
[3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
క్రింది ఆడియో కూడా తప్పక వినండి
ఇస్లాం ఆత్మహత్యకు అనుమతిస్తుందా? [ఆడియో]
పరలోకం (The Hereafter) ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/hereafter/
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *

[3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
క్రింది ఆడియో కూడా తప్పక వినండి
ఇస్లాం ఆత్మహత్యకు అనుమతిస్తుందా? [ఆడియో]
పరలోకం (The Hereafter) ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/hereafter/

[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
18:57 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَىٰ فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا
తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు
18:58 وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا
నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
18:59 وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا
తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము
సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/
ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran
సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

[18 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/
సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం
https://www.youtube.com/watch?v=UsTrHy6arh8 [12 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్లోని మొదటి అధ్యాయం, సూరతుల్ ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాన్ని వివరిస్తారు. ఏ పనినైనా అల్లాహ్ పేరుతో (బిస్మిల్లాహ్) ప్రారంభించాలని, ఇది ఖురాన్ అపార కరుణామయుడైన అల్లాహ్ నుండి వచ్చిన గ్రంథమని గుర్తుచేస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఖురాన్ యొక్క నిర్మాణం, 114 సూరాలు మరియు 30 పారాలుగా విభజించబడిందని వివరించారు. సూరతుల్ ఫాతిహా, ఖురాన్ సారాంశంగా పరిగణించబడుతుందని, మూడు ప్రధాన భాగాలుగా విభజించబడిందని తెలిపారు. మొదటి భాగం అల్లాహ్ యొక్క లక్షణాలైన రబ్ (ప్రభువు), అర్-రహ్మాన్ (కరుణామయుడు), అర్-రహీమ్ (కృపాశీలుడు), మరియు మాలిక్ (అధిపతి)ని స్మరిస్తూ ఆయనను స్తుతించడం. రెండవ భాగం, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం మరియు ఆయన సహాయాన్నే అభ్యర్థించడం గురించి చెబుతుంది. మూడవ భాగం, రుజుమార్గం (సన్మార్గం) కోసం చేసే ప్రార్థన, అంటే ప్రవక్తలు, సత్యవంతులు మరియు పుణ్యాత్ముల మార్గం, అల్లాహ్ ఆగ్రహానికి గురైనవారి (యూదులు) మరియు మార్గభ్రష్టులైనవారి (క్రైస్తవులు) మార్గం కాదని స్పష్టం చేస్తుంది. వక్త, జ్ఞానం ఉండి ఆచరించకపోవడం మరియు జ్ఞానం లేకుండా ఆరాధించడం రెండూ ప్రమాదకరమని హెచ్చరించారు.
ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో మనం ఆరంభం చేస్తున్నాము. ముందు ఇక్కడ మనం సూరతుల్ ఫాతిహా. ఖురాన్ ఆరంభం అనేది బిస్మిల్లాహ్ నుండి ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బిస్మిల్లాహ్ అన్న పదం ఖురాన్ యొక్క ఆరంభంలో ఏదైతే వచ్చిందో దీని గురించి ధర్మ పండితులు చెప్పిన విషయాలు అందులో సంక్షిప్తంగా రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి, మనం ఏ కార్యం మొదలు పెట్టినా గాని అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలు పెట్టాలి.
రెండవది, “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అని ఖురాన్ ఆరంభం ఏదైతే జరుగుతుందో, ఇందులో ఒక గొప్ప సూచన ఏముందంటే ఈ దివ్య గ్రంథం అల్లాహ్ వైపు నుండి ఉంది. ఎలాంటి అల్లాహ్? సర్వసామాన్యంగా పూర్తి సృష్టికి, ప్రత్యేకంగా మానవుల పట్ల ఎంతో కరుణతో మెలిగేవాడు. వారిపై దయ దాక్షిణ్యాలు చూపేవాడు. వారి యొక్క మంచి కొరకే ఈ ధర్మ గ్రంథం అవతరింపజేశారు.
