంటారు. నాతో జరిగిన తప్పు, ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు. కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ సమయంలో నేను అల్లాహ్ యందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు కలిగి లేను. నేను చేయలేను. మీరు వెళ్ళండి, కావాలంటే ప్రవక్త నూహ్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి ఈ మహా మైదానం, అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము? ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మోసే, ప్రవక్త యేసు అలైహిముస్సలాం అజ్మయీన్ ఎవరు కూడా అల్లాహ్ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు. మరి ఈ రోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకం తో పాటు ఉన్న ఈ పేపర్ ని తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు. డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి. ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ విశ్వాసమే ఇహలోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది.

సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ ఇరవై తొమ్మిది, అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సాయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుడ్ని కలుస్తాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నేను నీకో హోదా, అంతస్తు ఇచ్చి పెళ్లి, పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఇహలోకంలో నీకు ప్రసాదించలేదా? గుర్రాలు, ఒంటెలు, ఎన్నో రకాల జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా? నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి, హోదా ఇవ్వలేదా? ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలని స్వీకరిస్తాడు. అవును అల్లాహ్! నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు. అప్పుడు అల్లాహ్ మరో ప్రశ్న అడుగుతాడు. ఈ రోజు నాతో కలిసే రోజు ఒక రోజు ఉంది అని నీవు నమ్మేవానివా? అప్పుడు అతను సమాధానం పలుకుతాడు – ఓ అల్లాహ్ లేదు. ఇహలోకంలో లభించిన ఈ హోదా, అంతస్తులు, ఇహలోకంలో లభించిన ఈ వరాలు, ఇవన్నిటినీ చూసుకొని మురిసిపోయి ఎక్కడ పరలోకం? ఎక్కడ అల్లాహ్ ను కలుసుకోవడం? ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం? ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా! మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురిఅయి ఉన్నాముకదా? లేదు అల్లాహ్ నీతో కలిసే ఒక రోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుఇహ లోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను. అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు. ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు, వరాలు కొందరు పుణ్యాత్ములకు, విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏభాగము లభించదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు. మూడో వ్యక్తితో కలుస్తాడు. నాలుగు వ్యక్తితో కలుస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇహలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు. నేను నిన్ను విశ్వసించాను. నీ ప్రవక్తను విశ్వసించాను. నువ్వు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను. నేను నమాజ్ చేశాను. ఉపవాసాలు ఉన్నాను. దానధర్మాలు కూడా చేశాను. సాధ్యమైనంతవరకు ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్ని అంతా చెప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు. మా యొక్క సాక్షిని మీ ముందుకు తీసుకు రావాలా? అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు. అప్పుడు. ఎవ్వరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని. అప్పుడు అతని మూతి మీద ముద్ర వేయబడుతుంది. ఆ తరువాత అతని తొడ మాట్లాడుతుంది, అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు, కపటవిశ్వాసుడు అని స్పష్టం అవుతుంది. కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు. ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో ఏమో అని”.

చెప్పే విషయం ఏమిటంటే, చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది. అల్లాహ్ ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతారు.

అల్లాహ్ (తఆలా) మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక! ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి? అక్కడ ఏమి జరగనుంది? ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాలలో మనం వింటూ ఉందాము. అల్లాహ్ (తఆలా) మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక. ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాసమార్గం మీద నడిచేటటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 09: అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, కర్మలు, వాటి యొక్క ఫలం [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 09 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 09. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 22:31 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి?

మహాశయులారా! మనం ఇహలోకంలో ఏమి చేసినా, ఏ రవ్వంత, అంతకంటే మరీ చిన్నది, అణువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైనా, దుష్కార్యమైనా అది విశ్వాసానికి సంబంధించినా, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా, ఒకవేళ రవ్వంత ఏ కార్యం అయినా గానీ అల్లాహ్ (తఆలా) దానిని హాజరు పరుస్తాడు.

అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో, అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన, అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది?

అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మలేదు గనుక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని, ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వరోపాసనలో తమ జీవితం గడపలేదు గనుక ఇది మహా పాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాధల పట్ల, నిరుపేదల పట్ల ఇంకా ఏ పుణ్యాలు, సత్కార్యాలైతే వారు చేసుకున్నారో, వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరు అవుతారో వారికి, వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించారు.

ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, దూరం దారిలో మైదానంలో ఎండమావులు ఎలా కనబడతాయో దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్ళు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది“. వీరు ఏ సత్కార్యాలు అయితే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా! అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా!

గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు ఏదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈవిధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు. ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు! కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహు దైవారాధన కు దూరంగా ఉండడం తప్పనిసరి.

అంతేకాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు. ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాం పై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్,, బిదాత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు, ఏ పాపాలు అయితే వేరే పుణ్యాలను కూడా, సత్కార్యాలను కూడా నాశనం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తరువాత తమకుతాము చాలా నష్టం లో పడి చూసుకుంటారు. తమకు తాము చాలా నష్టం లో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు.

సూరయే కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలి అన్నట్లుగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూరయే కహఫ్ లో “వారికి తెలియజేయండి. స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారు ఎవరో మీకు తెలియ చేయాలా? ఎవరి ఆ కష్టాలు అయితే ఇహ లోకంలోనే వృధా అయిపోయాయి. వారు ఏమి అనుకుంటారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు“. కానీ ఏ షిర్క్ పనులు అయితే వారు చేస్తున్నారో ఎలాంటి బిదాత్ లకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది.

ఆ తరువాత నూట ఐదవ ఆయత్ లో అల్లాహ్ అంటున్నాడు – “ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి. ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. పరలోక దినాన అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు“.

గమనించారా! సోదరులారా, సోదరీమణులారా! పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం? ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలు అన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేసాడు? ఇంతకు ముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! నాన్నా!, పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఇక్కడ పాస్ అవుతావు అని ఎలా అయితే మనం పిల్లలకు తెలియచేస్తామో, అంతకంటే గొప్ప మన కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు, ఆరాధ్య నీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉంటే, అలా తెలుసుకోలేదు. వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినం అయితే మనకు ఇక్కడ చేసుకున్న సత్ కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క సత్కార్యాలు అన్నీ వృధా అయిపోయాయి. “వారి యొక్క సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకం లో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికీ ఏ మాత్రం బరువు ఉండదు“.

ఈ విధంగా మహాశయులారా! మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

మహాశయులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో, అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడ యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు? వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో? అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాం పై సరైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మనం తెలుసుకుంటూ వస్తున్నాము.

ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరినెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరు అయినప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి! ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లాహ్ ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఎంత పరస్పరం ప్రేమ, ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన “ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరం అవుతారు, శత్రువులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది“.

అల్లాహ్ ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్యనీయులు కూడా, ఎవరినైతే ఆరాధించడం జరిగిందో, వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయత్ :

అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు? అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా? లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడటం జరుగుతుంది“.

అల్లాహ్ మనందరిని అలాంటి పరిస్థితుల నుండి కాపాడుగాక.

అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి, ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకం లో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. మేము అల్లాహ్ ను వదిలి అల్లాహ్ కు, ఆ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ తో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాహ్ కు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాహ్ కు సమానులుగా చేసి, మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము“.

ఈవిధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఇహలోకంలో ఎంత తప్పు చేసామో కదా! ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనలు వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏమి ప్రయోజనం ఉండదు.

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లాహ్ యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాహ్ తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొలిపి మార్గభ్రష్టత్వం లో పడవేసి అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించాలని, వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి, ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు.

అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి. మాకు సహాయం చేయండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు. మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. మీరు జిన్నులను ఆరాధించేవారు, షైతానులను ఆరాధించేవారు. షైతాను మిమ్మల్ని ఇలాంటి పెడమార్గంలో పడవేసాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు.

చదవండి ఈ ఆయత్. ఎన్నో ఆయత్ లు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయత్ నేను చదువుతున్నాను – “ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఆ మహా మైదానంలో అందరిని సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహ్ (తఆలా) దైవదూతలతో ప్రశ్నిస్తాడు. ఏమి? వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవ దూతలు సమాధానం చెబుతారు. నీవు అన్ని రకాల షిర్క్, బహు దైవారాధన నుండి అతీతునివి. నీవు మాకు సాన్నిహిత్యునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కాదు మాకు స్నేహితులు. సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము. నీవు అన్ని రకాల షిర్క్ లకు అతీతునివి. వారు జిన్నులను ఆరాధించేవారు. వారిలో అనేకమంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది. వారిపై విశ్వాసం ఉండింది“.

అలాగే ఏసుక్రీస్తు, హజరత్ ఈసా (అలైహిస్సలాం) “మీరు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి” అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసు క్రీస్తు హాజరవుతారు. ఈసా (అలైహిస్సలాం) హాజరవుతారు. వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు – “అప్పుడు అల్లాహ్ (తఆలా) మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాం ని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ను వదిలి “నన్ను, నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి” అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ (తఆలా) మందలిస్తాడు“. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు? “నీవు పవిత్రునివి, అన్ని రకాల బహు దైవారాధనకు అతీతునివి. ఏ మాట పలకడం నాకు ఏ మాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను? అలాంటి మాట నేను ఎందుకు చెపుతాను? నేను ఒకవేళ చెప్పి ఉంటె నీకు తెలుసు ఆ విషయం. నేను వారికి చెప్పి ఉంటె నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి! నా యొక్క ప్రభు, మీ యొక్క ప్రభువు అల్లాహ్ మాత్రమే గనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా ఏసుక్రీస్తు (అలైహిస్సలాం) తెలియజేస్తారు“.

ఇంకా ఏమి జరగనుంది? ఇన్షా అల్లాహ్ తరవాయి భాగంలో మనం తెలుసుకుందాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 08: ప్రళయదినం రోజు ఉండే ఆందోళనకర పరిస్థితి -2 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 08 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 08. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:41 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును?, ప్రజల పరిస్థితి ఆరోజు ఎలా ఉండును? అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం ఇది.

మహాశయులారా! ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాబై వేల సంవత్సరాల పరిమాణం. యాభై వేల సంవత్సరాలు ఇహలోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్టు. గమనించండి! అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడు, ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహ్ ఎదుట సమీకరింపబడతామో ఆ సమయాన. అల్లాహ్ (తఆలా) ఆ విషయాన్ని సూరతుల్ మఆరిజ్ లో (70:4) ఇలా తెలియపరిచాడు –

تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ – 70:4
యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.

యాబై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ (ఆత్మ), అంటే జిబ్రిల్ అమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు, పాపాత్ములు ఇహదినాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకపొద్దు మాత్రము లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకం లో ఉన్నాము అని భావిస్తారు.

ఈ రోజుల్లో ముప్పై, నలబై, యాబై సంవత్సరాలు జీవిస్తున్నాము. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తూ ఉంది. పగలుశ్రమిస్తున్నాము. రాత్రి పడుకుంటున్నాము. ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిచిపోతూ ఉంది.. పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు. ఆలోచించండి!, దాని గురించి సిద్ధపడండి! లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది?. ఈ ఆయతులను శ్రద్ధగా విని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ నలబై ఐదు లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలిపాడు –

وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ – 10:45
అల్లాహ్‌ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది.

“ఎప్పుడు ఏ రోజున అయితే వారిని సమీకరిస్తామో, పోగు చేస్తామో ఆ రోజున వారు ఏమంటారు? పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఇహలోకంలో ఉన్నాము”. ఆ అంటే పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కన్నులారా చూస్తారో అప్పుడు ఇహలోకం చాలా సంక్షిప్తమైన జీవితం, పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏ మాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది. అందుగురించి క్షణం పాటు ఈజీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ, పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ దీర్ఘ కాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని, తన బంధువులలో అతి దగ్గరగా ఉన్న వారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు.

సూరయే మఆరిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతులు ఒకసారి మీరు చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ – 70:11
నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,

وَصَاحِبَتِهِ وَأَخِيهِ – 70:12
తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,

وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ – 70:13
తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,

وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ – 70:14
భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.

كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ – 70:15
(కాని ఇది) అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని.

అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు – ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించాలి ఎవరిని సంతానాన్ని, తన సహవాసిని, ఏ వంశం, ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో, శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో తోసేయ్యాలి. ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడ వేయాలి. ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి, అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి – అని అపరాధి ఆ రోజు కోరుతాడు. సమాధానం ఏమి వస్తుంది అల్లాహ్ వైపు నుండి? “ముమ్మాటికి అలా జరగదు”. అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్దపడాలి. దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి.

ఇదే సూరయే మఆరిజ్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు.

إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا – 70:6
అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.

وَنَرَاهُ قَرِيبًا – 70:7
కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.

అవిశ్వాసులకు, సత్యతిరస్కారులకు, అపరాధాలు చేసినవారికి ఆ రోజు అంత దీర్ఘంగా ఏర్పడుతుంది. కానీ, మాకు, విశ్వాసం అవలంభించిన వారికి, సత్కార్యాలు చేస్తున్న వారికి, అల్లాహ్ ఇష్టప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి, అది చాలా తక్కువ సమయంగా, కొన్ని హదీతు లలో చెప్పడం జరిగింది, ఒక ఫర్ద్ నమాజ్ (విధి నమాజ్) చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది.

ఈ విధంగా మహాశయులారా! ఎన్ని పాపాలు పెరుగుతాయో, ఎన్ని కష్టాలు పెరుగుతాయో, ఎంత మనం అవిశ్వాసానికి ఒడికడతామో, దైవ ధిక్కారానికి, అల్లాహ్ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో, ఆ రోజు మనకు అంతే దూరంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఏర్పడుతుంది. ఎంత మనం అల్లాహ్ కు చేరువుగా ఉంటామో, ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో, కేవలం ఆయన యొక్క ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది.

ఆ రోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు. ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు. మరొకరు విశ్వాసమార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు. పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు. మూడోవారు పుణ్యాత్ములు, సదాచారణ చేసేవారు, విశ్వాసులు, అల్లాహ్ యొక్క భక్తులు. ఈ ముగ్గురు స్థితులు ఎలా ఉంటాయో, వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో, ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకో బోతున్నాము.

ఎవరైతే అవిశ్వాసానికి ఒడికడతారో, సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? ఎవరు ఏ స్థితిలో చనిపోయినా, ఎవరు ఎక్కడ దేనికి గురి అయినా, క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా, నీళ్ళల్లో కొట్టుకుపోయినా, కాల్చబడి బూడిద అయిపోయినా, ఏ స్థితిలో ఎవరు ఉన్నాగాని అల్లాహ్ వారందరినీ వెలికి తీస్తాడు. ఎప్పుడైతే వారు బయటకి వస్తారో, ఆ మహా మైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు –

مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ – 54:8
తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.

అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు అంటారు – “ఈ రోజు చాలా కఠినమైనరోజు, చాలా కష్టతరమైన రోజు.” అంతే కాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకుతాము శాపం కురిపించు కుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు.

సూరయే యాసీన్, ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని, ఎన్నో వివరాలను అల్లాహ్ (తఆలా) స్పష్ట పరిచాడో ఆ సూరయే యాసీన్ ను ఈరోజుల్లో బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకునే కి బదులుగా దానిని మృత్తులపై చదువుతూ ఉంటారు. ఈ సూరయే యాసీన్ ఈ ఖురాన్ లో అవతరింప చేయటానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఒక హెచ్చరిక, వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అయితే అదే సూరాలో ఖురాన్ లో అల్లాహ్ అంటున్నాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51
మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు

قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ – 36:52
“అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్‌) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).

