ఇమాం వెనుక జుహ్ర్, అస్ర్ నమాజు చివరి రెండు రకాతులలో సూరహ్ ఫాతిహా తో పాటు ఇంకొక సూరా కూడా చదవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

వీడియో పాఠాలు

ధర్మపరమైన నిషేధాలు – 18: నమాజు వదలకు [వీడియో]

బిస్మిల్లాహ్

[1:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 18

18నమాజు వదలకు. మానవుల మరియు ప్రభువు మధ్య అది పటిష్ఠ సంబంధం. అది ధర్మానికి మూల స్థూపం. నమాజు వదలిన వానికి ఇస్లాంలో ఏ వాటా లేనట్లే.

عَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ يَقُولُ: (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“నిశ్చయంగా ఒక మనిషి మరియు షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (సత్యతిరస్కారా)లకు మధ్య ఉన్న వ్యత్యాసం నమాజు పాటించకపోవడం”.

(ముస్లిం/ బయాను ఇత్ లాఖి ఇస్మిల్ కుఫ్రి అలా మన్ తరకస్సలా/ 82).

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

డ్యూటీ వల్ల ఫజర్ నమాజులో, సున్నత్ చేయకుండా ఫర్జ్ ఒక్కటే చేస్తే నమాజు చెల్లుతుందా? అజాన్ ముందే నమాజు చేసుకోవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[12:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 12: సామూహిక నమాజ్, పంక్తుల విషయం, ఖస్ర్, జమ్అ [వీడియో]

బిస్మిల్లాహ్

[68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

సామూహిక నమాజ్:

ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

إِذَا أُقِيمَتْ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ. (مسلم ).

“ఏ నమాజ్ యొక్క ఇఖామత్ అయ్యిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు”. (ముస్లిం 710).

జహరీ([1]) నమాజులో ముఖ్తదీ([2]) నిశబ్దంగా

 ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ).

“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)

పంక్తుల విషయం:

ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి

వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః        لاَ صَلاَةَ  لِفَردٍ خَلفَ الصَّف

“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).

వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).

మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

“పురుషుల మేలయిన పంక్తి మొదటిది. చెడ్డది చివరిది. స్త్రీలకు మేలయిన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః

(إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ).

“కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసేవారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 676).

పంక్తులను సరి చేసుకొని, నమాజీలు దగ్గరదగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاة)

“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).

ఖస్ర్:

ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.

ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.

స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.

ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.

జమ్అ:

జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).

ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.

అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.

అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.


[1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.

[2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.  


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.

ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?

చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:

أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.

ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.

అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.

ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.

కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?

ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

సజ్దా చేసే సరైన విధానం

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,

سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు

అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

సజ్దా చేసే సరైన విధానం

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 13 – వ్యాదిగ్రస్తుని (రోగి) నమాజ్, జుమా నమాజ్, పండుగ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వ్యాదిగ్రస్తుని నమాజ్:

నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

(صَلِّ قَائِمًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ).

“నీవు నిలబడి నమాజ్ చేయి. శక్తి లేనిచో కూర్చుండి చేయి. ఈ శక్తి లేనిచో పరుండుకొని చేయి”. (బుఖారిః 1117).

జుమా నమాజ్:

జుమా నమాజ్ వాజిబుంది. అది చాలా గొప్ప దినము. వారము రోజుల్లో అది చాలా ఘనతగల రోజు. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] {الجمعة:9}

{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).

జుమా ప్రత్యేకతలు:

స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.

జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.

జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(مَنْ قَرَأ سُورَةَ الْكَهفِ كَانَتْ لَهُ نُورًا يَومَ الْقِيَامةِ مِن مَقَامِهِ إِلى مَكَّةَ وَمَنْ قَرَأ عَشْرَ آيَاتٍ مِنْ آخِرِهَا ثُمَّ خَرَجَ

الدَّجَّالُ لَمْ يَضُرُّه).

“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”. (అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).

ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.

(إِذَا جَاءَ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَقَدْ خَرَجَ الْإِمَامُ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ).

“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).

ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.

ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.

పండుగ నమాజ్

పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.

పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).

పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 11 – నమాజ్ లో మరచిపోవుట, సున్నతె ముఅక్కద, విత్ర్, ఫజ్ర్ సున్నతులు, చాష్త్ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజులో మరచిపోవుట:

ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.

మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.

ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).

మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.

మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.

ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.

సున్నతె ముఅక్కద

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).

విత్ర్ నమాజ్

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః

أَنَّ رَسُولَ الله كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.  (బుఖారి 991, ముస్లిం 749).

అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.

ఫజ్ర్ సున్నతులు

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్న తులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724).

వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారుః

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.

చాష్త్ నమాజ్

దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.

హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).

దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.


[1]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.