సోదర మహాశయులారా, దివ్యగ్రంథం ఖురాన్ లో 114 సూరాలు ఉన్నాయి. మొదటి సూరా ఇది సూరె ఫాతిహా మరియు చివరి సూరా సూరతున్నాస్.
ఇందులో ప్రజలు కంఠస్థం చేసుకోవడానికి, ప్రజలు గుర్తుంచుకోవడానికి 30 కాండాలలో, సామాన్యంగా పారా లేదా జుజ్ అని అనబడడం జరుగుతుంది. పారా అని ఉర్దూలో మరియు జుజ్ అని అరబీలో చెప్పడం జరుగుతుంది. 30 పారాల్లో దీనిని విభజించడం జరిగింది. ఇది పారాయణం, తిలావత్ కొరకు సులభతరంగా ఉండడానికి. మళ్ళీ పారాలో కూడా కొన్ని భాగాలు చేయబడ్డాయి. అయితే ఈనాటి నుండి మనం ప్రతి రోజు ఒక పారా సారాంశాన్ని వినబోతున్నాము.
మొట్టమొదటి సూరా సూరె ఫాతిహా. దీని గురించి స్వయంగా ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ యొక్క మొట్టమొదటి సూరా ఆరంభ పరంగా, ఖురాన్ ఇప్పుడు ఉన్నటువంటి క్రమం పరంగా సూరె ఫాతిహా. మరియు అంతేకాదు, ఖురాన్ లోని 114 సూరాలలో أعظم سورة అతి గొప్ప సూరా, అతి ఘనత గల సూరా సూరతుల్ ఫాతిహా. అంతేకాదు ఈ సూరె ఫాతిహా, దీనిని ఖురాన్ యొక్క సారాంశం అని కూడా అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉర్దూలో మా ఛానల్ లో ఒక వీడియో కూడా ఉంది. దాన్ని కూడా ఉర్దూ తెలిసిన వారు చూడవచ్చు. అందులో చాల వివరాలు ఉన్నాయి.
అయితే సూరతుల్ ఫాతిహాలో మనం గమనిస్తే, చదువుతే శ్రద్ధగా, ఇందులో మనకు మూడు భాగాలు కనబడతాయి.
ఒకటి, (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీం, మాలికి యౌమిద్దీన్) ఇక్కడి వరకు.
రెండవ భాగం, (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మూడో భాగం, “ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం” నుండి చివరి వరకు.
ఈ మొదటి భాగంలో మనకు తెలుపబడిన గొప్ప విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నీపై ఎవరైనా ఉపకారం చేశారు గనుక నీవు అతన్ని స్తుతించదలుచుకుంటే, రబ్బిల్ ఆలమీన్ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ ఆయన యొక్క కృపలు, కరుణలు, దయ, అనుగ్రహాల కంటే ఎక్కువగా ఇంకా వేరే ఎవరి అనుగ్రహాలు లేవు. అందుకొరకు నీవు అల్లాహ్ ను స్తుతించు.
ఓ మానవుడా, నీవు ఎవరి పట్లనైనా ఒక ఆశతో చూస్తున్నావు, అతని వైపు నుండి నీకు ఏదైనా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నావు, అర్రహ్మా నిర్రహీం అతి గొప్ప కరుణామయుడు, కృపాశీలుడు అల్లాహ్ మాత్రమే గనుక నీవు అతన్ని స్తుతించు.
ఒకవేళ నీవు ఎవరితోనైనా భయపడి స్తుతించదలుస్తే, మాలికి యౌమిద్దీన్ ప్రళయ దినానికి ఏకైక యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. అతని యొక్క భయం ఎంతగా మనలో ఉండాలంటే, అంతకంటే ఎక్కువ భయం ఇంకా ఎవరిది కూడా ఉండజాలదు. అలాంటి అల్లాహ్ కు నీవు నీ స్తుతులు, పొగడ్తలన్నీ కూడా చెల్లిస్తూ ఉండు.
