1.10 జుమా ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

485 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا جَاءَ أَحَدُكمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 2 باب فضل الغسل يوم الجمعة

485. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “జుమా (నమాజు) కు వచ్చేవాడు గుస్ల్ (స్నానం) చేసి రావాలి.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 2వ అధ్యాయం – ఫజ్లిల్ గుస్లి యౌముల్ జుమా)

486 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ ابْنِ عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ بَيْنَمَا هُوَ قَائمٌ فِي الْخُطْبَةِ يَوْمَ الْجُمُعَةِ إِذْ دَخَلَ رَجُلٌ مِنَ الْمُهَاجِرينَ الأَوَّلَينَ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَادَاهُ عُمَرُ: أَيَّةُ سَاعَةٍ هذِهِ قَالَ: إِنِّي شُغِلْتُ فَلَمْ أَنْقَلِبْ إِلَى أَهْلِي حَتَّى سَمِعْتُ التَّأْذينَ، فَلَمْ أَزِدْ عَلَى أَنْ تَوَضَّأْتُ فَقَالَ: وَالْوُضُوءُ أَيْضًا وَقَدْ عَلِمتَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَأْمُرُ بِالْغُسْلِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 2 باب فضل الغسل يوم الجمعة

486. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జుమా ప్రసంగం చేస్తుంటే, ప్రవక్త సహచరుల్లో ముహాజిరీన్ వర్గానికి చెందిన గతకాల* అగ్రగణ్యుల్లోని ఒక సహాబి (ప్రవక్త సహచరుడు) వచ్చారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని ఉద్దేశించి “మీరిలా ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటీ?” అని ప్రశ్నించారు. దానికి ఆ సహాబి (రదియల్లాహు అన్హు) “నేనొక ముఖ్యమైన పనిలో ఉండిపోవడం వలన కాస్త ఆలస్యమయింది. నేను (పని ముగించుకొని) ఇంటికి వచ్చేటప్పటికి అజాన్ వినపడసాగింది. వెంటనే నేను వుజూ మాత్రమే చేసి, మరేపనీ చేయకుండా (నమాజుకు) వచ్చేశాను” అని అన్నారు. “ఏమిటీ వుజూ మాత్రమే చేశారా? (జుమా నమాజు కోసం) స్నానం (గుస్ల్) చేయాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించిన సంగతి తెలియదా?” అని అన్నారు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు).

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 2వ అధ్యాయం – ఫజ్లిల్ గుస్లి యౌముల్ జుముఆ]

* గతకాల అగ్రగణ్యులు అంటే బద్ర్ యుద్ధంలో పాల్గొన్న వారు, రిజ్వాన్ శపథం చేసినవారు, రెండు ఖిబ్లాల (బైతుల్ మఖ్దిస్, కాబా షరీఫ్)ల వైపు అభిముఖులై నమాజ్ చేసినవారు – అని అర్థం. వారిలో ఒక సహాబీ అంటే హజ్రత్ ఉస్మాన్ జున్నూరైన్ (రదియల్లాహు అన్హు) అని అర్థం. ఇస్లామీయ చరిత్రలో ఈ సంఘటన కూడా సమతా, న్యాయాలకు ఒక మచ్చుతునక. ఆత్మపరిశీలన విషయంలోగానీ, విమర్శ విషయంలో గానీ అందరూ సమానులేనని ఈ సంఘటన తెలియజేస్తోంది.

487 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 161 باب وضوء الصبيان ومتى يجب عليهم الغسل

487. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “ప్రతి వయోజన పురుషుడు శుక్రవారం నాడు తప్పనిసరి (వాజిబ్)గా స్నానం చేయాలి. (*)

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 16వ అధ్యాయం – వుజూ ఆస్సిబ్యాని వ మతా యజిబు అలైహిముల్ గుస్ల్)

* ఈ హదీసుని బట్టి శుక్రవారం రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలని తెలుస్తోంది. దీన్ని కొందరు సహాబీలు పాటించారు. అయితే హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం బట్టి శుక్రవారం స్నానం వాజిబ్ (విధి) కాదని మస్తహిబ్ (అభిలషణీయం) మాత్రమేనని కూడా మరొక వైపు తెలుస్తోంది. అందువల్ల అత్యధిక మంది ధర్మవేత్తలు ఈ పద్ధతినే అవలంబించారు. దీనికి మరింత బలం చేకూర్చుతున్న మరో హదీసు ఉంది. అందులో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా (శుక్రవారం రోజు) వుజూ చేస్తే సరే (సరిపోతుంది). అయితే గుసుల్ చేయడం మరింత మంచిది”

488 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: كَانَ النَّاسُ يَنْتَابُونَ يَوْمَ الْجُمُعَةِ مِنْ مَنَازِلِهِمْ وَالْعَوَالِي، فَيَأْتُونَ فِي الْغُبَارِ، يُصِيبُهُمُ الْغُبَارُ وَالْعَرَقُ، فَيَخْرُجُ مِنْهُمُ الْعَرَقَ فَأَتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنْسَانٌ مِنْهُمْ وَهُوَ عِنْدِي، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ أَنَّكُمْ تَطَهَّرْتُمْ لِيَوْمِكُمْ هذَا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 15 باب من أين تؤتى الجمعة

488. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు ప్రజలు తమ ఇండ్లలో నుంచి మదీనా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి, దుమ్ము, ధూళి కొట్టుకొని చెమటలతో తడిసి గుంపులు గుంపులుగా (జుమా నమాజుకు) వచ్చేవారు. దుమ్ముతో కలిసి చెమట కారుతూ (దుర్వాసన కొడుతూ) ఉండేది. ఒకసారి అలాంటి వారిలో ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చాడు. ఆ సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గర కూర్చొని ఉన్నారు. ఆయన ఆ వ్యక్తిని చూసి “ఈ రోజు మీరు (ప్రజలు) గనక శుచి శుభ్రతలు పాటిస్తే (అంటే స్నానం చేసి ఉంటే) ఎంత బాగుంటుంది?” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 15వ అధ్యాయం – మిన్ ఐన తూతల్ జుముఆ]

489 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّاسُ مَهَنَةَ أَنْفُسِهِمْ، وَكَانُوا إذَا رَاحُوا إِلَى الْجُمُعَةِ رَاحُوا فِي هَيْئَتِهِمْ، فَقِيلَ لَهُمْ لَوِ اغْتَسَلْتُمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الجمعة: 16 باب وقت الجمعة إذا زالت الشمس

489. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రజలు (ఆ కాలంలో) తమ పనులు తామే చేసుకునేవారు. (అలా పనులు చేసి) జుమా నమాజుకు అవే బట్టలతో (దుమ్ము చెమటలతో కూడిన) శరీరంతో వచ్చేవారు. అందువల్ల ‘మీరు స్నానం చేసి వస్తే ఎంత బాగుండేది’ అని (దైవప్రవక్త) చెప్పేవారు వారికి.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 16వ అధ్యాయం – వఖ్తిల్ జుముఅతి ఇజా జాలతిషమ్స్)

490 – حديث أَبِي سَعِيدٍ، قَالَ: أَشْهَدُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ، وَأَنْ يَسْتَنَّ، وَأَنْ يَمَسَّ طيبًا، إِنْ وَجَدَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 3 باب الطيب للجمعة

490. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “శుక్రవారం రోజు ప్రతి ముస్లిం యువజనుడు విధి (వాజిబ్)గా స్నానం చేయాలి. మిస్వాక్ (బ్రష్) కూడా చేయాలి. ఉంటే సువాసనలు కూడ పూసుకోవాలి.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 3వ అధ్యాయం – అత్తీ బిలిల్ జుముఆ]

491 – حديث ابْنِ عَبَّاسٍ عَنْ طَاوُسٍ عَنِ ابْنِ عَبَّاسٍ، أَنَّهُ ذَكَرَ قَوْلَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْغُسْلِ يَوْمَ الْجُمُعَةِ، فَقُلْتُ لاِبْنِ عَبَّاسٍ: أَيَمَسُّ طيبًا أَو دُهْنًا إِنْ كَانَ عِنْدَ أَهْلِهِ فَقَالَ: لاَ أَعْلَمُهُ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 6 باب الدهن للجمعة

491. హజ్రత్ తావూస్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) స్నానం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించిన ఒక హదీసు విన్పించారు. అప్పుడు నేను జోక్యం చేసుకుంటూ, “ఈ హదీసులో, అతని భార్య దగ్గర తైలం సువాసనలు ఉంటే వాటిని సయితం ఉపయోగించాలన్న విషయం కూడా ఉందా?” అని అడిగాను. దానికి ఆయన “ఈ సంగతి నాకు తెలియదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం, జుమా, 6వ అధ్యాయం – అద్దుహ్నిలిల్ జుముఆ]

492 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: حَقٌّ عَلَى كُلِّ مُسْلِمٍ أَنْ يَغْتَسِلَ فِي كُلِّ سَبْعَةِ أَيّامٍ يَوْمًا يَغْسِلُ فِيهِ رَأْسَهُ وَجَسَدَهُ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 12 باب هل على من لم يشهد الجمعة غسل من النساء والصبيان وغيرهم

492. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రతి ముస్లిం వారానికి (కనీసం) ఒకసారి స్నానం చేయాలి. ఆ స్నానంలో తల, శరీరం పూర్తిగా కడుక్కోవాలి. ఇది ముస్లింలపై ఉన్న అల్లాహ్ హక్కు.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 12వ అధ్యాయం – హల్ అలామన్ లమ్ యష్ హదుల్ జుముఅత గుస్లున్ మినన్నిసా]

493 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ غُسْلَ الْجَنَابَةِ ثُمَّ رَاحَ فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الْخَامِسَةِ فَكَأَنَّما قَرَّبَ بَيْضَةً، فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ الْمَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 4 باب فضل الجمعة

