ప్రవక్త(ﷺ) చూపిన రుజుమార్గంలో ప్రళయం వరకూ సత్యంపై ఉండే జమాత్? [ఆడియో]

ప్రవక్త(ﷺ) చూపిన రుజుమార్గంలో ప్రళయం వరకూ సత్యంపై ఉండే జమాత్?
షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/BokURAxRYRE – 38 నిముషాలు

6:153 وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. (సూరా అల్ – అన్ ఆమ్ 6:153)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ‘రుజుమార్గం’ (సరైన మార్గం) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇస్లాం మాత్రమే అల్లాహ్ చూపిన రుజుమార్గమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అది పరిపూర్తి చేయబడిందని నొక్కి చెబుతారు. ప్రవక్త (స) తరువాత ఇస్లాంలో ఏర్పడిన వివిధ ఆలోచనా విధానాలు, వర్గాలు (హనఫీ, మాలికీ, షాఫఈ, హంబలీ) గురించి చర్చిస్తూ, అసలైన మార్గం ప్రవక్త మరియు ఆయన సహచరులు అనుసరించినదేనని స్పష్టం చేస్తారు. ‘అహలె హదీస్’ అనే పదం యొక్క మూలాన్ని, దాని నిర్వచనాన్ని వివరిస్తూ, ఇది ఖురాన్ మరియు హదీసులను సహచరుల అవగాహన ప్రకారం అనుసరించే విధానమని పేర్కొంటారు. చివరగా, ముస్లింలందరూ విభేదాలను వీడి, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఐక్యంగా ఉండాలని, ఈ ఐక్యత కోసం భారతదేశంలోని ‘జమియతే అహలె హదీస్’ సంస్థతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తారు.

నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ యొక్క కీడు నుండి. షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు, అనంత కరుణామయుడు, అపార కృపా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

ప్రియులారా, నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథం, సూరె అన్ఆమ్, వాక్యము సంఖ్య 153 పఠించాను. ఇందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు ప్రవక్త వారితో. ప్రవక్త వారు అంటూ ఉన్నారు:

وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
(వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమన్ ఫత్తబిఊహు వలా తత్తబిఊ స్సుబుల ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ, దాలికుమ్ వస్సాకుమ్ బిహీ ల అల్లకుమ్ తత్తఖూన్)

నిశ్చయంగా ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అవలంబించకండి. అలా చేస్తే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పించి చెల్లాచెదురు చేస్తాయి.” మీరు భయభక్తులు కలిగి ఉండటానికి అల్లాహ్‌ మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. (6:153)

“వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గం. ఖురాన్ అంటుంది, “వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గము. “ఫత్తబిఊహు” – మీరు ఈ రుజుమార్గాన్ని అనుసరించండి. “వలా తత్తబిఊ స్సుబుల” – ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళ్ళకండి. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళితే మీరు నా మార్గము నుండి తప్పిపోతారు అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ మార్గం, ఏ మార్గం? అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మార్గం. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఆ మార్గాన్ని విడిచిపెడితే మీరు తప్పిపోతారు. “దాలికుమ్ వస్సాకుమ్ బిహీ ల అల్లకుమ్ తత్తఖూన్” – మీరు భక్తిపరులు అవుతారన్న సంగతి వలన, బహుశా మీరు భక్తిపరులు కాగలరని మీకు ఈ విధంగా ఆజ్ఞాపించటం జరుగుతుంది అని ఖురాన్ గ్రంథం చెబుతోంది.

మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఆ రుజుమార్గం ఏమిటి? ఏ రుజుమార్గం వలన అయితే మనిషి ప్రతి నమాజులో అల్లాహ్ త’ఆలాతో ప్రార్థిస్తాడు:

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
(ఇహ్‌దినస్సిరాతల్ ముస్తఖీమ్)
ఓ అల్లాహ్, మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపు. (1:6)

అల్లాహ్, నేను నీ నుండి రుజుమార్గాన్ని ఆశిస్తున్నాను. నాకు రుజుమార్గమును ప్రసాదించు. అల్లాహ్ త’ఆలాతో రోజుకు మనిషి అభ్యర్థిస్తాడు. మరి అల్లాహ్ త’ఆలా చూపిన ఆ రుజుమార్గం ఏమిటి? వాస్తవానికి ఆ రుజుమార్గం ఇస్లాం ధర్మం ప్రియులారా. ఇస్లాం అనే ధర్మం, ఇదే మానవులందరి కోసం వచ్చిన రుజుమార్గం. ఇస్లాం అనే ధర్మం ఏదైతే రుజుమార్గమో, మరి మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాంటి రుజుమార్గాన్ని అనుసరించాలి? ఏ రుజుమార్గం అయితే ప్రవక్త వారిపై పూర్తి చేయబడినదో, ఏ విధంగానైతే పవిత్ర ఖురాన్ గ్రంథం, ఐదవ సూరా, సూరె మాయిదా, వాక్యము సంఖ్య మూడు ప్రాంతంలో అల్లాహ్ త’ఆలా ఏమంటున్నారు మూడులో? అల్లాహ్ ఏమంటున్నారంటే:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
“ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాను.” (5:3)

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా మైదానంలో ఉన్నారు. ప్రవక్త వారు జీవితంలో ఒకే ఒక హజ్ యాత్ర చేశారండి. హిజ్రీ పదవ సంవత్సరం, జుల్ హిజ్జా మాసం, తొమ్మిదవ తారీఖు, ప్రవక్త వారు అరఫాత్ మైదానంలో ఉండగా, అల్లాహ్ త’ఆలా వాక్యాన్ని దింపారు. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” – ఈ రోజు నేను ఇస్లాం అనే ధర్మాన్ని నీపై పరిపూర్తి చేశాను. మరి రుజుమార్గం అనగా ఏ ధర్మం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సీలు వేయబడినదో, అదే రుజుమార్గం.

మరి ఈనాటి ముస్లిం సమాజం ఆ రుజుమార్గాన్ని పొందాలి అంటే, మరి ఆ ప్రవక్త వారిపై ధర్మశాస్త్రం సీలు వేయబడిన తరువాత, ఏదైతే ఇస్లాంలో వివిధ రకాల మనుషులు వచ్చి వివిధ రకాల ఆలోచనా భావాలు కల్పించారో, ఆ ఆలోచనా భావాలను మనము తీసుకుంటే రుజుమార్గంపై ఉన్నట్లా? లేకపోతే ప్రవక్త వారిపై ఏ ధర్మశాస్త్రం అయితే పూర్తి చేయబడిందో ఆ ధర్మశాస్త్రంపై ఆచరించే వారు రుజుమార్గంలో ఉన్నట్లా? ఆ తరువాత, ప్రవక్త గతించారు. ప్రవక్త గతించిన తరువాత, సల్లల్లాహు అలైహి వసల్లం, బాగా వినండి. ఇది హిజ్రీ 1442వ సంవత్సరం. హిజ్రీ 1442వ సంవత్సరం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుండి ఏ హిజ్రీలో గతించారు? హిజ్రీ 11వ సంవత్సరంలో ప్రవక్త పరమపదించారు. ఆ తరువాత ఇస్లాం ధర్మశాస్త్రంలో అనేక రకాలైన ఆలోచనా భావాలు కలిగిన విద్వాంసులు వచ్చారు.

ఉదాహరణకి, నేటి ముస్లిం సమాజం ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల ఆలోచనా భావాలను ముస్లిం సమాజం తమలోకి తీసుకుంది. ఈ నాలుగు రకాల ఆలోచనా భావాలు ఏమిటి? వారు ఏమంటారంటే, ముస్లిం సమాజంలో అనేకమంది తమకు తాము మేము అహలె సున్నత్ వల్ జమాత్, అహలుస్సున్నా వల్ జమాత్, మేమే అహలుస్సున్నా వల్ జమాత్. ఎవరైతే అహలుస్సున్నా వల్ జమాత్, నలుగురు ఇమాముల తరువాత ముస్లిం సమాజం తీసుకొచ్చింది. బాగా వినండి. నాలుగు రకాల స్కూల్స్, నాలుగు రకాల ఆలోచనా భావాలు ఇస్లాంలోకి వచ్చాయి. మొదటి ఆలోచనా భావన, ప్రవక్త గతించిన 69 సంవత్సరాల తరువాత పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్. ప్రవక్త హిజ్రీ 11లో చనిపోతే, 80 హిజ్రీలో పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్ వారి ఎవరైతే అనుచరులు ఉన్నారో, వారు హనఫీ స్కూల్ తీసుకొచ్చారు. హనఫీ ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్. ఆ తరువాత 93లో పుట్టిన మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. ఆ తరువాత ప్రియులారా, హిజ్రీ 150లో పుట్టిన ఇమామ్ షాఫఈ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. హిజ్రీ 164లో పుట్టిన ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ ది ఒక ఆలోచనా విధానం. వీరి నలుగురిని ప్రపంచం ఏమంటుంది? ఇమామ్ అబూ హనీఫా వెంట నడిస్తే హనఫీలు, ఇమామ్ మాలిక్ వెంట నడిస్తే మాలికీలు, ఇమామ్ షాఫఈ వెంట నడిస్తే షాఫఈ మస్లక్ వారని, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ వెనకాతల నడిస్తే హంబలీ అంటారు.

కాలక్రమేణా ప్రపంచంలో ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ, భారతదేశంలో కూడా జమాత్ లు వెలసిల్లాయి. ఇక్కడ కూడా ఇస్లాం పేరుతో అనేక రకాలైన జమాత్ లు ఆవిర్భవించాయి. అల్లాహ్ రక్షించుగాక! ఈరోజు ప్రపంచంలో అత్యధిక బిద్అత్, అత్యధిక భ్రష్టు పట్టించే మూల స్థానం ఉంది అంటే, అల్లాహ్ రక్షించుగాక, ఇదే భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన బిద్అత్ లను స్థాపించే వ్యవస్థలు ఇక్కడే మూల కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. అదే క్రమంలో, మన మాట ప్రియులారా, నేను చెబుతున్న మాట, ప్రవక్త వారిపై అల్లాహ్ ఏ ఇస్లాంనైతే పరిపూర్తి చేశాడో, ఆ ఇస్లామే రుజుమార్గం. ఆ ఇస్లాం ఎక్కడ దొరుకుతుంది? మనం అన్వేషించే ప్రయత్నం చెయ్యాలి. భారతదేశంలో అనేక రకాలైన మనుషులు, పెద్ద పెద్ద ఇమాములు అనేక రకాలైన ఆలోచనా భావాలతో, ఏదైతే మన సమాజంలో బరేల్వీ వ్యవస్థ ఉంది. ఈ బరేల్వీ వ్యవస్థ ఎప్పుడు స్థాపించబడింది? సుమారు 1800 ప్రాంతంలోనే అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లో బరేల్వీ ప్రాంతంలో ఉంటూ బరేల్వీ అనే వర్గాన్ని స్థాపించారు. ఆ తరువాత దేవ్ బంద్ వర్గం వచ్చింది, ఖాసిం నానోతవి రహిమహుల్లాహ్. ఆ తరువాత మనకి తెలుసు ఇస్లాం నుండి బయటకు వెళ్లిన ఖాదియానీ వచ్చింది, మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ స్థాపించారు. మనం చూస్తున్నాం తబ్లీగీ జమాత్ వచ్చింది, మౌలానా ఇలియాస్ రహిమహుల్లాహ్ స్థాపించారు. జమాతె ఇస్లామీ హింద్ అనే సంస్థను చూశాం మనం, దాన్ని మౌదూదీ గారు స్థాపించారు. ఇలా వేరువేరు భావాలు గల, వేరువేరు ఆలోచనా విధానాలు గల ఇస్లాం జమాతులు ఈ యొక్క ప్రపంచంలో, మన భారతదేశంలో ఆవిర్భవించాయి.