మరో రకంగా మనం ఆలోచిస్తే మనమందరం దాసులం, అల్లాహ్ మన యజమాని. మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎల్లవేళల్లో మరియు ఆరాధన అన్న పదం విన్నప్పుడు కేవలం నమాజ్ ఒక్క విషయాన్ని మనసులో తీసుకురాకండి. ఆరాధన అని అన్నప్పుడు ప్రత్యేకంగా అల్లాహ్ ను ఆరాధించే విషయంలో అది మనసు సంబంధమైన ఆరాధన అయినా, నాలుక సంబంధమైన ఆరాధన అయినా, అవయవాలకు సంబంధమైన ఆరాధన అయినా ఇవి వస్తాయి. అలాగే హుఖూఖుల్లాహ్ (అల్లాహ్ హక్కులు ) కు సంబంధించినవి వస్తాయి, హుఖూఖుల్ ఇబాద్ కు సంబంధించినవి కూడా వస్తాయి.
ఈ ఆరాధనలన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు, చేసేటప్పుడు మనలో నాలుగు విషయాలు ఉండాలి. మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. అల్లాహ్ ను మనం సంపూర్ణ ప్రేమతో, సంపూర్ణ ఆశతో, సంపూర్ణ భయంతో ఆరాధించాలి మరియు వినయ వినమ్రతతో. అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ భయం మరియు ఆశ, సంపూర్ణ ప్రేమ మరియు ఆశ భయం.
ఈ మూడిటికి ధర్మపండితులు, ధర్మపండితులు ఒక పక్షి మాదిరిగా కూడా ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఎలాగైతే ఒక పక్షి ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా, తల లేకుండా ఎగరదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా గాని అది బ్రతకదు, ఎగరదు. అలాగే ఈ మూడింటిలో ఏ ఒక్క విషయం తగ్గిపోయినా గాని మన యొక్క ఆరాధన, మనం అల్లాహ్ ను ఆరాధించే విషయంలో చాల లోపం కలుగుతుంది.
ఆ తర్వాత చెప్పడం జరిగింది.
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. (1:5)
ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ యొక్క సహాయమే కోరుతున్నాము. మనకు మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, అంతేకాదు అల్లాహ్ యొక్క ఆరాధన మనం అల్లాహ్ యొక్క సహాయం లేనిది చేయలేము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరుగుతుంది.
మూడవ విషయం. ఇహలోకంలో మన కొరకు అత్యంత గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అల్లాహ్ కు ఇష్టమైన మార్గం మన కొరకు ప్రాప్తించబడడం. అదే విషయం ఇందులో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒక్క రోజులో 17 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాము. అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు అని.
అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ మనకు సన్మార్గం ఏదైతే చూపుతాడో దాని యొక్క ఇక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటి? అల్లాహ్ ను ఆరాధించి అల్లాహ్ యొక్క మార్గంపై నడిచి ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందారో, ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ములు అలాంటి వారి మార్గం మాకు ప్రసాదించు అల్లాహ్.
మరి ఎవరైతే, మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయి సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడ్డారో అలాంటి వారి మార్గం వద్దు. అంటే ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హదీసుల ఆధారంగా
الْمَغْضُوبِ
(అల్ మగ్జూబ్)
ఆగ్రహానికి గురైన వారు
ఎవరిపై అయితే ఆగ్రహం కురిసిందో వారెవరు? వారు వాస్తవానికి యూదులు. మరియు
الضَّالِّينَ
(వజ్జాలీన్)
మార్గభ్రష్టులు
క్రైస్తవులు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కారణం గమనించండి, సంతోషపడే విషయం కాదు. ఒకరిని దూషించే విషయం కాదు అంతకు.
