రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.
‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.
ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :
1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)
ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)
అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:
ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)
3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)
4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)
5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.
6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)
వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నా సహచరులను తిట్టబాకండి. నా సహచరులను తిట్టబాకండి. ఎవరి అధీనంలోనా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – ఒకవేళ మీలో ఎవరయినా ఉహద్ అంత బంగారం ఖర్చు పెట్టినాసరే వీరి (అంటే సహాబాలు ఖర్చుచేసిన) అర్థ సేరు కాదు కదా కనీసం పావు సేరు ధాన్యానికి సమానమయిన పుణ్యఫలం కూడా పొందలేరు.” (ముస్లిం)
అబూసయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ప్రకారం ఖాలిద్ బిన్ వలీద్ – అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మధ్య ఒకసారి అభిప్రాయభేదం తలెత్తింది. అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆవేశంలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ను దుర్గాషలాడారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై హదీసును పలికారు.
”ఉహద్” ఒక పర్వతం పేరు. ప్రాచీన కాలంలో అది మదీనాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే అది ప్రస్తుతం మదీనా నగరంలో ఒక వీధిగా ఉంది. ఈ పర్వతానికి ఆనుకునే ఆనాడు మహా సంగ్రామం జరిగింది. అది ఉహద్ సంగ్రామంగా చరిత్ర ప్రసిద్ధిచెందింది.
అర్థ సేరు అనేపదం హదీసులోని ‘మద్ద్‘ అనే పదానికి మారుగా వ్రాయడం జరిగింది. “మద్” అనేది ధాన్యం కొలిచే డబ్బా లాంటిది. అది ఇంచుమించు అర్థ సేరుకు సమానం.
అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తొలితొలి సహచరులలోని వారు. అల్లాహ్ ఆయనకు పుష్కలమయిన ధనరాసుల్ని ఒసగాడు. అయితే ఆయన ఆ ధనరాసులను అల్లాహ్ మార్గంలో విరివిగా ఖర్చు చేశారు. హిజ్రీ 33లో మదీనాలో తనువు చాలించారు.
ఖాలిద్ బిన్ వలీద్ కూడా మహాప్రవక్త సహచరులలోని వారే. అయితే ఆయన ప్రారంభంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా నిలబడి పోరాడినవారు. ఆతరువాత హిజ్రీ 8వ యేట సత్యాన్ని గ్రహించి ఇస్లాం స్వీకరించారు. ఇక ఆ తరువాత ఆయన ఇస్లాం వ్యాప్తికై తన శక్తులన్నింటినీ ధారపోశారు. ఆయన్ని ఏ సైనిక పటాలానికి కమాండర్ గా నియమించినా విజయమే లభించేది. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ హిజ్రీ 21 యేట కాలధర్మం చెందారు.
పై హదీసులో సహాబాల స్థానం, వారి త్యాగాలు ప్రముఖంగా ప్రస్తుతించబడ్డాయి.విశ్వాస స్థితిలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూచి, ఆయన వెంట ఉన్నవారిని, విశ్వాసస్థితి లోనే మరణించిన వారిని సహాబాలు అంటారు.
ఇమామ్ నవవి ఇలా అంటున్నారు:- “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులంతా ఆదరణీయులే. నమ్మకస్తులే. ‘ఒకవేళ వారు ఉపద్రవానికి గురయినా కాకపోయినా’ దీని భావం ఏమంటే వారిలో ఎవరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పలుకులను ఉల్లేఖించినా అవి ప్రామాణికంగానే పరిగణించబడతాయి. వారి ఉల్లేఖనాలపై సంశయాలకు తావులేదు.
హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ”మహాప్రవక్త సున్నత్ ని అనుసరించే వారందరిలో సహాబాలు నమ్మకస్తులన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఎవరో కొద్దిమంది బిద్అతీలు (కొత్తపుంతలు తొక్కేవారు) మాత్రమే దీంతో విభేదిస్తారు.”
కాజీ అయాజ్ ఇలా అన్నారు – “ఈ హదీసు ద్వారా సహాబాలంతా, తదనంతర అనుయాయులకన్నా శ్రేష్ఠులు అన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యక్ష సహచరులు తొలి దశ నుంచీ కష్టకాలంలో ఆదుకున్నారు. తమ ఇళ్ళల్లో ఉన్నదంతా అల్లాహ్ మార్గంలో అర్పించారు. ఎల్లప్పుడూ మహాప్రవక్తను వెన్నంటి ఉండేవారు. ఈ భాగ్యం తరువాతి వారికి లభించలేదు. జిహాద్ విషయంలోనయినా, విధేయత విషయంలోనయినా సహాబాల తరువాతే ఇతరుల స్థానం. సర్వోన్నత ప్రభువు ఇలా సెలవిచ్చాడు –
“మీలో (మక్కా) విజయానంతరం ఖర్చుపెట్టిన వారు మరియు పోరాడినవారు, (మక్కా) విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, పోరాడినవారితో సమానులు కాజాలరు. వారు ఉన్నత శ్రేణికి చెందినవారు.”
అదీగాక వారి హృదయాలలో ప్రేమానురాగాలు, దయాభావం, సంకల్పశుద్ధి, అణకువ, వినమ్రత, అల్లాహ్ మార్గంలో పోరాటపటిమ విరివిగా ఉండేవి. ఒక్క క్షణమే కానివ్వుగాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి గడపటమే వేరు. ఆ మధుర క్షణాలతో సరితూగగల ఆచరణ ఇంకేది కాగలదు!? ఎవరెంత ప్రయత్నించినా ఆ స్థాయికి చేరుకోలేరు. అది కేవలం అల్లాహ్ కృప మాత్రమే. అల్లాహ్ కోరిన వారికే అది దక్కింది. కాజీ అయాజ్ ఇలా అభిప్రాయపడ్డారు : “ఈ ఉన్నతస్థానం, మహాప్రవక్త వెంట సుదీర్ఘకాలం గడిపిన, దైవమార్గంలో విరివిగా ఖర్చుచేసిన, ధర్మపోరాటం చేసిన, హిజ్రత్ చేసిన వారికే వర్తిస్తుందని పలువురు హదీసువేత్తలు అంటున్నారు. అంతేగాని మహాప్రవక్తను కేవలం ఒకసారి చూసినవారికో, లేక మక్కా విజయానంతరం విశ్వసించిన వారికో ఆ ఉన్నత స్థానం లభించదు. ఎందుకంటే వారికి అల్లాహ్ మార్గంలో హిజ్రత్ ని, ప్రారంభంలో విశ్వసించిన ముస్లిములకు సహాయపడే అవకాశం గాని రాలేదు.”
ఈ అభిప్రాయంకన్నా, మహాప్రవక్తను విశ్వాసస్థితిలో చూసిన వారంతా సహాబాలుగానే పరిగణించబడతారన్న అభిప్రాయమే నిర్వివాదాంశంగా తోస్తుంది.
ఈ హదీసు మహాప్రవక్త ప్రియ సహచరుల త్యాగాల సాగరంలో ఒక బిందువు మాత్రమే. దైవగ్రంథమైన ఖుర్ఆన్లోనూ, మహాప్రవక్త పలుకులలోనూ సహాబాల స్థానం అత్యున్నతమైందని చెప్పబడింది.
“(ఈ విజయప్రాప్తి) ఆ బీద ముహాజిర్లకే చెందాలి. ఎవరయితే తమ ఇళ్ళూ, వాకిలి మరియు ఆస్తిపాస్తులకు నోచుకోకుండా తీసివేయబడ్డారో, వీరు అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను కోరుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త మద్దతుకై సన్నద్ధులై ఉంటారు. వీరే సన్మార్గగాములు. ఇంకా, ఈ ముహాజిర్లు వలస రాకపూర్వం విశ్వసించి ‘దారుల్ హిజ్రత్’ (యస్రిబ్ లేదా మదీనా) లో వేచివున్న వారికి కూడా (ఈ విజయ ప్రాప్తిచెందాలి). వీరు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. ఏది వారికి ఇచ్చినా దాని గురించి మనసులోనే పెట్టుకోరు. తమకేదయినా అవసరం ఉన్నప్పటికీ తమ స్వయంపై ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు. యధార్థానికి తమ మనసులోని సంకుచితత్వానికి దూరంగా మసలుకున్నవారే సాఫల్యం పొందుతారు.” (అల్ హష్ర్ : 8, 9)
పై రెండు ఆయత్లలో అల్లాహ్ అన్సార్లను, ముహాజిర్లను సాఫల్యం పొందిన వారుగా పేర్కొన్నాడు. ఈ విధంగా ఎన్నో ఆయత్లలో మహాప్రవక్త ప్రియ సహచరులు కొనియాడబడ్డారు. తరువాత వచ్చిన అనుయాయులు ఈ సహాబాల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలని తాకీదు చేయడంజరిగింది. హష్ర్ సూరాలోనే పదవ ఆయత్లో చూడండి –
”వీరి తరువాత వచ్చిన వారు ఇలా వేడుకుంటారు – “ఓ మా ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన సోదరులందరినీ క్షమించు! విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎటువంటి కాపట్యాన్నీ ఉంచబాకు. మా ప్రభూ! నువ్వెంతో దయామయుడవు, కృపాకరుడవు.” (అల్ హష్ర్ : 10)
తమకు పూర్వం విశ్వసించిన వారి మన్నింపునకై ప్రార్థించటం విశ్వాసుల సుగుణానికి తార్కాణమని పై ఆయత్ ద్వారా రూఢీ అవుతోంది. వారి యెడల ఎటువంటి కాపట్యాన్నిగాని, దురుద్దేశ్యాన్ని గాని వారు సహించరు.