శంఖము ఉదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగెడుతూ వస్తారు. అయ్యో! మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు. మా ఈ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు? అని అంటారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది. రహ్మాన్ కరుణామయుడైన అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. ఈ రోజు తప్పకుండా మీరు ఆయన ఎదుట సమీకరింపబడతారు. ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగితీరింది. ఇప్పుడు మీరుకు మీరు శపించి కున్నా, మీకు మీరు బాధ పడ్డా అయ్యో! మమ్మల్ని ఎవరు లేపారు? ఎందుకు లేపారు? అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమి లాభం లేదు.

ఎవరైతే ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనను ధిక్కరించారో, పుణ్య మార్గంలో నడవడానికి ఇది మాపని కాదు అంటూ పుణ్యాన్ని గురించి, సత్కార్యాల్ని గురించి, మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునే వారు. అలాంటి వారి పరిస్థితి ఏమి జరుగుతుంది? సూరయే ఇబ్రాహీం నలబై ఎనిమిది నుంచి యాబై వరకు చదివి చూడండి –

يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ – 14:48
ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్‌ ముందుకు వస్తారు

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ – 14:49
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ – 14:50
వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.

“ఏ రోజు అయితే భూమి మార్చివేయడం జరుగుతుంది, ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది. అందరూ ఆ ఏకైక, మరియు ఎంతో శక్తిశాలి అయినా అందరి పై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు, వెలికి వస్తారు. అపరాధులను, అల్లాహ్ ఆరాధనలు దిక్కరించిన వారిని నువ్వు చూస్తావు. వారిని సంకెళ్లలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. వారి యొక్క దుస్తులు, గంధకం తో చేయబడిన దుస్తులు గా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది”. అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి నుండి మనందరినీ కూడా కాపాడుగాక!

మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకరమైన, గాంభీర్యం అయిన విషయం మరొకటి ఏమిటంటే, ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ (మైల్) అంత దూరంలోనే ఉంటారు. అల్లాహు అక్బర్! గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసి బొగ్గుల్లా మారుతాము. కానీ ఆరోజు వేడి యొక్క, ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహ్ (తఆలా) అటువంటి శరీరాలను పుట్టిస్తాడు. మరియు సూర్యుడు ఇంత దగ్గరగా ఉండి, దాని యొక్క తాపం, దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది? ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండెనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళ్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది?

సహీ ముస్లింలో హదీత్ ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: సూర్యుడు ఒక మైల్ దూరంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది కేవలం ఒక మైల్ అంత దూరం లో ఉంటుంది“. ఒక ఉల్లేఖనంలో ఉంది – “ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు. కొందరు తమ చెమటలో చీలమండలాల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు తమ చెమటలో మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు“.

సూరయే ముతఫ్ఫిఫీన్ ఆయత్ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ – 83:6 (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు) యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు. “ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమట లో మునిగి ఉంటారు. కొందరు అయితే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు“.

సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ లో ఉంది. “ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటాయి. చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది“. అల్లాహు అక్బర్! గమనించండి ఇది స్వయంగా మన చెమట. ఆరోజు ఆ పరిస్థితి ఉంటుంది.

ప్రళయ దినాల ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క మాటలు ధిక్కరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క బాటను అవలంబించని వారు, ప్రవక్త బాటకు వ్యతిరేకంగా వారి యొక్క మిత్రులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతను ఇచ్చువారు ఎలా వాపోతారో, బాధపడతారో ఈ ఆయతులను విని గమనించండి.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا – 25:27
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا – 25:28
“అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا – 25:29
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”

“ఆ రోజు అపరాధి, దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు. మరి అంటాడు – అయ్యో! నా పాడుగాను. నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను, ఓ నా పాడుగాను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండును. నా దోస్తు, నా ఫ్రెండ్, నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తరువాత నన్ను మార్గభ్రష్టత్వం లోకి పడవేశాడు. ఈవిధంగా తీరా సమయం వచ్చినప్పుడు షైతాను మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు”.

అల్లాహ్ (తఆలా) మనందరి సృష్టికర్త ఆ రోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేసాడో గమనించండి. ఇకనైనా సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిస్థితి అంతా చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది – “ఈ రోజు మనకు ఎవరు సిఫారసు చేసేవాడు లేడు. ఎవరి సహాయం మనకు అందదు. ఈరోజు మనం అల్లాహ్ యొక్క మన్నింపును, అల్లాహ్ యొక్క క్షమాపణను నోచుకోలేము” అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది.

సూరయే రూమ్ ఆయత్ నెంబర్ పన్నెండులో అల్లాహ్ చెప్పాడు –

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ – 30:12
ప్రళయం నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు.

ప్రళయం సంభవించిన రోజున అపరాధములు పూర్తిగా నిరాశ చెంది పోతారు – ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని, వారు ఇహ లోకంలో చేసుకున్న పుణ్యాలు ఏ మాత్రం పనికి రావు అని. విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు. అందుకే ఆ రోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు – “నా వద్దనైతే విశ్వాసం లేదు, నా వద్దనైతే సత్కార్యాలు లేవు. నేను అల్లాహ్ కు ఏమని సమాధానం పలకాలి? అయ్యో! ఈరోజు నేను మట్టిని అయిపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా, ఎలాంటి అల్లాహ్ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటె బాగుండును” అని. కానీ అలాంటి కోరికలు పూర్తి కావు.

ఇలా సూరయే నబాలో ఇలా తెలియపరిచారు.

وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا – 78:40
అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.

ఆ రోజు అవిశ్వాసుడు అంటాడు – అయ్యో! నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది! అని వాపోతాడు. కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల. అందుగురించి మహాశయులారా! ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు. ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాసమార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ (తఆలా) మనందరికీ అలాంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 07: ప్రళయం సంభవించినప్పుడు ఉండే ఆందోళనకర పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 07 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 07. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:32 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.

ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.

అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.

అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.

ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.

మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.

సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.

ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.

ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!

సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?

ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 06: ప్రళయ దినాన లెక్క తీసుకోవడం [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 06 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 06. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:16 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! లెక్క తీసుకునే విధానాలు ప్రళయ దినాన ప్రతి ఒక్కరితో వేరు వేరుగా ఉండవచ్చు. అల్లాహ్ (తఆలా) కొందరిని తన దగ్గరికి పిలుచుకొని తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క సత్కార్యాన్ని గుర్తు చేసి, పాపాలు ఏదైతే అతని నుండి జరిగినవో అతని ద్వారా ఒప్పిస్తాడు. ప్రజల్లో కొందరు ఒప్పుకుంటారు. మరి కొందరు స్వయంగా వారు చేసిన పాపాల్ని అబద్దం చెప్పి మేము చేయలేదు అని అంటారు. అలాంటి వారికి అల్లాహ్ (తఆలా) వారి ముందు కొన్ని, కొందరు సాక్షులను తీసుకొస్తాడు. చివరికి స్వయంగా వారి శరీర భాగాలు కూడా మాట్లాడుతాయి మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.

ఈ విధంగా సోదరులారా సహీ బుఖారిలో ఒక హదీత్ వచ్చి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ప్రళయ దినాన అల్లాహ్ (తఆలా) ఒక వ్యక్తిని ప్రజలందరి మధ్యలో నుండి హాజరు పరుస్తాడు మరియు తనకు మరియు అతనికి మధ్యలో ఎలాంటి అనువాదం చేసే వాని అవసరం లేకుండా స్వయంగా అల్లాహ్ (తఆలా) అతనితో మాట్లాడుతాడు. అతడు చేసిన పాపాల్ని అతనికి గుర్తు చేస్తాడు. అతడు తన పాపాలు అన్నిటిని కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (తఆలా) అతనితో అంటాడు: “ఇహలోకంలో నీవు ఈ పాపాలు చేసినప్పుడు నిన్ను అవమాన పరచకుండా నీతో జరిగిన ఈ పాపాల విషయంలో ఎవరికి తెలియకుండా నేను కప్పి ఉంచాను. ఈ రోజు కూడా ప్రజలందరి ముందు నిన్ను అవమాన పరచకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను, మన్నించేస్తున్నాను” అని అల్లాహ్ (తఆలా) శుభవార్త తెలియపరుస్తాడు.

దీనికి భిన్నంగా ఖురాన్ లోని ఆయత్ మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది. ఒక వ్యక్తి వస్తాడు. ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు. “నీవు చేసిన పాపాలు ఒప్పించడానికి సాక్ష్యం పలికే వారిని తీసుకొస్తాను” అని అంటే “ఈ రోజు నేను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారిని ఎవరినీ స్వీకరించను. నా శరీరం నాకు సాక్ష్యం పలుకుతే నేను స్వీకరిస్తాను”. అప్పుడు అల్లాహ్ (తఆలా) శరీరం యొక్క తోలు ఏదైతే ఉందో దానిని ఆదేశిస్తాడు. మనిషి యొక్క తోలు మాట్లాడుతూ ఉంటుంది. వారు తమ శరీర తోలును ఎప్పుడైతే మాట్లాడడం వ్యతిరేకంగా సాక్ష్యం పలకడం చూస్తారో, వారు తోలుతో అంటారు: “ఏమైంది? నాకు వ్యతిరేకంగా మీరు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నారు?” “ప్రతి మాట్లాడే వారికి మాట్లాడే శక్తి అల్లాహ్ ఎలా ప్రసాదించాడో ఈరోజు మాకు మాట్లాడే శక్తి అల్లాహ్ అలాగే ప్రసాదించాడు” అని ఆ తోళ్ళు పలుకుతాయి.

సూరయే యాసీన్ లోని ఆయతులు చదవండి – “మేము ఆ రోజు ప్రళయ దినాన వారి యొక్క నోళ్ళపై ముద్ర వేసేస్తాం. అప్పుడు వారి యొక్క చేతులు మాట్లాడుతూ ఉంటాయి. వారి యొక్క కాళ్లు సాక్ష్యం పలుకుతాయి. వారు చేసిన వాటన్నిటి గురించి చెపుతూ ఉంటాయి”. మహాశయులారా! అల్లాహ్ ఒకవేళ తన దాసులపై అన్యాయం చేసి నరకంలో పంపినా గానీ, అతన్ని ఎవరూ అడిగేవారు లేరు. అంతటి శక్తిశాలి. అయినా అది అతని యొక్క అన్యాయం అనబడదు కూడా. ఎందుకంటే మనందరం అతని ఆధీనంలో ఉన్నాము. అతని యొక్క దాసులము. కానీ, “నీ ప్రభువు తన దాసులపై ఏ రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు“. ఆనాడు లెక్క తీసుకోబడటం ఏదైతే జరుగుతుందో అందులో అల్లాహ్ ఏ ఒక్కరిపై కూడా రవ్వంత అన్యాయం, దౌర్జన్యం చేయనే చేయడు. అల్లాహ్ ఎలా దౌర్జన్యం చేయగలుగుతాడు? అస్తగ్ఫిరుల్లాహ్! అల్లాహ్ ఎలా అన్యాయం చేయగలుగుతాడు? ఆయనే స్వయంగా చెబుతున్నాడు, ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఖుద్సీ, “అన్యాయాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి ఉన్నాను. మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి, అన్యాయాలు చేసుకోకండి“.

లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే ఆయన ఒకరి పాపాల గురించి మరొకరిని పట్టుకోడు. ఒకరి పాపాల భారం మరొకరిపై వేయడు. ఒకరు చేసిన పాపానికి మరొకరిని శిక్షించడు.

అంతేకాకుండా లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం అల్లాహ్ ఏదైతే పాటిస్తాడో – దాసులు వారు చేసిన కర్మలన్నీ వారికి స్వయంగా చూపిస్తాడు. “ఎవరైతే అణువంత పుణ్యం చేసుకున్నారో వారు కూడా దానిని చూసుకుంటారు. మరి ఎవరైతే అణువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు“. సూరయే ఆలె ఇమ్రాన్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: “ఆనాడు ప్రతీ ప్రాణి, ప్రతీ ఒక్కరు తాను చేసుకున్న మంచిగానీ, చెడ్డ గానీ, సత్కార్యం గానీ, దుష్కార్యం కానీ దానిని వారు చూస్తారు. దానిని వారు పొందుతారు. ప్రతీ కార్యం వారికి తెలియజేయడం జరుగుతుంది.”

లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) సత్కార్యాల సత్ఫలితం ఎన్నో రెట్లుగాపెంచి ఇస్తాడు. కానీ అదే దుష్కార్యాలు వాటి యొక్క శిక్ష ఏ రవ్వంత పెంచి ఇవ్వడు. దీని గురించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. ఒక సహీ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లాహ్ అతనికి ఒక పుణ్యం రాస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లాహ్ అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రెట్లు నుండి ఏడు వందల రెట్ల వరకు పుణ్యాలు రాస్తాడు. దాసుడు ఒకవేళ దుష్కార్యం గురించి మనసులో అనుకుంటే అల్లాహ్ అతనికి ఒక పాపం రాయడు. ఒకవేళ అతను ఆ దుష్కార్యం చేస్తే ఒక్క పాపం మాత్రమే రాస్తాడు. అదే ఒకవేళ అతను ఆ దుష్కార్యం ఆలోచనను వదులుకుంటే అతనికి ఒక పుణ్యం రాస్తాడు“. ఈ హదీత్ కు సాక్షాధారం చదవాలనుకుంటే ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదవవచ్చు. “ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని పది రెట్ల కు ఎక్కువగా వారికి పుణ్యం లభిస్తుంది

అలాగే లెక్క తీసుకోవడంలో ఒక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని శిక్షించడు. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని పట్టుకోవడం జరగదు. ఖురాన్ లోని ఈ ఆయత్ చదవండి – “ఒకరి పాపాల భారం మరో ఒకరిపై వేయడం జరగదు“. మరోచోట అల్లాహ్ (తఆలా) తెలిపాడు – “ప్రతి మనిషి తాను ఏమి సంపాదించాడో దాని ప్రకారమే అతనికి ప్రతిఫలం లభిస్తుంది“. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరు శిక్ష పొందడం ఇలా జరగదు కానీ ఎవరైనా ఇతరులకు చెడు చేయాలని చెప్పి, చెడు వైపునకు ప్రేరేపిస్తే వారు చెడు చేసినందుకు ఇతని కారణంగా అతను ఆ చెడు చేశాడు కనుక అతను చేసిన చెడులోని పాప భారం అతనిపై ఏమాత్రం తగ్గకుండా, ఇతను చెడు వైపునకు పురికొల్పినందుకు ఇతను కూడా ఆ పాప భారాన్ని మోస్తాడు. అతని యొక్క పాప భారంలో ఏ మాత్రం తగ్గింపు జరగదు. లెక్క జరిగే విషయాల కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాము. అలాగే సోదరులారా, చెడు వైపునకు ప్రేరేపిస్తే, ప్రేరేపించిన వారికి ఆ చెడు యొక్క పాపం కలుగును. దాని యొక్క శిక్ష అతను పొందాలి. అలాగే ఎవరైనా మంచి కార్యం వైపునకు, పుణ్యకార్యం వైపునకు ఇతరులను ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానం మేరకు ఎవరెవరు ఆ పుణ్యం వైపునకు వస్తారో, దానిని ఆచరిస్తారో వారికి వారి ప్రకారంగా సత్ఫలితం లభిస్తుంది. కానీ పుణ్యం వైపునకు ఆహ్వానించే వారికి కూడా ఆ పుణ్యం చేసినంత సత్ఫలితం వారికి లభిస్తుంది.

లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) అవిశ్వాసులకు, కపటవిశ్వాసులకు, వంచకులకు, మరెందరో పాపాలు చేసేటటువంటి దుర్మార్గులకు వారు తిరస్కరించినందుకు, వారికి వ్యతిరేకంగా ఎన్నో రకాల సాక్షులను వారి ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు తర్వాత ఎపిసోడ్ లలో ఇన్షాఅల్లాహ్ మనం విననున్నాము.

అయితే లెక్క విషయంలో మరొక విషయం మనం తెలుసుకోవలసినది ఏమిటంటే – ఆదమ్ (అలైహిస్సలాం) నుండి మొదులుకొని చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో, వారందరి ప్రవక్తల జాతుల్లో అందరికంటే మొట్టమొదటి సారిగా లెక్క తీసుకోవడం జరిగేది మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క అనుచర సంఘం. దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “మనం ఇతర జాతులను చూస్తే వారికంటే చివరిలో వచ్చిన వారిమి. కానీ ప్రళయ దినాన అందరికంటే ముందు మనం ఉంటాము. సర్వ ప్రజల్లో అందరికంటే ముందు లెక్క, తీర్పు జరిగేది మన అనుచర సంఘం యొక్క లెక్క తీర్పు.” ఇది కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు మనపై అల్లాహ్ యొక్క గొప్ప కరుణ. దీనిని మనం గ్రహించాలి.

ఈ హదీత్ సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో ఉంది మరియు ముస్నద్ అహ్మద్ ఇంకా ఇబ్నెమాజా లో ఉంది – ఇబ్నె అబ్బాస్ (రది యల్లాహు తఆలా అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపినట్లుగా చెప్పారు – “ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి. కానీ లెక్క జరిగే ప్రకారంగా మొట్టమొదటి వాళ్ళం. మన నుండే లెక్క మొదలవుతుంది. మన లెక్క అయిన తర్వాతనే ఇతర జాతుల లెక్క జరుగుతుంది.”

మరి సోదరులారా!, సోదరీమణులారా!, లెక్క జరిగే ఆ ప్రళయదినాన మొట్టమొదటి లెక్క దేని గురించి జరుగునో ఎప్పుడైనా మనం గమనించామా? హదీతుల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేసారు. ఎందుకూ? అలాంటి సత్కార్యాలు చేయడంలో మనం వెనుక ఉండకూడదు అని. ప్రళయ దినాన లెక్క తీసుకోబడే రోజు మనం అక్కడ మోక్షం పొందాలి, ఆ లెక్కలో పాస్ అవ్వాలి అని. ఇబ్నెమాజా లోని సహీ హదీత్ – “ప్రళయ దినాన ఆరాధనల్లో అందరికంటే ముందు నమాజ్ యొక్క లెక్క తీసుకోబడును. నమాజ్ సరిగ్గా ఉంటే అందులో అతడు పాస్ అయ్యాడు అంటే ఇతర వేరే కర్మలు కూడా సరి అయినట్లు. అతను నమాజ్ లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇతర విషయాల్లో కూడా ఫెయిల్ అయినట్లే“, అందుగురించి మహాశయులారా!, ఇకనైనా నమాజ్ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా పురుషులు సామూహికంగా మస్జిద్ లో నమాజ్ చేయాలి. ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ లో ఏ బద్ధకం వహిస్తున్నామో, రాత్రి పడుకోవడంలో ఆలస్యం చేసి ఫజర్ నమాజ్ ను వదిలేస్తున్నామో, మనం డ్యూటీ వెళ్ళే సమయంలో చదవడం లేదా జోహార్ తో పాటు కలిపి చదవడం లాంటి ఏ తప్పులు అయితే చేస్తున్నామో వాటిని వదులుకోవాలి. తొలిసారిగా లెక్క జరిగేది నమాజ్ గురించి. ఈ నమాజ్ లో పాస్ కాకుంటే మనం చాలా నష్టపోతాము, ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది. అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి.

ఇంకా మహాశయులారా!, తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు, సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీత్, “ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో మొట్టమొదటి తీర్పు రక్తాల గురించి జరుగును. ఎవరు ఎవరిని అన్యాయంగా హత్య చేశారో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ లు వేసాడో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి సహాయ పడ్డాడో” ఈ విధంగా ఇస్లాంలో ఆరాధనల్లో మొట్ట మొదటి విషయం నమాజ్ అయితే సామాజిక వ్యవహారాల్లో, సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది. మహాశయులారా!, ఇకనైనా గమనించండి. ఇస్లాం పై బురద చల్లకండి. ఇస్లాం పై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి. ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది. అన్యాయంగా, అకారణంగా, దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని హత మారుస్తారో వారికి స్వర్గం కూడా లభించదు. స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల ప్రయాణం గల దూరం నుండి ఆఘ్రానించ బడుతుంది. కానీ అలాంటి వారికి ఆ సువాసన కూడా లభించదు అని ఇస్లాం స్పష్టపరిచింది. అయితే ప్రళయదినాన ఈ రక్తాలు గురించి మొట్టమొదటి తీర్పు జరుగును. అందుగురించే ఇస్లాం “ఎవరైనా అన్యాయంగా ఒక ప్రాణిని చంపారంటే మానవత్వం మొత్తాన్ని మట్టిలో కలిపినట్లు” అని వారి గురించి హెచ్చరించింది.

ఈ విధంగా లెక్క జరిగే ఆ రోజున దానికి సంబంధించిన వివరాలు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల ఈనాటి కార్యక్రమంలో విన్నాము, తెలుసుకున్నాము. అయితే ఆ లెక్క జరిగే రోజు రాకముందే మనం ఇక్కడే దాని గురించి సిద్దపడాలి. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు చెప్పిన ఈ మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: “ప్రళయ దినాన అక్కడ మీ లెక్క జరిగే కి ముందు మీరు ఇక్కడే మీలెక్క తీసుకుంటూ ఉండండి. మీకు అక్కడ సులభతరం కలుగుతుంది“.

అల్లాహ్ మనందరికీ ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతికార్యం గురించి లెక్క తీసుకుంటూ ఆ లెక్క రోజు గురించి సిద్ధపడేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మన్’హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత: అఖీదా (విశ్వాసం) మరియు ఆచరణలో [వీడియో]

మన్’హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత: అఖీదా (విశ్వాసం) మరియు ఆచరణలో
https://www.youtube.com/watch?v=LN3WpB8zhnQ [55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

సలఫ్ అంటే ఎవరు? మన్’హజె సలఫ్ అంటేమిటి ?

సలఫ్ అనే పదం ‘సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘పూర్వ కాలపు పుణ్యాత్ములు, సజ్జనులు’. ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త (ﷺ) ఈ మూడు తరాలను ఉత్తమ ముస్లిం తరాలుగా అభివర్ణించారు.

عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «خَيْرُ النَّاسِ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُم»

మొదటిది: ప్రవక్త (ﷺ) మరియు ఆయన సహబా (సహచరులు).
రెండవది: తాబిఈన్ (సహచరుల అనుచరులు).
మూడవది: తబఎ తాబిఈన్ (సహచరుల అనుచరుల అనుచరులు)

[బుఖారీ 2652, ముస్లిం 2533]

అయితే సలఫ్ ఎలా ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకున్నారో, ఆచరించారో అలాగే అర్థం చేసుకునే, ఆచరించే ప్రయత్నం చేసేవారినే ‘సలఫీ’ లేదా ‘అహ్లె హదీస్’ అని అంటారు. మరియు ‘నిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅ’ వీరే.

ఈ ప్రసంగంలో, వక్త మన్ హజె సలఫ్ (పూర్వీకుల మార్గం) యొక్క ప్రాముఖ్యతను విశ్వాసం మరియు ఆచరణలో వివరించారు. జ్ఞానాన్ని అన్వేషించేవారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలను వివరిస్తూ, వారి కోసం అల్లాహ్ శాంతిని, కరుణను పంపుతాడని మరియు సృష్టి మొత్తం వారికోసం దుఆ చేస్తుందని తెలిపారు. ఉపమానం ద్వారా, ఖురాన్ మరియు హదీసులను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, ప్రవక్త సహచరులైన సహాబాల అవగాహనను అనుసరించడం తప్పనిసరని నొక్కి చెప్పారు. ఖవారీజ్ వంటి చారిత్రక సమూహాల ఉదాహరణలను ఇస్తూ, సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం ఎలా మార్గభ్రష్టత్వానికి దారితీస్తుందో వివరించారు. దొంగ చేతిని నరకడం వంటి ఖురాన్ ఆదేశాలను సరిగ్గా ఆచరించడానికి సహాబాల అవగాహన ఎంత అవసరమో ఉదాహరణలతో స్పష్టం చేశారు. మన విశ్వాసం, ఆచరణ, దావత్ మరియు ప్రవర్తన అన్నీ మన్ హజె సలఫ్‌కు అనుగుణంగా ఉండాలని, లేకపోతే అవి అల్లాహ్ వద్ద స్వీకరించబడవని హెచ్చరించారు. చివరగా, సహాబాలను గౌరవించడం మరియు వారి మార్గాన్ని అనుసరించడం ప్రతి ముస్లిం విధి అని హజ్రత్ అబూబకర్ మరియు రబియా (రదియల్లాహు అన్హుమ్) మధ్య జరిగిన సంఘటన ద్వారా తెలియజేశారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

అఊదు బిల్లాహిస్ సమీయిల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్.

وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (4:115)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టి యొక్క సృష్టికర్త, పోషణకర్త మరియు మనందరి ఆరాధనలకు ఏకైక నిజమైన అర్హుడు అల్లాహ్ కే ప్రశంసలు, పొగడ్తలు. లెక్కలేనన్ని దరూద్ సలాం, శాంతి, కరుణలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తమ తమ జాతుల వరకు సరియైన రీతిలో అందజేశారో.

అల్హందులిల్లాహ్, ఈ రోజు మర్కజ్ ఇబాదుర్రహ్మాన్ వైపు నుండి ఈ ప్రత్యేక క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో అందులో నాకు ఇవ్వబడినటువంటి అంశం మన్ హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత, విశ్వాసం మరియు ఆచరణలో.

ఇలాంటి ఇంత మంచి అవకాశం నాకు లభించినందుకు ముందు అల్లాహ్ కు లెక్కలేనన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మర్కజ్ ఇబాదుర్రహ్మాన్ యొక్క బాధ్యులు ప్రత్యేకంగా షేఖ్ అబూబకర్ ఉమ్రీ హఫిదహుల్లాహ్ మరియు ఈ అంశాన్ని వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నటువంటి తుల్లాబె ఇల్మ్, ధర్మ విద్యార్థులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ఒక శుభవార్తను ముందు తెలియజేయాలనుకుంటున్నాను.

అదేమిటి శుభవార్త? ఎవరైతే ధర్మ జ్ఞానం నేర్చుకొనుటకు ఒక సమావేశంలో హాజరవుతారో. సమావేశం అంటే అది మస్జిద్ కావచ్చు, ఏదైనా మద్రసా కావచ్చు, ఏదైనా మనం ఒకచోట గుమిగూడడం కావచ్చు మరియు ఇలాంటి టెక్నాలజీ కాలంలో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇలాంటి సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా మనం ఇప్పుడు ఒకచోట, ఒక ఉద్దేశంతో జమా అయ్యాము. ఇది కూడా అందులో వచ్చేస్తుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు ఎన్నో ఉన్నాయి వాటి యొక్క సారాంశం ఏంటి?

ఎవరైతే ధర్మజ్ఞానం నేర్చుకోవడానికి ఒకచోట హాజరవుతారో, అల్లాహు త’ఆలా వారిని తన దగ్గర ఉన్నటువంటి దైవదూతల ముందు ప్రశంసించి వారిని స్తుతిస్తాడు. వారి యొక్క ఈ అమోఘమైన విద్య నేర్చుకోవడానికి హాజరు కావడాన్ని ఎంతో గొప్పగా చెబుతాడు. అంతేకాదు, ఆ దైవదూతలందరినీ కూడా అల్లాహు త’ఆలా సాక్ష్యంగా ఉంచి వారి యొక్క పాపాలను మన్నించేటువంటి శుభవార్త ఇస్తాడు. అంతేకాదు, ధర్మవిద్య నేర్చుకోవడానికి ఎవరైతే ఒకచోట హాజరవుతారో అల్లాహ్ వైపు నుండి ప్రశాంతత అనేది వారిపై అవతరిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క కారుణ్యం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అంతేకాదు, సోదర మహాశయులారా సోదరీమణులారా, ఎవరైతే ధర్మజ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరుతారో వారి గురించి ఈ సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి దుఆ చేస్తూ ఉంటారు.

ఎంత గొప్ప అదృష్టం గమనించండి. అందుకొరకు ఇప్పటివరకు మీరు ఏ క్లాసులు అయితే వింటూ ఉన్నారో, ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం ఎలా విశ్వసించాలి అని షేఖ్ అబూబకర్ హఫిదహుల్లాహ్ గారు ఏదైతే వివరిస్తూ వచ్చారో ఇంకా ముందుకు ఏ క్లాసులు అయితే జరుగుతాయో అందులో మనకు కావలసినటువంటి ముఖ్య కొన్ని విషయాలు ఏంటో తెలుసా?

మనం ఈ విద్య నేర్చుకునే ఈ క్లాసులలో ఏదైతే హాజరయ్యామో, ప్రతీ రోజూ, ప్రతీ సందర్భంలో, చివరికి మనం క్లాసులో ఆన్‌లైన్ లేకపోయినప్పటికీ ఆ పీడీఎఫ్ తిరగేస్తూ, ఆ పాఠాలను మనం కొంచెం గుర్తు చేస్తూ, అల్లాహ్ దీనికి మనకు మంచి ప్రతిఫలం ప్రసాదించాలని అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశిస్తూ ఉండాలి. ఇంకా సోదర మహాశయులారా, నేర్చుకున్న విద్య ప్రకారంగా ఆచరించడానికి మనలో ముందు నుండే ఒక కాంక్ష, ఒక జజ్బా అనేది ఉండాలి. మరియు ఈ ధర్మవిద్య ప్రకారంగా మనం ఇతరులకు కూడా ఆహ్వానిస్తాము అని ఆ సంకల్పం కూడా ఇప్పటి నుండే చేసుకొని ఉండాలి. ఇవి మన బాధ్యతలు.

ఈ రోజు నా యొక్క అంశం, సలఫె సాలెహీన్ మన్ హజె సలఫ్ దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత విశ్వాసం మరియు ఆచరణలో.

సోదర మహాశయులారా, నా అంశానికి వివరణ నేను మీకు ఇచ్చే ముందు ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న సామెత తెలియజేస్తాను. మీరందరూ ఏదో ఈ ఒక్క ఉపన్యాసం, ప్రసంగం వినడానికి హాజరు కాలేదు. మీరు స్టూడెంట్స్. డైలీ క్లాస్ వైజ్ లో, సబ్జెక్ట్ వైజ్ లో చదువుతున్నారు.

ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. సామాన్యంగా మనం క్లాసులో వెళ్ళినప్పుడు, క్లాసులో చూస్తాము, ఎప్పుడైతే మనకు గురువుగారు ఒక పాఠం బోధిస్తారో, ఆ సందర్భంలో మన క్లాస్మేట్ ఎవరైతే ఉంటారో, తోటి మనతో చదివేవారు, వారిలో కొందరు చాలా మంచి బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, గురువు చెప్పే మాటల్ని, పాఠాల్ని చాలా తొందరగా, మంచి విధంగా అర్థం చేసుకునే వారు ఉంటారు. అవునా కాదా? ఉంటారు.