[2]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ముగ్గురు అల్లాహ్ పూచీలో (హామీలో) ఉన్నారు [ఆడియో]

బిస్మిల్లాహ్

[9:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు:

“ముగ్గురు అల్లాహ్ యొక్క హామీ/పూచీ(జమానత్)లో ఉన్నారు. బ్రతికివుంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారివైపు నుండి అల్లాహ్ సరిపోతాడు.ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మొదటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తూ సలాం చేసేవాడు. అతను అల్లాహ్ యొక్క పూచీలో ఉంటాడు. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్ళేవాడు. అల్లాహ్ యొక్క పూచీలో అతను కూడా ఉంటాడు. మూడో వ్యక్తి అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరిన వ్యక్తి. అతను కూడా అల్లాహ్ యొక్క హామీలో ఉంటాడు.”

عَنْ أَبِي أُمَامَةَ أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ

504 صحيح ابن حبان كتاب البر والإحسان باب إفشاء السلام وإطعام الطعام

499 المحدث شعيب الأرناؤوط خلاصة حكم المحدث صحيح في تخريج صحيح ابن حبان

Abu Umamah reported: The Messenger of Allah, peace and blessings be upon him, said,

Three people have a guarantee from Allah. If he lives he will have provision to suffice him, and if he dies he will enter Paradise: one who enters and greets with peace has a guarantee from Allah, one who goes out to the mosque has a guarantee from Allah, and one who goes out in the way of Allah has a guarantee from Allah.

Source: Ṣaḥīḥ Ibn Ḥibbān 504. Grade: Sahih (authentic) according to Al-Mundhiri

నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత
https://youtu.be/_eBuDfQT_qU [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించే మార్గాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలు మరియు జిక్ర్ యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. 10 సార్లు తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్), తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్), మరియు తక్బీర్ (అల్లాహు అక్బర్) పఠించడం ద్వారా స్వర్గ ప్రవేశం మరియు ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయని ఒక హదీసు ఉటంకించబడింది. అలాగే, నిద్రపోయే ముందు 33 సార్లు తస్బీహ్, 33 సార్లు తహ్మీద్, 34 సార్లు తక్బీర్ పఠించడం వల్ల 1000 పుణ్యాలు వస్తాయని చెప్పబడింది. మరో హదీసు ప్రకారం, ప్రతి నమాజ్ తర్వాత 33 సార్లు ఈ జిక్ర్‌లు చేయడం హజ్, ఉమ్రా, దానధర్మాలు మరియు జిహాద్ చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని, మరియు 100వ సారిగా “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం సముద్రపు నురుగు అంత పాపాలను కూడా క్షమింపజేస్తుందని వివరించబడింది. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత 10 సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం ద్వారా లభించే ప్రత్యేకమైన లాభాలు, షైతాన్ నుండి రక్షణ మరియు స్వర్గాన్ని వాజిబ్ చేసే పుణ్యాల గురించి కూడా చర్చించబడింది.

బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్

మహాశయులారా! ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయవల్ల, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు పొందే అటువంటి కొన్ని సత్కార్యాల గురించి ఇన్షాఅల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో ప్రత్యేకంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దుఆలు మనకు నేర్పారు. వాటి యొక్క ఘనత అనేది మహా గొప్పగా ఉంది. ఒకవేళ మనం ఫర్ద్ నమాజ్ తర్వాత రెండు నిమిషాలు, మూడు నిమిషాలు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ఆ దుఆలను మనం చూసి చదివినా గానీ, ఇన్షాఅల్లాహ్ మహా గొప్ప పుణ్యాలు మనం పొందగలుగుతాము.

ఉదాహరణకు, చాలా చిన్నపాటి కార్యం. అందులో ఒక నిమిషం కాదు, అర నిమిషం కూడా పట్టదు. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల పుణ్యాలు అనేటివి మహా గొప్పగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ హదీస్ పై గమనించండి, సునన్ అబీ దావూద్ లో ఈ హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

خَصْلَتَانِ
[ఖస్ లతాని]
రెండు అలవాట్లు/గుణాలు

لَا يَعْمَلُ بِهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ
[లా య’అమలు బిహిమా అబ్దున్ ముస్లిమున్ ఇల్లా దఖలల్ జన్నహ్]
ఏ ముస్లిం దాసుడైతే వాటిని ఆచరిస్తాడో, తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు.

గమనించండి. రెండు మంచి అలవాట్లు, రెండు సత్కార్యాలు, ఏ ముస్లిం దాసుడు వాటిని పాటిస్తాడో తప్పకుండా స్వర్గంలో పోతాడు. అల్లాహు అక్బర్. ఆ రెండిటినీ పాటించిన వారు వారికి ఏం శుభవార్త ఇవ్వబడింది? స్వర్గ ప్రవేశం.

وَهُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ
[వహుమా యసీరున్, వమన్ య’అమలు బిహిమా ఖలీలున్]
అవి చాలా సులభమైనవి, కానీ వాటిని ఆచరించేవారు చాలా తక్కువ.