493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తిస్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళేవాడికి ఒక పొట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళేవాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 4వ అధ్యాయం – ఫజ్లిల్ జుముఆ]

494 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا قُلْتَ لِصَاحِبِكَ يَوْمَ الْجُمُعَةِ أَنْصِتْ، وَالإِمَامُ يَخْطُبُ، فَقَدْ لَغَوْتَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 36 باب الإنصات يوم الجمعة والإمام يخطب

494. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడిన వారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 36వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్)

495 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَكَرَ يَوْمَ الْجُمُعَةِ، فَقَالَ: فيهِ سَاعَةٌ لاَ يُوَافِقُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ قَائمٌ يُصَلِّي، يَسْأَلُ اللهَ تَعَالَى شَيْئًا إِلاَّ أَعْطَاهُ إِيَّاهُ وَأَشَارَ بِيَدِهِ يُقَلِّلُهَا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 37 باب الساعة التي في يوم الجمعة

495. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా గురించి ప్రస్తావిస్తూ ఇలా ప్రవచించారు:- “ఆ రోజు ఓ ప్రత్యేక (శుభ) ఘడియ ఉంది. ఆ ఘడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాహ్ ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు.” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంగతి చెబుతూ “ఆ ఘడియ అతి స్వల్పంగా ఉంటుంది” అని చేత్తో సైగ చేశారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 37వ అధ్యాయం – అస్సా అతిల్లతీ ఫీయౌమిల్ జుముఅ]

496 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نَحْنُ الآخِرُونَ السَّابِقُونَ يَوْمَ الْقِيَامَةِ، بَيْدَ كُلُّ أُمَّةٍ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا، وَأُوتينَا مِنْ بَعْدِهِمْ؛ فَهذَا الْيَوْمُ الَّذي اخْتَلَفُوا فِيهِ؛ فَغَدًا لِلْيَهُودِ، وَبَعْدَ غَدٍ لِلنَّصَارَى
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان

496. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) క్రైస్తవులకు లభించింది.”

[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్]

497 – حديث سَهْلٍ، قَالَ: مَا كُنَّا نَقِيلُ وَلاَ نَتَغَدَّى إِلاَّ بَعْدَ الْجُمُعَةِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 40 باب قول الله تعالى: (فإِذا قضيت الصلاة فانتشروا في الأرض)

497. హజ్రత్ సహల్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మేము (దైవప్రవక్త కాలంలో) శుక్రవారం రోజు నమాజుకు పూర్వం అన్నం తినడం గాని, విశ్రాంతి తీసుకోవడం గాని చేసే వాళ్ళము కాము. నమాజు ముగించిన తరువాతనే ఈ పనులు చేసే వాళ్ళం.”

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 40వ అధ్యాయం – ఖాలల్లాహుతాలా ఫయిజా ఖుజియతిస్సలాతు ఫన్తషిరూ ఫిల్ అర్జ్)

498 – حديث سَلَمَةَ بْنِ الأَكْوَعِ قَالَ: كُنَّا نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْجُمُعَةَ ثُمَّ نَنْصَرِفُ وَلَيْسَ لِلْحِيطَانِ ظِلٌّ نَسْتَظِلُّ فِيهِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 35 باب غزوة الحديبية

498. హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నమాజు చేశాక ఇండ్లకు తిరిగి వస్తున్నప్పుడు గోడలు మేము ఆశ్రయం పొందే అంత నీడలు ఇచ్చేవి కావు. (సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 35వ అధ్యాయం – గజ్వతుల్ హుదైబియా)

499 – حديث ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ قَائمًا، ثُمَّ يَقْعُدُ، ثُمَّ يَقُومُ، كَمَا تَفْعَلُونَ الآنَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 27 باب الخطبة قائما

499. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిలబడి (జుమా) ప్రసంగం చేసేవారు. మధ్యలో కాసేపు కూర్చుంటారు. తర్వాత తిరిగి లేచి మీరీనాడు ప్రసంగిస్తున్నట్లే నిలబడి ప్రసంగించేవారు. (సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 27వ అధ్యాయం – అల్ ఖుత్బతి ఖాయిమా)

500 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ أَقْبَلَتْ عيرٌ تَحْمِلُ طَعَامًا، فَالْتَفَتُوا إِلَيْهَا، حَتَّى مَا بَقِيَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلاَّ اثْنَا عَشَرَ رَجُلاً، فَنَزَلَتْ هذِهِ الآيَةُ (وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انْفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائمًا)
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 38 باب إذا نفر الناس عن الإمام في صلاة الجمعة فصلاة الإمام ومن بقى جائزة

500. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక (జుమా) నమాజు చేస్తుంటే, ఆహారధాన్యాలు తీసుకొని ఒక వర్తక బిడారం (నగరానికి) వచ్చింది. దాంతో చాలా మంది జనం దానివైపు దృష్టి మరల్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు పన్నెండుమంది మాత్రమే (మస్జిదులో) ఉండిపోయారు. ఆ సందర్భంలో “వ ఇజా రఔ తిజారతన్ ఔ లహ్ వానిన్ ఫజూ ఇలైహా వతర కూక ఖాయిమా” (వారు వ్యాపారం, వినోదం, తమాషా జరుగుతుంటే చూసి నిన్ను ఒంటరిగా వదిలేసి అటువైపు పరుగెత్తారు” అనే (జుమా సూరాలోని) సూక్తి అవతరించింది.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 38వ అధ్యాయం – ఇజానఫరన్నాసు అనిల్ ఇమామి ఫీ సలాతిల్ జుముఆ]

501 – حديث يَعْلَى بْنِ أُمَيَّةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ عَلَى الْمِنْبَرِ (وَنَادَوْا يَا مَالِكُ)
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 7 باب إذا قال أحدكم آمين والملائكة في السماء

501. హజ్రత్ యాలబిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (శుక్రవారం రోజు) “వ నాదవ్ యా మాలికు లియఖ్జి అలైనా రబ్బుక్’ (జుఖ్రుఫ్ సూరా –77వ సూక్తి) అనే సూక్తి పఠిస్తుంటే నేను విన్నాను.

[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్ , 7వ అధ్యాయం – ఇజా ఖాల అహదుకుమ్ ఆమీని…]

502 – حديث جَابِرٍ قَالَ: دَخَلَ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ فَقَالَ: أَصَلَّيْتَ قَالَ: لاَ، قَالَ: فَصَلِّ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 33 باب من جاء والإمام يخطب صلى ركعتين خفيفتين

502. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి శుక్రవారం రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తుంటే, ఒక వ్యక్తి అప్పుడే మస్జిదులోనికి ప్రవేశించాడు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని ఉద్దేశించి “నీవు నమాజు చేశావా?” అని అడిగారు. దానికా వ్యక్తి చేయలేదన్నాడు. “అయితే ముందు రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యి” అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 33వ అధ్యాయం – మన్ జా అవల్ ఇమామి యఖ్ తుబు సలారకాతైని ఖఫీఫతైన్]

503 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَهُوَ يَخْطُبُ: إِذَا جَاءَ أَحَدُكُمْ وَالإِمَامُ يَخْطُبُ أَوْ قَدْ خَرَجَ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 25 باب ما جاء في التطوع مثنى مثنى

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినపుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.* [సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజుద్, 25వ అధ్యాయం – మాజాఆ ఫిత్తత్వా మన్నామన్నా]

504 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ فِي الْجُمُعَةِ، فِي صَلاَةِ الْفَجْرِ، آلَم تَنْزيلُ، السَّجْدَةَ، وَهَلْ أَتَى عَلَى الإِنْسَانِ أخرجه البخاري في، 11 كتاب الجمعة: 10 باب ما يقرأ في صلاة الفجر يوم الجمعة

504. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజులో సజ్దా దహర్ సూరాలు పఠించేవారు. [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 10వ అధ్యాయం – మాయఖ్రావు ఫీసలాతిల్ ఫజ్రి యౌముల్ జుముఆ]

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1.9 ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం| మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

398 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ قَالَتْ: فَرَضَ اللهُ الصَّلاَةَ حِينَ فَرَضَهَا رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فِي الْحَضَرِ وَالسَّفَرِ، فَأُقِرَّتْ صَلاَةُ السَّفَرِ، وَزِيدَ فِي صَلاَةِ الْحَضَرِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 كيف فرضت الصلوات في الإسراء

398. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)

399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها

399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-

నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)

400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه

400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]

401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة
سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر

401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-

మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.