సర్వసామాన్యంగా ఎవరైతే వెనక వచ్చేవారు ఉంటారో వారు ఏం చేస్తారు? గురువు గారి పాఠం అర్థం చేసుకోవడానికి ఆ క్లాసులో ఉన్నటువంటి ఉత్తీర్ణులైన, ప్రధమంగా, మొదటి నుండి ఉన్నటువంటి పాఠాన్ని మంచి విధంగా అర్థం చేసుకున్నటువంటి ఆ మన తోటి విద్యార్థులను సంప్రదిస్తాము. వాటి ద్వారా మరింత మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. గురువు చెప్పిన పాఠాన్ని మనం వెనక ఉన్నందుకు, దూరంగా ఉన్నందుకు, అయ్యో గురువు చెప్పిన పాఠం ఈ పుస్తకం నుండే కదా సరిపోయిందిలే అని ఊరుకోము మనం. ఆ పాఠం ఎలా నచ్చ చెప్పారు? ఆ ముందుగా ఉన్నటువంటి ఆ ఎక్కువ బుద్ధివంతులు, జ్ఞానవంతులు ఎలా అర్థం చేసుకున్నారు? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇది బుద్ధిమంతుడు, జ్ఞానమంతుడు చేసేటువంటి పని, ఈ రోజుల్లో మనం సర్వసామాన్యంగా చేస్తూ ఉన్నాము. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే ఇది మనకు ఒక స్వాభావిక, ప్రకృతిపరమైన విషయం. స్వభావానికి విరుద్ధమైన విషయం కాదు.

ఈ ఉదాహరణ ద్వారా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మన యొక్క విశ్వాసాలలో, మన యొక్క జీవితంలో, మన యొక్క ఆచరణలలో, మనకు సంబంధించిన ప్రతీ విషయంలో ఖురాన్, హదీసులను అర్థం చేసుకోవడానికి మన్ హజె సలఫ్ లోని మొదటి శ్రేణి సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం, చాలా అవసరమైన విషయం. మరియు ఇది లేనిది మనం ఖురాన్, హదీసును అర్థం చేసుకోలేము అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, వాస్తవానికి ఖురాన్, హదీసుల ఆదేశం కూడా ఇది మన స్వభావంలో, ప్రకృతిలో ఉన్న విషయం. ఇది గ్రహించండి ముందు మీరు.

దలీల్లు ఎన్నో ఖురాన్, హదీసులో ఉన్నాయి, తర్వాత తెలియజేస్తాను నేను. కానీ అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానాలతో మనం ముందు గ్రహించవలసిన విషయం ఏంటి? ఖురాన్, హదీసులను సహాబాలు అర్థం చేసుకున్న విధంగా మన్ హజె సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోవడం ఇది ఒక అమ్ రె ఫిత్రీ, తప్పనిసరి విషయం, స్వాభావిక విషయం. దీనికి విరుద్ధం చేయడం వాస్తవానికి అసలైన మూర్ఖత్వం, అసలైన బుద్ధిహీనత, అసలైన జ్ఞానానికి వ్యతిరేకమైన విషయం.

ఈనాడు అరబీ భాష ఎంత అభివృద్ధి చెందినా, దాని యొక్క సాహిత్యం ఎంత గొప్పగా ముందుకు ఏగినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురాన్ అవతరించినప్పుడు అరబీ భాషలో వారు ఏ ప్రావీణ్యత కలిగి ఉన్నారో వాటికి మనం మించి పోలేము. ఆనాటి కాలంలో ఆ అరబీ తెలిసిన అరబీ సాహిత్యపరులు కూడా కేవలం భాష ఆధారంగానే ఖురాన్, హదీసును అర్థం చేసుకునే వాళ్ళము అన్నటువంటి తప్పుడు ఆలోచనలో పడలేదు. ఖురాన్ అల్లాహ్ వైపు నుండి అవతరించింది. దాని యొక్క వివరణ హదీస్ రూపంలో అల్లాహు త’ఆలా యే అవతరింపజేశాడు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ను తమ ఆచరణ ద్వారా, తమ మాటల ద్వారా, తక్రీర్, తమ ముందు జరిగిన ఏదైనా సంఘటన విషయం దానిని రూఢీపరుస్తూ లేదా దానిని రద్దు పరుస్తూ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఇదంతా కూడా వివరణ.

అందుకొరకే మన్ హజె సలఫ్ అని ఏదైతే మనం మాటిమాటికి అంటూ ఉంటామో, మన్ హజె సలఫ్ అని అంటే ఏంటి? దీనికి సంక్షిప్త భావం ఖురాన్, హదీసును సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకొని ఏ విధంగా ఆచరించారో, అది ఒక విధానం. మనం ఖురాన్, హదీసును అర్థం చేసుకోవడానికి ఆ సహాబాల విధానాన్ని అనుసరించడం తప్పనిసరి.

సలఫ్ అంటే గతించిపోయిన వారు, పూర్వీకులు. ఈ పూర్వీకులలో మొట్టమొదటి స్థానంలో, మొట్టమొదటి శ్రేణిలో, అంతస్తులో సహాబాలు ఉన్నారు. ఎందుకు? వారే డైరెక్ట్ ఖురాన్ అవతరణను తమ కళ్ళ ద్వారా చూసిన వారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ధర్మాన్ని నేర్చుకొని, అర్థం చేసుకొని, ఆచరించి ఇతరులకు చేరవేసిన వారు.

సహాబాలు అర్థం చేసుకున్నట్లు, సలఫె సాలెహీన్ అర్థం చేసుకున్నట్లు, ఆచరించినట్లు మనం ఇస్లాంను, ధర్మాన్ని, ఖురాన్, హదీసును అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే అలా కాకుంటే మన యొక్క విశ్వాసాలు సరియైనవి కావు, అల్లాహ్ అంగీకరించడు, స్వీకరించడు. ఒకవేళ మన్ హజె సలఫ్ ప్రాముఖ్యతను మనం గ్రహించకుంటే మన ఆచరణ సరియైనది కాదు, అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఒకవేళ మనం మన్ హజె సలఫ్ ను అర్థం చేసుకోకుంటే, దాని ప్రాముఖ్యతను గ్రహించకుంటే, మనం ఇహలోకంలో చేసే ఏ పని కూడా అది అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాదు.

అందుకొరకు మన్ హజె సలఫ్ అని మాట వచ్చినప్పుడు మూడు విషయాలు తప్పనిసరివి అని మదిలో నాటుకోండి, ఎల్లవేళల్లో ఈ మూడు విషయాలను ఫ్రెష్ గా ఉంచుకోండి. ఒకటి మన్ హజె సలఫ్ ను మనం తెలుసుకోవడం, రెండవది మన్ హజె సలఫ్ ను అర్థం చేసుకొని ఆచరించడం, మూడవది సచ్చే పర్యంతరం చివరి శ్వాస వరకు దానిపై స్థిరంగా ఉండడం. ఇల్మ్, ఫహమ్, సబాత్. అర్థం చేసుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం మన్ హజె సలఫ్ గురించి, దానిని అర్థం చేసుకొని ఆచరించడం మరియు దానిపై స్థిరంగా ఉండడం. ఈ మూడు విషయాలు తప్పనిసరి.

ఒకవేళ మనం విశ్వాసం అని, అల్లాహ్ ను విశ్వసించే విషయంలో గానీ ఇంకా వేరే విషయాల్లో గానీ నాకు అర్థమైనట్లు ఖురాన్, హదీస్ ద్వారా నేను విశ్వసిస్తాను. నాకు నా భాషలో ఖురాన్, హదీస్ ఉంది కదా సరిపోతుంది అని విర్రవీగుతూ మన్ హజె సలఫ్ ను తిరస్కరిస్తే అది అసలైన హిదాయత్, సన్మార్గం కాదు అని అల్లాహ్ స్వయంగా ఖురాన్ లో తెలియపరిచాడు. “ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్ తుమ్ బిహి ఫఖదిహ్ తదవ్ వ ఇన్ తవల్లవ్ ఫ ఇన్నమాహుమ్ ఫీ షిఖాఖ్”. సహాబాల విశ్వాసం ఎలా ఉందో, ప్రపంచ మనుషులందరి విశ్వాసాలు ఆ విధంగా కానంత వరకు వారు సన్మార్గగాములు కాలేరు, సన్మార్గంపై ఉండలేరు. “వ ఇన్ తవల్లవ్” వారు గనక ఒకవేళ వెన్ను తిరిగి పోతే పోనివ్వండి. వాస్తవానికి చీలికలు వహించి, సన్మార్గం నుండి పెడమార్గంలో పడినవారు వారే అవుతారు.

అందుకొరకు సహాబాల ప్రకారంగా విశ్వాసం మనకు తప్పనిసరి విషయం. అలాగే ఆచరణ. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఖురాన్ లో అల్లాహు త’ఆలా ఎన్నో సందర్భాలలో “ఇన్నల్లదీన ఆమనూ వ అమిలుస్ సాలిహాత్“, “యా అయ్యుహల్లదీన ఆమనూ అతీవుల్లాహ వ అతీవుర్ రసూల్“. ఈమాన్ తో పాటు, విశ్వాసంతో పాటు ఆచరణ, సదాచరణ మరియు అల్లాహ్ యొక్క విధేయతతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయత మాటిమాటికి అల్లాహు త’ఆలా ప్రస్తావించాడు.

అయితే విశ్వాసం సహాబాల మాదిరిగా ఉండడం ఈ సూర బకరా ఆయతు ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో, మన జీవితంలోని ప్రతి ఆచరణ సహాబాల ప్రకారంగా, వారు అర్థం చేసుకొని ఆచరించిన విధంగా ఉండడం తప్పనిసరి అని కూడా అల్లాహు త’ఆలా సూరతున్నిసాలో చాలా స్పష్టంగా తెలియపరిచాడు. “వ మన్ యుషాకికిర్ రసూల మిమ్ బాఅది మా తబయ్యన లహుల్ హుదా”. హిదాయత్, సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా ఎవరైతే దానికి విముఖత చూపుతారో, వ్యతిరేకించి వెనుతిరిగిపోతారో, “వ యత్తబిఅ గైర సబీలిల్ మూమినీన్“. ఇక్కడ గమనించండి. అల్లాహు త’ఆలా హిదాయత్ తర్వాత అతడు ఏదైతే వెనుదిరిగాడో, చీలికల్లో పడిపోయాడో, వ్యతిరేకత వహించాడో, “నువల్లిహి మా తవల్లా” అని కూడా చెప్పవచ్చు. అతన్ని మేము నరకంలో పంపించేస్తాము అని. కానీ దానికంటే ముందు ఏం చెప్పాడు? “వ యత్తబిఅ గైర సబీలిల్ మూమినీన్”. విశ్వాసుల మార్గాన్ని వదిలి వేరే మార్గాన్ని అనుసరిస్తున్నాడో, అతన్ని మేము అతడు ఏ పెడమార్గం వైపునకు వెళ్ళాడో అటు ఆ వైపునకే మరలింపజేస్తాము, చివరికి ఆ విధంగా అతన్ని నరకంలో పడవేస్తాము అది చాలా చెడ్డ స్థానం అని అంటున్నాడు.

ఇక్కడ విశ్వాసుల మార్గాన్ని అని అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడు, “సబీలిల్ మూమినీన్”, ఆ సబీలిల్ మూమినీన్ ఏంటి? సహాబాయె ఇక్రామ్. ఎందుకంటే విశ్వాసులలో మొట్టమొదటి విశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన వారు సహాబాలు.

అందుకొరకు సోదరులారా, నేను ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. వాటి ద్వారా మాట మరింత స్పష్టమవుతుంది. కానీ ఖురాన్లో అల్లాహు త’ఆలా ఈ విషయాలను ఎంత నొక్కి చెబుతున్నాడో, దీని ద్వారా మనం మన్ హజె సలఫ్ యొక్క, సహాబాలు అర్థం చేసుకున్న విధంగా ఆ ప్రకారంగా మన విశ్వాసాలు, మన ఆచరణలు ఉండడం ఎంత ముఖ్యమో, అవసరమో అది మీరు గమనించండి.

దీనికి సంబంధించి ముస్తద్రక్ హాకింలో హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క సంఘటన మరియు హదీస్ కూడా విందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలంలో కొందరు సహాబాల మన్హజ్ ను వ్యతిరేకించి సహాబాలు ఎలా ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకున్నారో ఆ మార్గాన్ని, విధానాన్ని వ్యతిరేకించినందుకు ఎంత పెడమార్గంలో పడిపోయారంటే స్వయంగా హజ్రత్ అలీ వారినే కాఫిర్ అని అనేసారు. ఇంకా ఎందరో సహాబాలను కాఫిర్ అని అన్నారు. ఎవరు వారు? ఖవారీజ్. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ ఖవారీజ్ లతో మునాజరా (డిబేట్) చేయడానికి వెళ్లారు.

ఆ సందర్భంలో ఆయన అన్నటువంటి పలుకులు ఇప్పటికీ చాలా భద్రంగా ఉన్నాయి. అక్కడ మీరు గమనించండి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఏమంటున్నారు?

أَتَيْتُكُمْ مِنْ عِنْدِ صَحَابَةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنْصَارِ. لِأُبَلِّغَكُمْ مَا يَقُولُونَ. الْمُخْبَرُونَ بِمَا يَقُولُونَ. فَعَلَيْهِمْ نَزَلَ الْقُرْآنُ. وَهُمْ أَعْلَمُ بِالْوَحْيِ مِنْكُمْ.

నేను మీ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు అయినటువంటి ముహాజిరీన్ మరియు అన్సార్ వారి వద్ద నుండి వస్తున్నాను. వారి యొక్క మాటను నేను మీకు చేరిపించడానికి, తెలపడానికి వస్తున్నాను. వారు ఎలాంటి వారంటే వారు ఏమి మాట్లాడినాగానీ ఆ ఖురాన్, హదీసుల ఆధారంగా మాట్లాడుతారు. ఎందుకంటే ఖురాన్ వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించింది. మరియు వారు మీ కంటే ఎక్కువగా మంచి రీతిగా అల్లాహ్ యొక్క వహీని తెలుసుకున్న వారు

ఇక్కడ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఆ ఖారిజీ వాళ్లతోని ఏదైతే మునాజరా, డిబేట్ చేశారో, దానికి ముందు ఈ మాట ఏదైతే ప్రస్తావించారో, మీరు విన్నారు కదా. ఇక చివరి పలుకులు, సహాబాలు మీకంటే ఎక్కువగా వహీ గురించి, అ’అలము, ఎక్కువగా తెలిసిన వారు, వహీ గురించి మంచి రీతిలో తెలిసిన వారు అని ఏదైతే అన్నారో అలా ఎందుకన్నారో తెలుసా? ఆ విషయం తెలిస్తే ఈ రోజుల్లో మన మధ్యలో కొంతమంది పుట్టుకొచ్చారు. “తెలుగులో ఖురాన్ సంపూర్ణంగా ఉంది. ఎందరో దీనికి అనువాదాలు చేశారు. ఇక మనకు ఖురాన్ సరిపోతుంది, హదీస్ అవసరం లేదు” అని కొందరు అంటున్నారు. మరికొందరు అంటున్నారు, “ఖురాన్ కు అనుకూలంగా ఉన్నటువంటి హదీసులను మాత్రమే తీసుకోవాలి” అని. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవారు వాస్తవానికి అటు హదీస్ ను తిరస్కరించారు, హదీస్ ను తిరస్కరిస్తే ఇక ఖురాన్ పై కూడా వారి విశ్వాసం లేనట్లే.