అహలె హదీస్: మూలం మరియు నిర్వచనం

ఇదే క్రమంలో భారతదేశంలో అహలె హదీస్ అనే పేరుతో కూడా ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ఈ అహలె హదీస్ లు ఎవరైతే అనబడ్డారో, వీరిని భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లింలలో, హనఫీ వర్గంలో ఉన్నవారు తిడుతూ వచ్చారు. వీరు వహాబీలు, వీరి వెనకాతల నమాజ్ అవ్వదు, వీరికి సలాం చెప్పకండి, మేమంతా ముఖల్లిదులం, వీరు గైర్ ముఖల్లిదులు, వీరు ఇస్లాంలో కొత్త విధానాలు తీసుకొచ్చారు. మా తాత ముత్తాతల వరకు చెయ్యి కింద కట్టే వాళ్ళం, వీరొచ్చి చెయ్యి పైన కట్టే విధానం తీసుకొచ్చారు. మా తాత ముత్తాతలు ఆమీన్ గట్టిగా చెప్పేవారు కాదు, వీరొచ్చి మేము ఆమీన్ గట్టిగా చెప్పాలంటున్నారు. మా తాత ముత్తాతల కాలంలో మేము తక్బీర్ తో చేతులు ఎత్తేవారం కాదు, వీరు చేతులు ఎత్తుతున్నారు. మా తాత ముత్తాతల కాలంలో నమాజ్ అయిన తరువాత ఇజ్తిమాయీ దుఆ ఇమామ్ గారు చేసేవారు, మేము వెనకాతల ఆమీన్ ఆమీన్ పలికేవాళ్ళం, వీరు ఇది తీశారు. ఎన్ని తీశారండి? ఆమీన్ తీసేశారు, దుఆ తీసేశారు, చేతులు మాటిమాటికి పైకి ఎత్తుతున్నారు, చేతులు పైకి కడుతున్నారు, ఇదొక కొత్త వ్యవస్థ. వీరు గైర్ ముఖల్లిదులు. నఊజుబిల్లాహి మినస్సాలిక్.

ఒక మాట వాస్తవంగా మీరు తెలుసుకుంటే సోదరులారా, నేను ఏమీ ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను. ఒక వర్గం వైపు నేను మోజుతో ఆ వర్గానికి సపోర్టుగా మాట్లాడను, ఒక వర్గం పైన వైరి వలన ఆ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడ కోవాల్సిన అవసరం మనకి లేదు. మనం మాట్లాడుకోవలసినది ఖురాన్ మరియు హదీసు మాట. ఈరోజు మనం చెబుతున్న మాట ఏమిటంటే, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇస్లాం ధర్మము పరిపూర్తి చేయబడిందో, “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” అల్లాహ్ అన్నాడు, ప్రవక్తా, నీపై నేను ఇస్లాం ధర్మాన్ని పరిసమాప్తము చేసేసాను. ఆ విధానము ఎవరి వద్దనైతే ఈరోజు ప్రపంచంలో ఉందో, వారినే అహలె హదీస్ విధానం అన్నారు ప్రియులారా. ఈ అహలె హదీస్ విధానం ఎవడో నలుగురు నాలుగు తప్పులుగా మన గురించి చెప్పితే మనం తప్పు అయిపోం. మనము ఇన్షా అల్లాహ్ సత్యంపై ఉన్నవాళ్ళం. ఎందుకు? హదీసుల ద్వారా కొన్ని ఆలోచనలు చెబుతాను వినండి. ఫస్ట్ హదీస్, ప్రవక్త ఏం చెప్పారండి? “నా యొక్క ఉమ్మత్, నా అనుచర సమాజం 73 వర్గాలుగా చీలిపోతుంది,” ప్రవక్త అన్నారు. 73 వర్గాలుగా చీలిపోతుంది. “ఇల్లా మిల్లాతన్ వాహిదా” వారందరూ నరకానికి వెళ్తారు. “కుల్లుహుమ్ ఫిన్నార్” వారందరూ నరకంలోకి వెళ్తారు. ఇల్లా, కానీ “మిల్లాతన్ వాహిదా,” ఒకే ఒక సంఘము తప్ప. ప్రవక్త వారితో సహబాలు అడిగారు, “మన్ హియ యా రసూలల్లాహ్?” ప్రవక్తా, ఆ ఒక్క సంఘం ఏది? దేని గురించి అయితే మీరు స్వర్గానికి వెళ్తున్నారు అన్నారో? ప్రవక్త వారు ఏమన్నారు? “మా అన అలైహి వ అస్ హాబీ,” ఎవరైతే నన్ను అనుసరిస్తారో, నా సహబాలను అనుసరిస్తారో, వారు స్వర్గానికి వెళ్తారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సుబ్ హా నల్లాహ్. ఆ ఒకే ఒక వర్గం ఎవరు? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండో హదీస్, తిర్మిజీ గ్రంథంలో ఒక హదీస్ ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, “లా తజాలు తాఇఫతుమ్ మిన్ ఉమ్మతీ,” నా యొక్క ఉమ్మత్ లో ఒక వర్గం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. “మన్సూరీన్,” ఆ వర్గానికి విజయం ప్రాప్తమవుతుంది. ప్రజలు ఆ వర్గానికి సహాయము చేసినా, సహాయము చేయకపోయినా, వారు ఎల్లప్పుడూ సత్యంపై ఉంటారు. “హత్తా తఖూమస్సాఅ,” ఆఖరికి ప్రళయం వచ్చేస్తుంది, ఆ వర్గం మాత్రం సత్యంపై నిలబడుతుంది, వారికి విజయం ప్రాప్తమవుతుంది అని ప్రవక్త వారు అన్నారు. ఈ హదీసులో ఆ వర్గం, “తాఇఫా,” ఆ వర్గం అన్న మాటకు బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు, అలీ మదీనీ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త వారు చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. దాని తర్వాత, పీరానె పీర్, పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ అంటున్నారు, గున్ యతుత్ తాలిబీన్ అనే వారి పుస్తకం. పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ రాసిన గున్ యతుత్ తాలిబీన్ పుస్తకంలో రాస్తున్నారు అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్, ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఆ తరువాత, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ ఒక గొప్ప మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, బిద్అతీలను ఎలా మనం పోల్చుకోవాలి? అబ్దుల్ ఖాదిర్ జీలానీ అంటున్నారు రహిమహుల్లాహ్, బిద్అతీలను పోల్చుకునే మార్గం ఏమిటంటే, బిద్అతీలు ఎల్లప్పుడూ అహలె హదీస్ ల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఎవడైతే అహలె హదీస్ గురించి చెడుగా మాట్లాడుతాడో, వాడు బిద్అతీ అని మనం పోల్చుకోవాలి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ చెప్పారు. నేను చెప్పే మాట ఏమిటంటే, కన్ఫ్యూజ్, ఈరోజు ఏంటండీ ముస్లింల మనం? ఒకరంటారు ఫలానా అహలుస్సున్నా, ఒకరంటారు అహలె హదీస్, ఒకరంటారు ఫలానా తబ్లీగ్, ఒకరంటారు ఫలానా కజా, వ కజా, ఇన్ని మాటలు. ఇందులో ఈరోజు సత్యమైన వ్యవస్థ, ఖురాన్ మరియు హదీస్ వరకు మిమ్మల్ని చేర్చే వ్యవస్థ, ఎప్పుడైనా పరికించారా? ఎప్పుడైనా ఆలోచించారా? పుస్తకాలు తెరిచి చూసే ప్రయత్నం చేశారా? ఈరోజు సుబ్ హా నల్లాహ్, ఈ అహలుల్ హదీస్ అన్న మాట, అహలె హదీస్ అనే ఈ సంఘం, ఏ వ్యక్తి చేత స్థాపించబడలేదు. ఎలాగైతే నేను ఇందాక ప్రస్తావించాను, సుబ్ హా నల్లాహ్, మనం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జమాత్ గురించి చెడుగా మాట్లాడే హక్కు మాకు లేదు, మాట్లాడం ప్రియులారా. మనం బిద్అతులను, ఇస్లాం ధర్మశాస్త్రంలో నవీన పోకడలను ఖండిస్తాం. మనం తీసుకుందాం, మీరు చూపించండి, ప్రశ్నిస్తున్నాను, ఇన్ని నాళ్ళలో వస్తున్నాం మస్జిద్ లకు, ఒక వ్యవస్థ మనం తెలుసుకునే ప్రయత్నం చేశామా? అహలె హదీస్ అంటే ఏమిటి అసలు? అహలె హదీస్ అంటే ఒక మనిషి చేత స్థాపించబడిన ఒక జమాతా? అరె అన్ని జమాతులు, బరేల్వీ, సయ్యద్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ. తబ్లీగీ జమాత్, ఫలానా మౌలానా ఇలియాస్. జమాతె ఇస్లామీ, ఫలానా అబుల్ అలా మౌదూదీ. ప్రతి జమాత్ ఏదైతే ఇస్లాం అన్న పేరుతో భారతదేశంలో ఉందో, ప్రతి జమాత్ ను ఒక వ్యక్తి స్థాపించాడు. కానీ ఈ అహలుల్ హదీస్ అనే వర్గాన్ని సుబ్ హా నల్లాహ్, సహబాల కాలము నుండి అహలె హదీస్ అన్న మాట వస్తుంది. ఆధారాలు చూపించాను. బుఖారీ రహిమహుల్లాహ్ వారి ఉస్తాద్ అలీ మదనీ రహిమహుల్లాహ్ అహలె హదీస్ అనే పదాన్ని ఉపయోగించారు. వాస్తవానికి అహలె హదీస్ అంటే ఏమిటి? చాలామంది నఊజుబిల్లా రకరకాల మాటలు పలికారు. భారతదేశంలో బ్రిటిష్ వారు తయారు చేశారు వహాబీలను, ఇదంతా తప్పుడు మాట ప్రియులారా. అహలె హదీస్ ప్రవక్త యొక్క సహబాల కాలం నుండి సుబ్ హా నల్లాహ్ ఉంది. దీన్నే అహలె హదీస్ అన్నారు, అహలె ఇత్తిబా అన్నారు, అహలుల్ అసర్ అన్నారు, అహలుత్ తౌహీద్ అన్నారు, ఫిర్కతున్ నాజియా అన్నారు. రకరకాల పేర్లతో దీన్ని పిలవడం జరిగింది. మన భారతదేశంలో ఇది అహలె హదీస్ గా పిలవడం జరుగుతుంది. దీనిలోనే మన కోసం స్వర్గం ఉంది ప్రియులారా. దానికి ఆధారం, అహలె హదీస్ అంటే అర్థం ఏంటి? అహల్, అహల్ అంటే అర్థము చెందిన వారు. అహల్ అంటే అర్థము చెందిన వారు. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్. హదీస్ అనే పదం కేవలం హదీస్ కు మాత్రమే మనం దాన్ని ఇది చేయకూడదు ప్రియులారా. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్ రెండింటినీ కలిపి ఇస్లామీయ ధర్మశాస్త్రం హదీస్ అని చెప్పింది ప్రియులారా. అంటే అహలె హదీస్ అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీస్ లపై ఆచరించే వారినే అహలె హదీస్ అన్నారు ప్రియులారా. మరి ఆచరణలో ఆలోచనా విధానం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కడు వచ్చి ఖురాన్ ఎత్తి ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, లేదు. అహలె హదీస్ అంటే అదే ఖురాన్ చెప్తుంది, ఎలా ఖురాన్ హదీస్ ను నమ్మాలి? ఉదాహరణకి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో చెప్పాడు, “లా తఖ్రబుస్సలాత వ అన్తుమ్ సుకారా,” మీరు మధ్యము స్థితిలో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు వెళ్ళకండి. అరె, చూడండి చూడండి, అల్లాహ్ త’ఆలా మీరు నమాజు దరిదాపులకు వెళ్ళకండి, మధ్యము స్థితిలో ఉన్నప్పుడు, అంటే నమాజు చేసేటప్పుడు మధ్యం తాగకూడదేమో, నమాజు చేయని స్థితిలో మధ్యం తాగొచ్చేమో, అర్థం చేసుకునే వాడు ఇలా అర్థం చేసుకుంటాడు. కాబట్టి దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అది ఎప్పుడు అవతరించింది? ఎలా అవతరించింది? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రవక్త వారి శిష్యులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఆ విధంగా ఖురాన్ హదీస్ ను అర్థం చేసుకోవాలి. దానికి ఆధారం ఇదే ఖురాన్, రెండవ సూరా, వాక్యం సంఖ్య 137. అల్లాహ్ ఏమన్నారంటే:

فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُم بِهِ فَقَدِ اهْتَدَوا
(ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్తుమ్ బిహీ ఫఖదిహ్ తదవ్)

వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందుతారు. (2:137)

ఏ విధంగానైతే సహబాలు విశ్వసించారో, ఆ విధంగా విశ్వసిస్తేనే వారు మార్గదర్శకత్వంపై ఉన్నట్లు ప్రియులారా. కాబట్టి అహలె హదీస్ విధానం నిస్సంకోచంగా మిమ్మల్ని సహబాల విధానం వరకు తీసుకువెళ్తుంది. ఎవరైతే ఈ అహలె హదీస్ అనే మనహజ్ కాకుండా, అహలె హదీస్ మనహజ్ కాకుండా, ప్రవక్త మనహజ్ కాకుండా, సహబాల విధానం కాకుండా వేరే విధానాలపైకి వెళ్తే, వారు నరకంలోనికి వెళ్ళిపోతారు. ఆధారం, నాలుగవ సూరా, సూరె నిసా, వాక్యము సంఖ్య 115. అల్లాహ్ ఏమన్నారంటే, మనం చదవాలి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఖురాన్ అంటుంది:

وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
(వ మన్ యుషాఖిఖిర్రసూల మిన్ బ’ది మా తబయ్యన లహుల్ హుదా వ యత్తబి’ గైర సబీలిల్ ము’మినీన నువల్లిహీ మా తవల్లా వ నుస్లిహీ జహన్నమ వసాఅత్ మసీరా)

సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా ప్రవక్తకు విరోధం వహించి, విశ్వాసుల మార్గాన్ని కాకుండా ఇతర మార్గాన్ని అవలంబించేవాడిని మేము వాడు తిరిగిన వైపుకే తిప్పివేస్తాము. వాడిని నరకాగ్నిలో పడవేస్తాము. అది చాలా చెడ్డ గమ్యస్థానం. (4:115)

ఎవరైతే మీకు ప్రవక్త విధానం చూపించి, సహబాల విధానం చూపించి, ప్రవక్త మరియు సహబాల విధానము తెలిసిన తరువాత ఆ విధానాన్ని విడిచిపెట్టి, వేరే విధానం వెంట వెళితే వాడిని మేము నరకంలో వేస్తాం అల్లాహ్ అన్నాడు. నేను చెప్పట్లేదు అల్లాహ్ అన్నాడు. ప్రవక్త మరియు సహబాల విధానం తెలిసిన తరువాత అల్లాహ్ మరియు ప్రవక్త విధానానికి దూరంగా వెళితే వాడిని మేము నరకంలో పడవేస్తాం. మరి ఈరోజు మనం అల్లాహ్ మార్గం, ప్రవక్త మార్గం, సహబాల మార్గంపై ఎంతవరకు ఉన్నట్లు? ఎంతవరకు ఈ ప్రపంచం మిమ్మల్ని పిలుస్తోంది? మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఆ అల్లాహ్ మార్గం, అల్లాహ్ ప్రవక్త మార్గం, సహబాల మార్గం మిమ్మల్ని అహలె హదీస్ అనే విధానం సుబ్ హా నల్లాహ్ పిలుస్తుంది. మీరు చెప్పట్లేదు అహలె హదీస్ చెప్పండి, చెప్పండి, కానీ ఈరోజు అహలె హదీస్ అనే విధానం మిమ్మల్ని స్వర్గం వరకు తీసుకువెళ్తుందని చెబుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా దీన్నే సలఫీ వ్యవస్థ అన్నారు, అహలుల్ హదీస్ వ్యవస్థ అన్నారు, రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. మా విధానం ఏంటండీ? మా విధానం ఏంటి? నలుగురు ఇమాములను ప్రేమిస్తాం. నలుగురు ఇమాముల పట్ల ప్రేమ ఉంది. ఏ ఇమామ్ ను తిరస్కరించరు అహలె హదీస్. ఈరోజు ప్రపంచంలో అన్ని ముస్లింలు, పెద్ద పెద్ద ముఫ్తీలు ఏమంటున్నారంటే లేదండి, అహలె హదీస్ కొత్తగా వచ్చిందండి, మా అబూ హనీఫా చెప్పిందే మాకు కావాలండి, మా షాఫఈ చెప్పిందే మాకు కావాలండి, ప్రవక్త చెప్పినా వద్దు. మేమేమంటున్నామంటే, ఖురాన్ తీయండి, నాలుగవ సూరా, మనం తెలుసుకోవాలి, 59వ వాక్యం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ
(యా అయ్యుహల్లదీన ఆమనూ అతీఉల్లాహ వ అతీఉర్రసూల వ ఉలిల్ అమ్ రి మిన్కుమ్, ఫ ఇన్ తనాత’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్తకు విధేయత చూపండి. మీలోని అధికారులకు విధేయత చూపండి. ఏదైనా విషయంలో మీకు మధ్య అభిప్రాయభేదం వస్తే, దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. (4:59)

ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీలో పెద్దలకు విధేయత చూపండి. తఫ్సీర్ లో ఉలమాలు రాశారు, ఒకవేళ అక్కడ ఏదైనా ఖురాన్ హదీస్ కు వ్యతిరేకంగా ఉంటే మీరు పెద్దల్ని విడిచిపెట్టి అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరలిపోండి. నేను నలుగురిని, ఎంతమందికి ఐడియా కలిగి ఉన్నారో, ఐడియా లేకపోతే వినండి. ఐడియా, ఎందుకంటే ఈరోజు ఏందంటే అరె, ఏంది నేను హనఫియన్, హనఫియన్, ఎవరికి కావాలి? మీరు హనఫీ అవ్వొచ్చు మాస్టర్ అవ్వండి. కానీ ఇతరులను గైర్ ముఖల్లిదులు, వాళ్ళు ఇది, అది, ఓ చిన్న ఉదాహరణ ఇచ్చి మాట ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. అహలె హదీస్ కు, అహలె హదీస్ కు, ఇతర ముఖల్లిదులకు, ఎవరైతే లేదు హనఫీ, లేదు షాఫఈ, లేదు మాలికీ, లేదు హంబలీ, ఎవరైతే ఉన్నారో వాళ్లకి మనకి చిన్న తేడా చూపే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాను. ఏమిటంటే, ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఒక వ్యక్తి ఉండేవాడు, బహుశా మీరు విని ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆయన ముందు జీవితంలో షాఫఈ మస్లక్ లో ఉండేవాడు, జమాత్ తో తిరిగేవాడు. ఇండోనేషియా, జపాన్, ఎక్కడెక్కడికో వెళ్ళాడు. జీవితపు చరమాంకంలో అహలె హదీస్ విధానానికి దగ్గరయ్యాడు, సుబ్ హా నల్లాహ్. నేను ప్రశ్నించాను, అయ్యా మీరు జీవితంలో ఇన్నేళ్ల పాటు ఫలానా జమాత్ తో, ఇన్ని దేశాలు, ఇన్ని ఏళ్ళు తిరిగారు కదా, ఎందుకు విడిచిపెట్టేశారు? ఆయన స్టోరీ చెప్పాడు, అయ్యా నేను షాఫఈ అనే మస్లక్ లో ఉండేవాడిని. నేను ఒకసారి హజ్ యాత్రకు బయలుదేరాను. నేను తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చాను. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు, మా మస్జిద్ ఇమామ్ గారు నా చెవిలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా, నువ్వు హజ్ యాత్ర చేయటానికి వెళ్తున్నావ్, నీ ఫ్లైట్ జెడ్డాలో ల్యాండ్ అవ్వడానికి ముందు మీకాత్ వస్తుంది. మీకాత్ ప్రాంతంలో మనం ఏం చేస్తామంటే సంకల్పం చేస్తాం. నేను ఉమ్రా చేయడానికి వెళ్తున్నాను. అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్, అల్లాహుమ్మ లబ్బైక హజ్జన్ అని మనం హజ్ లేదా ఉమ్రాకి ఫ్లైట్ లోనే మీకాత్ లో సంకల్పం చేస్తాం. గురువుగారు ఏం చెప్పారంటే చెవిలో, అరేయ్, నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, మీకాత్ రాగానే, అల్లాహ్ నేను హజ్ కు కోసం సంకల్పం చేస్తున్నాను, దానితోపాటే షాఫఈ నుండి హనఫీగా మారిపోతున్నాను అని సంకల్పం చేసుకో అన్నారు. ఇదేంటి గురువుగారు, తెల్లవారితే హనఫీలొక వ్యతిరేకంగా మనం ఉన్నాం, ఇప్పుడెందుకు హజ్ కు వెళ్తుంటే ఇప్పుడు హనఫీగా మారిపోమంటారు ఏమిటి అని బాధపడ్డాడు. గురువుగారు చెప్పారు, లేదు నాయనా, మన షాఫఈ మస్లక్ ప్రకారం ఏముందంటే పురుషుడు వజూ చేసిన తరువాత, పురుషుడు వజూ చేసిన తరువాత స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ భగ్నమైపోతుంది. నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, అక్కడ అనేక మంది పురుషులు స్త్రీలు ఉంటారు. నీకు తెలియకుండానే ఏదో స్త్రీ తవాఫ్, ప్రదక్షిణ చేసే కంగారులో నిన్ను తాకి వెళ్ళిపోతుంది, నీ వజూ విరిగిపోతుంది. నువ్వు షాఫఈ మస్లక్ లో ఉండిపోతే, మాటిమాటికి ఎవరో తగులుతుంటారు, వజూ చేస్తూ ఉంటావ్, నీ హజ్ యాత్ర మొత్తం వజూలోనే పోతుంది. అలా కాకుండా హనఫీ మస్లక్ ప్రకారం అయితే పురుషుడు వజూ చేసి స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ విరగదు. కాబట్టి హజ్ యాత్ర అంతా చేసుకో హనఫీ మస్లక్ లో, తిరిగి ఇండియాలో ల్యాండ్ అయిపోయినప్పుడు నేను షాఫఈగా మారిపోయాను అని చెప్పి ల్యాండ్ అయిపో అన్నాడు. ఇదేంది ఇస్లాం? హనఫీ మస్లక్ లో ఒకటి, షాఫఈ మస్లక్ లో ఒకటి. అహలె హదీస్, ఇది వినండి. అహలె హదీస్ ఏం చెప్తుంది? మనం షాఫఈని గౌరవిస్తాం, హనఫీని గౌరవిస్తాం. మనం ఏం చూస్తాం? ప్రవక్త ఏం చేశారు అని మనం చూస్తాం. సుబ్ హా నల్లాహ్, హదీస్. అమ్మా ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా అంటున్నారు, రాత్రి పూట ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేసేవారు. నేను ప్రవక్త ముందు పడుకునే దానిని, ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేస్తూ సజ్దా చేసినప్పుడు ప్రవక్త వారి తల నా మోకాళ్లకు, ముడుపులకు తగిలేది. ఎప్పుడైతే ప్రవక్త తల నా కాళ్లకు తగిలేదో, నేను రెండు కాళ్లు ముడుచుకునే దానిని. అమ్మా ఆయిషా అంటున్నారు. దీని బట్టి ఏం తెలిసింది? పురుషుడు వజూ చేసి కేవలం స్త్రీని ముట్టుకుంటే వజూ విరగదు. ఇదే అహలె హదీస్. మనం నమ్ముతాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. కానీ బండగా ఇది చేశారు ఆ గురువుగారు, చెయ్యం. ఖురాన్ లో ఉందా? హదీస్ లో ఉందా? ఇదే నిజమైన సహబాల మార్గం, ప్రవక్త మార్గం, స్వర్గానికి తీసుకువెళ్లే మార్గం. ఇదే వ్యవస్థను భారతదేశంలో అత్యధికంగా అహలె హదీస్ గా పిలుస్తారు. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు, ఈరోజు అహలె హదీస్ అని చెప్పుకోవటానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక మనిషి పెట్టిన సంస్థ కాదు. సహబాల విధానాన్నే అహలె హదీస్ అన్నారు.