(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)

1.7 నమాజు ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

213 – حديث ابْنِ عُمَرَ كَانَ يَقُولُ: كَانَ الْمُسْلِمُونَ حِينَ قَدِمُوا الْمَدِينَةَ يَجْتَمِعُونَ فَيَتَحيَّنُونَ الصَّلاَةَ، لَيْسَ يُنَادَى لَهَا؛ فَتَكَلَّمُوا يَوْمًا فِي ذَلِكَ، فَقَالَ بَعْضُهُمْ اتَّخِذُوا نَاقُوسًا مِثْلَ نَاقُوسِ النَّصَارَى، وَقَالَ بَعْضُهُمْ: بَلْ بُوقًا مِثْلَ بُوقِ الْيَهُودِ؛ فَقَالَ عُمَرُ رضي الله عنه: أَوَلاً تَبْعَثُونَ رَجُلاً يُنَادِي بِالصَّلاَةِ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا بِلاَلُ قُمْ فَنَادِ بِالصَّلاَةِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 1 باب بدء الأذان

213. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ముస్లింలు మదీనా వచ్చిన తరువాత ప్రారంభంలో నమాజు కోసం అజాన్ చెప్పే సంప్రదాయం ఉండేది కాదు, నిర్ణీత వేళకు ప్రజలు తమంతట తామే (మస్జిద్ లో) గుమిగూడి నమాజు చేసుకునేవారు. కొన్నాళ్ళ తరువాత ఓ రోజు ముస్లింలు దీన్ని గురించి పరస్పరం సంప్రదించుకోవడానికి సమావేశమయ్యారు. అప్పుడు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ “క్రైస్తవుల మాదిరిగా ఒక గంట ఏర్పాటు చేసుకొని మోగించాల’ని అన్నారు. మరి కొందరు యూదుల మాదిరిగా శంఖం ఊదాలని అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ, “మనం నమాజు ప్రకటన కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎందుకు నియమించుకోకూడదు?” అని అన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సలహా విని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)తో “లే, లేచి నమాజు కోసం ప్రకటన చెయ్యి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 1వ అధ్యాయం – బయీల్ అజాన్]

ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఉపదేశం, ముఖ్యంగా 40 సం. దాటిన ప్రతి ఒక్క విశ్వాసికి [ఆడియో ]

ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఉపదేశం, ముఖ్యంగా 40 సం. దాటిన ప్రతి ఒక్క విశ్వాసికి
https://youtu.be/nWrwm6_2jLQ [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జిహాద్ అంటే ఏమిటి? చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది? [వీడియో]

జిహాద్ అంటే ఏమిటి? అవిశ్వాసుల_సందేహం – చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది?
https://youtu.be/gSMYVw32Mr4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

Al-Hajj 22:39
أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا۟ۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్‌ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.

Al-Baqarah 2:190
وَقَٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمْ وَلَا تَعْتَدُوٓا۟ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ
మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్‌ ఇష్టపడడు.

Al-Anfal 8:61
وَإِن جَنَحُوا۟ لِلسَّلْمِ فَٱجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.

An-Nisa’ 4:90
… فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
… కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్‌ మీకు మార్గం తెరచి ఉంచలేదు

2.7 ఖుర్భానీ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1280 – حديث جُنْدَبٍ، قَالَ: صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَوْمَ النَّحْرِ ثُمَّ خَطَبَ ثُمَّ ذَبَحَ، فَقَالَ: مَنْ ذَبَحَ قَبْلَ أَنْ يُصَلِّيَ فَلْيَذْبَحْ أُخْرَى مَكَانَهَا، وَمَنْ لَمْ يَذْبَحْ فَلْيذْبَحْ بِاسْمِ اللهِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 23 باب كلام الإمام والناس في خطبة العيد

1280. హజ్రత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఈదుల్ అద్ హా (బక్రీద్ పండుగ) రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మొదట నమాజు చేశారు. తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. ఆ తరువాత బలి (ఖుర్బానీ) పశువుని జిబహ్ చేశారు. (ఆ సందర్భంలో) ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరైనా నమాజుకు పూర్వం పశువుని జిబహ్ చేసి ఉంటే అతను దానికి బదులు మళ్ళీ మరొక పశువుని జిబహ్ చేయాలి. నమాజుకు ముందు ఖుర్బానీ ఇవ్వనివాడు (నమాజు తరువాత) అల్లాహ్ పేరుతో (అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి) పశువుని జిబహ్ చేయాలి”.

(సహీహ్ బుఖారీ:- 13వ ప్రకరణం – ఈదైన్, 23వ అధ్యాయం – కలామిల్ ఇమామి వన్నాసి ఫీ ఖుత్భతిల్ ఈద్)

2.12 – వ్యాధులు & వైద్యం – మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1411 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَيْنُ حَقٌّ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 36 باب العين حق

1411. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- “దిష్టి తగలడం వాస్తవమే”. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 3వ అధ్యాయం-ఆల్ ఐను హఖ్ )

1412 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُحِرَ، حَتَّى كَانَ يَرَى أَنَّهُ يَأْتِي النِّسَاءَ وَلاَ يَأْتِيهِنَّ قَالَ سُفْيَانُ (أَحَدُ رِجَالِ السَّنَدِ) وَهذَا أَشَدُّ مَا يَكُونُ مِنَ السِّحْرِ إِذَا كَانَ كَذَا فَقَالَ: يَا عَائِشَةُ أَعَلِمْتِ أَنَّ اللهَ قَدْ أَفْتَانِي فِيمَا اسْتَفْتَيْتُهُ فِيهِ أَتَانِي رَجُلاَنِ فَقَعَدَ أَحَدُهُمَا عِنْدَ رَأْسِي، وَالآخَرُ عِنْدَ رِجْلَيَّ، فَقَالَ الَّذِي عِنْدَ رَأْسِي لِلآخَرِ: مَا بَالُ الرَّجُلِ قَالَ: مَطْبُوبٌ قَالَ: وَمَنْ طَبَّهُ قَالَ: لُبَيْدُ ابْنُ أَعْصَمَ، رَجُلٌ مِنْ زُرَيْقٍ، حَلِيفٌ لِيَهُودَ، كَانَ مُنَافِقًا قَالَ: وَفِيمَ قَالَ: فِي مُشْطٍ وَمُشَاقَةٍ قَالَ: وَأَيْنَ قَالَ: فِي جُفِّ طَلْعَةٍ ذَكَرٍ تَحْتَ رَعُوفَةٍ، فِي بِئْرِ ذَرْوَانَ قَالَتْ: فَأَتَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْبِئْرَ حَتَّى اسْتَخْرَجَهُ فَقَالَ: هذِهِ الْبِئْرُ الَّتِي أُرِيتُهَا وَكَأَنَّ [ص:60] مَاءَهَا نُقَاعَةُ الْحِنَّاءِ، وَكأَنَّ نخْلَهَا رُؤُوسُ الشَّيَاطِينِ قَالَ: فَاسْتُخْرِجَ قَالَتْ: فَقُلْتُ أَفَلاَ، أَي، تَنَشَّرْتَ فَقَالَ: أَمَا وَاللهِ فَقَدْ شَفَانِي، وَأَكْرَهُ أَنْ أُثِيرَ عَلَى أَحَدٍ مِنَ النَّاسِ شَرًّا
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 49 باب هل يستخرج السحر

1412. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేతబడి చేయబడింది. దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలను కలుసుకోకపోయినా కలుసుకున్నానేమోనని అనుమానించేవారు – ఈ హదీసు ఉల్లేఖకుల్లో హజ్రత్ సుఫ్యాన్ (రహిమహుల్లాహ్) దీనిపై వ్యాఖ్యానిస్తూ, “ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే అది చాలా తీవ్రమైన చేతబడి అని భావించాలి” అని అన్నారు –

తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో (అంటే హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హాతో) ఇలా అన్నారు. ఆయిషా! నీకు తెలుసా? నేను అల్లాహ్ ని ఈ బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకుంటే ఆయన దీనికి పరిష్కార మార్గం చూపించాడు.

(కలలో) నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు నా తలవైపు, మరొకడు నా కాళ్ళవైపు కూర్చున్నాడు. తలవైపు కూర్చున్నవాడు “ఇతనికి ఏమయింది?” అని అడిగాడు రెండవ వ్యక్తిని. “ఇతనికి చేతబడి చేశారు” అన్నాడు రెండవ వ్యక్తి. “ఎవరు చేశారు?” అడిగాడు మొదటి వ్యక్తి. “లుబైద్ బిన్ ఆసిమ్ చేశాడు” అన్నాడు రెండవ వ్యక్తి. (లుబైద్, బనీ జరఖ్ తెగకు చెందిన వాడు, కపట విశ్వాసి, యూదుల పక్షపాతి). “ఈ చేతబడి ఎందులో చేశాడు?” మొదటి వ్యక్తి ప్రశ్నించాడు. “దువ్వెన, దువ్వెనతో రాలిన వెండ్రుకలలో” సమాధానమిచ్చాడు రెండవ వ్యక్తి. “ఎక్కడ చేశాడు?” అడిగాడు మొదటి వ్యక్తి, “పోతు ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ బావిలో ఒక రాతి క్రింద అదిమి పెట్టాడు” అన్నాడు రెండవ వ్యక్తి.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతబడిని (వస్తువుల్ని) తీసి వేయించడానికి (అనుచరుల్ని వెంట బెట్టుకొని) ఆ బావి దగ్గరకు వెళ్ళారు. “నాకు (కలలో) చూపించబడిన బావి ఇదే” అన్నారు ఆయన. ఆ బావిలోని నీరు గోరింటాకు రంగులా (ఎర్రగా) మారిపోయింది. అక్కడి ఖర్జూర చెట్లు కూడా పిశాచ తలలు మాదిరిగా తయారయిపోయాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞతో ఆ బావిలోని చేతబడి (వస్తువుల)ని తీసివేయడం జరిగింది. ఆ తరువాత నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “మీరు చేతబడికి విరుగుడు ఎందుకు చేయలేదు?” అని అడిగాను. దానికి ఆయన సమాధానమిస్తూ, “దైవసాక్షి! అల్లాహ్ నాకు స్వస్థత చేకూర్చినప్పుడు, నేను అనవసరంగా ఇతరుల మీద లంఘించి జనంలో అలజడి సృష్టించడం బాగుండదు. అలా చేయడం నాకిష్టం లేదు” అని అన్నారు.