అవి రెండూ చాలా స్వల్పమైనవి. కానీ వాటిని ఆచరించే వారు చాలా అరుదు, చాలా తక్కువ మంది.

ఇప్పుడు రెండు విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒకటి, ఆ రెండు సత్కార్యాల ఘనత తెలిసింది. ఏంటి ఘనత? స్వర్గ ప్రవేశం. అంటే ఆ రెండు పనులు, ఆ రెండు కార్యాలు చేస్తే మనకు స్వర్గం లభిస్తుంది అని చెప్పారు ప్రవక్త. కానీ వెంటనే ఏం చెప్పారు? అవి చూడడానికి చాలా చిన్నగానే ఉన్నాయి, స్వల్పంగానే ఉన్నాయి. కానీ దాని మీద ఆచరించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

అందులో ఒకటి ఏమిటంటే, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవడం.

ఇంత చెప్పిన తర్వాత ప్రవక్త గారు దాని యొక్క మరో లాభం చెప్పారు. అదేమిటి? చెప్పారు, ఈ 10, 10 సార్లు చదివితే ఎన్ని అయినాయి? 30. ఐదు నమాజుల్లో ఐదు 30 లు, 150. ప్రవక్త చెప్పారు, నాలుకపై ఇవి 150. కానీ ప్రళయ దినాన ఎప్పుడైతే తూకం చేయబడతాయో అప్పుడు 1500. 1500 పుణ్యాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సత్కార్యం చేయడం వల్ల మనకు ఒకటి, స్వర్గ ప్రవేశ శుభవార్త లభించింది. రెండవది, 1500 సత్కార్యాలు, 1500 పుణ్యాలు మనకు లభిస్తాయి అని కూడా మనకు తెలిసింది. ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత 10, 10 సార్లు ఇలా చదవడం ఏమైనా కష్టమవుతుందా? ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏ మాత్రం కష్టం కాదు. కానీ దానికి చదివే అలవాటు అనేది ఉండాలి.

ఇందులోనే రెండో విషయం ఏంటిది? పడుకునే ముందు 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ఎన్ని అయినాయి? 100. కానీ ప్రళయ దినాన ఇవి 1000 కి సమానంగా ఉంటాయి, అంటే మనకు 1000 పుణ్యాలు లభిస్తాయి.

అయితే ప్రవక్త గారి సహచరులు ఈ ఘనతలు విని ఊరుకుండలేదు. మరో ప్రశ్న అడిగారు. అదేమిటి? ప్రవక్తా, ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది, ఇంత చిన్నటి సత్కార్యం. కానీ మీరు ఒక మాట చెప్పారు, వాటిపై ఆచరించేవాళ్ళు చాలా తక్కువ మంది అని. అలా ఎందుకు చెప్పారు? వీటిని ఆచరించడంలో ఏంటి కష్టం? మాకేం కష్టం అనిపించడం లేదు కదా.

గమనించండి, ప్రవక్త గారు చెప్పారు, మనిషి ఎప్పుడైతే నమాజ్ పూర్తి ప్రవక్త చెప్పిన ఈ జిక్ర్ చేయడానికి కూర్చుంటాడో, షైతాన్ వాడు వచ్చి అతనికి ఏదో ఒక విషయం గుర్తు చేస్తాడు. డ్యూటీలో లేట్ అవుతుంది. అయ్యో వర్క్ షాప్ లో తొందరగా వెళ్ళేది ఉంది. ఆ, కూరగాయలు తీసుకొచ్చేది ఉంది. అరె, ఇంట్లో భార్య గుర్తు చేస్తుంది. ఏదో ఒక మాట. షైతాన్ వాడు గుర్తు చేస్తాడు, మనిషి ఈ జిక్ర్ చేయకముందే లేచి వెళ్ళిపోతాడు. పడుకునే ముందు మనిషి తన పడక మీదికి వెళ్ళిపోతాడు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది, ఈ జిక్ర్ చేయడం మరిచిపోతాడు. ఈ విధంగా చూడండి సోదరులారా! షైతాన్ వాడు మనకు అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి ఎలా దూరం చేస్తాడో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు.

అయితే ఫర్ద్ నమాజ్ తర్వాత చేయవలసిన జిక్ర్, ఏ అజ్కార్, స్మరణలైతే ఉన్నాయో, దుఆలైతే ఉన్నాయో అందులో ఒక విషయం మనకు తెలిసింది. ఏం తెలిసింది? ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఏం చేయాలి మనం? 10, 10 సార్లు, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవాలి. ఇక రండి.