జమియతే అహలె హదీస్ మరియు దాని పిలుపు

మరి ఇండియాలో దీని తారీఖ్ ఏంటి? ఇండియాలో ఎప్పుడు పూర్తి అధికారికంగా మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ప్రియులారా, ఈ అహలె హదీస్ జమాత్ ఎప్పుడు కమిటీగా, అహలె హదీస్ వ్యవస్థ ఉంది, ఎప్పుడు కమిటీగా స్థాపించబడింది అంటే, 1906వ సంవత్సరంలో ప్రియులారా, 1906, 1906వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఆరా అనే ప్రాంతంలో అహ్మదియా అనే ఒక మదరసా ఉండేది. ఆ మదరసా యొక్క వార్షికోత్సవములో అహలె హదీస్ కాన్ఫరెన్స్ పేరుతో మొట్టమొదటి ఇజ్తిమా భారతదేశంలో జరిగింది 1906లో ప్రియులారా. అప్పుడు ఈ జమియత్, ఒక కమిటీ పరంగా, మనుషులైతే ఎప్పుడో ఉన్నారు సుబ్ హా నల్లాహ్, కమిటీ పరంగా భారతదేశంలో 1906 నుండి ఆవిర్భావంలోనికి వచ్చింది. కానీ ముస్లింలు ఎప్పుడున్నారు? 1906లో వచ్చారా? ముస్లింలు సహబాల కాలంలోనే ఇండియాలోనికి వచ్చారు. రాసేవాళ్ళు రాస్తారు పుస్తకాల్లో, భారతదేశంలో ముస్లింలు 712 క్రీస్తుశకం సింధూ దండయాత్ర ద్వారా దేశంలోనికి వచ్చారు. ఇది అబద్ధం. 712లో మహమ్మద్ గజనవి, గోరి, పేర్లు ఉంటాయి కదా, గజనీ మహమ్మద్, ఇలాంటి పేర్లు ఉంటాయి. వారి ద్వారా దండయాత్ర ద్వారా, 712లో ముస్లింలు వచ్చారు, అబద్ధం. ఇస్లాం భారతదేశంలో ప్రవక్త కాలంలో వచ్చింది. భారతదేశంలో ఇప్పటికీ మొట్టమొదటి మస్జిద్ ఉంది, వెళ్లి చూడండి. ఇండియాలో మొట్టమొదటి మస్జిద్ 629లో కట్టారు, సుబ్ హా నల్లాహ్. ఇది 2021 అయితే, భారతదేశంలో మొదటి మస్జిద్ 629లో కట్టబడింది. ఇప్పటికీ కేరళలో, మలబార్ ప్రాంతంలో, చెరమాన్ పెరుమాళ్ జుమా మస్జిద్ పేరుతో మస్జిద్ వర్ధిల్లుతుంది ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ, సుబ్ హా నల్లాహ్, మనం ఒక మంచి వ్యవస్థను కలిగి ఉండాలి, ఖురాన్ హదీస్ వ్యవస్థ, అదే అహలె హదీస్ వ్యవస్థ, అదే సహబాల కాలం నాటి నుండి ఉంది. ఇమాముల కాలం నాటి నుండి ఉంది. ప్రతి ఇమామ్ ఈ అహలె హదీస్ విధానాన్ని గౌరవించారు. ఇదే సత్యమని ధ్రువీకరించారు. ఈరోజు ప్రవక్తపై అవతరించిన ఇస్లాం, ఏదైతే అహలె హదీస్ రూపంలో మాత్రమే భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలి ఉంది ప్రియులారా. ఇండియాలో దీని ఆవిర్భావం 1906లో జరిగింది, సుబ్ హా నల్లాహ్. అప్పటి నుండి ఇదొక జమియత్ గా అవతరించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఇది మర్కజీ జమియతే అహలె హదీస్ గా మారింది ప్రియులారా. అనేక శాఖలు కలిగి ఉంది, సుబ్ హా నల్లాహ్. ఇది ప్రపంచానికి శాంతి వైపునకు పిలుస్తుంది. దీని ద్వారా ప్రపంచానికి లాభాలు తప్ప నష్టాలు లేవు. ఈరోజు భారతదేశంలో మేమే అహలుస్సున్నా వల్ జమాత్, అహలుస్సున్నత్, అహలుస్సున్నత్, వీరంతా అహలె బిద్అత్ పనులు చేస్తున్నారు. ఈరోజు దేశంలో ఇస్లాంకు సంబంధించి, షరియత్ కు సంబంధించి విషయాలు కోర్టులకెక్కినాయి అంటే, ఎవరు కోర్టుకెక్కించారు? ఈరోజు ఇస్లాం షరియత్ లో భారతదేశం యొక్క కోర్టులు వచ్చి చుచ్చును పోయాయి అంటే ఎవరు చుచ్చు చేశారు? త్రిపుల్ తలాఖ్ తీసుకోండి. ఈ త్రిపుల్ తలాఖ్ అంశం భారతదేశంలో షరియత్, షరియత్ లోకి కోర్టు వచ్చింది అంటే త్రిపుల్ తలాఖ్ నియమం ఉంది. కానీ వాస్తవానికి ఖురాన్ హదీస్ ప్రకారం త్రిపుల్ తలాఖ్ ఇస్తే, మూడు తలాఖులు కాదు. ఎవడైనా మనిషి తన భార్యకు మూడు సార్లు తలాఖ్ చెబితే, షరియత్ ప్రకారం ఒక్క తలాఖ్ మాత్రమే అవుతుంది. స్త్రీ గౌరవాన్ని కాపాడే వ్యవస్థ అహలె హదీస్ వ్యవస్థ ప్రియులారా. ఈరోజు దేశంలో ఒక ఉద్యమం, స్త్రీలు మస్జిద్ లోకి రాకూడదు, స్త్రీల కోసం మస్జిద్ లో ఏర్పాటు లేదు, దీనికోసం కేరళలో ఒక స్త్రీ ఏం చేసింది? జుమా రోజు మీరు మస్జిద్ లకు స్త్రీలను రానివ్వటం లేదు, నేను ఇమామత్ చేయిస్తా, నఊజుబిల్లా, జుమా రోజు ఇమామత్ చేయించింది ఒక స్త్రీ. అల్లాహ్ రక్షించుగాక! దేని వలన? మీరు స్త్రీలకు మస్జిద్ లో పర్మిషన్ ఇవ్వకపోవడం వలన. కానీ ఈరోజు మేరు భారతదేశంలో అహలె హదీస్ మస్జిదులు స్త్రీల కోసం తలుపులు తెరుస్తున్నాయి, మాషా అల్లాహ్. మీరు మస్జిద్ కు వచ్చి పురుషులతో పాటు పరదా వ్యవస్థతో నమాజ్ స్థాపించవచ్చు. అహలె హదీస్ విధానం, దేశంలో ఇస్లాంకు వ్యతిరేకంగా గొంతెత్తే వారికి సమాధానం మన వద్ద ఉందండి. త్రిపుల్ తలాఖ్ కోసం మాట్లాడేవారు, మేము అహలె హదీస్ సమాధానం ఇస్తాం. ఎవరైనా స్త్రీ మస్జిద్ కు రాకూడదంటే, సమాధానం ఇవ్వగలదు అహలె హదీస్. ఈరోజు భారతదేశంలో ముస్లింల పట్ల ద్వేషం దేనికోసం అండి? కోపం, కొంతమంది ముస్లింలు, జ్ఞానం లేని ముస్లింలు ఏం చేస్తున్నారు? పండగ వస్తే, ఒక జెండాలు పెడతారు. ఆ జెండా దేనిని రిసెంబుల్ చేస్తుంది? అది పక్క దేశం యొక్క జెండాలాగా ఉంది. మరి ఆ జెండాలు పెట్టకుండా, ఈరోజు ఇస్లాంను పూర్తిగా వాస్తవ రూపంలో తెలియజేసేది అహలె హదీస్. ఒక అహలె హదీస్ మస్జిద్ వద్ద ఏదైనా పండగ వస్తే జెండా చూస్తారా? అల్లాహ్ రక్షించుగాక! మనమంతా బిద్అత్ ప్రియులారా. ఈరోజు అహలె హదీస్ విధానం, దేశంలో అనేక మంది హిందువులు తిడుతుంటారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక నగరాలలో మధ్యలో దర్గాల పేర్లతో, సమాధుల పేర్లతో సమాధులు ఉంటాయి. కానీ సమాధులు భూమికి ఇంత ఎత్తులో కూడా ఉండకూడదు, తొలగించాలని చెప్పిన వ్యవస్థ ఇస్లాం వ్యవస్థ. దీనితో దేశానికి శాంతి ఉంది. మరి ఎంతమంది ఈరోజు స్వర్గానికి వెళ్ళే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు శాంతి కలిగించే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు స్వచ్ఛమైన తౌహీద్ బోధించే ఈ వ్యవస్థతో కలిసి ఉన్నారు? కలవండి. ఈరోజు అహలె హదీస్ అనే ఈ విధానంతో, ఈ మస్లక్ ఎందుకంటే ప్రియులారా, నేను చెప్పే మాట, ఇంతకీ ఎందుకయ్యా చెప్తున్నారు ఈయన? నేను చెప్పే మాట, ఈరోజు మనమంతా ఒక శక్తి ప్రియులారా. ఈ శక్తి చిన్నాభిన్నం కాకూడదు. మనం ముక్కలు కాకూడదు. మనం ముక్కలైతే ఏమవుతుంది? ఖురాన్ తీయండి. అల్లాహ్ అంటున్నారు:

وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వ అతీఉల్లాహ వ రసూలహూ వలా తనాత’ఊ ఫతఫ్షలూ వ తద్ హబ రీహుకుమ్ వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)

అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. పరస్పరం కలహించుకోకండి. అలా చేస్తే మీరు బలహీనులైపోతారు. మీ బలం నశిస్తుంది. ఓర్పు వహించండి. నిశ్చయంగా అల్లాహ్‌ ఓర్పు వహించేవారికి తోడుగా ఉంటాడు. (8:46)

అల్లాహ్ ఏమన్నాడు? “వ అతీఉల్లాహ,” అల్లాహ్ కు విధేయత చూపండి. “వ రసూల,” ప్రవక్తకు విధేయత చూపండి. “వలా తనాత’ఊ,” పరస్పరం కలహాలకు గురి కాకండి. మీరు కలహాలకు గురైతే “ఫతఫ్షలూ వ తద్ హబ రీహుకుమ్,” మీరు గనక కలహాలకు గురైతే మీరు ముక్కలైపోతారు, మీ గాలి, అంటే మీ బలం కాస్తా తగ్గిపోతుంది. “వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్,” ఓర్పు వహించండి. అల్లాహ్ ఓర్పు వహించే వారికి తోడున్నాడు. ఒక సంఘంగా ఉండండి. ఖురాన్ యే చెప్పింది:

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا
(వ’తసిమూ బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖూ)

మీరందరూ కలిసి అల్లాహ్‌ త్రాడును గట్టిగా పట్టుకోండి. పరస్పరం విడిపోకండి. (3:103)

మీరంతా అల్లాహ్ మరియు ప్రవక్త త్రాడును గట్టిగా పట్టుకోండి. ముక్కలైపోకండి. ఈరోజు ముక్కలు చెక్కలైపోయాం ప్రియులారా. నేను ఒక మాట అంటాను, వ్యక్తిగతంగా మీరు ఏమనుకున్నా అనుకోండి, కానీ జమాత్ పరంగా, జమియత్ పరంగా ఈరోజు దేశానికి అవసరం ఈ అహలె హదీస్ విధానం ప్రియులారా. కాబట్టి దీని కోసం మనం పని చేయాలి, మనమంతా కలిసి ఉండాలి, ఒక సంఘంగా. ముస్లిమేతర శక్తులు, ముస్లిమేతర శక్తులు ఇస్లాంను అపఖ్యాతి పాలు చేయటానికి ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయో, అల్లాహ్ చెప్పాడు ఖురాన్ గ్రంథంలో, తీయండి ఇంటికెళ్ళి ఎనిమిదవ సూరా, సుమారు వాక్యం సంఖ్య 72 లేదా 76, తీయండి. అల్లాహ్ ఏమన్నాడు? వారు అవిశ్వాసులు. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఈరోజు జెండాలు పట్టుకుని మనం పరిగెత్తుంటాం, సుబ్ హా నల్లాహ్, పరిగెట్టు, పరిగెట్టు, నమాజ్ అయినా కూడా ఇటు రాదు ధ్యాస, అటే వస్తుంది ధ్యాస. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఓ విశ్వాసులారా, మీరు గనక స్నేహితులు కాకపోతే, భూమిలో కల్లోలం చెలరేగుతుంది అని అల్లాహ్ త’ఆలా చెప్పాడు. స్నేహితులు అవుదామా లేదా? అవుదాం. చాలు ఆ మాటలు. మనం పరస్పరం వ్యక్తిగతంగా ఏమైనా పెట్టుకుందాం. కానీ అల్లాహ్ కోసం, ప్రవక్త కోసం, ఖురాన్ హదీస్ కోసం, ఈరోజు ఇస్లాం కోసం, ముస్లింలంతా ఒక శక్తిగా ఉండాలి ప్రియులారా. దీనికోసం సుబ్ హా నల్లాహ్, నేనేదైతే ఇందాక నుంచి జమాతె అహలె హదీస్ అంటున్నానో, ఇది కూడా ఒక వ్యవస్థ లాగా ఉంది, దీనికి కార్యచరణ ఉంది. దీనికి వెనకా ముందు ఏమీ లేకుండా లేదండి. ఢిల్లీ నుండి సుబ్ హా నల్లాహ్ మన జమియత్ ఉంది ప్రియులారా. మన జమియత్ ఈ దేశంలో 1906లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి తన పని చేస్తూ పోతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి జమియత్ ఆవిర్భవించింది ప్రియులారా. చెప్పడం జరుగుతుంది, వల్లాహు ఆలమ్, ఈ యొక్క అహలె హదీస్ మనహజ్ పై నడిచే వారు, నేను విన్నాను హైదరాబాద్ లో, అల్లాహు ఆలమ్, సుమారు నాలుగు కోట్ల మంది మనం దేశంలో నివసిస్తున్నాం. కానీ మనం ఒక శక్తిగా నివసించటానికి మనమొక సంస్థను స్థాపించుకున్నాం. బయట బోర్డు కూడా పెట్టారు ప్రియులారా, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్, అఖిల భారత జమియతే అహలె హదీస్ హింద్ సంస్థ. ఇది ఢిల్లీ నగరంలో తన యొక్క ముఖ్య కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్రీయ శాఖలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో జిల్లా శాఖలు ఉన్నాయి. జిల్లాలలో నగర శాఖలు ఉన్నాయి. నగరాల కింద ప్రాంతీయ శాఖలు ఉన్నాయి, సుబ్ హా నల్లాహ్. ఢిల్లీలో మన అమీర్ గారు ఉన్నారు. స్టేట్ లో అమీర్ గారు ఉన్నారు. జిల్లాకి అమీర్ గారు ఉన్నారు. నగరానికి అమీర్ గారు ఉన్నారు. మనమొక సంస్థగా, ఒక బలంగా తయారవ్వాలంటే జమియత్ తో సంబంధం కలిగి ఉండాలి ప్రియులారా. అదే కోవలో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగర జమియతే అహలె హదీస్ మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తుంది, ఈ సంఘంతో ముడిపడండి. మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి తెలియజేద్దాం. ఎవరయ్యా, నేను ఏ జమాత్ లో లేనండి, నాకు అమీర్ లేడండి. లేదు ప్రియులారా. జమాత్ లో ఉంటేనే నీపై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది. హదీస్ లో ప్రవక్త వారు ఏం చెప్పారు? “యదుల్లాహి అలల్ జమాఅ,” జమాత్ పై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు జమాత్ వ్యవస్థతో మనం ఎంతవరకు కలిసి ఉన్నాం? ప్రియులారా అవసరం. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, రోజుకొకటండి, అల్లాహ్ రక్షించుగాక, మన గురించి మాట్లాడేవాడు లేడు దేశంలో. అల్లాహ్ రక్షించుగాక, మొన్న ఇద్దరు నర్స్ అండి, ఇద్దరు సిస్టర్స్ ఢిల్లీలో ట్రైన్ ఎక్కారు, ఒడిస్సా వెళ్తున్నారు. ఎవరో ఇద్దరితో మాట్లాడుతున్నారట, సంథింగ్ ఎవరికో డౌట్ వచ్చింది. ఝాన్సీ రైల్వే స్టేషన్ లో దింపేశారు. దానికోసం ఒక సీఎం లేఖ రాసేస్తాడు, హోం మినిస్టర్ జవాబు ఇస్తాడు, మేము యాక్షన్ తీసుకుంటాం ట్రైన్ లో దింపిన వారిపై. ఒక ఇద్దరు నన్స్, ఒక ఇద్దరి కోసం దేశమంతా కోడై కూస్తుంది. వారి సంఘాలు ఆవురావురు కేకలు వేస్తున్నాయి. నేను ఒక కోటి పెట్టుకున్నాను, నాపై ముద్ర వేసేవారు ఉగ్రవాది అని ముద్ర వేస్తున్నారు. నాపై నుండి కింద నుండి, ఎందుకు కారణం? ఒకటి దేశంలో ముస్లింలు ఈ సున్నత్ ను విడిచిపెట్టకపోవడం. అల్లాహు అక్బర్, మనం ప్రతి ఒక్కరం ముస్లింలుగా ఉండి, దేశంలో ఉన్న 20% ముస్లింలు సుబ్ హా నల్లాహ్ ఈ గడ్డం వ్యవస్థ పాటిస్తే ఎవ్వరూ మిమ్మల్ని చూడరు. సుబ్ హా నల్లాహ్, ముస్లింల వ్యవహారం ఏది? ఈరోజు మనం చాలా మంది భయపడుతున్నాం షరియత్ ను ఆచరించడానికి, నడిపితే భయం. అల్లాహ్ మనకి తోడున్నాడు. కానీ చెప్పే మాట, ఇద్దరి గురించి మాట్లాడితే దేశం కోడై కూస్తుంది, మన కోసం మాట్లాడేవాడు నోరొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పొద్దున్న లేగిస్తే పేపర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం అని రాస్తున్నాడు. ఎంతమంది బాధపడుతున్నాం? నేను అంటున్నాను ప్రియులారా, మనం ఏ ఫీల్డ్ లోనైతే ఆరితేరి ఉన్నామో, మనం ప్రశ్నించే వ్యవస్థగా మారాలంటే మనమంతా జమాత్ కు మన యొక్క సహాయం అందించాలి. ఎవరు, ఒక మెడికల్ ఫీల్డ్ లో నేను ఉన్నానండి, జమియత్ శబ్దం ఇస్తే నేను దాని కోసం పనిచేస్తున్నాను. ఫలానా ఫీల్డ్ లో, ఎంతమంది అయితే మీకు కలలు ఉన్నాయో, ఈ కలలన్నీ, గురువుగారు ఫలానా ఫీల్డ్ నాకు తెలుసండి, నేను జమియత్ కు సహకరిస్తాను. టెన్త్ క్లాస్ అయిపోయింది పిల్లవాడికి, టెన్త్ తరువాత ఏం చేయాలి? పిల్లలకు తెలియడం లేదు. నేను ఉన్నానండి, టెన్త్ తరువాత పిల్లలు ఎలా చదువుకోవాలో నేను చెప్పగలను, నేను జమియత్ కు ఈ విధంగా సహాయం చేస్తాను. గురువుగారు ఫలానా ఫీల్డ్ మెడికల్ నాకు తెలుసండి, నేను ఇన్షా అల్లాహ్ మనం ముస్లింల కోసం, ప్రతి ఒక్కరూ తన, తన అంటున్నారు, మనం? వాడు, వాడు, వాడు, వాడు, వాడు, వాడు, మేమేమో… ఈ దేశానికి అవసరం ప్రియులారా. ప్రతి ఒక్కరూ మనం అంటున్నారు, మనం మాత్రం నేను అనుకుంటున్నాం. పనికిరాదు ప్రియులారా. కాబట్టి మనమంతా మనముగా పని చేయాలంటే మనం జమియత్ తో కలవాలి ప్రియులారా. ఈ జమియత్ మీకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసింది. బయట గోడ మీద పెట్టించిందంట అక్కడ. ఈ జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోండి. 18 సంవత్సరాలు వస్తే మీరు జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోవచ్చు. జమియత్ లో మీ సలహా ఇవ్వవచ్చు, మీ సంపదింపులు ఇవ్వవచ్చు, జమియత్ మీతో మాట్లాడుతుంది. జమియత్ ఏదైనా నిర్ణయం చేసుకుంటే మిమ్మల్ని కూడా సంప్రదిస్తుంది. మీరు జమియత్ లోకి రాకుండా, జమియత్ మూల సిద్ధాంతాలకు రాజీ కాకుండా, జమియత్ గురించి చెడుగా మాట్లాడుతూ, జమాత్ మమ్మల్ని పట్టించుకోదండి, మా వైపునకు చూడదండి, మాతో మాట్లాడదు అంటే, అవదు ప్రియులారా. కాబట్టి ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. కాకినాడ నగర జమియత్ యొక్క బాధ్యులతో సంప్రదించండి. ఈ జమియత్ యొక్క సభ్యత్వ ఫారం నమోదు చేయండి. మనమంతా కలుద్దాం, ఒక శక్తిగా భారతదేశంలో పని చేద్దాం. ఇస్లాంకు వ్యతిరేకంగా ఏవైతే గొంతుకలు లేగుస్తున్నాయో, వాటిని మనం ఎదుర్కోవాలంటే శక్తి అవసరం ప్రియులారా. రెండో మాట ఏందీ, ఈ శక్తి అంటున్నారు, ఎదుర్కోవాలంటున్నారు, ఎవడు పడితే వాడు, నా విధానం ఇదండి, మీరు ఈ జెండా పట్టుకుంటాను, లేదు. ఆ విధానం కూడా ఖురాన్ హదీస్ మనకు తెలియజేసాయి. ఆ విధానాలను జమియత్ మీకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా, మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి అందిద్దాం. ఈరోజు అదే ఖురాన్ హదీస్ నిర్మలముగా, స్వచ్ఛముగా ప్రపంచానికి అందజేయటానికి భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ పేరు జమియతే అహలె హదీస్ హింద్, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్. ఈ యొక్క జమియత్ లో మనమంతా భాగస్వాములవుదాం, ఇన్షా అల్లాహ్ త’ఆలా భారతదేశంలో పనిచేద్దాం. అల్లాహ్ ఈ జమియత్ తో కలిసి పనిచేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.