(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 49వ అధ్యాయం – హల్ యుస్తఖ్రజ్ అస్-సిహ్ర్)

2.22 – పశ్చాత్తాప ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1746 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَقُولُ اللهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي وَأَنَا مَعَهُ إِذَا ذَكَرَنِي فَإِنْ ذَكَرَنِي فِي نَفْسِهِ، ذَكَرْتُهُ فِي نَفْسِي وَإِنْ ذَكَرَنِي فِي ملإٍ، ذَكَرْتُهُ فِي مَلإٍ خَيْرٍ مِنْهُمْ وَإِنْ تَقَرَّبَ إِلَيَّ بِشِبْرٍ، تَقَرَّبْتُ إِلَيْهِ ذِرَاعًا وَإِنْ تَقَرَّبَ إِلَيَّ ذِرَاعًا، تَقَرَّبْتُ إِلَيْهِ بَاعًا وَإِنْ أَتَانِي يَمْشِي، أَتَيْتُهُ هَرْوَلَةً
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 15 باب قول الله تعالى (ويحذركم الله نفسه)

1746. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు :-

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు – “నా దాసుడు నా గురించి ఎలా ఊహించుకుంటాడో నేనతని కోసం అలాగే ఉంటాను. నా దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా పేరు స్మరిస్తున్నప్పుడు నేనతని వెన్నంటి ఉంటాను. అతను నన్ను మనసులో జ్ఞాపకం చేస్తే నేను కూడా మనసులో జ్ఞాపకం చేస్తాను. అతను గనక ఏదైనా సమావేశంలో నా గురించి ప్రస్తావిస్తే నేను అంతకంటే శ్రేష్ఠమైన (దైవదూతల) సమావేశంలో అతడ్ని గురించి ప్రస్తావిస్తాను. నా దాసుడు నా వైపు ఒక జానెడు జరిగి వస్తే నేనతని వైపుకు ఒక బారెడు జరిగి వస్తాను. అతను నా వైపుకు ఒక బారెడు పురోగమిస్తే నేనతని వైపుకు రెండు బారలు పురోగమిస్తాను. అతను నా వైపుకు నడచి వస్తే నేనతని వైపుకు పరుగెత్తుకొస్తాను.”

(సహీహ్ బుఖారీ:- 97వ ప్రకరణం – అత్ తౌహీద్, 15వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వయుహజ్జిరుకు ముల్లాహ నఫ్సహు)

1747 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: للهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ، مِنْ رَجُلٍ نَزَلَ مَنْزِلاً، وَبِهِ مَهْلَكَةٌ، وَمَعَهُ رَاحِلَتُهُ، عَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ فَوَضَعَ رَأْسَهُ، فَنَامَ نَوْمَةً، فَاسْتَيْقَظَ، وَقَدْ ذَهَبَتْ رَاحِلَتُهُ حَتَّى اشْتَدَّ عَلَيْهِ الْحَرُّ [ص:239] وَالْعَطَشُ، أَوْ مَا شَاءَ اللهُ، قَالَ: أَرْجِعُ إِلَى مَكَانِي فَرَجَعَ، فَنَامَ نَوْمَةً، ثُمَّ رَفَعَ رَأْسَهُ، فَإِذَا رَاحِلَتُهُ عِنْدَهُ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة

1747. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు :

“ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరికి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తల పైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా)పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.”

(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)

1748 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضٍ فَلاَةٍ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة

1748. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎలాంటి అన్న పానీయాలు లభించని భయంకర ఎడారి ప్రాంతంలో తప్పిపోయిన తన ఒంటె తిరిగి లభించినపుడు ఒక బాటసారి ఎంత సంతోషిస్తాడో అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం పట్ల అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు.”

(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)

81. తఫ్సీర్ సూర తక్వీర్ (Tafsir Surah Takweer) [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తక్వీర్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1eUZmfRFb8Sghnt6K-nwlM

2.24 – స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1797 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 28 باب حجبت النار بالشهوات

1797. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మనో వాంఛలతో కప్పి వేయబడింది. స్వర్గం కష్టాలు కడగండ్లతో కప్పివేయబడింది.” *

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 28వ అధ్యాయం – హుజిబతిన్నారు బిషహవాత్)

* అంటే స్వర్గంలో ప్రవేశించే మార్గం కష్టాలు, కడగండ్లతో నిండి ఉంది. మరో మాటలో చెప్పాలంటే స్వర్గప్రవేశం చేయాలంటే కష్టాలు, బాధలు సహించవలసి ఉంటుందన్నమాట. అలాగే నరకానికి దారితీసే మార్గం మనోవాంఛలతో నిండి ఉంది. అంటే మనస్సుకు తోచిన విధంగా ప్రాపంచిక వ్యా మోహంతో విశృంఖల జీవితం గడిపితే అది మనిషిని నరకానికి గొని పోతుందన్నమాట. ఈ హదీసు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాటల్లోని మర్మానికి, సమగ్రతకు ఒక మచ్చుతునకని, ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అన్నారు. (సంకలనకర్త)

1798 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَالَ اللهُ: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ فَاقْرَءُوا إِنْ شِئْتُمْ (فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنِ)
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1798. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- అల్లాహ్ ఈ విధంగా అన్నాడు – “నేను నా పుణ్య దాసుల కోసం (స్వర్గంలో) ఎవరి కళ్ళూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి మనస్సుకూ అందనటువంటి సామగ్రిని సిద్ధం చేసి ఉంచాను.”

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు తెలిపిన తరువాత, “దీనికి ఆధారం కావాలంటే ఖారీ ఖుర్ఆన్ సూక్తిని చదువుకోండ”ని ఈ క్రింది సూక్తిని వినిపించారు – “వారి కర్మలకు ప్రతిఫలంగా వారి కండ్ల చలువ కోసం అల్లాహ్ ఏ ప్రాణికీ తెలియని అపూర్వ సామగ్రిని సిద్ధపరచి ఉంచాడు.” (అస్సజ్జా : 17)

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్క్ , 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1799 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، يَبْلُغُ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ شَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 56 سورة الواقعة: 1 باب قوله (وظل ممدود)

1799. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించిన ఒక ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :- స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు. (సహీహ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 58వ సూరా – వాఖియా, 1వ అధ్యాయం – ఖౌలిహీ తఆలా వజిల్లిన్ మమ్ దూద్)

1800 – حديث سَهْلِ بْنِ سَعْدِ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1800. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1801 – حديث أَبِي سَعِيدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ الْجَوَادَ الْمُضَمَّرَ السَّرِيعَ مِائَةَ عَامٍ مَا يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1801. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : “స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడ క్రింద ఒక రౌతు వేగంగా పరుగెత్తే గుర్రమెక్కి వందేండ్లు పయనించినా అతనా నీడ అంచుకు చేరుకోలేడు.” (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1802 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ يَقُولُ لأَهْلِ الْجَنَّةِ: يَا أَهْلَ الْجَنَّةِ يَقُولُونَ: لَبَّيْكَ، رَبَّنَا وَسَعْدَيْكَ فَيَقُولُ: هَلْ رَضِيتُمْ فَيَقُولُونَ: وَمَا لَنَا لاَ نَرْضى وَقَدْ أَعْطَيْتَنَا مَا لَمْ تُعْطِ أَحَدًا مِنْ خَلْقِكَ فَيَقُولُ: أَنَا أُعْطِيكُمْ أَفْضَلَ مِنْ ذلِكَ قَالُوا: يَا رَبِّ وَأَيُّ شَيْءٍ أَفْضَلُ مِنْ ذَلِكَ فَيَقُولُ: أُحِلُّ عَلَيْكُمْ رِضْوَانِي، فَلاَ أَسْخَطُ عَلَيْكُمْ بَعْدَهُ أَبَدًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1802. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు :- అల్లాహ్ స్వర్గవాసుల్ని “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. దానికి స్వర్గవాసులు “మేము నీ సమక్షంలో హాజరయ్యాము ప్రభూ!” అనంటారు. “మీరు సంతోషంగా ఉన్నారా?” అని అడుగుతాడు అల్లాహ్. “మేమిక సంతోషంగా ఎందుకు ఉండము? నీవు నీ సృష్టిరాసుల్లో ఎవరికీ ప్రసాదించని మహాభాగ్యాలు మాకు ప్రసాదించావు” అంటారు స్వర్గవాసులు. “నేను మీకు ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ప్రసాదిస్తాను” అంటాడు అల్లాహ్. “ప్రభూ! ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ఇంకేముంటుంది?” అంటారు స్వర్గవాసులు. అప్పుడు అల్లాహ్ “నేను మీకు నా ప్రసన్నతా మహాభాగ్యం అనుగ్రహిస్తాను. ఇక నుండి నేను ఎన్నడూ మీ మీద ఆగ్రహించను” అని అంటాడు. (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1803 – حديث سَهْلِ بْنِ سَعْدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ لَيَتَرَاءَوْنَ الْغُرَفَ فِي الْجَنَّةِ، كَمَا تَتَرَاءَوْنَ الْكَوْكَبَ فِي السَّمَاءِ قَالَ: فَحَدَّثْتُ النُّعْمَانَ ابْنَ أَبِي عَيَّاشٍ فَقَالَ: أَشْهَدُ لَسَمِعْتُ أَبَا سَعِيدٍ يُحَدِّثُ وَيَزِيدُ فِيهِ كَمَا تَرَاءَوْنَ الْكَوْكَبَ الْغَارِبَ فِي الأفُقِ الشَّرْقِيِّ وَالْغَرْبِيِّ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق 51 باب صفة الجنة والنار

1803. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో స్వర్గవాసులు ఒకరి మేడలను మరొకరు మీరిక్కడ ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు.”