మహాప్రవక్త ప్రియ సహచరులలో ఎవరినయినాసరే నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అర్వ బిన్ జుబైర్ తో ఇలా అన్నారు: “ఓ నా సోదరి కుమారా! సహాబాల మన్నింపునకై వేడుకుంటూ ఉండమని వీరికి ఆదేశించబడింది. కాని వీళ్ళు వారిని దుర్భాషలాడారు.” (ముస్లిం)
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “అత్యుత్తమమైన కాలం నాది. ఆపైన నా తరువాతది. ఆపైన దాని తరువాతది.” (బుఖారి)
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు – “మహాప్రవక్త వారి సహచరులను దూషించకండి. వారు మహాప్రవక్తతో గడిపిన ఒక్క క్షణం మీ యొక్క 40 యేళ్ళ ఆచరణకన్నా శ్రేష్ఠమైనది.”
”కొంతమంది, దైవప్రవక్త సహచరులను, ఆఖరికి అబూబకర్, ఉమర్లను కూడా పరుషంగా మాట్లాడుతున్నారు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) తో చెప్పగా, “అందులో ఆశ్చర్య పడాల్సింది ఏముంది? వారి ఆచరణ సమాప్తమయింది. అయితే వారికి లభించేపుణ్యఫలం సమాప్తం కారాదని అల్లాహ్ నిర్ణయించాడు” అని ఆమె బదులిచ్చారు. ఈ పలుకులను జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. దీని భావం ఏమిటంటే, దుర్భాషలాడిన, చాడీలు చెప్పిన వారి సత్కార్యాలు కీర్తిశేషులయిన ఆ మహనీయుల ఖాతాలో జమ అవుతాయి. ఆ విధంగా వారు చనిపోయినప్పటికీ ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు.
ప్రముఖ హదీసు వేత్త అబూజర్ అత (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : “ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరులలో ఎవరినయినా అగౌరవపరుస్తూ మాట్లాడటం మీరు చూస్తే అతను ధర్మభ్రష్టుడని తెలుసుకోండి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యసంధులు. ఖుర్ఆన్ సత్యబద్ధమైనది. అటువంటి ఖుర్ఆన్ ను, మహాప్రవక్త సంప్రదాయాన్ని మన దాకా అందజేసినవారే సహాబాలు. ఖుర్ఆన్ మరియు సున్నత్ ను మనకందజేసిన సహాబాలు నమ్మకస్తులు కారని వారు చెప్పదలుస్తున్నారు. ఆ విధంగా ఖుర్ఆన్ హదీసులు మిథ్య అని నిరూపించదలుస్తున్నారు. ఇటువంటి వారంతా ధర్మ విరోధులు, ధర్మ భ్రష్టులు.”
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియసహచరుల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ పంథా సమతూకంతో కూడినది. అది వారి స్థానం నుండి వారిని మరీ ఎత్తి దైవంతో సరితూగే స్థానమూ కల్పించదు. అలా అని వారిని అవహేళనచేసే విధంగానూ దిగజార్చదు. అందుకే అహ్లె సున్నత్లు మధ్యస్థ విధానాన్ని అవలంబిస్తారు. వారు అందరినీ ప్రేమిస్తారు. న్యాయంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఇస్తారు. వారి అంతస్తును మరింత పైకి ఎత్తనూ ఎత్తరు. వారి హక్కుల్ని నెరవేర్చటంలో లోటూ రానివ్వరు. మహాప్రవక్త సహచరుల ప్రశంసలో వారి నోళ్ళు తడిగా ఉంటాయి. వారి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండిపోతాయి.
సహాబాల మధ్య ఎప్పుడయినా, ఏదయినా విభేదం గాని, వివాదం గాని తలెత్తితే అది కేవలం ‘ఇజ్తెహాద్ ‘ షరీఅత్ అన్వయింపు కారణంగానే తలెత్తేది. ఎవరు ఇజ్తెహాద్ లో కరెక్టుగా ఉంటే వారికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరెవరి ఇజ్తెహాద్ లో లోపం ఉంటుందో వారికి ఒకే వంతు ప్రతిఫలం లభిస్తుంది. సహాబాలు మానవాతీతులు కారు. వారూ మానవులే. వారి ద్వారా కూడా పొరపాట్లు జరగవచ్చు. జరిగేవికూడా. అంతమాత్రాన అసాధారణమయిన వారి త్యాగాలు, సుగుణాలు మరుగున పడజాలవు. వారి సత్కర్మలు తదనంతర అనుయాయుల సత్కార్యాల కంటే అధికం. అలాగే వారి పొరపాట్లు వారి తరువాతి వారి పొరబాట్లకన్నా బహుస్వల్పం. అదీగాక, అల్లాహ్ వారిని మన్నించాడు. వారితో ప్రసన్నుడైనాడు.
తావీ (రహిమహుల్లాహ్) గారు “అఖీద అహ్లుల్ సున్నత్ లో ” ఇలా రాస్తున్నారు : “మనమంతా మహాప్రవక్త ప్రియ సహచరులను ప్రేమిస్తున్నాము. వారిలో ఎవరి ప్రేమ పట్ల కూడా వైపరీత్యానికి పోము. ఇంకా వారిలో ఏ ఒక్కరితోనో సంబంధాన్ని త్రెంచుకోవటమూ లేదు. ఎవరు సహాబాల పట్ల కపటత్వం ప్రదర్శించారో వారిపట్ల మేముకూడా అలాగే వ్యవహరిస్తాము. మేము మటుకు వానిని మంచి పదాలతోనే స్మరిస్తాము. వారిపట్ల ప్రేమ ఉంటేనే ధర్మం (దీన్) పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నట్లు లెక్క. వారిపట్ల గనక వైరభావం ఉంటే అది కుఫ్ర్ (తిరస్కారం)కు, కాపట్యానికి, తలపొగరుతనానికి ఆనవాలు అవుతుంది.”
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి: “సహాబా (రదియల్లాహు అన్హు)లందరి సుగుణాలను స్మరించడం, వారిలోని పరస్పర విభేదాల గురించి చర్చకు తావీయకుండా ఉండిపోవటం సంప్రదాయం (సున్నత్). ప్రవక్త సహచరుల్లో ఏ ఒక్కరినయినా సరే దూషించినవాడు మార్గవిహీనుడే. సహాబాల పట్లప్రేమ కలిగి ఉండటం సున్నత్. వారి కోసం అల్లాహ్ ను వేడుకోవటం అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటమే. ఇంకా వారి మార్గాన్ని అనుసరిస్తే అది మోక్షానికి వారధి వంటిది. వారి పాద చిహ్నాలలో నడుచుకోవటం ఔన్నత్యానికి సోపానం.”
సహాబాలలోని తప్పులను చర్చించే, లేదా వారిలో ఎవరినయినా అవమానపరచే అనుమతి ఎవరికీ లేదు. అలా చేసిన వారిని కాలపు రాజ్యాధికారి విధిగా శిక్షించవలసి ఉంటుంది. అటువంటి వారిని మన్నించి వదలివేయటం సబబు కాదు. వారిని శిక్షించాలి, ఆపైన వారిచేత పశ్చాత్తాపం ప్రకటించాలి. పశ్చాత్తాపపడితే సరి. లేకపోతే వారికి మళ్ళీ శిక్ష విధించాలి. వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడేవరకూ నిర్బంధంలో పెట్టాలి.