యూట్యూబ్ ప్లే లిస్ట్ – షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

క్రింది వీడియో కూడా తప్పకుండా వినండి:
మన్’హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత, అఖీదా (విశ్వాసం) మరియు ఆచరణలో [వీడియో]

ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? – షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Y55gGxIgxeM

[63 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి :

ఉపద్రవానికి మూలం: ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్థుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూద వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపకింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇత్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది. 

‘అఖీదయే తహావీయ’ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు:

“రఫ్ద్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌల్ వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తనను ఒక మహా సాత్వికునిగా, దుష్ట శిక్షకు శిష్టరక్షణకు నడుం బిగించిన వానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా అసంతృప్త వాదాన్ని వ్యాపింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. దరిమిలా ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు)అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని కుత్సితబుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్‌ ఖైస్’కు పలాయనం చిత్తగించాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.” 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. వారి హృదయాలు భగ్న హృదయాలైపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నిగిల్లిపోయింది. అప్పటి వరకూ అణగిమణగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాపింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరణిని అవలంబించదలచిన వారు అశక్తులైపోయారు. అందువల్ల వారంతా ఖిలాఫతకు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవాగ్ని రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత, సంఘఠితత్వం సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్లూను కోలేక పోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవనవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్చిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్ధపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.”

(మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305) 

ఇకపోతే హజ్రత్ అలీ, ముఆవియా (రదియల్లాహు అన్హుమ్)ల యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీ (కారణం)ని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు: 

ముఆవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్దానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఆవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి – తానొక ఖలీఫా కావటం చేత ముఆవియ మరియు ముఆవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. తమ వద్ద శక్తి ఉంది. అధికార బలం ఉంది. అయినప్పటికీ వారు మాట వినటం లేదు. కాబట్టి వారితో యుద్ధం చేసి, వారిని దారికి రప్పించాలి. తద్వారా వారు ఖలీఫాకు విధేయులవుతారు. ఆ విధంగా ముస్లింల సామూహిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది – ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన. కాగా; హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది : తాము అలీ (రదియల్లాహు అన్హు)చేతులపై ‘ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయటంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై జులుంకు ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి మనకు న్యాయం చేసే ప్రతిభావంతుడైన ఖలీఫా చేతుల మీద మాత్రమే మనం బైఅత్ (ప్రతిజ్ఞ) చేయాలి.” 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)మధ్య పొడసూపిన విభేదాలు, అంతఃకలహాల ఫలితంగా జరిగిన యుద్ధాలు – ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది. 

ఒకటి : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ రగడపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారిలా వేడుకుంటూ ఉంటారు: 

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయా లలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ :10) 

రెండు: సహాబా (ప్రవక్త సహచరులు రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం. దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి : 

మొదటి పద్దతి: 

అలాంటి కథనాల (ఆసార్)లో కొన్ని పచ్చి అబద్దాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలవి. 

రెండవ పద్ధతి: 

సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులుచేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్దం పాళ్ళు అధికం. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. 

మూడవ పద్ధతి: 

ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి, అలాంటివి చాలా తక్కువే. ఈ విషయంలో మటుకు ప్రవక్త సహచరులు అశక్తులు, క్షంతవ్యులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇత్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు ‘ముజ్తహిద్’ లు (సమకాలీన సవాళ్ళను షరీఅత్ బద్దంగా అన్వయించటానికి శాయశక్తులా కృషిచేసిన విజ్ఞులు). ఈ అన్వయింపు ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకూ చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ – వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ – చిత్తశుద్దితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది

న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తిహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండింతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం) 

నాల్గవ పద్ధతి: 

ప్రవక్త సహచరులు (సహాబా రదియల్లాహు అన్హుమ్) కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి 

1. బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! తప్పులు ఎన్ని జరిగి ఉన్నాసరే, పశ్చాత్తాపం (తౌబా) వాటిని రూపుమాపుతుంది. 

2. ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ : 114) 

3. వారి పుణ్యకార్యాలు వేరితరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరయినా ఒక ‘ముద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక! 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ధర్మవేత్తల నమ్మకం (అఖీదా) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు, పవిత్రులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరయినా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం (తౌబా) ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని క్షమిస్తాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చారో, మరెవరయితే దానిని సత్యమని ధ్రువీకరించారో అటువంటివారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు). (అజ్ జుమర్ : 33-35)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది : 

తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. (అల్ అహ్ ఖాఫ్ : 15,16) 

(మజ్మూల ఫతావా : 35/69)

ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబా వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంట గలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమయిన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తగు ఆధారాలు, నిదర్శనాలు లేకుండానే – కేవలం తమ మనోవాంఛలకు లోబడి – స్వార్థపరుల, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో – ఇస్లాం యొక్క గొప్ప చరిత్రపట్ల, తొలికాలపు మహనీయుల పట్ల లేనిపోని దురనుమానాలను నూరిపోస్తున్నారు. ఆ విధంగా వారిలో ఇస్లాం పట్ల ఏవగింపును కలిగించి, ముస్లిం సముదాయంలో చీలికను తీసుకురావాలని, తొలికాలపు సజ్జనుల పట్ల చివరి కాలపు ప్రజలలో ద్వేషాన్ని, వైషమ్యాన్ని రగుల్గొల్పాలని చూస్తున్నారు. దీనికి బదులు వారు తొలికాలపు సత్పురుషుల అడుగుజాడలలో నడచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది! అలాంటి సద్భావన కలిగి ఉండే వారిని అల్లాహ్ సయితం శ్లాఘిస్తాడు. ఉదాహరణకు – 

వారి తరువాత వచ్చిన వారు (తమ పూర్వీకులను గురించి) ఇలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగినవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ : 10) 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు 

(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు: 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి. 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు – 

“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం) 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు. 

ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా – 

”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం) 

తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు : 

“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.”
(ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్) 

ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:

“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.” 

అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :

“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”

ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :

“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389) 

(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు : 

మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100) 

కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115) 

‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు: 

“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.” 

ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి. 

సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది. 

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు. 
  2. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు. 
  3. అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు. 

మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక! 

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు. 

దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు. 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

తౌహీద్ మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము – ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

6 వ అధ్యాయం
తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ

ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57). 

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ

“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ

“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).

తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది. 

ముఖ్యాంశాలు: 

1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది 

2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది. 

3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు. 

4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు. 

ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది. 

ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28). 

5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి! 

6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.” 

ఇది రెండు రకాలు: 

ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. 

రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. 

దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

నిశ్చయంగా ధర్మం సులువైనది, దాని అనుసరణలో కాఠిన్య వైఖరి పాటించవద్దు | విశ్వాస పాఠాలు | 10వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[10 నిముషాలు]

రెండవ భాగం

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: (إِنَّ الدِّينَ يُسْرٌ وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ فَسَدِّدُوا وَقَارِبُوا وَأَبْشِرُوا وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنْ الدُّلْجَةِ).

10 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“నిశ్చయంగా ధర్మం సులువైనది. ఏ వ్యక్తి అయినా ధర్మం అనుసరణలో కాఠిన్య వైఖరి అవలంబిస్తే ధర్మమే అతనిపై ఆధిక్యత  సాధిస్తుంది. (హెచ్చుతగ్గులు లేకుండా) సంపూర్ణ విధానాన్ని అవలంభించండి. లేదా దాని (సంపూర్ణతకు) సమీపాన చేరండి. (మీకు లభించే ప్రతిఫలంతో) సంబర పడండి. ఉదయసాయంకాల, మరి కొంత రాత్రి సమయాల్లో (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి”. (బుఖారి 39).