హదీసు ఉల్లేఖకుని ఉవాచ :- నేనీ హదీసుని నూమాన్ బిన్ అయాష్ (రహిమహుల్లాహ్) నుండి గ్రహించాను. ఆయన ఈ హదీసు గురించి చెబుతూ “నేనీ హదీసుని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) నోట విన్నానని సాక్ష్యమిస్తున్నాను” అని అన్నారు. అయితే ఆయన ఈ హదీసులో అదనంగా “మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై అస్తమిస్తుండే నక్షత్రాలను చూస్తున్నట్లు” అని అనేవారు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1804 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ يَتَرَاءَيُونَ أَهْلَ الْغُرَفِ مِنْ فَوْقِهِم كَمَا يَتَرَاءَيُونَ الْكَوْكَبَ الدُّرِّيَّ الْغَابِرَ فِي الأُفُقِ مِنَ الْمَشْرِقِ أَوِ الْمَغْرِبِ، لِتَفَاضُلِ مَا بَيْنَهُمْ قَالُوا: يَا رَسُولَ اللهِ تِلْكَ مَنَازِلُ الأَنْبِيَاءِ، لاَ يَبْلُغُهَا غَيْرُهُمْ قَالَ: بَلَى، وَالَّذِي نَفْسِي بِيَدِهِ رِجَالٌ آَمَنوا بِاللهِ، وَصَدَّقُوا الْمُرْسَلِينَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1804. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉద్బోధిస్తూ “స్వర్గవాసులు తమ పైనుండే మేడలలోని వారిని, మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై దేదీప్యమానంగా మెరిసే నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు. దీనిక్కారణం స్వర్గవాసుల్లో కూడా అంతస్తులు, తరగతులు ఉంటాయి” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! ఈ మేడలు దైవప్రవక్తల గృహాలయి ఉంటాయా? అక్కడకు వారు తప్ప మరెవరూ చేరుకోలేరు కాబోలు” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఎందుకు చేరుకోలేరు! నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ దేవుని సాక్షి! వీరసలు అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తలను సమర్ధించిన వారయి ఉంటారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఆ ఫీ సిఫతిల్ జన్నతి వ అన్నహామఖూఖతున్)

1805 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُونَ الْجَنَّةَ عَلَى صُورَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، عَلَى أَشَدِّ كَوْكَبٍ دُرِّيٍّ فِي السَّمَاءِ إِضَاءَةً؛ لاَ يَبُولُونَ، وَلاَ يَتَغَوَّطُونَ، وَلاَ يَتْفِلُونَ، وَلاَ يَمْتَخِطُونَ أَمْشَاطُهُمُ الذَّهَبُ، وَرَشْحُهُمُ الْمِسْكُ، وَمَجَامِرُهُمُ الأَلُوَّةُ الأَنجُوجُ عُودُ الطِّيبِ وَأَزْوَاجُهُمُ الْحُورُ الْعِينُ عَلَى خَلْقِ رَجُلٍ وَاحِدٍ عَلَى صُورَةِ أَبِيهِمْ آدَمَ سِتُّونَ ذِرَاعًا فِي السَّمَاءِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1805. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి సమూహంలోని ప్రజల ముఖాలు పున్నమి రాత్రి చంద్రునిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వారి తరువాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు మెరిసిపోయే ముత్యాల్లాంటి ప్రకాశవంతమైన నక్షత్రాల్లా ధగధగ మెరిసిపోతూ ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆకాశంలో ఇతర నక్షత్రాల కన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. స్వర్గవాసులు మల మూత్ర విసర్జన చేయరు. అదీగాక వారు ఉమ్మరూ, చీదరు కూడా. వారి దువ్వెనలు బంగారంతో చేసినవయి ఉంటాయి. వారి చెమట నుండి కస్తూరి సువాసన గుబాళిస్తుంది. వారి ఉంగరాలపై సుగంధ పరిమళంతో కూడిన సామ్రాణి జ్వలిస్తూ ఉంటుంది. వారి భార్యలు విశాలమైన నల్లటి కళ్ళు గల (అందమైన) స్త్రీలయి ఉంటారు. స్వర్గవాసులందరి రూపాలు వారి పితామహుడు హజ్రత్ ఆదం (అలైహి) రూపంలా ఒకే విధంగా ఉంటాయి. వారి ఎత్తు అరవై బారలు ఉంటుంది. (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖళ్ళి ఆదము సలవాతుల్లాహి అలైహి జుర్రియతివీ)

1806 – حديث أَبِي مُوسى الأَشْعَرِيِّ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْخَيْمَةُ دُرَّةٌ مُجَوَّفَةٌ، طُولُهَا فِي السَّمَاءِ ثَلاَثُونَ مِيلاً فِي كُلِّ زَاوِيَةٍ مِنْهَا لِلْمُؤْمِنِ أَهْلٌ، لاَ يَرَاهُمُ الآخَرُونَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1806. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: (స్వర్గవాసి) కుటీరం ఒక ముత్యమయి ఉంటుంది (అది ఏక ముత్య కుటీరం). దాని లోపలి భాగం మెరుగుదిద్దబడి ఉంటుంది. దాని ఎత్తు 30 మైళ్ళు (48 కిలో మీటర్లు) ఉంటుంది. అందులోని ప్రతి గదిలో విశ్వాసుల కోసం భార్యలు ఉంటారు. వారిని ఇతరులెవరూ చూడలేరు. (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1807 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: خَلَقَ اللهُ آدَمَ، وَطُولُهُ سِتُّونَ ذِرَاعًا، ثُمَّ قَالَ: اذْهَبْ فَسَلِّمْ عَلَى أُولَئِكَ مِنَ الْمَلاَئِكَةِ، فَاسْتَمِعْ مَا يُحَيُّونَكَ [ص:290] تَحِيَّتُكَ وَتَحِيَّةُ ذُرِّيَّتِكِ فَقَالَ: السَّلاَمُ عَلَيْكُمْ فَقَالُوا: السَّلاَمُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ فَزَادُوهُ، وَرَحْمَةُ اللهِ فَكُلُّ مَنْ يَدْخُلُ الْجَنَّةَ عَلَى صُورَةِ آدَمَ، فَلَمْ يَزَلِ الْخَلْقُ يَنْقُصُ حَتَّى الآنَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1807. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “అల్లాహ్ (తొలి మానవుడైన) హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ను సృష్టించాడు – అప్పుడాయన ఎత్తు అరవై బారలు ఉండింది – అల్లాహ్ ఆయనతో “దైవదూతల దగ్గరికెళ్ళి వారికి సలాం చెయ్యి, దానికి వారేమి సమాధానమిస్తారో విను. వారు పలికిన సలామే నీ, నీ సంతానం సలాం, ప్రతి సలాం అవుతుంది” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఆదం (అలైహి) వెళ్ళి వారికి ‘అస్సలాము అలైకుం’ అనిసలాం చేశారు. దానికి వారు “అస్సలాము అలైక వ రహ్మతుల్లాహ్” అని ప్రతి సలాం చేశారు. వారు రహ్మతుల్లాహ్ అనే పదాన్ని అదనంగా పలికారు – స్వర్గంలో ప్రవేశించే ప్రతి మానవుని రూపం ఆదం (అలైహి) రూపంలా ఉంటుంది – ఆ (తొలి మానవుని సృష్టి) తరువాత ఈనాటి వరకూ మానవుల ఎత్తు నిరంతరాయంగా తగ్గుతూ వస్తోంది“.* (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖల్ఖి ఆదమ సలవాతుల్లాహి అలైహి వజుర్రియతిహీ)

* ఈ హదీసు శీర్షికకు అనుగుణమైన హదీసు కాదు. దానిక్కారణం విషయసూచిక సహీహ్ ముస్లిం నుండి గ్రహించబడింది. సహీహ్ ముస్లిం విషయసూచిక ఈ అధ్యాయం క్రింద దీంతో పాటు మరో హదీసు కూడా ఉంది. అది సహీహ్ బుఖారీలో లేదు. అందువల్ల మూలంలో పక్షుల్లాంటి హృదయాలన్న ప్రస్తావన లేదు. (అనువాదకుడు)

1808 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نارُكمْ جُزْءٌ مِنْ سَبْعِينَ جُزْءًا مِنْ نَارِ جَهَنَّمَ قِيلَ يَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنْ كَانَتْ لَكَافِيَةً قَالَ: فُضِّلَتْ عَلَيْهِنَّ بِتِسْعَةٍ وَسِتِّينَّ جُزْءًا، كلُّهُنَّ مِثْلُ حَرِّهَا
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 10 باب صفة النار وأنها مخلوقة

1808. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉద్బోధించారు – “నరకాగ్ని మీ (ఇహలోక) అగ్నికి 70 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుంది.” అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! (కాల్చడానికి) ఈ అగ్ని కూడా సరిపోతుంది కదా!” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై 69 రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బె భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు.
– (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 10వ అధ్యాయం – సిఫతిన్నారి వ అన్నహా మఖూఖహ్)

1809 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تَحَاجَّتِ الْجَنَّةُ وَالنَّارُ [ص:291] فَقَالَتِ النَّارُ: أُوثِرْتُ بِالْمُتَكَبِّرِينَ وَالْمُتَجَبِّرِينَ وَقَالَتِ الْجَنَّةُ: مَا لِي لاَ يَدْخُلُنِي إِلاَّ ضُعَفَاءُ النَّاسِ وَسَقَطُهُمْ قَالَ اللهُ، تَبَارَكَ وَتَعَالَى، لِلْجنَّةِ: أَنْتِ رَحْمَتِي أَرْحَمُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَقَالَ لِلنَّارِ: إِنَّمَا أَنْتِ عَذَابٌ أُعَذِّبُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَلِكُلِّ وَاحِدَةٍ مِنْهُمَا مِلْؤُهَا فَأَمَّا النَّارُ فَلاَ تَمْتَلِىءُ حَتَّى يَضَعَ رِجْلَهُ فَتَقُولُ قَطٍ قَطٍ قَطٍ فَهُنَالِكَ تَمْتَلِىءُ، وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْضٍ وَلاَ يَظْلِمُ اللهُ، عَزَّ وَجَلَّ، مِنْ خَلْقِهِ أَحَدًا وَأَمَّا الْجَنَّةُ، فَإِنَّ اللهَ، عَزَّ وَجَلَّ، يُنْشِىءُ لَهَا خَلْقًا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 50 سورة ق: 1 باب قوله وتقول هل من مزيد