అబూ సయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం సహాబాలలో అంతస్తులున్నట్లు నిర్ధారణ అవుతోంది. వారిలో వివిధ కోవలున్నట్లు కూడా విదితమవుతోంది. విజయానికి పూర్వం అల్లాహ్ మార్గంలో తమ ధనంతో, ప్రాణాలతో పోరాడిన వారికి విజయం తరువాత పోరాడిన వారు సాటి రాలేరని అల్లాహ్ స్వయంగా “పేర్కొన్నాడు.
“మీలో ఎవరయితే విజయం తరువాత ఖర్చు చేశారో, పోరాడారో వారు ఎప్పటికీ విజయానికి పూర్వం ఖర్చుచేసిన, పోరాడిన వారితో సమానులు కాలేరు.”
ఇక్కడ “విజయం” అనే పదం హుదైబియా ఒడంబడిక నేపధ్యంలో ఉంది. హుదైబియా ఒప్పందం తరువాత చేసిన త్యాగాల కంటే హుదైబియా ఒప్పందానికి ముందుచేసిన త్యాగాలు ఇంకా విలువైనవని తెలుస్తోంది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ని ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) పరుషంగా మాట్లాడినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించటమే గాక అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ను తన సన్నిహితునిగా పేర్కొన్నారు. ఎందుకంటే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ చివర్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ అంతటి వారే అబ్దుర్రహ్మాన్ బిన్ఔఫ్ (రదియల్లాహు అన్హు)కు సాటి రాలేనపుడు ఆ తరువాతి అనుయాయుల్లో మాత్రం సహాబాలతో సరిపడే వారెవరుంటారు?
హదీసు ద్వారా బోధపడిందేమంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రియ సహచరులంతా మనకు గౌరవనీయులు, ఆదర్శప్రాయులు, కనుక వారి పొరపొచ్చాలను వెతుకుతూ ఉండటం, వాటిని సాగదీయటం వాంఛనీయం కాదు. అది అమర్యాద, అవిజ్ఞత అనిపించుకుంటుంది. మనం ఎంతసేపటికీ వారి సత్కార్యాలనే మార్గపు కాగడాలుగా ఎంచుకోవాలి. వారిలోని లోటుపాట్లను విస్మరించాలి. వారి స్థాయిని మనలో ఎవరూ అందుకోలేరని తెలుసుకోవాలి. వారి అపారమైన సుగుణాల ముందు వారి లోటుపాట్లు దేనికీ పనికిరావు. అనుయాయుల్లో ఎవరయినా సరే వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం అమర్యాదకరంగానే పరిగణించబడుతుంది. మనం చేయవలసిందల్లా వారి శ్రేయాన్ని అభిలషిస్తూ ప్రార్థించటం, వారి జీవితాల ద్వారా గుణపాఠం గరపుతూ ఉండటమే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)
అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.
ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?
దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)
ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.
ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.
దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.
ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)
అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి! అల్లాహ్ యే ఈ సృష్టి ప్రదాత. ఆయన ఎవరిని కోరుతాడో వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు, వారు మనుషులైనా లేక ప్రదేశమైనా, లేక ఏదైనా సందర్భం అయినా, లేక ఏదైనా ఆరాధన అయినా అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ (నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) (అల్ ఖసస్ 28:68)
మరియు నిశ్చయంగా అల్లాహ్ నమాజులలో జుమా నమాజును ఎంచుకున్నాడు. మరియు దానికి కొన్ని ప్రత్యేకతలను ప్రసాదించాడు. మరియు కొన్ని సున్నతులను మరికొన్ని ఆచరణలను అభిలషణీయం (ముస్తహబ్)గా నిర్వచించాడు.
1. జుమా ప్రార్థన ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి మరియు ముస్లింల గొప్ప సమావేశాలలో ఒకటి.
2. జుమా నమాజ్ యొక్క సున్నతులు:- (గుసుల్ చేయడం) అనగా తప్పనిసరిగా తలస్నానం చేయడం, సువాసనలు పూసుకోవడం, మరియు మిస్వాక్ చేయడం, మంచి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం సున్నత్ ఆచరణ లోనివి. అబూ దర్దా (రదియల్లాహు అన్హు) గారి హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; “ఎవరైతే జుమ్అహ్ రోజు తలస్నానం చేసి, మంచి అందమైన దుస్తులు ధరించి మరియు పరిమళాలు పూసుకొని ప్రశాంతంగా జుమా నమాజ్ కొరకు బయలుదేరుతాడో దారి మధ్యలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని వేధించకుండా ఉండి, మస్జిద్ చేరుకుని తన అదృష్టం కొద్ది నఫిల్ నెరవేర్చి ఇమామ్ కొరకు వేచి చూస్తూ ఉంటాడో’ అతని రెండు జుమాల మధ్య పాపాలు క్షమించబడతాయి.” (అహ్మద్)
సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు; “మనిషి శుక్రవారం నాడు తలంటు పోసుకొని, వీలైనంతవరకు పరిశుద్ధతను పాటించి, నూనె రాసుకొని లేక తన ఇంట్లో ఉన్న పరిమళాన్ని పూసుకుని, ఆ తర్వాత మస్జిద్ కి వెళ్లి అక్కడ ఏ ఇద్దరి మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్ళకుండా (ఎక్కడో ఒక చోట) తన అదృష్టంలో వ్రాసివున్న నమాజు చేసుకొని ఆ తర్వాత ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు అతని వల్ల జరిగే పాపాలు మన్నించబడతాయి”. (బుఖారి)
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమ్అహ్ నాడు గుసుల్ (తలంటు స్నానం) చేయటం ప్రతి వయోజనుడికి తప్పనిసరి (వాజిబ్) మరియు వారు మిస్వాక్ చేయాలి మరియు ఒకవేళ పరిమళం ఉంటే పూసుకోవాలి” (బుఖారీ-ముస్లిం)
3. జుమ్అహ్ యొక్క మరొక సున్నత్ ఏమిటంటే నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఆధారం: ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు శుక్రవారం రోజున ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, అయితే ప్రజలు రోజు వినియోగించే దుస్తువులను ధరించి ఉన్నారు అప్పుడు అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు “ఈ రోజు మీరు (ప్రజలు) గనక అవకాశం ఉండి ఉంటే రోజూ ధరించే దుస్తులు కాకుండా జుమా నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోండి” అని అన్నారు.(అబూ దావుద్)
ఈ హదీసు ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే జుమా నమాజ్ కొరకు అన్నిటికంటే అందమైన దుస్తులను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది.
4. జుమా నమాజ్ యొక్క అభిలషణీయమైన (ముస్తహబ్) కార్యాలలో ఒకటి మస్జిదును పరిమళింప చేయాలి. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా ఆజ్ఞాపించారు – “మీరు మధ్యాహ్నం వేళ జుమా రోజున మస్జిదె నబవిని సువాసనలతో పరిమళింప చేయండి”. (ముస్నద్)
5. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటి జుమా నమాజ్ కొరకు త్వరపడటం, మరియు కాలినడకన మస్జిదుకు వెళ్లడం. ఇది ఉత్తమమైన ఆచరణ.
ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ప్రవచనం, “జుమా రోజు స్నానం చేయించి, తాను కూడా స్నానం చేసి, ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్ కు వాహనంపై రాకుండా నడచి వచ్చి, ఇమాముకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా విని ఎటువంటి చెడుపని చేయకుండా ఉంటే, అతని ప్రతి అడుగుకు బదులు సంవత్సరమంతా ఉపవాసాలు మరియు రాత్రంతా ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి)
దైవప్రవక్త ప్రవచనంలో గుసుల్ చేయించమని ఉంది, అనగా తన భార్యతో సంభోగించడం. దీని వివరణ అహ్మద్ గారు ఇలా తెలియజేశారు; మరియు ఇందులో ఉన్నటువంటి వివేకాత్మకమైన విషయాన్ని కూడా తెలియపరిచారు, సంభోగం వలన మనిషి మనసుకు ప్రశాంతత లభిస్తుంది దాని వలన ఒక నమాజికి నమాజులో ఉపశమనం లభిస్తుంది.
మరొక వివరణ ఏమిటంటే తలను శుభ్రంగా కడగడం, తలంటి స్నానం చేయడం ఎందుకంటే మామూలుగా మనం తలకు నూనె రాస్తాము అందువలన గుసుల్ స్నానం చేసే ముందు తలను శుభ్రంగా కడగమని ఆజ్ఞాపించబడింది.