మరో హదీస్ లో ఉంది, సహీహ్ బుఖారీ లోని హదీస్ అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకసారి బీద సహచరులు వచ్చారు. వచ్చి చెప్పారు, ప్రవక్తా ఈ ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు పుణ్యాలు సంపాదించడంలో, ఉన్నత స్థానాలు పొందడంలో, సదాకాలం ఉండే అటువంటి వరాలు పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ డబ్బు ఉన్నవాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు అని అనట్లేదు. మాకంటే ఎక్కువ భూములు సంపాదించారు అని అనట్లేదు. ఏమంటున్నారు? వీళ్ళు తమ డబ్బు కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు

وَالنَّعِيمِ الْمُقِيمِ
[వన్న’యీమిల్ ముఖీమ్]
మరియు శాశ్వతమైన అనుగ్రహాలు (పొందడంలో)

ఎల్లకాలం ఉండే అటువంటి నేమతులు, వరాలు, అనుగ్రహాలు వాటిని పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ప్రవక్త గారు అడిగారు, అదెలా? ఇప్పుడు వారు అన్నారు, మేము ఎలా నమాజ్ చేస్తున్నామో వారు కూడా చేస్తున్నారు. మేము ఎలా ఉపవాసం ఉంటున్నామో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ వారికి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు కారణంగా వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు, దానధర్మాలు చేస్తున్నారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు.

ఈ నాలుగు రకాల పుణ్యాలు, హజ్, ఉమ్రా, సామాన్య దానధర్మాలు మరియు జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు. మా దగ్గర డబ్బు లేదు గనుక హజ్ లో, ఉమ్రాలో, దానధర్మాలో, జిహాద్ లో మేము ఖర్చు చేసి చేయలేకపోతున్నాము గనుక ఆ పుణ్యాలు మేము పొందుతలేము. డబ్బు ఉన్నందువల్ల వారు ఇలాంటి పుణ్యాలు చేసి కూడా మాకంటే చాలా ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? నేను ఒక విషయం మీకు తెలుపుతాను. మీరు దానిని పాటించారంటే, ఆ విషయాన్ని మీరు పాటించారంటే మీకంటే ముందుకు ఎవరైతే వెళ్ళిపోయారో పుణ్యాల్లో, వారి వద్దకు మీరు చేరుకుంటారు. మరి ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు ఎన్నటికీ కూడా మీకు సమానంగా రాలేరు. మరియు మీకంటే ఉత్తమమైన వారు మరెవరూ ఉండరు, కేవలం మీ లాంటి ఈ ఆచరణ, ఈ పని చేసేవారు తప్ప.

అదేంటి? మీరు ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ 33, 33 సార్లు చదువుతూ ఉండండి.

ఈ రెండో విషయంలో, మొదటి హదీస్ లో 10 సార్ల ప్రస్తావన వచ్చింది. దానికి రెండు శుభవార్తలు మనకు దొరికాయి. ఒకటి స్వర్గ ప్రవేశం, రెండవది 1500 పుణ్యాలు. గుర్తుంచుకోండి. 10, 10 సార్లు చదివితే ఏంటి లాభం? స్వర్గ ప్రవేశం మరియు 1500 పుణ్యాలు. ఈ రెండో హదీస్ లో, సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం లోని హదీస్ ఇది. ఇందులో ఏముంది? ప్రతి ఒకటి 33, 33 సార్లు చదవాలి. దాని యొక్క లాభం ఏంటి? హజ్ చేయడం తో సమానం, ఉమ్రా చేయడం తో సమానం, సదకా దానధర్మాలు చేయడం తో సమానం, అల్లాహ్ యొక్క మార్గం జిహాద్ లో ధనం ఖర్చు పెట్టినంత సమానం. ఎంత గొప్ప పుణ్యం గమనించండి.

అంటే ప్రతిరోజు ఐదు హజ్ ల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఐదు ఉమ్రాల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఎంతో డబ్బు ఉన్నవారు డబ్బు ఖర్చు పెట్టి దానధర్మాలు చేసి పుణ్యాలు సంపాదిస్తున్నారో, అంత మనం ఈ 33, 33 సార్లు చదివి పుణ్యం సంపాదించవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే జిహాద్ లో ఖర్చు పెడుతున్నారో, వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనం ఇన్షాఅల్లాహ్ పొందవచ్చు.

ఈ 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి, 33, 33, 33 – 99 అయినాయి కదా, ఒక్కసారి

لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
[లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

చదివితే, ముస్లిం షరీఫ్ లో మరో ఘనత తెలుపబడింది. ఈ విషయం ముస్లిం షరీఫ్ లో ఉంది. అదేమిటి? ఒకవేళ మీ పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించబడుతుంది. అల్లాహు అక్బర్. అన్ని పాపాలు తొలగించబడతాయి అని ప్రవక్త గారు శుభవార్త ఇస్తున్నారు.