ఎవరికైతే ధర్మ జ్ఞానం లభించినదో మరియు వారు ఆ ధర్మ జ్ఞానాన్ని ఆచరించడం లేదో వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురుస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటారు కానీ ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరో, అందువల్ల వారు చేసే వారి కృషి అంతా కూడా సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడిపోతుంది, నష్టంలో వారు పడిపోతారు. అందుకొరకు వారిని జ్జాలీన్ అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మనం ఒకవేళ ధర్మ అవగాహన కలిగి సరియైన రీతిలో ఆచరించకుంటే యూదులతో సమానమైపోతాము అన్నటువంటి హెచ్చరిక ఉంది.
అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి కాంక్ష ఉంది, తపన ఉంది. కానీ విద్య నేర్చుకోవడం లేదు. ధర్మం నేర్చుకోకుండా దూరమైపోతున్నాము. ధర్మవేత్తలకు దూరం ఉంటున్నాము. నాకు తెలిసిపోయింది అని, నేను ఖురాన్ చదువుకుంటాను, వేరే వారితో నేర్చుకునేది ఏమున్నది? నేను అరబీ గ్రామర్ నేర్చుకున్నాను, ఖురాన్ నాకు డైరెక్ట్ గా అర్థమవుతుంది అన్నటువంటి భ్రమలో పడి ధర్మవేత్తలకు, సన్మార్గంపై ఉన్నటువంటి పుణ్య పురుషులకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండి మనకు మనం ధర్మానికి దూరం ఏదైతే చేసుకుంటున్నామో, వాస్తవానికి ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో పడవేస్తుంది.
చివరి ఒక మాట దీని గురించి చెప్పేది ఏమిటంటే, సూరతుల్ ఫాతిహా ఇందులో మనం అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందు అల్లాహ్ ను స్తుతించాలి, ఆ తర్వాత మన అవసరాన్ని పెట్టాలి. అయితే ఈ మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కూడా దరూద్ చదువుతూ ఉండాలి.
సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్ నుండి
https://teluguislam.net/?p=8142
ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/
నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

[75 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

[12:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి?
https://teluguislam.net/2019/12/21/protection-from-shaitan/

[68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]
ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
إِذَا أُقِيمَتْ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ. (مسلم ).
“ఏ నమాజ్ యొక్క ఇఖామత్ అయ్యిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు”. (ముస్లిం 710).
జహరీ([1]) నమాజులో ముఖ్తదీ([2]) నిశబ్దంగా
ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ).
“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)
ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి
వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః لاَ صَلاَةَ لِفَردٍ خَلفَ الصَّف
“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).
వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).
మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
(خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)
“పురుషుల మేలయిన పంక్తి మొదటిది. చెడ్డది చివరిది. స్త్రీలకు మేలయిన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).
మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః
(إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ).
“కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసేవారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 676).
పంక్తులను సరి చేసుకొని, నమాజీలు దగ్గరదగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
(سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاة)
“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).
ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.
ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.
స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.
ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.
జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).
ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.
అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.
అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.
[1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.
[2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.
ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు
[2 నిముషాలు]
https://youtu.be/s7y3-hGEEbc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ముందుగా, ఈ ఆడియోలోని ముఖ్య విషయాలు కింద పేర్కొనబడ్డాయి:
శుక్రవారం నమాజు కోసం పిల్లలను మస్జిద్కు తీసుకురావడం సరైనదేనా, వారు అల్లరి చేయడం వలన తల్లిదండ్రుల పుణ్యం తగ్గిపోతుందా అనే ప్రశ్నకు ఇందులో సమాధానం ఇవ్వబడింది. పిల్లలకు చిన్నతనం నుండే శుక్రవారం ప్రార్థనల ప్రాముఖ్యతను మరియు మస్జిద్ మర్యాదలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పబడింది. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి, వారిని ఒకేచోట వెనుక కూర్చోబెట్టడం అనే సాధారణ పొరపాటును సరిదిద్ది, ప్రతి తండ్రి తమ పిల్లలను తమ పక్కనే ఉంచుకోవాలని సూచించబడింది. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకోకుండా, ప్రశాంతంగా ఉంటారని మరియు మస్జిద్లో గందరగోళం జరగదని వివరించబడింది.