జుమా నమాజ్ కొరకు త్వరగా మస్జిద్ చేరుకోవడానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే శుక్రవారం రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందటానికి చేస్తున్నంత చక్కగా ‘గుస్ల్’ (స్నానం) చేసి జుమా నమాజ్ చేయటానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. అతని తర్వాత రెండవ వేళలో (ఆ విధంగా స్నానం చేసి) వెళ్ళే వ్యక్తి ఒక ఆవును బలి ఇచ్చినట్లుగా భావింపబడతాడు. ఆ తర్వాత మూడో వేళలో వెళ్ళే వాడికి కొమ్ములు తిరిగిన పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఇక నాల్గవ వేళలో వెళ్ళేవాడు ఒక కోడిని బలిచ్చినట్లుగా, ఐదవ వేళలో వెళ్ళేవాడు ఒక గ్రుడ్డును దానం చేసినట్లుగా పరిగణించ బడతాడు. ఆ తర్వాత ఇమామ్ (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయటం ఆపి) ఖుత్బా వినటానికి మస్జిద్లోకి వచ్చేస్తారు”.(బుఖారీ-ముస్లిం)
6. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో మరొకటి ఏమిటంటే; నమాజ్ కొరకు మస్జిద్ వైపు రావాలి మరియు ఇమామ్ మింబర్ పై ఎక్కక మునుపే నఫిల్ నమాజులు ఆచరించాలి. అది సూర్యుడు నడి నెత్తిపై నుండి వాలే సమయంలోనైనా సరే అనివార్యం (మక్రూహ్) కాదు దీని ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది, ఇప్పుడే మనం దాన్ని చదివి ఉన్నాము “అతని అదృష్టంలో ఎంత నమాజ్ అయితే ఉందో దాన్ని ఆచరించాలి” ఇది ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారి మాట మరియు ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్)గారు కూడా ఇలానే అన్నారు.
8. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటేమిటంటే ఖుత్బా సమయంలో మౌనంగా ఉండాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.” (బుఖారి- ముస్లిం)
9. జుమా నమాజు యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రెండు రకాతులలో సూర జుమా మరియు సూర మునాఫిఖూన్ లేక సూర ఆలా మరియు సూర గాషియా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ సూరాలను జుమా నమాజులో చదివేవారు. ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) గారు జుమా రోజున ఈ రెండు సూరాలు పఠించడం వెనుక ఉన్న వివేకాన్ని తెలియపరుస్తూ ఇలా అన్నారు; ఈ సూర జుమా నమాజ్ కొరకు త్వరపడడానికి మరియు దాని కొరకు వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి మరియు అతి ఎక్కువగా అల్లాహ్ ను స్మరించడం యొక్క ఆదేశాన్ని కలిగి ఉంది, దీని వలన ప్రజలకు ఇహపరాల సాఫల్యం లభిస్తుంది మరియు అల్లాహ్ స్మరణను మరవడం ద్వారా ఇహపరాల జీవితం వినాశనానికి లోనవుతుంది, రెండవ రకాతులో మునాఫిఖూన్ పటించబడుతుంది దీనికి గల కారణం ఏమిటంటే ఉమ్మతును దీని వలన కలిగే వినాశనం నుంచి హెచ్చరించడానికి మరియు ప్రజల యొక్క సిరిసంపదలు వారిని జుమా ఆరాధన నుంచి ఏమరపాటుకు లోను కాకుండా చేయడానికి ఒకవేళ ప్రజలు అలా చేస్తే వారు తప్పకుండా నష్టానికి లోనవుతారు. మరియు అదే విధంగా ఈ సురా పఠించడానికి గల కారణం ప్రజలను దానధర్మాలు చేయడం కొరకు ప్రేరేపించడం, మరియు అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ మరణం గురించి అవగాహన కలుగచేయడం, ఆ మరణ సమయంలో ప్రజలు కొంత సమయం కావాలని కోరుకుంటారు కానీ వారి ఆ కోరిక అస్సలు నెరవేరదు.
10. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒకటి ఏమిటంటే ఎవరైతే దీనిని విడిచిపెడతారో వారి కొరకు హెచ్చరిక ఉంది. అబూ జాద్ జమ్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా మామూలుగా భావించి మూడు జుమా నమాజులను విడిచిపెడతాడో అల్లాహ్ అతని హృదయంపై (మొహర్) సీలు వేస్తాడు.” (అహ్మద్)
11. జుమా నమాజ్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైతే ప్రజల మెడలపై నుండి గెంతుతారో మరియు అనవసరమైన కార్యాలకు పాల్పడతారో వారు ఘోరంగా నష్టానికి లోనవుతారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఎవరైతే వ్యర్ధమైన పనికి పాల్పడ్డారో లేక ప్రజల మెడలపై నుంచి గెంతారో అలాంటి వారికి జుమా పుణ్యఫలం లభించదు వారికి జుహర్ నమాజ్ పుణ్యం మాత్రమే లభిస్తుంది”.(అబూ దావుద్)
కావున ఎవరైతే జుమా నమాజుకి వస్తారో వారు దాని గొప్పదనాన్ని తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క గొప్ప సూచనల లోనిది, ఇమామ్ ప్రసంగించేటప్పుడు మనిషి తన అవయవాల పట్ల జాగ్రత్త వహించాలి, అనవసరంగా కుదపరాదు అనగా రాళ్లతో పుల్లలతో ఆడుకోవడం లేక నేలపై గీతలు గీయడం లేక మిస్వాక్ చేయడం ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. ఇది జుమా యొక్క మర్యాదలలో ఒకటి మరియు అదే విధంగా మౌనం వహించడం కూడా జుమాయొక్క మర్యాదలలోనిదే. ఇలా చేయకుంటే జుమాయొక్క పుణ్య ఫలం లో కొరత ఏర్పడుతుంది లేక పూర్తి పుణ్యఫలాన్ని కోల్పోయిన వారమవుతాం మరియు జుమా జుహర్ గా మారుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “మీరు ప్రసంగ సమయంలో మీ తోటి వ్యక్తితో నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడం కూడా వ్యర్థ మైన పనికి పాల్పడినట్లే”.
12. జుమా నమాజ్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే జుమా నమాజు తర్వాత నాలుగు రకాతులు నమాజ్ చదవడం (ముస్తహబ్) అనగా అభిలషణీయం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే జుమా నమాజు చదువుతాడో అతను దాని తర్వాత నాలుగు రకాతుల నఫిల్ నమాజ్ చదవాలి.”(ముస్లిం)
13. జుమా నమాజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియచేశారు; జుమా నమాజుకు ఇతర నమాజుల కంటే గొప్ప ప్రత్యేకత ఉంది, అదేమిటంటే ఇందులో ప్రజలు ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో సమావేశం అవుతారు, ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది, ఆ సమయంలో ఖురాన్ పారాయణం బిగ్గరగా చేయరాదు, ఇలాంటి ఎన్నో షరతులు ఇందులో ఉన్నాయి. (జాదుల్ మఆద్)
ఓ అల్లాహ్ దాసులారా! ఇవి జుమా నమాజుకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే ఇతర నమాజుల కంటే ఈ జుమా నమాజ్ కు ప్రాముఖ్యత లభించింది, మరియు అల్లాహ్ దగ్గర ఇది గొప్ప ప్రాధాన్యత కలది, కనుక మనం తప్పకుండా వీటిపై ఆచరించాలి, మరియు ఈ ఆచరణకై అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుతూ ఉండాలి, మరియు అల్లాహ్ తో ఈ ఆచరణల పుణ్యఫలాన్ని ఆశించాలి.
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు. అల్లాహ్ ఇలా అన్నాడు:
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు.ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారి పద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి. బిద్అత్ కార్యకలాపాలు మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతికార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుంచి దూరంగా ఉండండి మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ తఆల ముస్లింలకు జమాత్ తో అనగా (సామూహికంగా) మస్జిద్లో నమాజ్ ఆచరించమని ఆజ్ఞాపించాడు. మరియు అకారణంగా నమాజ్ నుండి దూరంగా ఉండడాన్ని వారించాడు. మరియు మస్జిదులో జమాతుతో నమాజ్ చదవడం గురించి అనేక హదీసులలో ఆజ్ఞాపించబడింది.
1. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:
మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, “అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశిం చిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).(బుఖారీ-ముస్లిం)
2. హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ను కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా – నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. ఎవరైతే ఉన్నతమైన రీతిలో వుజూ చేసి మస్జిద్ వైపు బయలుదేరుతారో వారి ఒక అడుగు బదులుగా ఒక సత్కార్యం వారి పేరున రాయబడుతుంది మరియు వారి ఒక్క స్థానం ఉన్నతం చేయబడుతుంది మరియు ఒక పాపం మన్నించడం జరుగుతుంది. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పదిహేనొవ పాఠం – ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
పదహారవ పాఠం – ఇస్లామీయ పద్దతులను అవలంభించటం.