1809. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “స్వర్గ నరకాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నరకం మాట్లాడుతూ “నాలో గర్విష్ఠులు, బలవంతులు ప్రవేశిస్తారు గనక నేను గొప్పదాన్ని” అని అన్నది. స్వర్గం మాట్లాడుతూ “నాలో మటుకు బలహీనులు, నిస్సహాయులు, ప్రజల దృష్టిలో విలువ లేని వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు” అని అన్నది. అప్పుడు అల్లాహ్ జోక్యం చేసుకుంటూ స్వర్గంతో “నీవు నా కారుణ్యానివి. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని కరుణిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత నరకంతో “నీవు ‘యాతనవు మాత్రమే. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని శిక్షిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత స్వర్గ నరకాలు రెండిటినీ నింపడం జరుగుతుందని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అయితే నరకంలో అల్లాహ్ తన కాలు పెట్టే దాకా అది నిండదు. అల్లాహ్ నరకంలో తన కాలు పెట్టినప్పుడు “చాలు చాలు ఇక చాలు” అంటుంది నరకం తన కడుపు నిండిపోయినట్లు. అది తనంతట తాను సంకోచిస్తుంది. అల్లాహ్ తన సృష్టి రాసుల్లో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడు. ఇక స్వర్గం విషయానికొస్తే దాన్ని నింపడానికి అల్లాహ్ కొత్తగా మరికొందరిని సృష్టిస్తాడు” (సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 5వ సూరా – ఖాఫ్, 1వ అధ్యాయం – ఖౌలిహీ వతఖూలు హల్ మిమ్మజీద్)

1810 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَزَالُ جَهَنَّمُ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ، حَتَّى يَضَعَ رَبُّ الْعِزَّةِ فِيهَا قَدَمَهُ فَتَقُولُ قطِ قَطِ وَعِزَّتِكَ وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْض
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 12 باب الحلف بعزة الله وصفاته وكلماته

1810. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మాటి మాటికీ ఇంకేదయినా ఉంటే తెచ్చి పడేయండి” అని అంటుంది. చివరికి అల్లాహ్ తన కాలిని దాని మీద పెడతాడు. అప్పుడు నరకం “నీ గౌరవ ప్రతిష్ఠల సాక్ష్యం! చాలు చాలు” అని అంటుంది. అది తనంతట తాను సంకోచించిపోతుంది.” (సహీహ్ బుఖారీ:- 83వ ప్రకరణం – ఐమాన్ వన్నుజూర్, 11వ అధ్యాయం – అల్ హల్ఫి బిఇజ్జతిల్లాహి వ సిఫాతిహీ వకలిమాతిహీ)

1811 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يُؤْتَى بِالْمَوْتِ كَهَيْئَةِ كَبْشٍ أَمْلَحَ، فَيُنَادِي مُنَادٍ، يَا أَهْلَ الْجَنَّةِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكلُّهُمْ قَدْ رَأَوْهُ ثُمَّ يُنَادِي: يَا أَهْلَ النَّارِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرُونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكُلُّهُمْ قَدْ رَآه فَيُذْبَحُ ثُمَّ يَقُولُ: يَا أَهْلَ الْجَنَّةِ خُلُودٌ، فَلاَ مَوْتَ وَيَا أَهْلَ النَّار خُلُودٌ، فَلاَ مَوْتَ ثُمَّ قَرَأَ (وَأَنْذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ، وَهؤُلاَءِ فِي غَفْلَةٍ، أَهْل الدُّنْيَا، وَهُمْ لاَ يُؤْمِنُونَ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 19 سورة مريم: 1 باب قوله وأنذرهم يوم الحسرة

1811. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :

(ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మికెవరికీ) మరణం రాదు” అని అంటాడు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు దినం గురించి భయ పెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అంజిర్హుమ్ యౌమల్ హస్రా)

1812 – حديث ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا صَارَ أَهْلُ الْجَنَّةِ إِلَى الْجَنَّةِ، وَأَهْلُ النَّارِ إِلَى النَّارِ؛ جِيءَ بِالْمَوْتِ حَتَّى يُجْعَلَ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ ثُمَّ يُذْبَحُ ثُمَّ يُنَادِي مُنَادٍ: يَا أَهْلَ الْجنَّةِ لاَ مَوْتَ، وَيَا أَهْلَ النَّارِ لاَ مَوْتَ فَيَزْدَادُ أَهْلُ الْجَنَّةِ فَرَحًا إِلَى فَرَحِهِمْ، وَيَزْدَادُ أَهْلُ النَّارِ حُزْنًا إِلَى حُزْنِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1812. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని స్వర్గనరకాల మధ్యకు తెచ్చి నిలబెట్టడం జరుగుతుంది. తరువాత దాన్ని కోసివేస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త లేచి “స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసుల ఆనందం అవధులు దాటుతుంది; నరకవాసులు దుఃఖంతో మరింత క్రుంగిపోతారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1813 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا بَيْنَ مَنْكِبَيِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1813. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : సత్యతిరస్కారి రెండు భుజాల మధ్య ఎంత అంతరం ఉంటుందంటే, భుజం మీద వేగంగా నడిచే రౌతు గనక నడిస్తే అతను మూడు రోజుల దాకా నడుస్తూనే ఉంటాడు.* (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

*నరక శిక్ష తీవ్రతను చవిచూడటానికి వీలుగా సత్యతిరస్కారుల శరీరం ఆ మేరకు చాలా పెద్దదిగా ఉంటుంది. సహీహ్ ముస్లిం ఉల్లేఖనంలో సత్య తిరస్కారి దవడ ఉహుద్ పర్వతమంత ఉంటుందని కూడా ఉంది. ఇవన్నీ సత్యాలు, వీటిని ముస్లింలు విధిగా విశ్వసించాలి. (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్)

1814 – حديث حارِثَةَ بْنِ وَهْبٍ الْخُزَاعِيِّ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ الْجَنَّةِ كُلُّ ضَعِيفٍ مَتَضَعِّفٍ، لَوْ أَقْسَمَ عَلَى اللهِ لأَبَرَّهُ أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ النَّارِ كُلُّ عُتُلٍّ جَوَّاظٍ مُسْتَكْبِرٍ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 68 سورة ن والقلم: 1 باب عتُل بعد ذلك زنيم

1814. హజ్రత్ హారిస్ బిన్ వహబ్ ఖుజాయి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“నేను మీకు స్వర్గవాసుల్ని గురించి చెప్పనా? అల్పుడని, నీచుడని లోకులు భావించే ప్రతి బలహీనుడు, నిస్సహాయుడు గనక అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచి ప్రమాణం చేస్తే అల్లాహ్ దాన్ని నిజపరుస్తాడు. నేను మీకు నరకవాసుల్ని గురించి చెప్పనా? జగడాలమారి, పిసినిగొట్టు, అహంకారి, గర్విష్ఠి అయిన ప్రతి వ్యక్తీ (నరకవాసియే). ”

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 68వ సూరా – ఖలమ్, 1వ అధ్యాయం – ఉతుల్లింబాద జాలిక జనీమ్)

1815 – حديث عَبْدِ اللهِ بْنِ زَمْعَةَ، أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، وَذَكَرَ النَّاقَةَ وَالَّذِي عَقَرَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: (إِذِ انْبَعَثَ أَشْقَاهَا) انْبَعَثَ لَهَا رَجُلٌ عَزِيزٌ عَارِمٌ مَنِيعٌ فِي رَهْطِهِ، مِثْلُ أَبِي زَمْعَةَ وَذَكَرَ النِّسَاءَ فَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ، يَجْلِدُ امْرَأَتَهُ جَلْدَ الْعَبْدِ، فَلَعَلَّهُ يُضَاجِعُهَا مِنْ آخِرِ يَوْمِهِ ثُمَّ وَعَظَهُمْ فِي ضَحِكِهِمْ مِنَ الضَّرْطَةِ، [ص:294] وَقَالَ لِمَ يَضْحَكُ أَحَدُكُمْ مِمَّا يَفْعَلُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 91 سورة والشمس: 1 باب حدثنا موسى بن إسماعيل

1815. హజ్రత్ అబ్దుల్లా బిన్ జమా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపన్యాసమిస్తుంటే విన్నాను. ఆయన (హజ్రత్ సాలిహ్ అలైహిస్సలామ్ గారి) ఒంటె సంగతి, దాని పొదుగును కోసి వేసిన వ్యక్తి సంగతి ప్రస్తావించారు. “ఆ జాతిలో అందరికన్నా బలవంతుడు దిగ్గున లేచాడు” (అషమ్స్ : 12) అనే సూక్తి పఠించి, ఆ ఒంటె పొదుగు కోసినవాడు ఆ జాతిలో అందరికన్నా బలాఢ్యుడు, పరమ దుర్మార్గుడు, జగడాలమారి, నోటి దురుసు గలవాడు” అని అన్నారు.

ఆ తరువాత ఆయన స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ “మీలో కొందరు మీ భార్యలను బానిసల్ని కొట్టినట్లు కొడ్తున్నారు. కాని అదే రోజు చివరి భాగం (రాత్రివేళ)లో ఆమెను తమ దగ్గర పడుకోబెట్టుకుంటున్నారు. (ఇది చాలా అనుచితమైన చర్య)” అని అన్నారు.

