
[31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవాడ్ని చూసినా గుండెలకు హత్తుకొని అతనికి పాలు పట్టేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ స్త్రీని చూసి మాతో “ఈ స్త్రీ తన పిల్లవాడ్ని అగ్నిలో విసిరి వేస్తుందంటారా?” అని అడిగారు. దానికి మేము “విసిరివేయదు, తనకు నిరోధక శక్తి ఉన్నంతవరకు ఆమె తన పిల్లవాడ్ని అగ్నిలో ఎంతమాత్రం విసిరి వేయదు” అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఈ స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు” అని అన్నారు.
అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభైతొమ్మిది భాగాలు తన దగ్గర పెట్టుకొని ఒక్క భాగం మాత్రమే భూమిపై అవతరింపజేశాడు. ఆ ఒక్క భాగం కారుణ్యం కారణంగానే మానవులు, ఇతర జీవరాసులు ఒకరి పట్ల మరొకరు కారుణ్యం, కనికరాలతో మసులుకుంటున్నారు. చివరికి (ఈ కారుణ్యం మూలంగానే) గుర్రం తన పిల్ల (కు కాస్త కూడా నష్టం వాటిల్ల కూడదని, దాని) పై నుండి తన కాలిగిట్టను ఎత్తుకుంటుంది.