పదిహేడవ పాఠం – షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం.
పద్దెనిమిదవ పాఠం – మృతుని జనాజా సిద్ధం చేయటం, అతని జనాజా నమాజు చదవటం, అతనిని పూడ్చటం.
ముందుమాట
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవాసనం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).
అమ్మా బాద్:
ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని నేను అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నామకరణం చేశాను.
వాటితో ముస్లిములకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’
‘ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’
‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నేను మినాలో అబ్దుల్లాహ్ వెంట నడుస్తూ ఉండగా ఆయన్ని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కలుసుకున్నారు. వారు ఆయనతో మాట్లాడసాగారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆయనతో అన్నారు : “ఓ అబూ అబ్దుర్రహ్మాన్! మీ వివాహం ఒక యుక్త వయస్కురాలైన అమ్మాయితో ఎందుకు జరిపించకూడదు? తద్వారా మీకు పూర్వకాలం (యౌవనం) ఎందుకు జ్ఞాపకం చేయకూడదు?” అబ్దుల్లాహ్ బదులిచ్చారు – “మీరు కూడా అదే మాటంటున్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు “ఓ యువకుల్లారా! మీలో నికాహ్ చేసుకోగల శక్తి ఉన్నవారు నికాహ్ చేసుకోవాలి. ఎందుకంటే చూపులను వాల్చడానికి, మర్మాంగాలను పరిరక్షించుకోవటానికి అలా చేయటం మంచిది. ఎవరికయితే నికాహ్ చేసుకునే స్థోమత లేదో వారు తప్పకుండా ఉపవాసం ఉంటుండాలి. అది అతని కొరకు డాలు వంటిది అని ప్రబోధించారు” అని అన్నారు. (ముస్లిం)
అల్ ఖమ గారు, మహాప్రవక్త ప్రియ సహచరుల శిష్యగణంలోని వారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క ముఖ్య శిష్యులు. ఈయన హిజ్రీ శకం 60 తరువాత మరణించారు.
‘మినా’ మక్కా సమీపంలోని ఒక ప్రదేశం. అక్కడ హజ్ యాత్రీకులు జిల్ హిజ్జా 8 నుండి 12వ తేదీ వరకు విడిదిచేస్తారు. ఉస్మాన్ మరియు అబ్దుల్లాహ్ మధ్య ఆ సంభాషణ బహుశా హజ్ దినాలలోనే జరిగి ఉంటుంది.
అబ్దుల్లాహ్ అంటే ఇక్కడ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నమాట. హదీసువేత్తల పరిభాష ప్రకారం – హదీసులో ఎప్పుడు అబ్దుల్లాహ్ ప్రస్తావన వచ్చినా అది అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కే వర్తించటం పరిపాటి.
తొలి తొలి రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన వారిలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఒకరు. మహాప్రవక్త ముహమ్మద్ ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్నవారిలో ఆయన ఆరవవారు. యుద్ధాలన్నింటిలో ఆయన ఇస్లాం తరపున పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించిన తరువాత ఆయన ఇస్లామీయ రాజ్యంలో పలు ముఖ్యమయిన బాధ్యతలను నిర్వర్తిస్తుండేవారు. హిజ్రీ శకం 32వ ఏట హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 60 ఏండ్లకు పైబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆదర్శ సమాజ సంస్థాపనలో హరామ్ మరియు హలాల్ యొక్క ప్రభావం https://youtu.be/B57_ENYyOeo [27 నిముషాలు] షేఖ్ షరీఫ్ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, వక్త ఒక ఆదర్శ సమాజం యొక్క పునాదుల గురించి వివరిస్తారు. హలాల్ (ధర్మసమ్మతం) మరియు హరాం (నిషిద్ధం) అనేవి కేవలం ఆహారానికి సంబంధించినవి కావని, జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఆదర్శ సమాజ స్థాపనకు మొదటి మెట్టు షిర్క్ (బహుదైవారాధన)ను విడనాడి తౌహీద్ (ఏకదైవారాధన)ను స్వీకరించడం అని ఉద్ఘాటించారు. తర్వాత, తల్లిదండ్రుల పట్ల విధేయత, అశ్లీలతకు దూరంగా ఉండటం మరియు హలాల్ జీవనోపాధి యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించారు. హరాం సంపాదన మరియు వినియోగం వల్ల కలిగే పర్యవసానాలు, ప్రార్థనలు స్వీకరించబడకపోవడం మరియు హృదయం కఠినంగా మారడం వంటివి ఉంటాయని హెచ్చరించారు. చివరగా, సమాజ సంస్కరణకు ప్రతి ఒక్కరూ హలాల్ మరియు హరాం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి, వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَبِهِ نَسْتَعِينُ وَالصَّلاةُ وَالسَّلامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ، أَمَّا بَعْدُ (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వబిహీ నస్త’ఈన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్, అమ్మా బాద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. మేము ఆయన సహాయాన్నే అర్థిస్తాము. మరియు ఆయన యొక్క నమ్మకమైన ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ మానవజాతి (హితం) కోసం వెలికితీయబడిన శ్రేష్ఠమైన సమాజం మీరే. మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. అల్లాహ్ను విశ్వసిస్తారు. (3:110)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي رَبِّ زِدْنِي عِلْمًا ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు, నా మాటను వారు అర్థం చేసుకోగలిగేటట్లు. ఓ ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి చేయి.
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు. అనంత కరుణామయుడు, అపార కృపాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరీమణులారా, విశాఖపట్నం జిల్లా జమియత్ అహ్లె హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన ఆదర్శ సమాజం అనే ఈ ఆధ్యాత్మిక, ధార్మిక సమావేశానికి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా.
హలాల్ మరియు హరాం యొక్క ప్రాముఖ్యత
సోదరులారా, ఈ సమావేశములో నాకు ఇవ్వబడిన అంశము సమాజముపై హరాం మరియు హలాల్ యొక్క ప్రభావం. సోదరులారా, ఏదైనా సమాజం ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దబడాలంటే, ఆ సమాజం అనుసరిస్తున్న పంథాపై సమాజం యొక్క అభివృద్ధి, దాని యొక్క పురోగతి ఆధారపడి ఉంటాయి.
మరి ఇస్లాం ధర్మశాస్త్రం ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది? ఈరోజు మనం ఒక ఆదర్శ సమాజంగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి? రోజుకు ఐదు పూటల మస్జిదులో నమాజ్ స్థాపించాం, మనం ఆదర్శ సమాజంగా మారిపోతామా? ఆదర్శ సమాజంగా ఒక సంఘం మారాలి అంటే ఆ సంఘం అల్లాహ్ త’ఆలా నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితాన్ని గడపాలి. ఎప్పటివరకైతే అల్లాహ్ త’ఆలా దేనిని అయితే హరాం అన్నాడో దానికి దూరంగా ఉండనంత వరకు, దేనినైతే అల్లాహ్ హలాల్ చేశాడో దానిపై ఆచరించనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజంగా మారదు ప్రియులారా.
హరాం, హలాల్ అన్న పదాలు మనం వింటూ ఉంటాం సాధారణంగా. ప్రతి దైనందిన జీవితంలో. వాస్తవానికి హరాం అంటే అర్థం ఏంటి? హలాల్ అంటే అర్థం ఏంటి? హరాం అనగా ప్రియులారా, ఆ కార్యం దేనినైతే మనిషి చేస్తాడో అతడు పాపి అవుతాడు. అతగాడికి పాపం ప్రసాదించబడుతుంది. హలాల్ దేన్ని అంటారు? హలాల్ ఆ పని దేనిని చేయటం వల్లనైతే మనిషి పుణ్యాన్ని పొందుతాడో. చిన్న మాట, హరాం చేసినవాడు పాపాన్ని అనుభవిస్తాడు. హలాల్ చేసినవాడు పుణ్యాన్ని పొందుతాడు.
ఆదర్శ సమాజ స్థాపనలో మొదటి మెట్టు: తౌహీద్
ఖురాన్ గ్రంథములో అల్లాహ్ త’ఆలా హరాం హలాల్కు సంబంధించిన మాటలు చాలా చెప్పారు. నేను ఈరోజు ముందు మీ ముందు సూరె అన్’ఆమ్, ఆరవ అధ్యాయము, వాక్యము సంఖ్య 151, 152, 153 వెలుగులో కొన్ని మాటలు చెబుతాను. ఈ వాక్యాలలో అల్లాహ్ ఏమంటున్నారు?
قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పండి: రండి! మీ ప్రభువు మీకు ఏ విషయాలను హరాం చేశాడో నేను బోధిస్తాను.
అల్లాహ్ త’ఆలా దేన్ని హరాం చేశారు?
أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا మీరు అల్లాహ్తో పాటు షిర్క్ చేయకండి.
ఏదైనా సమాజం ఉన్నత సమాజంగా, ఆదర్శ సమాజంగా మారాలి అంటే ఆ జాతిలో షిర్క్ ఉండకూడదు. ఈరోజు మనం షిర్క్ చేసినట్లయితే మనం ఎన్నటికీ ఆదర్శ సమాజంగా మారలేము. కాబట్టి మొదటి మాట, మనం తౌహీద్ పైకి రావాలి. ఈరోజు తౌహీద్ వైపునకు మనం రాకపోతే ప్రపంచంలో మనం ఆరాధన చేస్తున్నాం కానీ తౌహీద్ యొక్క మూల స్తంభాలు మనం తెలుసుకోలేదు.
గురువుగారు ఒక పుస్తకం పేరు చెప్పారండి. ఈరోజు మనం అహ్లుల్ హదీస్, ఖురాన్ హదీస్ పై ఆచరించే వారం. గురువుగారు చెప్పిన పుస్తకం గనక మనము చదివి ఉండకపోతే మనలో చిన్న లోపం ఉన్నట్టు ప్రియులారా. గురువుగారు చెప్పిన పుస్తకం పేరు ఏంటి? ఉసూలు స్సలాసా (మూడు మూల సూత్రాలు). ధర్మం యొక్క మూడు ప్రాథమిక మూల సూత్రాలు. మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో ప్రశ్నింపబడే మూడు ప్రశ్నలు. నీ దైవం ఎవరు? నీ ధర్మం ఏమిటి? నీ ప్రవక్త ఎవరు? ఒక చిన్న పుస్తకం, తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియులారా. ఈరోజు రోజుకు ఐదు పూటల నమాజ్ ఆచరిస్తున్నాం, కానీ మన సమాజానికి ప్రశ్నించండి. సోదరులారా, చెవియొగ్గి వినండి. ప్రశ్నించండి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే ఈరోజు మనలో చాలామందికి సరిఅయిన జవాబు తెలియదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితె కొంతమంది హర్ జగహ్ అల్లాహ్ హై భాయ్ అని అంటారు . అరే! మరి అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెబుతున్నాడో చూడండి :
الرَّحْمَنُ عَلَى الْعَرْشِ اسْتَوَى అనంత కరుణామయుడు అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు. (20:5)
ఇది తౌహీద్, అఖీదా ప్రియులారా. అల్లాహ్ త’ఆలాకి రూపం ఉందా? అనేక మంది అంటారు అల్లాహ్ నిరాకారుడు అని. లేదు ప్రియులారా, అల్లాహ్ ఆకారం కలిగి ఉన్నాడు. కానీ అల్లాహ్ యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ప్రియులారా.
కాబట్టి ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మూల స్తంభం తౌహీద్ పై నిలబడటం. ఎవరైతే తౌహీద్ పై నిలబడతారో ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది.
ఈరోజు ముస్లిం సమాజమా, నీ యొక్క బాధ్యత, ఈ రోజు ప్రపంచానికి మనం అల్లాహ్ యొక్క ఏకత్వం వైపునకు దావత్ ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలో మనుషులు మతాలు, కులాలు, ముఠాలు, వర్గాలుగా ముక్కలైపోయారు. వీరినందరినీ మనము గనక మనందరి సృష్టికర్త ఒక్కడే అన్న నినాదం వైపునకు తీసుకువస్తే ప్రపంచములో ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. దీని కోసం మనం ఎంతవరకు పని చేస్తున్నాం? ఈ తౌహీద్ యొక్క ప్రభావం ప్రపంచములో ఉంటుంది. తౌహీద్ యొక్క ప్రభావం ఆఖిరత్ లో ఉంటుంది. కేవలం అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని చెప్పేస్తారు కానీ మూఢనమ్మకాలపై విశ్వాసం. ఒక తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం, జ్వరం వస్తే తావీజు కట్టుకోవటం, ఇంకా నిమ్మకాయలపై, గుమ్మడికాయలపై, రాళ్లపై, చెట్లపై నమ్మకం పెట్టుకుంటే మనకి స్వర్గము లేదు.
ఎవరు సాఫల్యం చెందుతాడు?
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ ఎవరైతే అల్లాహ్ను విశ్వసించిన తర్వాత తమ ఈమాన్ను షిర్క్తో కలుషితం చేయరో,
أُولَئِكَ لَهُمُ الأَمْنُ అలాంటి వారి కొరకు శాంతి ఉంది. (6:82)
కాబట్టి, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మనం చేయాల్సిన మొదటి పని అల్లాహ్ యొక్క తౌహీదులోనికి పూర్తిగా ప్రవేశించాలి. అల్లాహ్ యొక్క తౌహీదులోనికి మనం వచ్చేస్తే ప్రపంచంలో శాంతి ఉంది. ఆఖిరత్లో ఏముంది?
إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلائِكَةُ أَلاَّ تَخَافُوا وَلا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ఎవరైతే, “అల్లాహ్ యే నా ప్రభువు” అని పలికిన పిదప, దానిపై స్థిరముగా నిలబడిపోయాడో, అలాంటి వారి వైపునకు వారు మరణించే సమయంలో దైవదూతలు వస్తారు, వారితో చెబుతారు: మీరు భయపడకండి, మీరు దుఃఖించకండి. అల్లాహ్ మీ కొరకు స్వర్గం యొక్క వాగ్దానము చేశాడు. (41:30)
ప్రియులారా, మొదటి మాట. ఇంకొకసారి విన్నవిస్తున్నాను. ప్రసంగాలు అవుతూ ఉంటాయి, వచ్చి కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మనం జ్ఞానాన్ని ఆర్జించకపోతే మన జీవితాలలో తౌహీద్, అఖీదా రాదు. నేను విన్నవిస్తున్నాను, ఉసూలే స్సలాసా పుస్తకాన్ని చదవండి. నేను అభ్యర్థిస్తున్నాను, మనం ఇన్షా అల్లాహ్ త’ఆలా ఒక పుస్తకాన్ని చదివి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో తీసుకువద్దాం. అప్పుడే మన సమాజం ఆదర్శ సమాజంగా మారగలదు.
తల్లిదండ్రుల పట్ల విధేయత
ఇక రెండవ మాట ప్రియులారా, అల్లాహ్ అంటూ ఉన్నారు, ఆదర్శ సమాజం ఏర్పాటు కావటానికి మీరు చేయాల్సిన పని ప్రియులారా,
وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا మీరు మీ తల్లిదండ్రులతో చక్కగా వ్యవహరించండి, వారిని గౌరవించండి.
ఈ సమాజం ఎంత గొప్ప సమాజంగా మారిపోయినా, తల్లిదండ్రి యొక్క విధేయత లేనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజం కాలేదు. షిర్క్ ఎంత హరామో, తల్లిదండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం. అల్లాహ్ ఖురాన్లో ఎక్కడ తౌహీద్ యొక్క ప్రస్తావన చేసినా వెంటనే తల్లిదండ్రి విధేయత గురించి అల్లాహ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా హదీసుల్లేఖిస్తున్నారు. ప్రవక్త అంటున్నారు: “రిధా రబ్బీ ఫీ రిధల్ వాలిదైన్.” అల్లాహ్ యొక్క సంతృప్తి, అల్లాహ్ యొక్క ఆనందం, అల్లాహ్ యొక్క సంతుష్టీకరణ మీ తల్లిదండ్రిని గనక మీరు సంతోష పెడితే అందులో అల్లాహ్ యొక్క సంతోషం ఉంది. మీ తల్లిదండ్రిని గనక మీరు ఇష్టపెట్టకపోతే మీతో అల్లాహ్ ఇష్టపెట్టడు. కాబట్టి ఈరోజు ఆదర్శ సమాజం అన్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను మీకు ఇస్తున్న రెండో సందేశం, తల్లిదండ్రి విధేయత.
అదే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యమన్ దేశము నుండి కాబాకు వచ్చి తన తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ అయిన తర్వాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా వద్దకు వచ్చి అడిగాడు: “అయ్యా, ఈమె నా తల్లి. ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా యాత్ర చేశాను. నేను ఈమె యొక్క హక్కును, ఈమె రుణాన్ని నేను చెల్లించానా? ఈమె హక్కును నేను చెల్లించానా?” అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా అంటున్నారు: “నీ మాతృమూర్తి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో, పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా” అన్నారు. అల్లాహు అక్బర్! ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో తల్లిదండ్రి విధేయత మహోన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.