ప్రశ్న:
షేఖ్, శుక్రవారం నాడు చాలా మంది స్త్రీలు, ఇంకా చాలా మంది పురుషులు కూడా తమ పిల్లలను తీసుకుని మస్జిద్కు పోతారు. ఆ మస్జిద్లలో ఇంకా పిల్లలు, చిన్న పిల్లలు ఇటు అటు తిరుగుతుంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్లకు నచ్చజెప్తూ, వాళ్లకు దగ్గర తీసుకుంటూ, వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ల తల్లిదండ్రులు. అలాంటప్పుడు కూడా ఆ శుక్రవారం రోజు పుణ్యాలు కోల్పోతామా?
జవాబు:
మంచి ప్రశ్న అడిగారు మీరు, అల్హందులిల్లాహ్ (అన్ని ప్రశంసలు అల్లాహ్కే). శుక్రవారం రోజు పిల్లల్ని మన వెంట తీసుకుని వెళ్ళాలి. శుక్రవారం ఘనత వారికి తెలియాలి. శుక్రవారం రోజు ముస్లింల ఆరాధనల గురించి వారికి చిన్నప్పటి నుండే తెలపడం ఇది మన యొక్క బాధ్యత. కానీ, వారు పిల్లలు అయినందుకు ఏ కొన్ని పొరపాట్లు జరుగుతాయో, అందుకని ముందే తల్లిదండ్రులు మస్జిద్కు పిల్లల్ని పంపే ముందు పిల్లలకు నేర్పాలి. వేరే ఎవరైనా తెలియని పిల్లలు అల్లరి చేసినా, మీరు అల్లరి చేయకూడదు. మస్జిద్ను గౌరవించాలి, జుమా రోజును గౌరవించాలి, ఆ రోజు ఖుత్బా ఇస్తూ ఉంటారు ఖతీబ్ గారు, మనం శ్రద్ధగా వినాలి అర్థం కాకపోయినా. ఇందులో ఉన్నటువంటి ఘనతలు ఏమిటి? అని పిల్లలకు చెప్పాలి. ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), మనం కూడా పిల్లల క్లాసులో ఈ విషయాలు బోధించే ప్రయత్నం చేస్తాము, ఇన్షా అల్లాహ్.
మరొక చాలా గొప్ప విషయం మనం మర్చిపోతూ ఉంటాము. అందువల్లనే పిల్లలు అల్లరి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. అదేంటి? మన వద్ద ఒక అలవాటు ఏముంది? పిల్లలందరినీ ఒకచోట వెనక్కి పారేయండి. పిల్లలు పిల్లలు అందరూ ఒకచోట కలిసిన తర్వాత, వారికి అంత దూరపు ఆలోచన లేదు, బుద్ధి జ్ఞానాలు లేవు, ధర్మ అవగాహన లేదు. అందుకొరకు పిల్లలు పిల్లలు కలిసినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి జరుగుతుంది.
అందుకొరకు ఏం చేయాలి? ప్రతి బాధ్యుడు తమ పిల్లలను తమ వెంట ఉంచుకోవాలి. ఇదే చాలా మంచి పద్ధతి. దీని ద్వారా పిల్లలు అల్లరి చేయకుండా, ఎలాంటి గలాటా చేయకుండా ఉంటారు. ఇది చాలా మంచి పద్ధతి, దీన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి.
జజాకుముల్లాహు ఖైరా (అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక).
—
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/
ఇతరములు:
స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.
ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?
చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:
أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.
అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.
ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.
కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?
ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,
سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు
అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.
—
నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/
You must be logged in to post a comment.