కొత్తగా కొందరు సోదరులు తెలిపిన విషయం ఏంటంటే, దీని కారణంగా ఇప్పుడు ఏమంటున్నారు? ఖురాన్లో ఎక్కడా కూడా పురుషులపై పట్టు వస్త్రాలు నిషిద్ధమని చెప్పబడలేదు. బంగారం పురుషుల కొరకు నిషిద్ధమని చెప్పబడలేదు. ఖురాన్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు, అందుకొరకు వారు బంగారం వేసుకోవచ్చు, పట్టు వస్త్రాలు ధరించవచ్చు. మరొకతను ఖురాన్ యొక్క ఆధారం మీద మొన్న మిడతల దండు ఏదైతే వచ్చిందో దానిని ప్రస్తావిస్తూ ఒక వీడియో చేసి ఏమంటున్నాడు? మిడతలు తినాలి అని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు, అందుకొరకు అవి తినకూడదు.

ఇలాంటి మూర్ఖత్వపు మాటలు, ఇలాంటి అజ్ఞాన మాటలు యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మాట్లాడేవారు వాస్తవానికి ఖురాన్, హదీస్ ను మన్ హజె సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోలేదు. ఎలాగైతే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఆ ఖారిజీ వాళ్ళతో చెప్పారో, సహాబాలు మీకంటే ఎక్కువగా వహీని, ఖురాన్ ను అర్థం చేసుకున్న వారు, ప్రవక్త మాటల్ని అర్థం చేసుకున్న వారు.

అలా ఎందుకు చెప్పారో తెలుసా? విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ ఖారిజీ వాళ్ళు తమ యొక్క పప్పు ఉడకలేదు, ముస్లింల మధ్యలో, సహాబాల మధ్యలో ఏదైతే వారు ఒక సంక్షోభం, అలజడి, పెద్ద వివాదం ఇంకా పెరుగుతూ పోవాలి అని కోరుతూ ఉన్నారో, అది సమసిపోయింది, అల్హందులిల్లాహ్. అప్పుడు సహాబాలు అన్నారు, ఈ చిన్నపాటి గొడవ ఏదైతే జరిగిందో, ఆ గొడవను మనం సమాప్తం చేయడానికి ఖురాన్ ప్రకారంగా మన మధ్య తీర్పు కొరకు మనం ముందుకు వద్దాము. అయితే ఖురాన్ ప్రకారంగా మనం తీర్పుకు ముందుకు వద్దాము అని అన్న తర్వాత అక్కడ కత్తులన్నీ కూడా కిందకి దిగిపోయాయి. ఖురాన్ మాటను విన్న వెంటనే అందరూ ఆ గొడవను, కొట్లాటను, ఆ యుద్ధాన్ని సమాప్తం చేసి సైలెంట్ గా ఉండిపోయారు.

ఇక ఖురాన్ ప్రకారంగా తీర్పు కొరకు ఒక ఇద్దరు ఇరువైపుల నుండి ముందుకు వచ్చారు. ఆ సందర్భంలో ఈ ఖారిజీ వాళ్ళు నవూదు బిల్లాహ్ చూడడానికి ఖురాన్ వారు చదువుతున్నారు, ఏమన్నారు? మీరన్నారు ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దాము అని, ఈ ఇద్దరు మనుషులు ఎందుకు ముందుకు వచ్చారు తీర్పు చేయడానికి? “వ మన్ లమ్ యహ్ కుమ్ బిమా అన్ జలల్లాహు ఫ ఉలాయిక హుముల్ కాఫిరూన్”. ఎవరైతే ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయరో, అల్లాహ్ అవతరించిన దాని ప్రకారంగా తీర్పు చేయరో, వారు కాఫిర్లు. మేము ఈ మనుషుల మాటలను, ఈ మనుషుల తీర్పులను మేము నమ్మము, తిరస్కరించము అని ఏం చేశారు? ఖురాన్ ఆయత్ చదివేశారు. కానీ చూడడానికి ఖురాన్ ఆయత్ ఏదైతే చదివారో, దాని యొక్క భావం అదేనా? కాదు. ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయడం అని అంటే ఖురాన్ ను మధ్యలో తీసుకొస్తే ఖురాన్ స్వయంగా మాట్లాడదు. ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయడం అంటే ఉదాహరణకు మనమిద్దరం ఏదైనా విషయంలో విభేదించుకున్నాము. నా మాట, మీ మాట ఒక జ్ఞానవంతుని ముందు పెట్టేది ఉంటే అతడు మన ఇద్దరి మాట విన్న తర్వాత ఖురాన్, హదీసులో ఏముందో దాని ప్రకారంగా తీర్పు చేసి న్యాయం ఎటువైపున ఉందో అది పరిష్కరిస్తాడు. ఖురాన్ నుండి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు సాక్ష్యం కూడా ఇచ్చారు. “యహ్ కుము బిహి దవా అద్లిమ్ మిన్ కుమ్” సూరతుల్ మాయిదాలో.

ఈ విధంగా వారు చూడడానికి ఖురాన్ ఆయత్ చదివేశారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మనం సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో, మన్ హజె సలఫ్ ఏమిటో అందులో తెలుసుకోవడం తప్పనిసరి.

ఒక ఉదాహరణ ఇచ్చి, ఎందుకంటే ఉదాహరణల ద్వారా విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సూరతుల్ అన్’ఆంలో ఆయత్ అవతరించింది. ఏమని?

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
“అల్లదీన ఆమనూ వ లమ్ యల్ బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాయిక లహుముల్ అమ్ ను వ హుమ్ ముహ్ తదూన్”. ఎవరైతే విశ్వసించారో మరియు తమ విశ్వాసాన్ని జుల్మ్ తో కలుషితం చేయలేదో, అలాంటి వారి కొరకే శాంతి ఉంది, వారే సన్మార్గంపై ఉన్నవారు.

సహాబాలు భయపడిపోయారు. ప్రవక్త వద్దకు వచ్చారు. ప్రవక్తా, అల్లాహు త’ఆలా ఈ ఆయత్ లో విశ్వాసాన్ని జుల్మ్ తో కలుషితం చేయని వారి కొరకే ప్రశాంతత మరియు శాంతి మరియు హిదాయత్ అని అంటున్నాడు. అయితే మాలో ప్రతి ఒక్కడు ఏదో ఒక చిన్నపాటి జుల్మ్ అతనితో జరుగుతూనే ఉంటుంది. ఏదైనా అన్యాయం, దౌర్జన్యం, చిన్నపాటి ఎవరి యొక్క హక్కులో ఏదైనా కొరత అనేది జరుగుతూనే ఉంటుంది కదా. మరి మా యొక్క విశ్వాసం వృధాగానా, మేము అల్లాహ్ యొక్క హిదాయత్ పై లేనట్లేనా, అని బాధపడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చ చెప్పారు. సూరతు లుఖ్మాన్ లోని ఆయత్ ను గుర్తు చేసి ఇక్కడ విశ్వాసంతో పాటు, విశ్వాసంలో జుల్మ్ ను కలుషితం చేయడం అంటే అది షిర్క్ అని చాలా స్పష్టంగా తెలియపరిచారు.

ఇక్కడ కొందరు మూర్ఖులు ఏమంటారో తెలుసా? ఆ విషయం ఖురాన్ లోనే ఉంది అని. కానీ ఖురాన్ లో ఉంది అని ఎలా తెలిసింది? హదీస్ ద్వారా తెలిసింది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రశ్నించారు, అప్పుడు మనకు ఆ విషయం చాలా స్పష్టంగా బోధపడినది.

ఈ రోజుల్లో కొందరు ఖురాన్ ను సహాబాల ప్రకారంగా అర్థం చేసుకునే వారు, హదీస్ యొక్క అవసరం లేదు అని అనేవారు ఖురాన్ లోని ఈ ఆయత్ యొక్క ఆచరణ రూపం ఏం దాలుస్తారో గమనించండి. అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశించాడు.

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا
“వస్సారికు వస్సారిఖతు ఫఖ్త’అ ఐదియహుమా”.
దొంగతనం చేసేవాడు పురుషుడైనా, స్త్రీ అయినా వారి యొక్క చేతులను మీరు నరికేసేయండి.

ఇక ఇక్కడ గమనించండి. అల్లాహు త’ఆలా ఖురాన్లో ఏ ఆదేశం ఇచ్చాడు? దొంగతనం చేసే వారు పురుషులైనా, స్త్రీ అయినా వారి చేతులు నరికేయాలి. ఇక్కడ కనీసం రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, ఎంత దొంగతనం చేస్తే చెయ్యి నరకాలి అన్న విషయం, ఆ దొంగతనం యొక్క పరిమాణం ఏంటి? చెయ్యి మణికట్టు వరకా, మోచేతుల వరకా, లేదా ఈ భుజం వరకా?

ఎందుకంటే చెయ్యి అన్న పదం ఏదైతే ఖురాన్లో వచ్చిందో, కొన్ని సందర్భాలలో ఇక్కడి వరకు అని వచ్చింది, మణికట్టు వరకు, ఇంత భాగాన్ని మాత్రమే చెయ్యి అంటారు. మరికొన్ని సందర్భాలలో, ఉదాహరణకు నేను మీకు దాని యొక్క రిఫరెన్స్ ఇవ్వాలంటే కూడా మణికట్టు వరకు ప్రస్తావన తయమ్ముం విషయంలో వచ్చి ఉంది. మోచేతుల వరకు అనేది ఉంటే, ఉదూ యొక్క విషయంలో వచ్చి ఉంది. మరియు సర్వసామాన్యంగా యద్ (చెయ్యి) అని అన్నప్పుడు, మణికట్టు నుండి మొదలుకొని ఈ భుజం వరకు కూడా అవుతుంది. ఎక్కడి వరకు చెయ్యి కట్ చేయాలి? ఎలా తెలుస్తుంది? హదీసుల ద్వారా తెలుస్తుంది. సహాబాలు ఎలా అర్థం చేసుకొని ఆచరించారు అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది.

అందుకే సోదరులారా, సహాబాల ప్రకారంగా, వారు అర్థం చేసుకున్న ప్రకారంగా ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకోవడం చాలా అవసరం, చాలా అవసరం, అది లేనిది సన్మార్గంపై ఉండలేము. ఎప్పుడైతే మనిషి తన యొక్క విశ్వాసంలో, నా ఇష్ట ప్రకారంగా నేను విశ్వాసాన్ని అవలంబిస్తాను. ఖురాన్, హదీస్ నేను అర్థం చేసుకొని నా ఇష్ట ప్రకారంగా అవలంబిస్తాను అంటే కూడా అతని విశ్వాసం సరికాదు, ఎప్పటివరకైతే సహాబాల యొక్క మన్హజ్, సలఫె సాలెహీన్ యొక్క మన్హజ్ విశ్వాసంలో ఏముందో దాన్ని తెలుసుకొని పాటించడో.

కొన్ని సందర్భాలలో మీకు విచిత్రం అనిపిస్తుంది కదా. కానీ వింటే విచిత్రం కావచ్చు. నిజమైన జ్ఞానం ఉండేది ఉంటే, ఖురాన్, హదీస్ యొక్క జ్ఞానం సహాబాల ప్రకారంగా ఉండేది ఉంటే, మన్ హజె సలఫ్ ప్రకారంగా ఉండేది ఉంటే విచిత్రం కాదు. మనం విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అని అంటాము కదా. సర్వసామాన్యంగా విశ్వాసం మరియు ఆచరణ అని అంటాము కదా. వాస్తవానికి విశ్వాసంలో ఆచరణలన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఆచరణ అని అన్నప్పుడు విశ్వాసం అందులో వచ్చేస్తుంది.

ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు, ఎలా తెలుస్తుంది? సహాబాల మన్హజ్ ను అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఖురాన్, హదీసును సహాబాల మన్హజ్ ప్రకారంగా, సలఫ్ మన్హజ్ ప్రకారంగా అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది.

ఇంకా ఆచరణ ఇది ఎంతో ముఖ్యం. కానీ ఇందులో వ్యత్యాసాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, వాటికంటే కొంచెం తక్కువ స్థానంలో ఉన్నాయి. అలాగే విశ్వాసంలో కూడా ఉన్నత శ్రేణికి చెందిన విశ్వాసం మరియు దానికంటే కొంచెం తక్కువ, దానికంటే మరీ కొంచెం తక్కువ, ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? ఖురాన్ హదీథ్ ను సహాబాల ప్రకారంగా, మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోవడం ద్వారా.

అందుకొరకే సోదర మహాశయులారా, మన్హజ్-ఎ-సలఫ్ మన జీవితంలోని ప్రతీ కోణంలో మనకు చాలా అవసరం. మన యొక్క ప్రవర్తనలో కూడా, మన యొక్క లావాదేవీల్లో, మన యొక్క వ్యాపారంలో, మన వైవాహిక జీవితంలో, మన యొక్క ఆచరణ, విశ్వాసం ప్రతీ దానిలో. ఇలా మన్హజ్-ఎ-సలఫ్ ను అనుసరించిన వారి గురించే అల్లాహు త’ఆలా సూరతుత్తౌబా, సూరా నెంబర్ తొమ్మిది, ఆయత్ నెంబర్ వందలో ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నాడో గమనించండి.

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ
ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్‌ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్‌ పట్ల ప్రసన్నులయ్యారు. (9:100)

ఎవరైతే విశ్వాసంలో ముందంజం వేసి, చాలా ముందు ముందుగా ఉన్నారో, ముహాజిరులలోని వారు మరియు అన్సార్లలోని వారు, వారికి శుభవార్తలు అయితే ఉన్నాయో ఉన్నాయి, అనుమానమే లేదు. కానీ వీరి యొక్క మన్హజ్ ను అవలంబించే వారి గురించి అల్లాహు త’ఆలా శుభవార్త ఇస్తున్నాడు. ఇప్పుడు గమనించండి. వల్లదీనత్తబవూహుమ్ బిఇహ్సాన్. తర్వాత ఆయత్ లో ఏ శుభవార్తలు అయితే ఉన్నాయో, అవి కేవలం ముహాజిరీన్ మరియు అన్సార్లకు మాత్రమే కాదు, వల్లదీనత్తబవూహుమ్ బిఇహ్సాన్. ఉత్తమమైన రీతిలో, సంపూర్ణ సంకల్ప శుద్ధితో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సరైన ఇత్తిబాలో (అనుసరణలో) ఎవరైతే ఇత్తబవూహుమ్, ముహాజిరీన్ మరియు అన్సార్ల యొక్క మన్హజ్ ను అనుసరించారో, వారికి కూడా ఏంటి ఆ అనుగ్రహాలు, ఏంటి ఆ శుభవార్తలు? రదియల్లాహు అన్హుమ్ వరదూ అన్హ్. అల్లాహు త’ఆలా పట్ల వారు సంతోషపడ్డారు, అల్లాహ్ వారి పట్ల సంతోషపడి ఉన్నాడు.

సోదర మహాశయులారా, ఖురాన్ లో ఎన్నో ఆయత్ లు ఉన్నాయి. సూరతున్నమల్ లో,

وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ
మరియు ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కలుగుగాక.

ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో, తఫ్సీర్ ఇబ్ను కథీర్ లో వచ్చింది. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు. ఇస్తఫా, ఇబాదిహిల్లదీ నస్తఫా, అల్లాహు త’ఆలా తన దాసులలో ఎన్నుకున్న వారు ఎవరు? సర్వసామాన్యంగా మనం అంటాము అందులో అనుమానమే లేదు, ప్రవక్తలు అని. వాస్తవం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహు త’ఆలా ఎవరిని ఎన్నుకున్నాడు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, సహాబాలను.