అశ్లీలతకు దూరంగా ఉండటం
ఇక నా అంశములో మూడవ మాట ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో ఏ హరాం విషయముల నుండి మనం దూరంగా ఉండాలి? అల్లాహ్ అంటున్నారు:
وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ మీరు అశ్లీలం దరిదాపులకు వెళ్ళకండి, బహిరంగంగా చేసే అశ్లీలం మరియు గుట్టు చప్పుడు కాకుండా చేసే అశ్లీలం.
అల్లాహ్ అంటున్నారు, మీరు అశ్లీలం దరిదాపులకు వెళితే సమాజం ఉత్తమ సమాజంగా మారదు. ఎలాంటి అశ్లీలం? అల్లాహ్ అంటున్నారు, బాహాటంగా చేసే అశ్లీలం, గుట్టు చప్పుడు కాకుండా, నన్ను ఎవరూ చూడటము లేదే అని మనము చేసే అశ్లీలం. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో చెడు పని చేయకండి అని చెప్పలేదు, చెడు పని దరిదాపులకు కూడా వెళ్ళకండి అన్నారు.
అశ్లీలం అంటే ఏంటి? ఈరోజు అశ్లీలం రకరకాలుగా ఉంది. సంగీతం అశ్లీలం, పాటలు అశ్లీలం, చలన చిత్రాలు అశ్లీలం, వస్త్రధారణలో అశ్లీలం, ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేయటం, ప్రేమకు ముందు అశ్లీలం.
వలీ లేకుండా నికాహ్ చేసుకొని సమాజములో అశ్లీలం. ఈరోజు ఆదర్శ సమాజం ఏర్పాటు చేయాలంటే మన నికాహ్ వ్యవహారాలు ఈరోజు ఎలా ఉన్నాయి ప్రియులారా? నాకు బాధనిపిస్తుంది. నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతాను. ఏ విధంగా ఉంది అంటే, వారు ఎవరో అంటున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో నికాహ్ చేసుకుంటున్నారు, ఫలానా జిహాద్ ఏదో అంటున్నారు. అది కాదు, దానికి విరుద్ధంగా జరుగుతుంది. మన ఆడపిల్లలు ప్రియులారా, ఈరోజు సమాజంలో అల్లాహ్ రక్షించాలి. ప్రియమైన సోదరీమణులారా, మీరు గనక వింటే అశ్లీలం హరాం. అశ్లీలం నిషిద్ధం ప్రియులారా. అశ్లీలానికి దూరంగా ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము.
పదండి చూద్దాం. అశ్లీలం అంటే ఏంటి? పాటలు. సినిమా పాటలు మనం వింటున్నాం. ఏవండీ, మ్యూజిక్ ఏంటండీ? మ్యూజిక్ హరాం అండీ అని చెబితే ఈరోజు అంటారు, “అరే! మనసు బాగాలేదండీ. అశ్లీలంతో కూడిన సంగీతం, సాధారణ సంగీతం వింటే మనసుకు వినసొంపుగా ఉంటుంది” అని అంటారు. ఇబ్నె తైమియా రహిమహుల్లాహ్ త’ఆలా అంటున్నారు, “అది మద్యము. మనిషి హృదయానికి సంగీతం మద్యపానము లాంటిది. సంగీతం ఎలాగైతే మనిషిని, మద్యపానం ఎలాగైతే నాశనం చేస్తుందో, సంగీతం మనిషిని నాశనం చేస్తుంది.”
ఈరోజు ప్రేమ పేరుతో వివాహాలు. మీ తల్లిదండ్రి నిన్ను కని, జన్మనిచ్చి, పెంచి పోషిస్తే, తల్లిదండ్రి యొక్క గౌరవాన్ని బజారులో కలపటం ఆదర్శ సమాజం కాదు. మొబైల్ లో హరాం చూస్తే, దీని పర్యవసానం ఏంటి?
సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: ప్రవక్త వారు ఇలా అంటున్నారు: “నా సమాజములో కొంతమంది ప్రళయ దినాన తిహామా పర్వతమంత పరిమాణములో పుణ్యాన్ని తీసుకు వస్తారు.” కానీ అల్లాహ్ ఏం చేస్తాడు? “హబా అమ్ మన్సూరా.” వారి యొక్క పుణ్య కార్యాలను అల్లాహ్ ధూళి చేసేస్తాడు, దుమ్ము చేసేస్తాడు. వారి పుణ్య కార్యాలు పనికి రావు. తిహామా పర్వతమంత పరిమాణంలో పుణ్య కార్యాలు. ప్రవక్తా! ఏమై ఉంటుంది వారి జీవితం? వారు మాలాగా విశ్వసిస్తారే, నమాజును స్థాపించే వారే కదా? ప్రవక్త అంటున్నారు, వారు ఏకాంతములో హరాం పనులు చేసేవారై ఉంటారు. నీ జీవితం లో నమాజ్ మరియు మిగతా మంచి పనులు చేస్తావు. కానీ ఏకాంతములో నీవు చేసిన హరాం పని ప్రళయ దినాన నీ ఆచరణ మొత్తాన్ని తుక్కు చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి.
ఇక ఆఖరి చివరి మాట. ఈరోజు ఇస్లాం ధర్మంలో స్త్రీకి అల్లాహ్ త’ఆలా హిజాబ్ను ఇచ్చాడు. ఈరోజు మన సోదరీమణులు హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఇది అశ్లీలం కాదా ప్రియులారా? హిజాబ్ లేకుండా తిరగటం అశ్లీలము కాదా? ఈరోజు ఇంట్లో బయలుదేరి హిజాబ్ ఒంటిపై ఉంటుంది, ఇంటి నుండి వెళ్ళిన తర్వాత హిజాబ్ బ్యాగులో ఉంటుంది. ఇది ఎక్కడి ఈమాన్ ప్రియులారా? తల్లిదండ్రులారా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లల యొక్క ట్రైనింగ్ మనం ఉత్తమ పద్ధతిలో చేయాలి. నా కూతురు అండి, నాకు ప్రేమ. కూతురికి ఏం చెప్పలేకపోతున్నాను. కూతుర్ని ఏం చేయలేకపోతున్నాను. ప్రవక్త వారు ఫాతిమా రదియల్లాహు త’ఆలా అన్హా గురించి ఏమన్నారు? ఫాతిమా నా శరీరంలో ముక్క(ఒక భాగం) . అంటే ఫాతిమాను అంత ప్రవక్త వారు ప్రేమించేవారు. ఒకసారి జుహైనా తెగకు చెందిన స్త్రీ దొంగతనం చేసింది. ఆ దొంగతనానికి సంబంధించి ప్రవక్త వారు చెయ్యి కత్తిరించమని ఆజ్ఞ ఇచ్చారు. రికమెండేషన్ వచ్చింది. ప్రవక్త ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లాహ్ సాక్షిగా! నా శరీరంలో ముక్క అయిన ఫాతిమా దొంగతనము చేసినా, ఈ ముహమ్మద్ తన కూతురు ఫాతిమా యొక్క చేతులు కత్తిరిస్తాడు. సుబ్ హా నల్లాహ్! కూతుర్ని ప్రవక్త ప్రేమించారు, కానీ ఏమంటున్నారు? హరాం పని చేస్తే కూతుర్ని కూడా ప్రవక్త శిక్షించటానికి వెనుకాడలేదు.