ఈ హదీసులో:

దీర్ఘ కాలం వరకు అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉండడానికి మనిషి చురుకుగా ఉండే సమయాల సహాయం తీసుకోవాలి. అంటే ఆ సమయాల్లో ఆరాధనలు పాటించాలి. ఎల్లప్పుడూ చేస్తూ ఉండే అల్పమైన ఆచరణలు, కొంత కాలం చేసి వదిలేసే అధిక ఆచరణల కంటే మేలైనవి. ఇస్లాం ధర్మం ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే అది చాలా సులభమైన ధర్మం. దాని ఆదేశాలు, నివారణలు మనిషి పాటించగలిగినవే. (అంటే మనిషి శక్తికి మించినవి కావు). శక్తికి మించిన శ్రమ భారాన్ని, ప్రవక్త సాంప్రదాయానికి భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడం నివారించబడినది. ఎలాంటి హెచ్చుతగ్గింపులు లేకుండా మధ్యేమార్గాన్ని అవలంభించాలన్న తాకీదు ఉంది. అదే రుజుమార్గం. మనిషి తన ఆరాధనలో పరిపూర్ణతకు చేరుకోలేక పోయినా దాని సమీపానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం చేసే ఆరాధన, సత్కార్యాల ఘనత తెలిసింది. ఆ సమయం సత్కార్యాల అంగీకార రీత్యా, మరియు వాటిని పాటించుట కూడా చాలా అనుకూలమైనది. రాత్రి పూట కొంత సమయం తహజ్జుద్ లో గడిపే ఘనత కూడా తెలిసింది. అది అల్లాహ్ దయతో సదుద్దేశాలు సంపూర్ణమగుటకు ఆయన సహాయం లభించును. అస్ర్ అయిన వెంటనే మరియు మగ్రిబ్ కు ముందు ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణ (జిక్ర్)లో ఉండుట అభిలషణీయం. మధ్యేమార్గంలో ఉండి, అల్లాహ్ ప్రసన్నత పొందే సత్కార్యాలు చేస్తూ, ప్రవక్త సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న విశ్వాసునికి మంచి శుభవార్తలు ఇవ్వబడ్డాయి.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

అన్ని ధర్మాల్లో అల్లాహ్ కు అతి ప్రియమైన ధర్మం | విశ్వాస పాఠాలు | 9వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قِيلَ لِرَسُولِ اللهِ : أَيُّ الْأَدْيَانِ أَحَبُّ إِلَى اللهِ قَالَ: (الْحَنِيفِيَّةُ السَّمْحَةُ).

9- ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ధర్మాల్లో ఏ ధర్మం అల్లాహ్ కు చాలా ప్రియమైనదని ప్రవక్త వద్దకు వచ్చిన ప్రశ్నకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం

అతిసులభమైన, షిర్క్ కు దూరమైన ఇస్లాం ధర్మం (హనీఫియ్య) ” అని సమాధానమిచ్చారు.

(అహ్మద్ 1/236. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారి (హ. 38 తర్వాత) లో ఈ హదీసును “హసన్” అని చెప్పారు).

ఈ హదీసులో:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పంపబడిన ఇస్లాం ధర్మం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇవ్వబడిన సవ్యమైన ధర్మమే. అది చాలా సులభమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మెత్తగా ప్రవర్తించుటకు, వారిపై మోపబడిన భారాన్ని తగ్గించుటకు, వారి శృంఖలాలను తెంచుటకు పంపబడ్డారు. అల్లాహ్ ప్రేమిస్తాడని తెలిసింది. కాని అది ఆయనకు తగిన రీతిలో అని నమ్మాలి. సృష్టిరాసుల పరస్పర ప్రేమతో పోల్చరాదు.

ఘనత పరంగా ధర్మాల్లో వ్యత్యాసం గలదు. ఇబ్రాహీం అలైహిస్సలాం కు అతి చేరువుగా ఉన్నవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మెత్తగా ప్రవర్తించుట, శుభవార్త వినిపిస్తూ మెలగుట మంచిదని, కష్టం కలిగించకుండా, విరక్తి కలిగించకుండా ఉండాలని చెప్పబడింది. ఈ విషయంలో ఈ హదీసు చాలా స్పష్టంగా ఉందిః

“మెత్తగా మెలగండి, కఠినంగా మెలగకండి. సంతృప్తి కలిగించండి. విరక్తి కలిగించకండి”.
(బుఖారి 69, ముస్లిం 1732)


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాస పాఠాలు -5: ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు [వీడియో]

బిస్మిల్లాహ్

[30 నిముషాలు]
విశ్వాస పాఠాలు – 5 – ఇస్లాం ఘనత -1 (హదీస్ #8) : ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇస్లాం ఘనత -1 (హదీస్ #8)

ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు

عَنْ ابْنِ شِمَاسَةَ الْمَهْرِيِّ قَالَ حَضَرْنَا عَمْرَو بْنَ الْعَاصِ > وَهُوَ فِي سِيَاقَةِ الْمَوْتِ فَبَكَى طَوِيلًا وَحَوَّلَ وَجْهَهُ إِلَى الْجِدَارِ فَجَعَلَ ابْنُهُ يَقُولُ يَا أَبَتَاهُ أَمَا بَشَّرَكَ رَسُولُ الله  ﷺ  بِكَذَا أَمَا بَشَّرَكَ رَسُولُ الله ﷺ  بِكَذَا قَالَ فَأَقْبَلَ بِوَجْهِهِ فَقَالَ إِنَّ أَفْضَلَ مَا نُعِدُّ شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ إِنِّي كُنْتُ عَلَى أَطْبَاقٍ ثَلَاثٍ لَقَدْ رَأَيْتُنِي وَمَا أَحَدٌ أَشَدَّ بُغْضًا لِرَسُولِ الله ﷺ مِنِّي وَلَا أَحَبَّ إِلَيَّ أَنْ أَكُونَ قَدْ اسْتَمْكَنْتُ مِنْهُ فَقَتَلْتُهُ فَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَكُنْتُ مِنْ أَهْلِ النَّارِ فَلَمَّا جَعَلَ اللهُ الْإِسْلَامَ فِي قَلْبِي أَتَيْتُ النَّبِيَّ ﷺ فَقُلْتُ ابْسُطْ يَمِينَكَ فَلْأُبَايِعْكَ فَبَسَطَ يَمِينَهُ قَالَ فَقَبَضْتُ يَدِي قَالَ: (مَا لَكَ يَا عَمْرُو؟) قَالَ: قُلْتُ أَرَدْتُ أَنْ أَشْتَرِطَ قَالَ: (تَشْتَرِطُ بِمَاذَا؟) قُلْتُ: أَنْ يُغْفَرَ لِي قَالَ: (أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلهَا وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ). وَمَا كَانَ أَحَدٌ أَحَبَّ إِلَيَّ مِنْ رَسُولِ الله ﷺ وَلَا أَجَلَّ فِي عَيْنِي مِنْهُ وَمَا كُنْتُ أُطِيقُ أَنْ أَمْلَأَ عَيْنَيَّ مِنْهُ إِجْلَالًا لَهُ وَلَوْ سُئِلْتُ أَنْ أَصِفَهُ مَا أَطَقْتُ لِأَنِّي لَمْ أَكُنْ أَمْلَأُ عَيْنَيَّ مِنْهُ وَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَرَجَوْتُ أَنْ أَكُونَ مِنْ أَهْلِ الْجَنَّةِ ثُمَّ وَلِينَا أَشْيَاءَ مَا أَدْرِي مَا حَالِي فِيهَا فَإِذَا أَنَا مُتُّ فَلَا تَصْحَبْنِي نَائِحَةٌ وَلَا نَارٌ فَإِذَا دَفَنْتُمُونِي فَشُنُّوا عَلَيَّ التُّرَابَ شَنًّا ثُمَّ أَقِيمُوا حَوْلَ قَبْرِي قَدْرَ مَا تُنْحَرُ جَزُورٌ وَيُقْسَمُ لَحْمُهَا حَتَّى أَسْتَأْنِسَ بِكُمْ وَأَنْظُرَ مَاذَا أُرَاجِعُ بِهِ رُسُلَ رَبِّي).

8-  ఇబ్ను షిమాస అల్ మహ్రీ ఉల్లేఖించారు: మేము అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మరణ సమీపాన అతని వద్ద కూర్చొని ఉండగా, అతను చాలా సేపు ఏడ్చి తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకున్నాడు. అప్పుడే అతని కుమారుడు నాన్నా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఫలానా, ఫలానా శుభవార్తలు ఇవ్వలేదా? అని తృప్తినిచ్చారు. ఇది విని అతను తన ముఖాన్ని (మావైపు) త్రిప్పి ఇలా చెప్పారుః “లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యాన్ని అన్నిటి కంటే అతిఉత్తమముగా భావించేవారము. విషయమేమిటంటే, నా జీవితంలో మూడు దశలు గడిచాయి. ప్రవక్తకంటే ఎక్కువ ద్వేషం మరెవ్వరితో లేని రోజులు గడిచాయి. అప్పట్లో నాకు మరీ ఇష్టమైన కార్యం ఏదైనా ఉంటే ఆయన్ను వశపరుచుకొని హతమార్చాలన్నదే. కాని ఒకవేళ నేను ఆ స్థితిలో చనిపోయి ఉంటే నరకవాసుల్లో చేరేవాడ్ని. కాని అల్లాహ్ కు దయ కలిగింది. అల్లాహ్ ఇస్లాం కొరకు నా హృదయాన్ని తెరిచాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! మీ కుడి చేతిని చాపండి. నేను ఇస్లాం స్వీకరిస్తూ శపథం చేస్తాను అని అన్నాను. ప్రవక్త తమ చెయ్యి చాపారు. కాని నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. “నీకేమయింది, అమ్ర్!” అని ప్రవక్త ఆశ్చర్యంతో అడిగారు. నేను ఒక షరతు పెట్టదలుచుకున్నాను అని చెప్పాను. “నీ షరతు ఏమిటి?” అని ప్రవక్త అడిగారు. నా పాపాలన్నీ మన్నింపబడాలని నేను చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తృప్తి పరిచారుః “ఏమీటి, నీకు తెలియదా? ఇస్లాం (స్వీకరణ) గత పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. హిజ్రత్ (ధర్మ రక్షణకై వలసపోవుట) పూర్వ పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. మరియు హజ్ కూడా పూర్వ తప్పిదాలను తుడిచి పెడుతుంది”. (ఆ పిదప నేను ఇస్లాం స్వీకరించాను).