ఆ తర్వాత ఆయన జనానికి హితోపదేశం చేస్తూ “ఎవరి నుంచయినా (శబ్దంతో) అపానవాయువు వెడలినప్పుడు నవ్వడం చాలా తప్పు. తాను చేసే పనినే ఇతరులు చేస్తే దానికి నవ్వడమెందుకు?” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 91వ సూరా – అష్షమ్స్, 1వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయిల్)

1816 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: رَأَيْتُ عَمْرَو بْنَ عَامِرِ بْنِ لُحَيٍّ الْخُزَاعِيَّ يَجُرُّ قُصْبَهُ فِي النَّارِ، وَكَانَ أَوَّلَ مَنْ سَيَّبَ السَّوَائِبَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 9 باب قصة خزاعة

1816. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

నేను నరకంలో అమ్ర్ బిన్ ఆమిర్ బిన్ లుహయ్యి ఖుజాయీని చూశాను. అతను తన పేగులు లాక్కుంటున్నాడు. ఇతనే అందరికన్నా ముందు (అరేబియాలో) విగ్రహం పేరుతో మొక్కుబడి చేసి ఒంటెను వదిలే దురాచారాన్ని ప్రారంభించినవాడు.”

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 9వ అధ్యాయం – ఖిస్సతిఖుజాఅ)

1817 – حديث عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تُحْشَرُونَ حُفَاةً عُرَاةً غُرْلاً قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ، يَا رَسُولَ اللهِ الرِّجَالُ وَالنِّسَاءُ يَنْظُرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ فَقَالَ: الأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَهِمَّهُمْ ذَاكِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1817. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ “ప్రళయదినాన మానవులు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారిగా లేపబడతారు” అని తెలిపారు. నేనీ మాట విని “దైవప్రవక్తా! (ఆ స్థితిలో) స్త్రీలు పురుషులు ఒకర్నొకరు చూసుకుంటారా?” అని అడిగాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానికి సమాధానమిస్తూ “ఆ సమయంలో వారంతా తీవ్రమైన ఆపదకు లోనయి ఉంటారు. ఒకరివైపు మరొకరు చూసుకునే ఆలోచనే తట్టదు వారికి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1818 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: قَامَ فِينَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، فَقَالَ: إِنَّكُمْ مَحْشُورُونَ حُفَاةً عُرَاةً غُرْلاً (كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ) الآيَةَ وَإِنَّ أَوَّلَ الْخَلاَئِقِ يُكْسى يَوْمَ الْقَيَامَةِ إِبْرَاهِيمُ وَإِنَّهُ سَيُجَاءُ بِرِجَالٍ مَنْ أُمَّتِي فَيُؤْخَذُ بِهِمْ ذَاتَ الشِّمَالِ، فَأَقُولُ: يَا رَبِّ أُصَيْحَابِي فَيَقُولُ: إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ فَأَقُولُ كَمَا قَالَ الْعَبْدُ الصَّالِحُ: (وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ) إِلَى قَوْلِهِ (الْحَكِيمُ) قَالَ: فَيُقَالُ إِنَّهُمْ لَمْ يَزَالُوا مُرْتَدِّينَ عَلَى أَعْقَابِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1818. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లేచి మా ముందు ఉపన్యాసమిస్తూ “మీరు ప్రళయ దినాన లేపబడినప్పుడు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారయి ఉంటారు. దివ్య ఖుర్ఆన్లో – ‘మేము మానవుడ్ని మొదట్లో ఏ విధంగా పుట్టించామో తిరిగి అదే విధంగా చేస్తాము’ అని ఉంది. ప్రళయదినాన అందరికంటే ముందు బట్టలు హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)కు ధరింపజేయడం జరుగుతుంది” అని అన్నారు.

ఆ తరువాతఆయన ఇలా తెలియజేశారు .“ఆ రోజు నా అనుచర సమాజానికి చెందిన కొందరిని తీసుకొచ్చి ఎడమ పక్షం వారిలో చేర్చడం జరుగుతుంది. నేనప్పుడు ‘ప్రభూ! వీరు నా అనుచరులు కదా!’ అనంటాను. దానికి అల్లాహ్ ‘నీ తదనంతరం వీరు (ధర్మంలో లేని) ఎన్ని కొత్త కొత్త విషయాలు సృష్టించారో నీకు తెలియదు’ అనంటాడు. నేనీ మాట విని అల్లాహ్ పుణ్యదాసుడు (హజ్రత్ ఈసా-అలైహి) పలికిన పలుకులే పలుకుతాను”. ఆయన పలుకులు ఈ విధంగా ఉన్నాయి – “(ప్రభూ!) నేను వారి మధ్య ఉన్నంత వరకే నేను వారి మీద పర్యవేక్షకుడిగా ఉన్నాను. తమరు నన్ను వెనక్కి పిలిపించుకున్న తరువాత వారిపై తమరే పర్యవేక్షకులు. ఇప్పుడు తమరు వారిని శిక్షించదలచుకుంటే వారు తమరి దాసులే. ఒకవేళ వారిని క్షమిస్తే తమరు సర్వాధికారి, ఎంతో వివేకవంతులు.” (5:117, 118) ఆ తరువాత నాతో “(నీవు ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత) వీరు మతభ్రష్టులయి జీవితాంతం అదే స్థితిలో ఉండిపోయారు” అని అనబడుతుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1819 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يُحْشَرُ النَّاسُ عَلَى ثَلاَثِ طَرَائِقَ: رَاغِبِينَ رَاهِبِينَ وَاثْنَانِ عَلَى بَعِيرِ، وَثَلاَثَةٌ عَلَى بَعِيرٍ، وأَرْبَعَةٌ عَلَى بَعِير، وَعَشَرَةٌ عَلَى بَعِيرٍ وَيَحْشُرُ بَقِيَّتَهُمُ النَّارُ، تَقِيلُ مَعَهُمْ حَيْثُ قَالُوا، وَتَبِيتُ مَعَهُمْ حَيثُ بَاتُوا، [ص:296] وَتُصْبِحُ مَعَهُمْ حَيْثُ أَصْبَحُوا، وَتُمْسى مَعَهُمْ حَيْثُ أَمْسَوْا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1819. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“పునరుత్థాన దినాన మానవులు మూడు వర్గాలుగా చీలిపోతారు. ఒక వర్గంలో భయం, ఆశ కలిగిన వారు ఉంటారు. (రెండవ వర్గంలో) ఒక ఒంటె మిద ఇద్దరు, మరొక ఒంటె మిద ముగ్గురు, వేరొక ఒంటి మీద నలుగురు చొప్పున ఉంటారు. మిగిలిన (మూడో వర్గం) వారిని అగ్ని ఒక చోట సమీకరిస్తుంది. వారు మధ్యాహ్నం వేళ ఎక్కడయినా నడుం వాల్చితే ఈ అగ్ని కూడా వారితో పాటే ఉంటుంది. రాత్రివేళ వారు ఎక్కడయినా గడిపితే అప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. ఉదయం లేచేటప్పుడు కూడా వారిని వెన్నంటే ఉంటుంది. సాయంత్రం అయినప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. (అంటే వారు ఎక్కడికి పోయినా, ఏ స్థితిలో ఉన్నాసరే అగ్ని వారిని వెన్నాడటం మానదన్నమాట).”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1820 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَوْمَ يَقُومُ النّاسُ لِرَبِّ الْعَالَمِينَ، حَتَّى يَغِيبَ أَحَدُهُمْ فِي رَشْحِهِ إِلَى أَنْصَافِ أُذُنَيْهِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 83 سورة ويل للمطففين

1820. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

“మానవులు విశ్వ ప్రభువు సన్నిధిలో నిలబడే రోజు వారి పరిస్థితి చెమటలతో చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కొందరు తమ చెవుల సగభాగం వరకు తమ సొంత చెమటతోనే మునిగి ఉంటారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 83వ సూరా – వైలుల్లిల్ ముతఫ్ఫిఫీన్)

1821 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَعْرَقُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يَذْهَبَ عَرَقُهُمْ فِي الأَرْضِ سَبْعِينَ ذِرَاعًا، وَيُلْجِمُهُمْ حَتَّى يَبْلُغَ آذَانَهُمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 47 باب قول الله تعالى (ألا يظن أولئك أنهم مبعوثون ليوم عظيم)

1821. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

“ప్రళయదినాన మానవుల శరీరాల నుండి చెమట విపరీతంగా కారుతూ ఉంటుంది. ఆ చెమట నేల మీద డెబ్బె గజాల దాకా ప్రవహిస్తూ ఉంటుంది. వారు తమ నోళ్ళు, చెవుల దాకా చెమటలోనే మునిగి ఉంటారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 47వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అలా యజున్ను ఉలాయిక అన్నహమ్ మబ్ వూసూన లి యౌమిన్ అజీమ్)

1822 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَحَدَكمْ، إِذَا مَاتَ، عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالْعَشِيِّ إِنْ كَانَ مِنْ أَهْلِ الْجَنَّةِ، فَمِنْ أَهْلِ الْجَنَّةِ؛ [ص:297] وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ؛ فَيُقَالُ هذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللهُ يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 90 باب الميت يعرض عليه مقعده بالغداة والعشي

1822. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 90వ అధ్యాయం – అల్ మయ్యతి యూరజు అలైహి మఖ్ అదుహు బిల్ ఘదాతి వల్ అషియ్యి )

1823 – حديث أَبِي أَيُّوبَ رضي الله عنه قَالَ: خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ وَجَبَتِ الشَّمْسُ، فَسَمِعَ صَوْتًا فَقَالَ: يَهُودُ تُعَذَّبُ فِي قُبُورِهَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 88 باب التعوذ من عذاب القبر