ఈ యొక్క వ్యాఖ్యానం కేవలం ఇబ్ను అబ్బాస్ దే కాదు, మీరు ఒకవేళ ఇబ్ను మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాటలు వీటి గురించి విన్నారు అంటే, ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అబర్రుహుమ్ ఖులూబా, సహాబాలు అల్లాహు త’ఆలా వారిని ప్రత్యేకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యరికాన్ని, షాగిర్దీ, ఫర్ ఏ గుడ్ స్టూడెంట్స్ ఏదైతే ఎన్నుకున్నాడో, సహాబాలను ఎన్నుకున్నాడు. ఎందుకు? వారిలో అలాంటి గొప్ప గుణాలు, మంచి విషయాలు అల్లాహు త’ఆలా చూసి ఉన్నాడు.

ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో సహాబాల గురించి తెలియజేస్తూ, మీరు ఒకవేళ ఎవరినైనా అనుసరించాలనుకుంటే, మీ కంటే ముందు గతించిపోయిన ఇలాంటి గొప్పవారి గురించి, అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, ఈ విధంగా కొన్ని సందర్భాలలో పేర్లతో చెప్పి ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో పేర్లు కాకుండా.

సోదర మహాశయులారా, మన జీవితంలో మనం సహాబాల యొక్క మన్హజ్, సలఫ్-ఎ-సాలిహీన్ యొక్క మన్హజ్ అవలంబించడం చాలా అవసరం.

దీనికి ఒక చిన్న సంఘటన మీరు గమనించండి. ముస్నద్ అహ్మద్ లో ఈ హదీథ్ వచ్చి ఉంది. ఒకసారి రబీఆ. రబీఆ రదియల్లాహు త’ఆలా అన్హు నవ యువకుడు, అతనిలో మరియు హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వీరిద్దరిలో కొన్ని మాటలు జరుగుతూ ఉంటాయి. మదీనాలో జరిగిన సంఘటన ఇది. అబూబకర్ అప్పటికే 55 వయసు దాటేశారు, రబీఆ ఇంకా నవ యువకుడు. ఇద్దరిలో మాట జరుగుతూ జరుగుతూ, అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ద్వారా ఏదో ఒక మాట వెళ్ళింది.

గమనించండి, ఇంకా అక్కడే ఉన్నారు, ఆ సమావేశాన్ని, ఆ సభను, ఆ స్థలం నుండి ఇంకా దూరం వెళ్ళలేదు, అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హుకు వెంటనే తెలిసింది నేను రబీఆకు ఇలాంటి మాట అనేశాను అని. అల్లాహ్ ఈ మాటను ఇష్టపడడు అని. వెంటనే అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, రబీఆ, నీవు కూడా వెంటనే ఇలాంటి మాట అని నాతో ప్రతీకారం తీర్చుకో, ప్రళయ దినం నాడు మనం, నేను దీని గురించి అల్లాహ్ వద్ద ప్రశ్నించబడకుండా ఉండడానికి.

రబీఆ ఏమన్నాడు? గఫరల్లాహు లక యా అబా బకర్. అబూబకర్, అల్లాహ్ నిన్ను క్షమించుగాక.

అబూబకర్ అంటున్నారు, సరే కానీ నేను ఏ మాట అయితే నిన్ను అన్నానో, నువ్వు అదే మాట అను, నువ్వు ప్రతీకారం తీసుకున్నట్లు అయిపోతుంది. కానీ రబీఆ అనలేదు. అననందుకు అబూబకర్ కు మరింత కొంచెం కోపం వచ్చింది. కానీ ఏం చేశారు? నేను నీ గురించి ప్రవక్త వద్దకు వెళ్లి షికాయత్ చేస్తాను అని వెళ్లారు. ప్రవక్త వద్దకు బయలుదేరారు.

ఇక్కడ ఏం జరిగింది గమనించండి. రబీఆ అస్లమ్ వంశానికి చెందినవారు, రబీఆ యొక్క జాతి వాళ్ళు, తెగ వాళ్ళు, వారు దగ్గరికి వచ్చి, ఈ పెద్ద మనిషికి ఏమైపోయింది? అతడే తప్పు చేసి, మళ్లీ తిరిగి అతడే షికాయత్ చేయడానికి ప్రవక్త వద్దకు వెళ్తున్నాడా? రబీఆ ఏమన్నాడో గమనించండి. “మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపోండి, నేను కూడా ప్రవక్త వద్దకు వెళ్తున్నాను. అక్కడ ఏదైనా మా ఇద్దరి గురించి మేలే జరుగుతుంది. కానీ మీరు గనక నాకు తోడుగా ఉన్నారు, అబూబకర్ కు వ్యతిరేకంగా ఉన్నారు అని అబూబకర్ కు తెలిసి, అబూబకర్ నారాజ్ అయ్యాడంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిసి, ప్రవక్త నా పట్ల అసంతృప్తి చెందారంటే, అల్లాహు త’ఆలా అసంతృప్తి చెందాడంటే రబీఆ నాశనమైపోతాడు”. వెంటనే రబీఆ కూడా ప్రవక్త వద్దకు చేరుకున్నాడు.

అప్పటికే అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు పూర్తి సంఘటన తెలియజేశారు ప్రవక్త వారికి. రబీఆ చేరుకున్న తర్వాత ప్రవక్త అడుగుతున్నారు, రబీఆ, నీవు ఏమి సమాధానం ఇచ్చావు? రబీఆ చెప్పారు, ప్రవక్తా నేను అన్నాను, గఫరల్లాహు లక యా అబూబకర్. ఓ అబూబకర్, అల్లాహు త’ఆలా నిన్ను క్షమించుగాక. అల్లాహు త’ఆలా నిన్ను మన్నించుగాక. అప్పుడు ప్రవక్త రబీఆను చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకొని చెప్పారు, నీవు చాలా మంచి పని చేసావు. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి అవుగాక. మన పెద్దవారిని గౌరవించే యొక్క అసలైన పద్ధతి ఇది.

ఈ సంఘటన ద్వారా మనకు ఏం తెలుస్తుంది? మన్హజ్-ఎ-సలఫ్ గురించే ప్రసంగం చేస్తూ చేస్తూ ఇది ఎందుకు చెప్పారు? సోదర మహాశయులారా, మన్హజ్-ఎ-సలఫ్ అంటే ఏమిటో తెలుసుకొని వారు, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత ఉందో గమనించని వారు ఇలాంటి ఎన్నో తప్పులకు, లోటుపాట్లకు గురై, ఈ రోజుల్లో కొందరు తమకు తాము ముస్లింలు, తమకు తాము మంచి ప్రసంగాలు చేసేవారు అని, యూట్యూబ్, ఫేస్బుక్ లలో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నవారు, కొన్ని సందర్భాలలో కొందరి సహాబాలనే కించపరుస్తున్నారు. కొన్ని విషయాలలో సహాబాలను కించపరుస్తున్నారు.

సహాబాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు?

إِذَا ذُكِرَ أَصْحَابِي فَأَمْسِكُوا
ఇదా దుకిర అస్హాబీ ఫఅమ్సికూ.
[నా సహచరుల గురించి ప్రస్తావించబడినప్పుడు, మీరు మౌనంగా ఉండండి.]

నా సహాబాల విషయంలో జోక్యం చేసుకొని, కించపరిచేటువంటి మాటలు జరిగే చోట నుండి మీరు తొలిగిపోండి, దూరమైపోండి. అక్కడ ఆ మాటలను ఖండిస్తే చాలా మంచిది. లేదా అంటే మీరు అక్కడ నుండి దూరమైపోండి.

సహాబాల ద్వారా ఈ ఖురాన్ మనకు చేరింది. సహాబాల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ లు మనకు చేరాయి. సహాబాలను గౌరవించడం, వారు అర్థం చేసుకున్నట్లు ఖురాన్ హదీథ్ లను అర్థం చేసుకొని మనం జీవించడం మన జీవితంలోని ప్రతీ కోణంలో. అందుకొరకే సుమారు 10 నిమిషాల ముందు నేను చెప్పాను, కొన్ని విషయాలు విన్నప్పుడు మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది అని. ఒక రెండు ఉదాహరణలు ఇచ్చాను కూడా. ఉదాహరణ గమనించండి.

సహాబాల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి అన్నది కూడా సహాబాల కాలం నుండి ఇప్పటి వరకు ధర్మవేత్తలందరూ కూడా బాబుల్ అఖాయిద్ లో పేర్కొన్నారు. అఖీద-ఎ-వాసితీయలో అక్కడ కూడా మీరు గమనించవచ్చు. అఖీద-ఎ-తహావియాలో ఇమామ్ తహావీ రహమహుల్లాహ్ అలైహ్, దాని యొక్క వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్ను అబిల్ ఇజ్ అల్ హనఫీ రహమహుల్లాహ్ అలైహ్, ఎంత వివరంగా దీని గురించి చెప్పి ఉన్నారో. మరి ఈ రోజుల్లో కొందరెవరైతే మన్హజ్-ఎ-సలఫ్ గురించే తప్పుడు మాటలు మాట్లాడుతూ, దీనిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో, వాస్తవానికి ఖురాన్ హదీథ్ ను వారు అర్థం చేసుకోవడం లేదు. పెడమార్గంలో వారు పడిపోతున్నారు అన్నటువంటి విషయం వారు గ్రహించడం లేదు.

మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత, దీని ద్వారా మన యొక్క విశ్వాసం, దీని ద్వారా మన యొక్క ఆచరణ, దీని ద్వారా మన యొక్క ప్రవర్తన, దీని ద్వారా మన యొక్క లావాదేవీలు, దీని ద్వారా మన యొక్క వైవాహిక జీవితం, దీని ద్వారా మన యొక్క వ్యాపారాలు, మన జీవితానికి సంబంధించిన ప్రతీ రంగంలో మేలు, మంచి విషయాలు అనేటివి ఉంటాయి, వాస్తవానికి మన్హజ్-ఎ-సలఫ్ ను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం నడిచామంటే.

మాటిమాటికి మన్హజ్-ఎ-సలఫ్ అంటున్నారు కానీ అది అసలు ఏంటి అని కొందరు అడుగుతున్నారు కావచ్చు. ఈ రోజు నా ప్రసంగం అది కాదు. మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రాధాన్యత, నేను ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. విషయం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అంటే, ఇక తర్వాత రోజుల్లో, తర్వాత క్లాసుల్లో మన్హజ్-ఎ-సలఫ్ యొక్క అఖీదా ఏమిటి, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క, ఇప్పుడు అఖీద-ఎ-వాసితీయ యొక్క పేరు ఏదైతే మీరు విన్నారో నా ప్రసంగం కంటే కొంచెం ముందు, అఖీద-ఎ-వాసితీయలో మీరు చదవండి, మేము ఇంతకు ముందు చదివి ఉన్నాము అల్హందులిల్లాహ్ షేఖ్ ముహమ్మద్ అల్ హమద్ హఫిదహుల్లాహ్ మాకు చదివించారు. అందులో విశ్వాసాలు, ఆచరణలు, పెళ్లిళ్ల విషయాలు, ప్రవర్తనలు అన్నీ ఎలా ఉంటాయి సలఫ్ వద్ద, మనం ఎలా అవలంబించాలి.

ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి చాలా రకాల పాపాలు, చాలా రకాల తప్పిదాలలో, మన సమాజంలో కొందరు ఉన్నారు, సమాజాన్ని వారు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే చాలా మంచిది. అధ్యయనం చేసి ఏం చేస్తున్నారు? వారిలో ప్రబలి ఉన్నటువంటి చెడులను ఖండించడానికి ఉద్యమం లేపుతున్నారు. అల్హందులిల్లాహ్, చాలా మంచి విషయం. ఈ ఉద్యమాలు లేపి స్కూళ్లలో, కాలేజీలలో, సమావేశాలలో, గల్లీ గల్లీలలో తిరిగి ఆ చెడును ఖండించడానికి చాలా కృషి పడుతున్నారు, చేస్తున్నారు. కానీ స్వయంగా వారు ఏ చెడు రూపుమాపడానికి నడుం బిగించారో, ఉద్యమం లేపారో, వారు మన్హజ్-ఎ-సలఫ్ ను అర్థం చేసుకోవడం లేదు గనక, మన్హజ్-ఎ-సలఫ్ గురించి చదివి లేరు గనక, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా చదివి లేరు గనక, ఒకవైపున చూస్తే వారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్నటువంటి కొన్ని ప్రశంసలు వారికి లభిస్తున్నాయి. కానీ మరోవైపున, వారు చేస్తున్నది పరలోకంలో హాజరైనప్పుడు వారికి ఏ పుణ్యం దక్కకుండా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకుంది ఇది? మన్హజ్-ఎ-సలఫ్ ను, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోకుండా కేవలం సమాజంలో జరుగుతున్న వాటిని అధ్యయనం చేసి, దానికి వ్యతిరేకంగా నడుం కట్టినందుకు.

అందుకొరకే సోదర మహాశయులారా, మన విశ్వాసాలు, మన యొక్క ఆచరణలు, ఆచరణలో దావత్ పనులు, దావత్ లో మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం, అన్ని విషయాలలో కూడా మన్హజ్-ఎ-సలఫ్ ను అవలంబించడం తప్పనిసరి.

ఈ రోజుల్లో కొందరేమంటారు? అరే మన పూర్వికులు చెప్పకుంటే, ఖురాన్ లో నాకు కనబడుతుంది కదా, నేను చెప్పకూడదా? అల్లాహు అక్బర్.

كُلُّ خَيْرٍ فِي اتِّبَاعِ مَنْ سَلَفَ، وَكُلُّ شَرٍّ فِي ابْتِدَاعِ مَنْ خَلَفَ
కుల్లు ఖైరిన్ ఫీ ఇత్తిబాయి మన్ సలఫ్, వకుల్లు షర్రిన్ ఫీ ఇబ్తిదాయి మన్ ఖలఫ్.
[ప్రతి మేలు పూర్వీకులను అనుసరించడంలో ఉంది, ప్రతి చెడు తరువాతి వారి బిద్ అత్ లలో ఉంది.]

అల్లాహు త’ఆలా ఈ ఖురాన్ మనకు అవతరింపజేశాడో, చూడడానికి కాలం పెరుగుతున్నా కొద్దీ సమస్యలు కొన్ని కొత్త కొత్తవిగా ఉన్నాయి అని ఏర్పడతాయి. కానీ గమనించండి, వాటి పరిష్కారానికి మూలాలు డైరెక్ట్ లేకున్నా గానీ, మూలాలు ఖురాన్ హదీథ్ లో తప్పకుండా ఉంటాయి. ఈ విషయం ఎలా తెలుస్తుంది? మన్హజ్-ఎ-సలఫ్ ను అవలంబించడం ద్వారా తెలుస్తుంది.