ఆ నాటి నుండి నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవారు, మరియు నా దృష్టిలో ఆయనకంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. వారి ఔన్నత్యపు గాంభీర్యం వల్ల నేను వారిని నా కళ్ళారా చూడగలిగేవాణ్ణి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపు రేఖల్ని వర్ణించమని ఎవరైనా నన్ను అడిగితే నేను వర్ణించలేను. ఎందుకనగ నేను ఎన్నడూ వారిని నా కళ్ళారా చూడనేలేదు. ఇదే స్థితిలో గనక నేను చనిపోతే నిశ్చయంగా స్వర్గవాసుల్లో ఒకడిని అని ఆశించేవాడిని.

ఆ తర్వాత నాపై (ప్రభుత్వపరంగా) ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. వాటి గురించి (నేను ప్రశ్నింపబడినప్పుడు) నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు?

నేను చనిపోయిన తర్వాత నా జనాజ వెంట రోదించే, కేకలు పెట్టే స్త్రీలుగాని, అగ్నిగాని రాకూడదు. నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా సమాధిపై కొద్ది కొద్దిగా మట్టి పోయండి. ఒంటెను కోసి దాని మాంసం పంచిపెట్టినంత సేపు మీరు నా సమాధి వద్దనే నిలిచి ఉండండి. నేను ధైర్యం, తృప్తి పొందుతాను. నా ప్రభువు పంపే దూతలకు నేనేమి సమాధానం చెబుతానో చూస్తాను. (ముస్లిం 121).

ఈ హదీసులోః

ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు. ఎవరు ఇస్లాంపై స్థిరంగా ఉంటాడో అతను పూర్వ పాపాల గురించి పట్టుబడడు. అలాగే హిజ్రత్ మరియు హజ్ కూడా పూర్వ పాపాల మన్నింపులకు కారణమవుతాయి.

గమనికః ఇస్లాం స్వీకరణ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల ప్రక్షాళన జరుగు తుంది. కాని హిజ్రత్, మరియు హజ్ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల మన్నింపు విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎందుకనగా పెద్ద పాపాల మన్నింపుకై స్వచ్ఛమైన తౌబా తప్పనిసరి. సత్కార్యాలు కూడా పాపాల మన్నింపుకై కారణమవుతాయి. ఎంత పెద్ద సత్కార్యముండునో అంతే పాపాలు మన్నించబడుతాయి. (ఖనన సంస్కారాలు పూర్తైన తర్వాత సమాధి వద్ద కొంత సేపు ఉండి దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు అతను సరియైన సమాధానం చెప్పగలగాలని అల్లాహ్ తో అతని కొరకు దుఆ చేయాలని ఇతర హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. ఉః అబూదావూద్, కితాబుల్ జనాయిజ్, బాబుల్ ఇస్తిగ్ఫారి ఇందల్ ఖబ్రి లిల్ మయ్యిత్… -అనువాదకుడు-).


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాస పాఠాలు -2: ఇస్లాం మరియు ఈమాన్ రెండిటి భావాలు ఒక్కటే (పార్ట్ 1) [వీడియో]

బిస్మిల్లాహ్

[31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇస్లాం మరియు ఈమాన్ రెండిటి భావాలు ఒక్కటే

عَن ابْنِ عَبَّاسٍ { قَالَ إِنَّ وَفْدَ عَبْدِ الْقَيْسِ لَـمَّا أَتَوْا النَّبِيَّ ﷺ قَالَ: (مَنْ الْقَوْمُ أَوْ مَنْ الْوَفْدُ) قَالُوا: رَبِيعَةُ قَالَ: (مَرْحَبًا بِالْقَوْمِ أَوْ بِالْوَفْدِ غَيْرَ خَزَايَا وَلَا نَدَامَى) فَقَالُوا: يَا رَسُولَ اللهِ إِنَّا لَا نَسْتَطِيعُ أَنْ نَأْتِيكَ إِلَّا فِي الشَّهْرِ الْحَرَامِ وَبَيْنَنَا وَبَيْنَكَ هَذَا الْحَيُّ مِنْ كُفَّارِ مُضَرَ فَمُرْنَا بِأَمْرٍ فَصْلٍ نُخْبِرْ بِهِ مَنْ وَرَاءَنَا وَنَدْخُلْ بِهِ الْجَنَّةَ وَسَأَلُوهُ عَنْ الْأَشْرِبَةِ فَأَمَرَهُمْ بِأَرْبَعٍ وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ أَمَرَهُمْ بِالْإِيمَانِ بِاللهِ وَحْدَهُ قَالَ: (أَتَدْرُونَ مَا الْإِيمَانُ بِاللهِ وَحْدَهُ) قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ قَالَ: (شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ وَإِقَامُ الصَّلَاةِ وَإِيتَاءُ الزَّكَاةِ وَصِيَامُ رَمَضَانَ وَأَنْ تُعْطُوا مِنْ الْمَغْنَمِ الْخُمُسَ) وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ عَنْ الْحَنْتَمِ وَالدُّبَّاءِ وَالنَّقِيرِ وَالْمُزَفَّتِ وَرُبَّمَا قَالَ الْمُقَيَّرِ وَقَالَ: (احْفَظُوهُنَّ وَأَخْبِرُوا بِهِنَّ مَنْ وَرَاءَكُمْ).

2- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రకారం: అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?అని అడిగారు. దానికి వారు ‘మేము రబీఅ తెగకు చెందిన వాళ్ళము’ అని అన్నారు. “ఓహో! మీరా, స్వాగతం! గౌరవనీయులారా!” ఏలాంటి సిగ్గు, అవమానం లేకుండా రావచ్చు!” అని ప్రవక్త అన్నారు. వారన్నారుః “ప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ముజర్ తెగ అడ్డు గోడగా ఉంది. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ సన్నిధికి రాలేము. ఇప్పుడు మాకేమైనా స్వర్గ ప్రవేశానికి ఉపయోగపడే విషయాలు, స్పష్టమైన గీటురాయి ఆదేశాలు ఇవ్వండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరికి రానటువంటి వారికి కూడా వినిపస్తాము. అంతే కాదు, పానీయాలను గురించి కూడా వారు ప్రవక్తని అడిగారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలను మానుకోవాలని ఆదేశించారు. ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలని చెబుతూ “ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు. (మాకు తెలియదు) అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదపరిచారుః “ఏకైక అల్లాహ్ ను విశ్వసించటమంటే అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనచేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. నమాజు వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి, రమజాను ఉపవాసాలు పాటించాలి, యుద్ధ ప్రాప్తిలో ఐదవ వంతు సొమ్ము, ప్రభుత్వ ధనగారానికి ఇవ్వాలి”. ఆ తర్వార, హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్([1]). అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, త్రాగడాన్ని  వారించారు. హదీసు ఉల్లేఖకులు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒక్కోసారి ముజఫ్ఫత్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడికి రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయండి” అని అన్నారు. (బుఖారి 53, ముస్లిం 17).

ఈ హదీసులో:

ఆచరణలు విశ్వాసములో ఓ భాగము. గురువు, మొదట సంక్షిప్తంగా చెప్పిన మాటను తర్వాత వివరించి చెప్పుట అభిలషణీయం. అందువల్ల అతని మాట అర్థమవుతుంది. గురువు హితబోధ చేస్తున్నప్పుడు ‘మూలజ్ఞానం మరియు అతిముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలని మరియు అర్థమగుటకు సంగ్రహముగా చెప్పాలని కూడా ఈ హదీసు సూచిస్తుంది. చూడడానికి ఇందులో ఐదు ఆదేశాలు కనబడుతున్నాయి. అయితే యుద్ధప్రాప్తిలోని ఐదో వంతు విషయం జకాత్ పరిధిలోనే వస్తుంది. ఎందుకనగా అది ధనం, సొమ్ముకు సంబంధించినదే కదా. ఇలా ఆదేశాలు నాలుగే అవుతాయి.

కొందరు హదీసువేత్తల అభిప్రాయ ప్రకారం పైన చెప్పబడిన నాలుగు నివారణలు రద్దయినాయి. అంటే ఇతర సహీ హదీసుల ఆధారంగా ఆ పాత్రలు ధర్మసమ్మతమైన పానీయాలు త్రాగడానికి ఉపయోగించవచ్చు.

(మదిలో, ఆచరణ రూపంలో) విద్యను భద్రపరచి, ఇతరులకు అందజేయడం గురించి ఈ హదీసులో ప్రోత్సహించబడింది. విద్యభ్యాసం క్రమపద్ధతిలో ఉండడం మంచిదని చెప్పబడింది.

ఇందులో హజ్ ప్రస్తావన రాలేదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాలు ఇచ్చేటప్పడు హజ్ యాత్ర విధిగా నిర్ణయించబడలేదు అని కొందరు పండితులు చెప్పారు.

వచ్చేవారితో వారి పేరు, వంశం గురించి అడగడం జరిగింది. ఇది సున్నత్ (ప్రవక్తవారి సత్సంప్రదాయం). వచ్చే అతిథుల మనుసు చూరగొని, ఒంటరితన భావాన్ని దూరం చేయుటకు మంచి పద్ధతిలో స్వాగతం పలకాలని ఈ హదీసులో ఉంది.

ఈ హదీసులో ఇస్లాం యొక్క అర్కాన్ (మౌలిక విషయా)లను ఈమాన్ యొక్క వ్యాఖ్యానంలో తెలుపడం జరిగింది. దీనితో తెలిసిందేమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ ప్రస్తావన విడివిడిగా వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఇస్లాం మరియు ఈమాన్ రెండింటికి సంబంధించిన అర్కానులు వస్తాయి. మరెప్పుడైతే రెండింటి ప్రస్తావన ఒకచోట వస్తుందో దేని భావం దానికే ఉంటుంది


([1]) హన్తమ్:- పచ్చ లేక ఎర్ర రంగు మట్టి కడవను అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా పార్శ్వ భాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారు చేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపు రంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బాః- పాత్రగా ఉపయోగించే బోలు సోరకాయను దుబ్బా అంటారు. నఖీర్:- ఖర్జూరపు చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముజఫ్ఫత్:- ఉమ్మి నీటితో లేపనం చేసిన మట్టి పాత్రను అంటారు. ముఖయ్యర్:- చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన లేపనం తయారు చేస్తారు. దాంతో లేపనం చేయబడిన పాత్రను అంటారు. ఈ లేపనాన్ని ఓడలక్కూడా ఉపయోగిస్తారు.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – 1వ క్లాస్ – “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి” [వీడియో]

బిస్మిల్లాహ్

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

دروس في العقيدة – విశ్వాస పాఠాలు

[آَمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِن رَبِّهِ وَالمُؤْمِنُونَ كُلٌّ آَمَنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ المَصِيرُ] {البقرة: 285}

{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించినదానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించినవారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారుః “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలి వస్తాము}. (సూరె బఖర 2:285).

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ > قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్బు ఉల్లేఖించారుః “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకుః) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907). విశ్వాస పాఠాలు

ఈ హదీసులో:

ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయిః

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] {الزُّمر:3} [مُخْلِصِينَ لَهُ الدِّينَ] {البيِّنة:5} [لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ] {الزُّمر:65}

{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3).
{పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించు- కోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5).
{మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).

ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగాః మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.

సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.

ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.

ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.

ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.

అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం, దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప. (ఉదాః హజ్).


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/