ఈరోజు మన ఇండ్లు ఎలా ఉన్నాయి? సోదరీమణులారా, మీరు వినండి. హిజాబ్ అల్లాహ్ త’ఆలా ఆకాశాల పై నుండి స్త్రీలకు ఇచ్చిన వరం ప్రియులారా. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది: “ప్రవక్తా!” “చెప్పమ్మా.” “ప్రవక్తా!” “చెప్పు.” “నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్తా. మూర్ఛ వ్యాధి వస్తే, మూర్ఛ వ్యాధికి శరీరం కొట్టుకొని కింద పడిపోతాను ప్రవక్తా. కింద పడిపోయిన సమయంలో నా శరీరంపై బట్టలు అటూ ఇటూ చిందరవందర అయిపోతాయి. తమరు అల్లాహ్ తో దుఆ చేయండి, నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని.” ప్రవక్త అన్నారు: “అమ్మా! ఆ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు. అల్లాహ్ నీకు స్వర్గాన్ని ఇస్తాడు. లేదంటావా, నువ్వు ప్రార్థించమంటావా, నేను ప్రార్థిస్తాను తల్లి. కానీ స్వర్గం యొక్క వాగ్దానం చేయను.” ఆ స్త్రీ అంటుంది: “లేదు ప్రవక్తా, ఆ వ్యాధిపైనే జీవితం గడిపేస్తాను. కానీ ఒక్క దుఆ చేసి పెట్టండి ప్రవక్తా. ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చి, మూర్ఛ వచ్చి నేను కింద పడిపోతానో, నా దేహంపై బట్టలు చిందరవందర అయిపోతాయి కదా ప్రవక్తా. అల్లాహ్ తో దుఆ చేయండి, ఆ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే, నా శరీరంపై బట్టలు చిందరవందర కాకూడదు, పరపురుషుడు నా దేహాన్ని చూడకూడదు.” అల్లాహు అక్బర్! ఈరోజు మన సోదరీమణులు ఎక్కడ ఉన్నారు?
హలాల్ జీవనోపాధి మరియు దాని ప్రభావం
ప్రియులారా, ఇక మనం మాట్లాడుకుంటే సోదరులారా, ఈరోజు మనం ఆదర్శ సమాజం స్థాపించటానికి చేయాల్సిన పని, మనం తినేది హలాల్ అవ్వాలి. అల్లాహ్ ఏమన్నారు ఇదే వాక్యాలలో? “వ అవుఫుల్ కైల.” మీరు ఎప్పుడైతే కొలతలు తూస్తారో చక్కగా తూకం చేయండి. “వల్ మీజాన బిల్ ఖిస్త్.” మీరు ఎప్పుడైతే త్రాసు చూస్తారో త్రాసును చక్కగా చూడండి. మనం నమాజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హరాం తింటున్నాం. ఈ హరాం గొప్ప డేంజర్ అండి. మనం దేన్ని తింటున్నాం పొట్టలో?
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ఓ ప్రవక్తలారా! తయ్యిబ్ (పవిత్రమైన) హలాల్ తినండి మరియు సత్కార్యాలు చేయండి. (23:51)
ఈ వాక్యం ద్వారా ఉలమాలు రాస్తున్న మాట ఏంటి? ఎవడైతే హలాల్ తింటాడో వాడే సత్కార్యము చేయగలడు. హరాం తిన్నవాడు సత్కార్యము చేయలేడు. ప్రపంచంలో, హరాం యొక్క పర్యవసానాలు ఏంటి? వడ్డీ కానివ్వండి, తూకములో లోపము చేయటం కానివ్వండి, అబద్ధపు సాక్ష్యం చెప్పి వస్తువు అమ్మటం కానివ్వండి, అబద్ధపు ప్రమాణాలు చేయనివ్వండి. డబ్బు అయితే వచ్చేస్తుంది. దీని పర్యవసానాలు? “ఇన్నల్లాహ తయ్యిబ్, లా యఖ్బలు ఇల్లత్ తయ్యిబా.” అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధము కాకుండా ఏమీ స్వీకరించడు. మనం తినేది హరాం, సంపాదన హరాం. అబద్ధము చెప్పి, దొంగతనము చేసి, మోసము చేసి, కల్తీ చేసి అమ్మేస్తున్నాను. అల్లాహ్ ఆరాధన స్వీకరించడు.
మొదటి హదీస్, ఒక వ్యక్తి మక్కా వెళ్ళాడు, కాబాకు వెళ్ళాడు. చేతులు పైకెత్తాడు: “అల్లాహ్! నా ప్రార్థన ఆలకించు.” అల్లాహ్ అన్నాడు, “వీడి బట్ట హరాం, వీడి తిండి హరాం, వీడు హరాం”. వీడి యొక్క దుఆ అల్లాహ్ త’ఆలా ఎలా స్వీకరిస్తాడు? సుబ్ హా నల్లాహ్! ఆలోచించండి, హరాం తింటే వాటి ఏం జరుగుతుంది?
సుఫ్యాన్ అసౌరీ రహిమహుల్లాహ్ యొక్క శిష్యుడు, అతని పేరు యూసుఫ్ అస్బాత్. ఆయన అన్నారు, షైతాన్ ఏం చేస్తాడట? షైతాన్ ఉదయాన్నే తన సైన్యాన్ని పంపుతాడు: “అరే ఎవరు ఆరాధన చేస్తున్నారో చూసుకొని రా.” ఎప్పుడైతే వెళ్లి ఒక వ్యక్తి హరాం తింటున్నాడు తెలుస్తుందో వెంటనే అంటాడు షైతాన్: “వాడి వద్దకు నువ్వు వెళ్ళొద్దు. వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది.”
అదే హలాల్ తింటే మన ఇండ్లు సంస్కరించబడతాయి, మన యొక్క సమాజం సంస్కరించబడుతుంది. సలఫ్ ఎలా ఉండేవారు తినటంలో? అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ ఒక గొప్ప విద్యావంతుడు. అబ్దుల్లా బిన్ ముబారక్ వాళ్ళ తండ్రి ముబారక్ ఒక దానిమ్మ తోటలో పని చేసేవారు. చాలా రోజులకు దానిమ్మ తోట యజమాని వచ్చి అన్నాడు: “ముబారక్! ఒక దానిమ్మ చెట్టు నుండి ఒక దానిమ్మ పండు తీసుకురా.” ముబారక్ వెళ్లారు. దానిమ్మ చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకువచ్చారు యజమానికి ఇచ్చారు. యజమాని తిన్నాడు, పుల్లగా ఉంది. “ముబారక్! ఇంకో దానిమ్మ పండు తీసుకురా.” హజరతే ముబారక్ రహిమహుల్లాహ్ వెళ్లారు. ఇంకో దానిమ్మ పండు తీసుకువచ్చారు, అదీ పుల్లగా ఉంది. అడిగారు యజమాని: “ఏమయ్యా! ఇన్నేళ్ల బట్టి నా తోటలో పని చేస్తున్నావు. ఏ చెట్టు దానిమ్మ పండు పుల్లగా ఉంటుందో, ఏ చెట్టు దానిమ్మ పండు తియ్యగా ఉంటుందో నీకు తెలియదా?” ముబారక్ అన్నారు: “అయ్యా, నేను మీ తోటలో కాపలా వాడిని. ఏ పండు ఎలా ఉందో చెక్ చేసే వాడిని కాదు. ఈ రోజు వరకు ఏ పండు ఎలా ఉంటుందో నేను తినలేదయ్యా.” యజమాని సంతోషపడ్డాడు. తన కూతురిని ముబారక్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరికీ కలిగిన సంతానం అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్.
బుఖారీ రహిమహుల్లాహ్ నాన్న ఇస్మాయిల్ అంటారు,: “నా ఇంట్లో ఒక్క దిర్హము కూడా హరాం ప్రవేశించలేదు.” హరాం కాదు, అనుమానాస్పదము కూడా. పర్యవసానం? బుఖారీ రహిమహుల్లాహ్ వచ్చారు. కాబట్టి ఆదర్శ సమాజ సంస్థాపనకు మనం తింటున్న ఆహారం, మనం చేస్తున్న వ్యాపారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదంటారా, ప్రపంచంలో మన హృదయం కఠినమైపోతుంది.
హసన్ బస్రీ రహిమహుల్లాహ్ అంటారు: “ఈ ప్రపంచములో అల్లాహ్ మనిషికి ఇచ్చే అతి పెద్ద శిక్ష, హరాం తినటం వల్ల వాడి హృదయం బండరాయి మాదిరిగా అయిపోతుంది.” ప్రేమ, కారుణ్యం వాడి హృదయంలో ఉండవు. కాబట్టి, మనం ఈరోజు ఈ యొక్క ఆదర్శ సమాజాన్ని స్థాపించాలంటే ఈ మార్గంపై నడవాలి ప్రియులారా. ప్రవక్త ఈ వాక్యాలు చెప్పి అదే అన్నారు:
وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ وَلاَ تَتَّبِعُواْ السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ذَلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ఇది నా మార్గం. దీనిపై అనుసరించండి. మీరు నా మార్గంపై ఉంటారు. నా మార్గాన్ని విడిచిపెట్టేస్తే మీరు వేరే మార్గాలపై వెళ్ళిపోతారు.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రవక్త వారు, అల్లాహ్ బోధించిన ఈ మార్గంపై నడిచే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)
అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”
బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.
దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.
1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.
2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.
3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).
విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.
4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.
5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”
అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.
కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.
6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.
అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.
అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.
ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.
ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.