ఈ రోజుల్లో కొందరు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు. “అరే ఈ సమస్య సహాబాల కాలంలో లేదండి, తాబయీన్ల కాలంలో లేదండి, మీకు అక్కడ ఎలాంటి హదీథ్ దొరకదు”. ఇది తప్పు విషయం అని గ్రహించండి. ఏ సమస్య ప్రళయం వరకు తలెత్తినా గానీ దాని కి డైరెక్ట్ గా నీకు, నాకు, మనలాంటి చిన్న విద్యార్థులకు, మనలాంటి అల్ప జ్ఞానులకు దాని గురించి డైరెక్ట్ ఖురాన్ హదీథ్ లో ఏది దొరకకున్నా, అది మన అల్ప, మన యొక్క కొరత జ్ఞానంలో. కానీ వాస్తవానికి తప్పకుండా అక్కడ ఏదైనా రూఢీ ఉంటుంది, అది ఎక్కువ జ్ఞానవంతుల వద్దకు వెళ్లి, మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అందుకొరకే సోదర మహాశయులారా, ఈ రోజుల్లో ఎన్నో రకాల ఉద్యమాలు ఏవైతే లేస్తున్నాయో, చివరికి ముస్లిమేతరులలో ఇస్లాం యొక్క దావత్ ఇవ్వడానికి ఇక్కడ కూడా చాలా ఘోరమైన ఒక పొరపాటు ఏం జరుగుతుంది? కొందరు చూడడానికి ఉద్దేశం ఇస్లాం యొక్క ప్రచారం. చాలా మంచిది అల్హందులిల్లాహ్. కానీ ప్రచారానికి కొన్ని మార్గాలను, కొన్ని పద్ధతులను ఏవైతే అవలంబిస్తున్నారో, మన్హజ్-ఎ-సలఫ్ కు వ్యతిరేకం ఉండి, వారు ఆ వ్యతిరేకమైన పద్ధతులను ఏవైతే అవలంబిస్తున్నారో, వాటి గురించి ఎంత ప్రచారం చేస్తున్నారంటే, ఈ దావత్ యొక్క పద్ధతులు ఏవైతే ఒక వసీలా, ఒక మాధ్యమం, ఒక సాధనంగా ఉన్నాయో, అసలు ఉద్దేశానికి, ఆ అసలు ఉద్దేశాన్ని వారు మరిచిపోయి, ఇందులో కొట్టుమిట్టాడుతున్నారు మరియు తనలాంటి పని చేసేవారితోని విభేదంలో చాలా లోతుగా వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ఇది కూడా మన్హజ్-ఎ-సలఫ్ కి వ్యతిరేకమైన విషయం.

అందుకొరకు ఇలాంటి సందర్భాలలో మనం మన్హజ్-ఎ-సలఫ్ ను, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దానిని అవలంబించడం చాలా చాలా అవసరం.

అల్లాహు త’ఆలా మనందరికీ మన్హజ్-ఎ-సలఫ్ ను మరింత లోతుగా అధ్యయనం చేసి, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకొని ఆచరించి, దాని వైపునకు ఇతరులను ఆహ్వానించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వఅహ్సనల్ జజా. వబారకల్లాహు ఫీకుమ్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=11898

మరణాంతర జీవితం – పార్ట్ 05: పునరుత్థాన దినంపై విశ్వాసం [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 05 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 05. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:07 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

సోదర సోదరీమణులారా! పరలోకం సత్యం. మరోసారి లేపబడటం అనుమానం, సందేహం లేని విషయం. దీని గురించి ఖురాన్ లో అల్లాహ్ (తఆలా) ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు. ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే, సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము: ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి, మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకి ఏదైనా కష్టం కావచ్చు. కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు. ఇది మన విషయం, నవూదుబిల్లాహ్, మనకు మరియు అల్లాహ్ కు ఎలాంటి పొంతన లేదు. కానీ మన తక్కువ జ్ఞానానికి, మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన యొక్క ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు, ఇంత పెద్ద భూమి ముందు, ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు అడుగుల మనం మానవులం ఇంత పెద్ద విషయం. అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందువుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా? ఎంత మాత్రం కష్టం కాదు. ఎంత మాత్రం కష్టం కాదు.

సూర రూమ్ ఆయత్ నెంబర్ 27 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు.

وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ – 30:27
“ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక”

ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించిన వాడు, ఆయన తప్పకుండా తిరిగి పుట్టించ గలడు. తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం.

సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 104 లో ఇలా తెలియపరిచాడు.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ – 21:104
“ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.”

గమనించారా? తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు.

ఒక వ్యక్తి ప్రస్తావన సూరయే యాసీన్ లో వచ్చి ఉంది. అతను ఎంతో విర్రవీగుతూ “మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తరువాత మా ఎముకలు సైతం బూడిద అయిపోయిన తర్వాత ఎలా పుట్టించ గలుగుతాడు, ఎలా తిరిగి లేప గలుగుతాడు?” అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు. అల్లాహ్ (తఆలా) అతనికి సమాధానం ఇస్తూ “మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు? అని ప్రశ్నిస్తున్నాడా? తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా?” ఆ తరువాత ఆయత్ నెంబర్ 79 లో అల్లాహ్ ఇలా తెలిపాడు.

قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ – 36:79
(వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”

తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి. ఇందులో అతనికి ఏ మాత్రం ఇబ్బందికరం ఉండదు. అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు.

ఇక బుద్ధి పూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరోరకంగా చూపించాడు. ఒకసారి గమనించండి. ఎండకాలం వచ్చిందంటే బీడు వారిన భూములను మనం చూస్తాం. ఏ మాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము. కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి, అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్త కు ఉందో, అలాగే చనిపోయిన మనిషిని, మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని, బూడిదగా మారినా ఎముకల్ని సైతం కలిపి మరోసారి జీవింప చేయడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు.

సూరయే ఫుస్సిలత్ లోని ఆయత్ నెంబర్ 39 గమనించండి.

وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ– 41:39

ఆయన యొక్క సూచనలలో ఒక సూచన ఏమిటంటే, నీవు భూమిని ఎండిపోయినదిగా, బీడుబారినదిగా చూస్తావు. ఎప్పుడైతే మేము ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తామో, ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోసాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడు. వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు.

ఇలాంటి ఆయత్ లు ఖురాన్ లో మరి ఎన్నో ఉన్నాయి. మరొక గమనించగల విషయం ఏమిటంటే, ఎండిపోయిన భూమి, చూడడానికి చనిపోయిన భూమి, అందులో నీటి వర్షం, వర్షం యొక్క నీరు పడిన తరువాత ఎలా పచ్చగా అవుతుందో, మొలకలు ఎత్తుతాయో ఇలాంటి ఉదాహరణలే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.

సహీ ముస్లింలోని హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరిచారు. “మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒక వైపునకు మెడలు వాలి పోతాయి. ప్రజలు సొమ్మసిల్లి పోతారు. ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. వెన్నుముక లోని చివరి భాగం ఏది అయితే మిగిలి ఉంటుందో, దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలు ఎత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు. రెండవ శంఖు ఊదిన తర్వాత అందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరవుతారు”. ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం, ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం. ఇందులో మనం ఏ మాత్రం ఆలస్యం కానీ, ఏ మాత్రం సందేహం గాని, అనుమానం గాని ఉంచుకోకూడదు. దీని వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించామో ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మరోసారి లేపుతాడు, బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది.

మరొక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు. ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు. వారికీ వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. వారు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా? లేదు. అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి. అక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తారు. బాధితునికి అతని హక్కు దౌర్జన్యపరుడు నుండి తప్పకుండా ఇప్పిస్తాడు. అంతే కాదు సహీ హదీత్ లో వచ్చి ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు: “ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయ దినాన హాజరు పరుస్తాడు. దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు”. చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్య లో కూడా న్యాయం చేకూర్చ గలిగే ఆ సృష్టికర్త, మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చ గలుగుతాడు. ఆ న్యాయం, ప్రతిఫల దినం తప్పని సరిగా రావలసి ఉంది. మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది. నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ దీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చు గాక.

ప్రళయ దినం రావడం ఆ రోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ (తఆలా) ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమ చేసి, వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు.

సూరతుల్ ఘాషియా ఆయత్ నెంబర్ 25, 26 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ – 88:25
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم – 88:26
“వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది. మరి ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము.”

లెక్క తీసుకోవడం అనేది అల్లాహ్ (తఆలా) మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం. కొన్ని సందర్భాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ యసీరా” అని దుఆ చేసేవారు. అంటే “ఓ అల్లాహ్! నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో. ఎలాంటి ఇబ్బందికి నన్ను గురిచేయకుండా నా లెక్క తీసుకో.” అయితే ఒక సందర్భంలో ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రశ్నించారు: “ప్రవక్తా! చాలా సులభతరమైన లెక్క ఏమిటి” అని? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానం పలికారు: “తేలికమైన, చాలా సులభతరమైన లెక్క అంటే ఆయేషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం“. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ లోనిది సహీ హదీత్.

అయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు” “ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడు అయితే శిక్షలో పడినట్లే”. అప్పుడు ఆయేషా (రదియల్లాహు అన్హా) మరోసారి ప్రశ్నించారు: “ప్రవక్తా! అల్లాహ్ (తఆలా) ఖురాన్ లో తెలిపాడు కదా! అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని”. దీనికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఆయిషా! ఇది కేవలం అతని కర్మ పత్రాల్లో చూడడం, దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం, దాని గురించి మందలించడం. ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, అతడు అయితే నాశనం అయినట్లే కదా!” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు చెప్పారు.

అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు? లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని, దానికి మనం ఇక్కడే సిద్దపడాలి అని మరియు అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి – “ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సత్ భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క, తీర్పులు అన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి. నీ యొక్క మన్నింపు కు మీ యొక్క క్షమాపణకు, నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి” అని దుఆ చేస్తూ ఉండాలి.

ఇప్పటికీ సమాజంలో కొందరు ప్రళయదినం ఎందుకు? ఆ రోజు ఎందుకు లెక్క తీసుకోవడం? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అల్లాహ్ (తఆలా) ఏ ఉద్దేశంతో మనల్ని ఇహలోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే. ఆయన ఆరాధన పద్ధతులను తెలియపరచడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంధాలను కూడా అవతరింపజేశాడు. ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి, దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు. ఇక ఆ పరలోకం,, ఇహలోకంలో ఎవరు ఎలా జీవించారు? ఆ లెక్క తీసుకోవడానికి, ఎవరు న్యాయం చేశారో, వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరైతే అన్యాయం చేశారో, దౌర్జన్యం చేశారో వారి యొక్క శిక్ష వారికి ఆ రోజు ఇవ్వడానికి. ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు? అల్లాహ్ పంపిన గ్రంధాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది.

సూరతుల్ ఆరాఫ్ లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:

మేము ప్రవక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము.”

ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు. వారి వారి కర్మల ప్రకారం, వారి వారి విశ్వాసాల ప్రకారం, వారు ఇహలోకంలో అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ ఆదేశాలను పాటించి, వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో, వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది. మరికొందరికి సులభతరంగా ఉంటుంది. కొందరిపట్ల మన్నింపు వైఖరి అల్లాహ్ వహిస్తాడు. మరి కొందరిని అల్లాహ్ (తఆలా) వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీత్ ఆ పొడుగైన హదీతులో చివరి మాట ఏంటంటే – “గత జాతులు నాకు చూపబడటం జరిగింది, నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను. వారిలో డెబ్బై వేల మంది వారు ఎంత అదృష్టవంతులు అంటే, వారు ఎలాంటి లెక్కలేకుండా, ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు.” అల్లాహు అక్బర్. అల్లాహ్ (తఆలా) మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి, ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దుఆ చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి.

ఇన్షా అల్లాహ్, పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూఉన్నాము . మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి. అల్లాహ్ (తఆలా) పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక, సత్కార్యాలు చేస్తూ ఉండి, కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్” చదువుతూ, అదే పుణ్య స్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మానవుడు చేసే ప్రతీ పనిని వ్రాసిపెట్టే దైవ దూతలు: కిరామన్ కాతిబీన్ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:15 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 23
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

82:10-12 وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ * كِرَامًا كَاتِبِينَ * يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!

ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.

వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!

మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?

ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి

45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ
“ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”

ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:

 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا

కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. 

షిర్క్ నిర్వచనం, దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్
అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
రెండవ ప్రకరణం: షిర్క్ నిర్వచనం, దాని రకాలు

(అ) షిర్క్ నిర్వచనం:

అల్లాహ్ యొక్క పోషకత్వంలోనూ, ఆయన దైవత్వంలోనూ వేరొకరికి సాటి (సహవర్తులను) కల్పించటాన్ని ‘షిర్క్‘ అంటారు.

ప్రజాబాహుళ్యంలో సాధారణంగా అల్లాహ్  దైవత్వం (ఆరాధన, దాస్యం ) విషయంలో షిర్క్ ప్రబలి ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే అల్లాహ్ తో పాటు వారు ఇతరులను కూడా మొర పెట్టుకుంటారు. లేదా అల్లాహ్ యేతరుల కొరకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదాహరణకు : ఖుర్బానీ, మొక్కుబడులు, అల్లాహ్ యేతరులకు భయపడటం, వారిపై ఆశలు పెట్టుకోవటం ఇత్యాదివి.


కొన్ని కారణాల దృష్ట్యా షిర్క్ మహాపరాధం. అవేమంటే:

(1) షిర్క్ చేయటమంటే సృష్టికర్త ప్రత్యేకతలలో, గుణాలలో సృష్టితాలకు సామ్యం కల్పించటమే. కాబట్టి అల్లాహ్ తో పాటు వేరేతరులకు భాగస్వామ్యం కల్పించినవాడు వాస్తవానికి ఆ భాగస్వాములను అల్లాహ్ ను పోలిన వారుగా ఖరారు చేశాడన్నమాట! ఇది అతి పెద్ద జులుం. మహాపాతకం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.” (లుఖ్మాన్ 31 : 13)

(2) షిర్క్ చేష్టకు ఒడిగట్టిన మీదట పశ్చాత్తాపం చెందనివానిని అల్లాహ్ క్షమించడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్క్ ను) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (అన్ నిసా 4 : 48)

(3) షిర్క్ కి పాల్పడేవాని కొరకు స్వర్గాన్ని నిషేధించానని, అలాంటి వ్యక్తి శాశ్వతంగా నరకాగ్నిలో కాలుతూ ఉంటాడని అల్లాహ్ తెలియపరిచాడు. ఉదాహరణకు :

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

ఎవడు అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. ఇక అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.” (అల్ మాయిద 5 : 72)

(4) మనిషి చేసే షిర్క్, అతను గతంలో చేసిన సత్కార్యాలన్నింటినీ సర్వ నాశనం చేసివేస్తుంది. (18 మంది ప్రవక్తల ప్రస్తావన తీసుకువచ్చిన మీదట) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ

ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సయితం దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసిన కర్మలన్నీ వృధా అయిపోయేవి.” (అల్ అన్ ఆమ్ 6 : 88)

వేరొకచోట అల్లాహ్  తన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుద్దేశించి ఇలా ఉపదేశించాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నీవు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేరతావు.” (అజ్ జుమర్ 39 : 65)

(5) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

shirk-types

జనులు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ను అంగీకరించనంత వరకూ వారితో పోరాడాలని నాకు ఆదేశించబడింది. వారు గనక ఈ కలిమాను అంగీకరిస్తే, వారు తమ ధన ప్రాణాలను కాపాడుకున్న వారవుతారు. అయితే ఈ కలిమా హక్కు మాత్రం మిగిలి ఉంటుంది.” (బుఖారీ, ముస్లిం)

(6) షిర్క్ పెద్ద పాపాలలోకెల్లా పెద్దది. దీని గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

shirk-types-2

ఏమిటి, అన్నిటికన్నా పెద్ద పాపాలేవో నేను మీకు తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశ్నించగా, ‘తప్పకుండా తెలుపండి దైవ ప్రవక్తా!’ అని మేమన్నాము. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “అల్లాహ్ కు భాగస్వామిగా వేరెవరినయినా నిలబెట్టడం, తల్లిదండ్రులను ఎదిరించటం.” (బుఖారీ, ముస్లిం)

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ తన పుస్తకం (అల్ జవాబుల్ కాఫీ : పే జి 109) లో ఇలా అభిప్రాయపడ్డారు:

అల్లాహ్ ఈ విషయం మనకు ఎరుకపరిచాడు. ఆయన సృష్టికర్త, పాలకుడు (ఆజ్ఞాపించేవాడు) అవటంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే; అల్లాహ్ ఆయన పేర్లు, గుణగణాల ఆధారంగా తెలుసుకోవాలి. కేవలం ఆయన్నే ఆరాధించాలి. ఆయనకు సాటి కల్పించరాదు. జనులు న్యాయానికి, సమత్వం, సమతూకాలకు కట్టుబడి ఉండాలి. సమత్వం, సమతూకాల మూలంగానే భూమ్యాకాశాల వ్యవస్థ నిలబడి ఉంది.”

అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమయిన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటా (త్రాసు)ను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయం (సమతూకం)పై నిలిచి ఉండటానికి!” (అల్ హదీద్ : 25)

పై ఆయతులో అల్లాహ్ తన ప్రవక్తలను పంపినట్లు, తన గ్రంథాలను అవతరింపజేసినట్లు తెలియజేశాడు. ప్రజలు నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండాలన్నదే దీని ఉద్దేశం. అన్నిటికన్నా పెద్ద న్యాయం (సమత్వం, సమతూకం) తౌహీద్. తౌహీదే (దేవుని ఏకత్వమే) న్యాయానికి, ధర్మానికి ప్రాతిపదిక. షిర్క్ (బహుదైవోపాసన) అతి పెద్ద దుర్మార్గం, దుర్వర్తనం, దారుణం.

అల్లాహ్ సెలవిచ్చినట్లు –

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా షిర్క్ (బహుదైవోపాసన) చాలా పెద్ద జులుం.” (లుఖ్మాన్ 31 : 13)

మొత్తానికి తెలిసిందేమంటే షిర్క్ (బహుదైవారాధన) అతి పెద్ద దారుణం (అన్యాయం). తౌహీద్ (ఏక దైవారాధన) అన్నిటికన్నా గొప్ప న్యాయం (ధర్మం). కనుక ఏ వస్తువు మహదాశయమైన తౌహీద్ కు వ్యతిరేకంగా నిలుస్తుందో అది మహాపరాధంగా పరిగణించబడుతుంది.

ఈ నేపథ్యంలోనే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు:

షిర్క్ (బహుదైవారాధన) ఈ సిసలయిన ఆశయానికి (తౌహీద్ కు) వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మహాపరాధమే. అల్లాహ్ ప్రతి  ముష్రిక్ పై స్వర్గాన్ని నిషిద్ధం (హరామ్) గావించాడు. అతని ధన ప్రాణాలను కూడా ఏక దైవారాధకుల కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. ఎందుకంటే వారు అల్లాహ్ దాస్యం యొక్క హక్కును నిర్వర్తించలేదు. కాబట్టి వారిని బానిసలుగా చేసుకునేందుకు ఏక దైవారాధకులకు అనుమతి ఇవ్వబడింది. అదలా ఉంచితే అల్లాహ్ ముష్రిక్కు చేసిన ఏ సత్కర్మనూ స్వీకరించడు. వారి కొరకు చేయబడిన సిఫారసు ఆమోదించటంగానీ, పరలోకంలో వారి మొరను ఆలకించటంగానీ, వారి కోర్కెను తీర్చటం గానీ చేయడు. ఎందుకంటే ముష్రిక్  వ్యక్తి అల్లాహ్ వ్యవహారంలో అతి పెద్ద మూర్ఖుడు. ఎందుకంటే అతను సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాడు. ఇది పరమ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో అజ్ఞానానికి పరాకాష్ఠ. ఆయన విషయంలో ఇది చాలా పెద్ద అన్యాయం. వాస్తవానికి అతను షిర్క్ చేసి అల్లాహ్ కు కాదు, తన ఆత్మకే అన్యాయం చేసుకున్నాడు.”

(7) వాస్తవానికి షిర్క్ ఒక లోపం. దోషం. దాని నుండి అల్లాహ్ తన అస్తిత్వాన్ని పవిత్రంగా, పునీతంగా ఖరారు చేసుకున్నాడు. కాబట్టి అల్లాహ్ కు సహవర్తుల్ని కల్పించే వాడు. ఆయనకు లేనిపోని దోషాన్ని, లోపాన్ని ఆపాదిస్తున్నడన్నమాట! ఆ విధంగా అతను అల్లాహ్ పై తిరుగుబాటు చేశాడు. ఆయన ఆజ్ఞను ఎదిరించి ఆయనతో శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు.


(అ) షిర్క్ రకాలు:

షిర్క్ రెండు రకాలు

మొదటి రకం: షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. అతను గనక పశ్చాత్తాపం చెందకుండానే మరణిస్తే కలకాలం నరకాగ్నిలో ఉంటాడు.

ఏ రకమయిన ఆరాధన అయినా సరే అల్లాహ్ యేతరుల కొరకు చేస్తే అది షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) అవుతుంది : ఉదాహరణకు అల్లాహ్ యేతరులను మొర పెట్టుకోవటం, వారి పేర మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, బలిదానాలు చేసి సమాధులలో ఉన్న వారి మెప్పు పొందగోరటం, జిన్నాతుల, షైతానుల ప్రసన్నత బడయటం, అలాగే మృతులు షైతానులు, జిన్నాతులు తమకేదైనా హానికలిగిస్తాయేమోనని భయపడటం. అలాగే – దేవుని ఏకత్వం కేవలం అల్లాహ్ మాత్రమే తీర్చగల అవసరాల కోసం అల్లాహ్ యేతరులను ఆశించటం, ఆపదలను తొలగించమని అల్లాహ్ యేతరులను అర్థించటం మొదలగునవి.

నేటి ఆధునిక యుగంలో ఇలాంటి షిర్క్ మరీ ఎక్కువైపోయింది. పుణ్య పురుషుల సమాధులపై నిర్మించబడిన కట్టడాల వద్ద సకల ఆర్భాటాలతో ఈ షిర్క్ పోకడలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి –

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ

వారు అల్లాహ్ ను వదలి తమకు లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ చేకూర్చ లేని వాటిని పూజిస్తున్నారు. (అదేమంటే) ‘అల్లాహ్ సమక్షంలో అవి మాకు సిఫారసు చేస్తాయి’ అని అంటున్నారు.” (యూనుస్ 10: 18)

రెండవ రకం: షిర్కె అస్గర్: (చిన్నతరహా షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండైతే వేరుపరచదు గాని దానివల్ల ‘ఏకదైవారాధన’ (తౌహీద్)లో దోషం ఏర్పడుతుంది. అంతేకాదు, అది అతన్ని క్రమక్రమంగా ‘షిర్కె అక్బర్’ వైపు తీసుకెళుతుంది. షిర్కె అస్గర్  కూడా రెండు రకాలు : (1) కనిపించే షిర్క్ (2) కనిపించని షిర్క్,

(1) కనిపించే షిర్క్:

అంటే మనిషి మాటల ద్వారా, చేతల ద్వారా వ్యక్తమయ్యే షిర్క్ అన్నమాట. ఉదాహరణకు : దైవేతరులపై ఒట్టేసి చెప్పటం. దీని గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

shirk-types-3

ఎవరయితే అల్లాహ్ యేతరునిపై ప్రమాణం చేశాడో అతను తిరస్కారాని (కుఫ్ర్) కి పాల్పడ్డాడు” లేదా ఆయనిలా అన్నారు : “అతను షిర్క్ కి ఒడిగట్టాడు.” (ఈ హదీసును తిర్మిజీ – 1535 సహీగా పేర్కొన్నారు. హాకిమ్ దీనిని సహీహ్ గా పేర్కొన్నారు).

అల్లాహ్ కోరినట్లుగా మరియు తమరు కోరుకున్నట్లుగా” అని చెప్పటం కూడా ఈ కోవకు చెందినదే. ఒకసారి ఒక సహచరుడు ఇలాగే అంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనిని ఈ విధంగా మందలించారు : –

shirk-types-4

ఏమిటి, నీవు నన్నూ అల్లాహ్ కు పోటీగా పరిగణిస్తున్నావా?” (ఇది తప్పు. దీనికి బదులు) నీవు ఈ విధంగా అను : ఒక్కడైన అల్లాహ్ కోరినట్లుగా.” (అస్సహీహ – 139) అలాగే  “ఒకవేళ అల్లాహ్ లేకుంటే, ఫలానా వ్యక్తి లేకుంటే” అని చెప్పటం కూడా ఇలాంటిదే.

అల్లాహ్ తలచినట్లుగానే జరిగింది. దానిమీదట ఫలానా వ్యక్తి అభిలషించినట్లుగా జరిగింది” అని అంటే అది సరైనదే. ‘దానిమీదట’ లేదా ‘ఆపైన’ అనే పదం చేరిస్తే అది ఒప్పే. ఎందుకంటే ఈ విధంగా అన్నప్పుడు దాసుని కోరిక దేవుని కోరికకు లోబడినట్లవుతుంది. ఉదాహరణకు : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు.” (అత్ తక్వీర్ 81 : 29)

నా కొరకు అల్లాహ్ మరియు మీరు తప్ప ఎవరూ లేరు” అని చెప్పటం కూడా ఒక విధంగా షిర్కుతో కూడిన పలుకే.  “ఇది అల్లాహ్ శుభాల వల్ల మరియు మీ శుభాల వల్లనే ప్రాప్తించింది” అని అటం కూడా ఇలాంటిదే.

షిర్కు తో కూడిన పనుల ఉదాహరణ:

ఏదైనా ఆపద నుండి బయటపడేందుకు లేదా ఏదైనా గండాన్ని తొలగించేందుకు కడియం ధరించటం, దారం కట్టడం, దిష్టి తగులుతుందనే భయంతో తాయెత్తు కట్టడం, వెంట్రుకల హారాలు తొడగటం మొదలగునవి.

ఇలాంటివన్నీ గండాల నుండి గట్టెక్కటంలో, కష్టాలను దూరం చేయటంలో తోడ్పడతాయని గనక మనిషి నమ్మితే ఇది షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) క్రిందికి వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఈ వస్తువులను ఇలాంటి ఉద్దేశాల ప్రాప్తి కొరకు సాధనంగా చేయలేదు. ఒకవేళ ఈ వస్తువులు తమంతట తాముగా ఆపదలను దూరం చేస్తాయని నమ్మితే మాత్రం అది ‘షిర్కె అక్బర్’ గానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది  అల్లాహ్ యేతరులపై ఆశ పెట్టుకోవటం వంటిదే.

(2) కనిపించని షిర్క్:

అంటే దాగి ఉన్న షిర్క్ అన్నమాట. ఇది మనిషి సంకల్పంలో మనోభావంలో ఉంటుంది. ఉదాహరణకు: ప్రదర్శనాబుద్ధి. అంటే ఒక వ్యక్తి  అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో ఒక సత్కార్యం చేసే బదులు జనుల మెప్పును కాంక్షించి చేస్తాడు. ఉదాహరణకు: ఎంతో ఏకాగ్రతతో నమాజ్ చేస్తాడు లేదా దానధర్మాలు చేస్తాడు. కాని అతని మనసులో లోకులు తనను ప్రశంసించాలన్న కోరిక ఉంటుంది.

ఏదైనా ఒక కార్యంలో ప్రదర్శనా మనస్తత్వం వచ్చిందంటే, అది అతని పనిని పాడు చేసేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగ స్వామ్యం కల్పించకూడదు.” (అల్ కహఫ్ 18 : 110)

షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :

“మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా ‘షిర్కె అస్గర్ ‘ గురించిన భయముంది. ‘దైవప్రవక్తా! షిర్కె అస్గర్ అంటే ఏమిటి?’ అని ప్రియ సహచరులు విన్నవించుకోగా, “ప్రదర్శనా బుద్ది” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు. (అహ్మద్-22528, తిబ్రానీ)

అలాగే ఎవరయినా ప్రాపంచిక స్వలాభాలను ఆశించి ఏదైనా సత్కార్యం చేస్తే, అది కూడా ‘కనిపించని షిర్క్’లోకి వస్తుంది. ఉదాహరణకు : ఎవరయినా కేవలం సిరిసంపదల కోసం హజ్ చేయటం, లేదా అజాన్ ఇవ్వటం, లేదా సామూహిక నమాజ్ కు సారధ్యం వహించటం, లేదా కేవలం సిరిసంపదలను ఆశించి ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం, జిహాద్ చేయటం.

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా ప్రవచించారు :

shirk-types-5

దీనారు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. దిర్హమ్ కు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. చారలు గల దుప్పటిని కలిగి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. పనితనము (చిత్రీకరణ) గల దుప్పటి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. అతనికేదైనా ఇవ్వబడితే సంతోషిస్తాడు. ఇవ్వకపోతే కినుక వహిస్తాడు.” (బుఖారీ)

ఈ విషయమై ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు:

సంకల్పాలలో, ఉద్దేశాలలో షిర్క్ అనేది తీరంలేని సముద్రం వంటిది. అతి కొద్ది మంది మాత్రమే దాని నుండి బయటపడగలుగుతారు. కనుక ఎవరయినా తన ఆచరణ ద్వారా అల్లాహ్ ప్రసన్నతతో పాటు వేరొక సంకల్పం చేసుకుంటే, అల్లాహ్ సామీప్యం పొందటంతో పాటు ఇతరత్రా ఉద్దేశ్యాలకు కూడా చోటిస్తే అతను తన సంకల్పంతో షిర్క్ చేసినట్లే.”

ఈ సందర్భంగా ‘సంకల్ప శుద్ది’ అంటే భావం దాసుడు తన మాటలను, చేతలను, సంకల్పాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించాలి. (అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనటమే అతని ధ్యేయమై ఉండాలి). ఇదే అసలుసిసలు ఏకోన్ముఖత. అంటే సిసలయిన ఇబ్రాహీమ్ విధానం. దీనిని అవలంబించమని అల్లాహ్ తన దాసులందరికీ ఆజ్ఞాపించాడు. ఇది మినహా ఆయన ఎవరి నుండీ, ఎలాంటి దానిని అంగీకరించడు. ఈ ఏకోన్ముఖతే ఇస్లాం వాస్తవికత.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో  చేరుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 85)

ఇదే సిసలయిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) విధానం. దీని నుండి ముఖం త్రిప్పుకున్నవాడు, విసుగును ప్రదర్శించినవాడు అతి పెద్ద మూర్ఖుడు.” (అల్ జవాబుల్ కాఫీ – పేజీ : 115)

షిర్కె అస్గర్ – షిర్కె అక్బర్ కి మధ్యగల వ్యత్యాసాలు

వెనుకటి చర్చ ప్రకారం ఈ రెండు రకాల షిర్క్ మధ్య గల తేడాలు ఇవి :

1. షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కరిస్తుంది. షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) ముస్లిం సముదాయం నుండి మనిషిని బహిష్కరించదు గాని అతని ఏకదైవారాధనా విశ్వాసంలో లోపం ఏర్పరుస్తుంది.

2. షిర్కె అక్బర్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకయాతనను అనుభవిస్తాడు. షిర్కె అస్గర్ కు ఒడిగట్టినవాడు నరకానికి ఆహుతి అయినా శాశ్వతంగా నరకంలోనే ఉండడు.

3.షిర్కె అక్బర్ మనిషి ఆచరణలన్నింటినీ నాశనం చేసేస్తుంది. కాగా, షిర్కె అస్గర్ ఆచరణలన్నింటినీ వృధా చేయదు. ఏ ఆచరణలో అది (ప్రదర్శనాబుద్ధి, ప్రాపంచిక స్వలాభాపేక్ష) జొరబడుతుందో దానిని మాత్రమే నాశనం చేస్తుంది.

4.షిర్కె అక్బర్ ముష్రిక్కుల ధన ప్రాణాలను ధర్మసమ్మతం చేసేస్తుంది. కాని షిర్కె అస్గర్ వల్ల అతని ధన ప్రాణాలు ధర్మసమ్మతం అవవు.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (93-100 పేజీలు). https://teluguislam.net/2019/09/20/aqeedah-tawheed-shaykh-fawzan/