ఇక రండి, మరోసారి మీకు గుర్తుండడానికి వాటిని సంక్షిప్తంగా చేస్తూ, ఫర్ద్ నమాజ్ తర్వాత ఒక కార్యం కానీ రెండు విధానాలు తెలుసుకున్నాం. ఏంటి ఒక కార్యం? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ మూడు పదాలు. కానీ ఒక పద్ధతి ఏంటిది? 10, 10 సార్లు చెప్పడం. ఇంకొకటి? 33, 33, 33, ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్… వీటన్నిటినీ కలిపి లాభాలు ఎన్ని మనం తెలుసుకున్నాము? ఒకటి లాభం, స్వర్గ ప్రవేశం. రెండవ లాభం, 1500 పుణ్యాలు. మూడవ లాభం, హజ్ చేసినంత పుణ్యం. నాలుగవ లాభం, ఉమ్రా చేసినంత పుణ్యం. ఐదవ లాభం, దానధర్మాలు చేసినంత పుణ్యం. ఆరవ లాభం, జిహాద్ లో ఖర్చు పెట్టినంత పుణ్యం. ఏడవ లాభం, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ తొలగించబడతాయి. ఎన్ని లాభాలు? ఏడు లాభాలు. ఏడు రకాల లాభాలండి.

కేవలం 10 రియాల్ ల ఓవర్ టైం మనకు దొరుకుతుంది ఒక గంటకు అని అంటే మనం వెనకాడతామా? మరి ఏడు రకాల పుణ్యాలు మనకు దొరుకుతున్నాయి. దీనికి ఒక గంట కాదు, టోటల్ నిమిషం, నిమిషంన్నర టైం పడుతుంది అంతే. మీరు ఒకసారి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, టైం పెట్టి, గడియారం పెట్టి మీరు చూడండి. మహా ఎక్కువ అంటే ఇది ఉంటే టోటల్ ఎంత? నిమిషంన్నర టైం పడుతుంది అంతే.

కొందరు పండితులు చెప్పారు, ఎంతవరకు వాస్తవం అల్లాహ్ కు తెలుసుగాక, ఒకవేళ మీరు 10 యొక్క ఉద్దేశంతో టోటల్ 33, 33 అనుకున్నా గానీ సరిపోతుంది, ఎందుకు? 33 లో 10 సరిపోతాయి కదా. అలా కూడా కొందరు అన్నారు.

ఈ విధంగా చూడడానికి మనం ఒక రకమైన కార్యం. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనడం. కానీ ఎన్ని లాభాలు తెలుసుకున్నాము? ఒకసారి లెక్కించగలుగుతారా? ఏంటి చెప్పండి? ఒకటి, స్వర్గ ప్రవేశం. రెండవది, 1500 పుణ్యాలు. మూడవది, హజ్ చేసినంత. నాలుగవది, ఉమ్రా చేసినంత. ఐదవది, దానధర్మాలు, సదకా. ఆరవది, జిహాద్ లో ఖర్చు పెట్టినంత. ఏడవది, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా అవన్నీ తొలగించబడతాయి. ఇవి ఏడు.

ఇక రండి, స్వర్గం విషయంలో మరొక గొప్ప శుభవార్త కూడా మనకి ఇవ్వబడింది ఆయతుల్ కుర్సీ విషయంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సహీహ్ హదీస్ లో ఉంది. ఇమాం నసాయి రహమతుల్లాహి అలైహి అమలుల్ యౌమి వల్ లైలా లో ప్రస్తావించారు. షేఖ్ అల్బాని రహమతుల్లాహి అలైహి కూడా తమ గ్రంథాలలో దీన్ని ప్రస్తావించారు. ఎవరైతే,

مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا الْمَوْتُ
[మన్ ఖర’అ ఆయతల్ కుర్సీ దుబుర కుల్లి సలాతిన్ మక్తూబతిన్, లమ్ యమ్న’అహు మిన్ దుఖూలిల్ జన్నతి ఇల్లల్ మౌత్]
ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీ చదువుతారో, వారు స్వర్గంలో ప్రవేశించడానికి కేవలం చావు మాత్రమే అడ్డు ఉన్నది

.ఎంత గొప్ప శుభవార్త గమనించండి. ఆయతుల్ కుర్సీ అంటే ఏంటి?

اللهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ
[అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’ఖుదుహూ సినతున్ వలా నౌమ్]
అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వలోకాల నిర్వాహకుడు. ఆయనకు కునుకు రాదు, నిద్రపోడు. చివరి వరకు ఇది ఒక ఆయత్.

ఈ విధంగా ఆయతుల్ కుర్సీ ద్వారా కూడా మనకు చాలా గొప్ప లాభాలు లభిస్తాయి, వాటిని చదివే అలవాటు మనం చేసుకోవాలి.

ఇంకా ఫజ్ర్ నమాజ్ తర్వాత, అప్పుడైతే డ్యూటీ ఉండదు కదా వెంటనే. కనీసం ఒక రెండు నిమిషాలు మనం సలాం తిప్పిన తర్వాత మస్జిద్ లో కూర్చోవచ్చు కదా. కూర్చొని

لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
[లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

పదిసార్లు చదవాలి. ఎన్నిసార్లు? పదిసార్లు. ఏంటి లాభం? ప్రవక్తగారు చెప్పారు, అల్లాహ్ త’ఆలా

كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ
[కతబల్లాహు లహూ అషర హసనాత్]
అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు రాస్తాడు

లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదవాలి. లాభాలు ఏంటి? ఇంకా ఉన్నాయి, దాన్ని గుర్తుంచుకోవాలి. పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే, మొదటి లాభం పది పుణ్యాలు అల్లాహ్ రాస్తాడు.