1823. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం :-

“సూర్యాస్తమయం అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుంచి బయలుదేరారు. ఒక చోట ఆయన ఒక విధమైన భయంకర) ధ్వని విని “ఇది సమాధిలో ఒక యూదుడి నుండి వస్తున్న ధ్వని. అతను సమాధి యాతనఅనుభవిస్తున్నాడు” అని అన్నారు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 88వ అధ్యాయం – అత్తవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్ర్)

1824 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ الْعَبْدَ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتَوَلَّى عَنْهُ أَصْحَابُهُ، وَإِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ، فَيُقعِدَانِهِ فَيقُولاَنِ: مَا كُنْتَ تَقُولُ فِي هذَا الرَّجُلِ (لِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ) فَأَمَّا الْمُؤْمِنُ [ص:298] فَيَقُولُ: أَشْهَدُ أَنَّهُ عَبْدُ اللهِ وَرَسُولُهُ فَيُقَالُ لَهُ: انْظُرْ إِلَى مَقْعَدِكَ مِنَ النَّارِ، قَدْ أَبْدَلَكَ اللهُ بِهِ مَقْعَدًا مِنَ الْجَنَّةِ فَيَرَاهُمَا جَمِيعًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1824. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“మనిషి (మృతదేహం)ని సమాధిలో పెట్టి (పూడ్చి) అతని బంధుమిత్రులు వెళ్ళిపోతారు. అతనింకా వారి చెప్పుల శబ్దం వింటూ ఉండగానే అతని దగ్గరికి ఇద్దరు దైవదూతలు వస్తారు. వారతడ్ని లేపి కూర్చోబెట్టి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గురించి ప్రశ్నిస్తూ “ఇతడ్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడుగుతారు. అతను విశ్వాసి అయి ఉంటే “ఆయన అల్లాహ్ దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అంటాడు. అప్పుడు వారు అతనితో ఇలా అంటారు. : “ఇదిగో చూడు ఇది నీ (శాశ్వత) స్థానం కావలసిన నరకం. దీనికి బదులు అల్లాహ్ నీకిప్పుడు స్వర్గంలో నివాసస్థానం ప్రసాదించాడు” అని చెబుతారు. ఈ విధంగా అతను తన రెండు స్థానాలను చూసుకుంటాడు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్ )

1825 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أُقْعِدَ الْمُؤْمِنُ فِي قَبْرِهِ أُتِيَ، ثُمَّ شَهِدَ أَنْ لاَ إِله إِلاَّ اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَذلِكَ قَوْلُهُ (يُثَبِّتُ اللهُ الَّذِينَ آمَنُوا بَالْقَوْلِ الثَّابِتِ)
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1825. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు:

“విశ్వాసిని సమాధిలో పెట్టిన తరువాత అతని దగ్గరకు (ఇద్దరు దైవదూతలు) వస్తారు. అప్పుడు విశ్వాసి “అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్” అని అంటాడు. దివ్య ఖుర్ఆన్లోని “విశ్వసించిన వారికి అల్లాహ్ ఒక స్థిర వచనం ఆధారంగా ఇహపర లోకాలలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు” (ఇబ్రాహీమ్ – 27) అనే సూక్తికి వివరణ ఇదే.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్)

1826 – حديث أَبِي طَلْحَةَ، أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَمَرَ يَوْمَ بَدْرٍ بِأَرْبَعَةٍ وَعِشْرِينَ رَجُلاً مِنْ صَنَادِيدِ قُرَيْشٍ، فَقُذِفُوا فِي طَوِيٍّ مِنْ أَطْوَاءِ بَدْرٍ، خَبِيثٍ مُخْبِثٍ وَكَانَ إِذَا ظَهَرَ عَلَى قَوْمٍ أَقَامَ بِالْعَرْصَةِ ثَلاَثَ لَيَالٍ فَلَمَّا كَانَ بِبَدْرٍ، الْيَوْمَ الثَّالِثَ، أَمَرَ بَرَاحِلَتِهِ فَشُدَّ عَلَيْهَا رَحْلُهَا ثُمَّ مَشَى وَاتَّبَعَهُ أَصْحَابُهُ وَقَالُوا مَا نُرَى يَنْطَلِقُ إِلاَّ لِبَعْضِ حَاجَتِهِ حَتَّى قَامَ عَلَى شَفَةِ الرَّكِيِّ فَجَعَلَ يُنَادِيهِمْ بِأَسْمَائِهِمْ وَأَسْمَاءِ آبَائِهِمْ: يَا فُلاَنُ بْنَ فُلاَنٍ وَيَا فُلاَنُ بْنَ فُلاَن أَيَسُرُّكُمْ أنَّكُمْ أَطَعْتُمُ اللهَ وَرَسُولَهُ فَإِنَّا قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا، فَهَلْ وَجَدْتُمْ مَا وَعَدَ رَبُّكُمْ حَقًّا قَالَ: فَقَالَ عُمَرُ: يَا رَسُولَ اللهِ [ص:299] مَا تُكَلِّمُ مِنْ أَجْسَادٍ لاَ أَرْوَاحَ لَهَا فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ مَا أَنْتُمْ بِأَسْمَعَ لِمَا أَقُولُ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 8 باب قتل أبي جهل

1826. హజ్రత్ అబూ తలా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బద్ర్ యుద్ధం నాడు ఖురైష్ నాయకుల్లో ఇరవై నాలుగు మంది వ్యక్తుల (మృతదేహాల)ను బద్ర్ లోని ఒక పాడుబడిన బావిలో పడవేయమని ఆజ్ఞాపించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఏదైనా జాతి పై విజయం సాధించినప్పుడు ఆ ప్రాంతంలో మూడు రాత్రుల పాటు బస చేస్తారు. బద్ర్ యుద్ధం ముగిసిన మూడవ రోజు రాగానే ఆయన తన స్వారీని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. దానిపై జీను కట్టిన తరువాత ఎక్కి బయలుదేరారు అనుచరులు కూడా ఆయన వెంట బయలుదేరారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏదైనా పని మీద ఎక్కడికో వెళ్తున్నారని వారు భావించారు. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ పాడుబడిన బావి ఒడ్డుకు వెళ్ళి నిలబడ్డారు. ఆయన ఆ హతులను వారి, వారి తండ్రుల పేర్లతో సంబోధిస్తూ “ఫలానా కొడుకు ఫలానా! ఫలానా కొడుకు ఫలానా!! మీరు అల్లాహ్ కు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులయి ఉండి ఉంటే బాగుండేదన్న వాస్తవాన్ని మీరు ఇప్పుడైనా బాగా గ్రహించారా? మేము మాత్రం మా ప్రభువు మాకు చేసిన వాగ్దానం నెరవేరిందని గ్రహించాము. మరి మీ ప్రభువు మీకు చేసిన వాగ్దానం నెరవేరిందని మీరు తెలుసుకున్నారా?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని “దైవప్రవక్తా! మీరు ఆత్మలు లేని దేహాలతో మాట్లాడుతున్నారా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నేను చెబుతున్న దానిని ఈ శవాలు నీకంటే బాగా వింటున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 8వ అధ్యాయం – ఖత్ లి అబీజహల్)

1827 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَتْ لاَ تَسْمَعُ شَيْئًا لاَ تَعْرِفُهُ إِلاَّ رَاجَعَتْ فِيهِ حَتَّى تَعْرِفَهُ وَأَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حُوسِبَ عُذِّبَ قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ أَوَلَيْسَ يَقُولُ اللهُ تَعَالَى (فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا) قَالَتْ: فَقَالَ إِنَّمَا ذَلِكَ الْعَرْضُ، وَلكِنْ مَنْ نُوقِشَ الْحِسَابَ يَهْلِكْ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 35 باب من سمع شيئًا فراجع حتى يعرفه

1827. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- నాకు తెలియని విషయం గురించి నేనెప్పుడైనా వింటే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగి పూర్తిగా తెలుసుకుంటాను. (ఓ రోజు) ఆయన “ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే” అని అన్నారు.అప్పుడు నేను “(ఖుర్ఆన్లో) ‘అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది’ అని అల్లాహ్ సెలవిచ్చాడు కదా!” అని అన్నాను.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “దానర్థం లెక్క తీసుకోవడం కాదు. కర్మల పత్రం చూపడం మాత్రమే. దీనికి భిన్నంగా ఎవరిని నిలదీసి లెక్క తీసుకోబడుతుందో అతను సర్వనాశనమవుతాడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 35వ అధ్యాయం – మన్ సమిఆ షై అన్ ఫరాజఆ హత్తా యారిఫహు)

1828 – حديث ابْنِ عُمَرَ رضي الله عنهما، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا أَنْزَلَ اللهُ بِقَوْمٍ عَذَابًا، أَصَابَ الْعَذَابُ مَنْ كَانَ فِيهِمْ، ثُمَّ بُعِثُوا عَلَى أَعْمَالِهِمْ
__________
أخرجه البخاري في: 92 كتاب الفتن: 19 باب إذا أنزل الله بقوم عذابًا

1828. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“అల్లాహ్ ఏ జాతి పైనయినా శిక్ష విధించినపుడు ఆ జాతిలో ఉన్న వారందరిపై ఆ శిక్ష విరుచుకుపడుతుంది. (పుణ్యాత్ములు, పాపాత్ములు అంతా ఆ విపత్తుకు గురి అవుతారు). అయితే ప్రళయదినాన వారు తమ తమ కర్మలను బట్టి లేపబడతారు (వారికి వారి కర్మలను బట్టి పుణ్యఫలమో పాప ఫలమో లభిస్తుంది)”

(సహీహ్ బుఖారీ :- 92వ ప్రకరణం – ‘ఫితన్’, 19వ అధ్యాయం – ఇజా అన్జలల్లాహు బిఖౌమిన్ అజాబన్)