وَمَحَا عَنْهُ عَشْرَ سَيِّئَاتٍ
[వమహా అన్హు అషర సయ్యిఆత్]
మరియు అతని నుండి పది పాపాలను తుడిచివేస్తాడు

రెండో లాభం ఏంటంటే, పది పుణ్యాలు అల్లాహ్ మాఫ్ చేస్తాడు, తొలగిస్తాడు. మూడో లాభం ఏంటంటే,

رَفَعَ لَهُ عَشْرَ دَرَجَاتٍ
[రఫ’అ లహూ అషర దరజాత్]
అతని కొరకు పది స్థానాలు పెంచుతాడు

وَكَانَ يَوْمَهُ ذَلِكَ كُلَّهُ فِي حِرْزٍ مِنْ كُلِّ مَكْرُوهٍ
[వకాన యౌమహు దాలిక కుల్లుహూ ఫీ హిర్జిన్ మిన్ కుల్లి మక్రూహ్]
మరియు ఆ రోజంతా అతను ప్రతి అసహ్యకరమైన దాని నుండి రక్షణలో ఉంటాడు

మరియు ఆ దినమంతా, ఆ రోజంతా అతని గురించి ప్రతి కీడు నుండి, చెడు నుండి, అసహ్య విషయాల నుండి అతన్ని కాపాడుకోబడుతుంది. ఎన్ని లాభాలు అయినాయి? లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదివితే ఎన్ని లాభాలు విన్నాము? పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు,

وَحُرِسَ مِنَ الشَّيْطَانِ
[వహురిస మినష్ షైతాన్]
మరియు షైతాన్ నుండి కాపాడబడతాడు

షైతాన్ నుండి కూడా కాపాడబడతాడు. షైతాన్ నుండి కూడా అతన్ని కాపాడడం జరుగుతుంది. ఐదు. ఆరవది,

وَلَمْ يَنْبَغِ لِذَنْبٍ أَنْ يُدْرِكَهُ فِي ذَلِكَ الْيَوْمِ إِلَّا الشِّرْكَ بِاللهِ
[వలం యంబగీ లిజంబిన్ అన్ యుద్రికహూ ఫీ దాలికల్ యౌమి ఇల్లష్ షిర్క బిల్లాహ్]
షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది

మరియు ఒకవేళ షిర్క్ కు పాల్పడేది ఉంటే మహా వినాశనం ఉంటుంది. కానీ షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది. దానివల్ల అల్లాహ్ త’ఆలా అతన్ని పట్టుకోడు. తొందరగానే వెంటనే శిక్షించడు. ఈ విధంగా లా ఇలాహ ఇల్లల్లాహ్.. పదిసార్లు చదవడం ద్వారా మనకు ఎన్ని లాభాలు కలిగాయి? ఒకటి, పది పుణ్యాలు లభిస్తాయి. రెండవది, పది పాపాలు తొలగించబడతాయి. పది స్థానాలు పెంచబడతాయి. ఇంకా, ఆ రోజంతా అతన్ని కాపాడబడుతుంది. మరియు షైతాన్ నుండి కూడా అతన్ని రక్షించడం జరుగుతుంది ఐదు. ఆరవది, ఏదైనా పాపం జరిగినా గానీ అల్లాహ్ వెంటనే శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి. అంటే షిర్క్ లాంటి పాపం అనేది కాకూడదు.

ఇది దేనివల్ల మనకు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే. కానీ ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. అప్పుడేంటి లాభం మనకు దొరుకుద్ది?

గమనించండి. ఈరోజు ఎన్ని లాభాలు మనం తెలుసుకుంటున్నామో అవన్నీ గుర్తున్నాయా లేవా? ఆ? మరోసారి రిపీట్ చేయాలా? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ దీని గురించి మనం ఏడు లాభాలు తెలుసుకున్నాం. గుర్తున్నాయా? ఏంటెంటి? స్వర్గ ప్రవేశం, 1500 పుణ్యాలు, ఇంకా హజ్ చేసినంత పుణ్యం, ఉమ్రా చేసినంత పుణ్యం, దానధర్మాలు చేసినంత పుణ్యం, ఇంకా జిహాద్ చేసినంత పుణ్యం మరియు సముద్రపు నురుగంత పుణ్యాలు ఉన్నా గాని తొలగించబడతాయి. ఇవి ఏడు.

ఇక ఆయతుల్ కుర్సీ లాభం ఒకటి విన్నాం, అదేమిటి? ఎవరైతే ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో, అతనికి మరియు స్వర్గానికి మధ్య అడ్డు ఏముంది? చావు. అతని మరణం తప్ప వేరేది అడ్డు లేదు. ఇక ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు ఏం చదవాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎన్ని లాభాలు? ఆరు లాభాలు తెలుసుకున్నాము. ఒకటి, పది పుణ్యాలు దొరుకుతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు, షైతాన్ నుండి కాపాడబడతాడు, ఇంకా ఏ పాపం వల్ల కూడా అతన్ని అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి.

ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత చదివితే ఏంటి లాభం? ఈ హదీస్ మీరు వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,

بَعَثَ اللهُ لَهُ مُسَلَّحَةً يَحْفَظُونَهُ مِنَ الشَّيْطَانِ حَتَّى يُصْبِحَ
[బ’అసల్లాహు లహూ ముసల్లహతన్ యహ్ ఫదూనహూ మినష్ షైతాని హత్తా యుస్బిహ్]
అతను ఉదయం అయ్యేవరకు షైతాన్ నుండి అతన్ని కాపాడే ఆయుధాలు ధరించిన వారిని అల్లాహ్ పంపుతాడు.

మగ్రిబ్ తర్వాత చదివితే తెల్లారే వరకు, హత్తా యుస్బిహ్, తెల్లారే వరకు షైతాన్ నుండి అతన్ని కాపాడడానికి ఆయుధంతో నిండి ఉన్న దైవదూతలను పంపుతాడు. ఇది మొదటి లాభం. ఎప్పుడు చదివితే? మగ్రిబ్ తర్వాత. రెండవది,

وَكَتَبَ اللهُ لَهُ بِهَا عَشْرَ حَسَنَاتٍ مُوجِبَاتٍ
[వకతబల్లాహు లహూ బిహా అషర హసనాతిన్ మూజిబాత్]
మరియు దాని ద్వారా అల్లాహ్ అతని కొరకు తప్పనిసరి చేసే పది పుణ్యాలను రాస్తాడు.

అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు ఎలాంటివి రాస్తాడో తెలుసా? స్వర్గానికి తీసుకువెళ్ళే పుణ్యాలు. సామాన్య పుణ్యాలు కాదు, స్వర్గం అతనిపై విధి చేసే అటువంటి పుణ్యాలు అల్లాహ్ అతని గురించి రాస్తాడు. ఎన్ని లాభాలు అయినాయి? మొదటిది ఏంటిది? షైతాన్ నుండి కాపాడడానికి అల్లాహ్ ఎవరిని పంపుతాడు? ఆయుధంతో ఉన్న దైవదూతలను పంపుతాడు. రెండవ లాభం ఏంటి? పది పుణ్యాలు రాస్తాడు, ఎలాంటి పది పుణ్యాలు? స్వర్గాన్ని విధి చేసే అటువంటి పుణ్యాలు. మూడవ లాభం, పది పాపాలని తొలగిస్తాడు, ఎలాంటి పాపాలు? మూబిఖాత్, అతన్ని నాశనం చేసే అటువంటి పది పాపాలు. మనిషి ఏదైనా పాపం చేసి ఉన్నాడు, ఎలాంటి పాపం? అతన్ని ఆ మనిషిని వినాశనానికి గురి చేస్తాయి. అలాంటి పాపం చేసి ఉన్నాడు. కానీ అల్లాహ్ అలాంటి పాపాన్ని కూడా మన్నించేస్తాడు. ఎందుకు మన్నిస్తాడు? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎప్పుడు చదవాలి? మగ్రిబ్ తర్వాత ఎన్ని పుణ్యాలు, ఎన్ని లాభాలు దొరికినాయి? మూడు. ఆయుధంతో ఉన్న దైవదూతలు షైతాన్ నుండి అతన్ని కాపాడుతారు. అల్లాహ్ స్వర్గంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పుణ్యాలు అతని గురించి రాస్తాడు, మరియు అతన్ని వినాశనానికి గురి చేసే, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు అతని నుండి మన్నించేస్తాడు. ఇంకా

وَكَانَتْ لَهُ بِعَدْلِ عَشْرِ رَقَبَاتٍ مُؤْمِنَاتٍ
[వకానత్ లహూ బి’అద్లి అష్రి రఖబాతిన్ ము’మినాత్]
మరియు పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది

పది విశ్వాసులను, విశ్వాస బానిసలను, పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది. ఈ నాలుగు లాభాలు. మగ్రిబ్ తర్వాత చదివితే నాలుగు లాభాలు. కానీ నాలుగు అని తక్కువ భావించొద్దు. మహా గొప్ప లాభాలు ఉన్నాయి ఇవి కూడా. పొద్దున చదివితే కూడా షైతాన్ నుండి రక్షించడం జరుగుతుంది అని చెప్పబడి ఉంది. కానీ సాయంత్రం చదివితే ఏముంది? దైవదూతలు, ఆయుధంతో ఉన్నటువంటి దైవదూతలను అల్లాహ్ త’ఆలా పంపుతాడు అని చెప్పడం జరిగింది. పొద్దున చదివితే కూడా పది పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ సాయంకాలం దాంట్లో ఏముంది? మూజిబాత్, అంటే స్వర్గానికి తీసుకెళ్ళే అటువంటి పుణ్యాలు అని. పొద్దున చదివితే కూడా పది పాపాలు తొలగించబడతాయి, కానీ సాయంత్రం చదివితే, సాయంత్రం చదివితే ఆ, ఘోరమైన, మనిషిని వినాశనానికి గురి చేసే అటువంటి, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు మన్నించబడతాయి. కానీ ఇక్కడ మరో కొత్త విషయం వచ్చింది. పొద్దున చదివిన దాంట్లో రాలేదు. అదేంటి? పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది.

ఈ విధంగా సోదరులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈరోజు మనం ఫర్ద్ నమాజుల తర్వాత ఏ జిక్ర్ అయితే మనం చేయవలసి ఉందో, ప్రవక్త గారు నేర్పారో వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకున్నాము, వాటి యొక్క లాభాలు కూడా తెలుసుకున్నాము. ఇన్ని గొప్ప లాభాలు ఉన్నాయో మీరే శ్రద్ధగా గమనించి వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జిక్ర్ మాత్రమే ఉన్నాయని భావం కాదు, ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కొన్ని జిక్ర్ ల గురించి నేను మీ ముందు ఈ మాట ఉంచాను. అల్లాహ్ త’ఆలా వీటిని అర్థం చేసుకుని, వీటిని ఆచరించే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

జిక్ర్ ,దుఆ మెయిన్ పేజీ
https://teluguislam.net/dua-supplications/

నమాజు మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 10 – నమాజు విధానం, నమాజ్ తర్వాత జిక్ర్, మస్బూఖ్, నమాజ్ భంగపరుచు కార్యాలు,నమాజ్ వాజిబులు,రుకున్ లు [వీడియో]

బిస్మిల్లాహ్

[1: 00 :14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ విధానం:

నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.

నమాజ్ చిత్రాలు చూడండి:

నమాజు పద్ధతి చిత్రాలు

ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః

1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).

2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ

రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి (చిత్రం1)

3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. (చిత్రం2)

4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః

అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).

(الْحَمْدُ لله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ).

(శుభాలు గల, అనేకానేక మంచి స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందును).

సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబార కస్ముక వతఆల జద్దుక వలాఇలాహ గైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.

ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.

5- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్,

6- బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ చదివి, సూరె ఫాతిహ చదవాలిః అల్ హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅ బుదు వఇయ్యాక నస్త ఈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం,  గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలద్జాల్లీన్. (ఆమీన్).

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ* الْحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ* الرَّحْمَنِ الرَّحِيمِ* مَالِكِ يَوْمِ الدِّينِ* إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ* اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ*صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.

7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.

8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)

9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.

10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْـحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَمِلْءُ الْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).

11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4

12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)

13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.

14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.

15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకా తుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా హిస్సాలి హీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.

ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ.

ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను

16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)

17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)

నమాజ్ తర్వాత జిక్ర్:

సలాం తింపిన తరువాత ఈ దుఆలు చదవాలి.

అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్ కస్సలాం తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. లా ఇలాహ ఇల్లల్లాహు     వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅ తియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లా హు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనా ఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.

అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).

తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).

తరువాత ఆయతుల్ కుర్సీ([1]) ఒకసారి.

ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.

మస్బూఖ్:

ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.

జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజును భంగపరుచు కార్యాలు:

  • 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
  • 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
  • 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
  • 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
  • 5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
  • 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
  • 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజ్ యొక్క వాజిబులు:

  • 1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
  • 2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
  • 3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
  • 4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
  • 5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
  • 6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
  • 7- మొదటి తషహ్హుద్ చదవడం.
  • 8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.

నమాజ్ యొక్క రుకున్ లు:

  • 1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
  • 2- తక్బీరె తహ్రీమ.            
  • 3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
  • 4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
  • 5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
  • 6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
  • 7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
  • 8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
  • 9- చివరి తషహ్హుద్.
  • 10- దాని కొరకు కోర్చోవడం.
  • 11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
  • 12- సలాం తింపడం.
  • 13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం

[1])اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا

فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ] {البقرة:255}

[2]) قُلْ هُوَ اللهُ أَحَدٌ(1) اللهُ الصَّمَدُ(2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ(3)  

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ(4) قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ(1) مِنْ شَرِّ مَا خَلَقَ(2) وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ(3) وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ(4) وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ(5).  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ(1) مَلِكِ النَّاسِ(2) إِلَهِ النَّاسِ(3) مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ(4) الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ(5)  مِنَ الجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ(6)


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు