(దాదాపు 60 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (60 నిముషాలు)
ఇతరములు:
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
(దాదాపు 60 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (60 నిముషాలు)
ఇతరములు:
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 28
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 28
1) అల్లాహ్ వ్రాసిన విధివ్రాత ప్రకారం ఒక విశ్వాసి ప్లేగు వంటి అంటువ్యాధుల వల్ల మరణిస్తే అది ఏ విధమైన మరణం అవుతుంది?
A) అకాల మరణం చెందినట్లు
B) షహీద్ (అమరగతి) చెందినట్లు
C) సహజ మరణం చెందినట్లు
2) ఏ కారణంగా స్త్రీలు అధికంగా నరకంలో ప్రవేశిస్తారు?
A) భర్త పట్ల అవిధేయత – కృతఘ్నత వల్ల
B) శాపనార్ధాలు – ఎత్తిపొడుపుల వల్ల
C) పై రెండూ కూడా కారణం
3) నరకంలో కాలిన కొంతకాలం తర్వాత ఎవరిని బయటకు తీసి స్వర్గంలో వెయ్యడం జరుగును?
A) అసాధ్యం ఎవ్వరినీ లేదు
B) యూదులనందరినీ
C) ఎవరి హృదయంలో గోధుమగింజంత స్వచ్ఛమైన ఏకదైవారాధన విశ్వాసం ఉందొ
క్విజ్ 28: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:59 నిమిషాలు]
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
ప్రశ్న- భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి!
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [7:00 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
[ఇక్కడ పుస్తకము చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [8 పేజీలు]
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పబ్లిషర్స్: జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)
ఇస్లాం ధర్మం పరిశుభ్రత మరియు సౌందర్యాలను ప్రేమించు, ప్రోత్సహించు ధర్మం. ప్రతి ముస్లింకి (హద్దు లోపల ఉండి) అంద సౌందర్యాలను ప్రదర్శించే వస్త్రాలు ధరించే అనుమతిచ్చింది, ప్రోత్సహించింది. మర్మావయవాలను కప్పి ఉంచడానికి, అలంకరణగా ఉపయోగించుకోడానికి అల్లాహ్ వస్త్రాలను (తయారు చేసుకునే సాధానాలను) సృష్టించాడు. ఆయన ఆదేశం ఇలా వుంది:
“ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు, శోభకు సాధనంగా ఉంటాయి.” (ఆరాఫ్ 7: 26).
వస్త్రధారణ విషయంలో ఏవి నిషిద్ధం అని స్పష్టమైన ఆధారం గలదో అవి తప్ప మిగతా వన్నియూ ధర్మసమ్మతమే. అలాగే ఇస్లాం వస్త్రధారణకు సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేక విధానాన్ని పరిమితం చేయలేదు. అయితే కొన్ని నియమ నిబంధనలు మాత్రం తెలిపింది. ప్రతీ ముస్లిం వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఆచరణలో ఉంచడం తప్పనిసరి. అవి ఈ విధంగా ఉన్నాయి:
1- శరీరంలో తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగం మొత్తంపై వస్త్రం ఉండాలి. ధరించినప్పటికీ శరీరం కనబడునటువంటి పలచగా ఉండకూడదు. శరీరావయవాల పరిమాణాన్ని తెలుపునటువంటి ఇరుకుగా ఉండకూడదు.
2- ముస్లిమేతరుల ప్రత్యేక వస్త్రాల మాదిరిగా ఉండకూడదు. అలాగే సమాజంలో చెడు కార్యాలకు పాల్పడే వారికి ప్రత్యేక చిహ్నంగా ఉండే దుస్తుల మాదిరిగా కూడా ఉండకూడదు. (వారు హీరో, హీరోయిన్ల పేరుతో పిలువబడేవారయినా, వేశ్యావృత్తి అవలంభించువారైనా, మరెవరైనా సరే).
3- వృధా ఖర్చులతో కూడినవై ఉండకూడదు.
పై నియమాలను పాటిస్తూ మనిషి తనకిష్టమైన తనకు అవసరమైన, తన సమాజంలో వాడుకలో ఉన్న ఏ దుస్తులు ధరించినా మంచిదే. దుస్తుల విషయంలో వచ్చిన నివారణలు, నిషిద్ధతలకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడుతున్నవి:
1- పురుషుల కొరకు బంగారం, పట్టు వస్త్రాలు నిషిద్ధం. అయితే అవి స్త్రీల కొరకు ధర్మసమ్మతమే. అలీ బిన్ అబూ తాలిబ్ (రజియల్లాహు అన్హు) హదీసులో ఉంది:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టు వస్త్రాన్ని తమ కుడి చెయిలో, బంగారాన్ని తమ ఎడమ చెయిలో తీసుకొని ఇలా చెప్పారు:
“ఇవి రెండూ నా అనుచర సమాజంలోని పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని చెప్పారు. (అబూ దావూద్/ ఫిల్ హరీరి లిన్నిసా 4057, నసాయి/ తహ్రీముజ్జహబి అలర్రిజాల్ 5053).
కాని పురుషులు వెండితో లేదా వెండి కలిపి మరేదానితోనైనా చేయబడిన ఉంగరం తమ అలవాటు ప్రకారం తొడగడంలో అభ్యంతరం లేదు.
2- ప్రాణం గల చిత్రం ఉన్న వస్త్రాలు: అంటే మనుషులు, జంతువుల చిత్రాలు గల వస్తువులు ధరించడం యోగ్యం కాదు. అవి దుస్తులయినా, నగలయినా మరేవైనా సరే.
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ఆమె బొమ్మలు గీసి యున్న ఒక దిండు కొన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుండి వచ్చి దానిని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖంలో ఏదో ఇష్టం లేని చిహ్నాలు చూసి, ప్రవక్తా! నేను అల్లాహ్ వైపునకు తర్వాత ఆయన ప్రవక్త వైపునకు మరలుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నాతో జరిగిన తప్పేమిటో సెలవియ్యండి అని అన్నాను. అందుకు ఆయన “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. దీనికి మీరు ఆనుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్పాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“ఈ బొమ్మలు, చిత్రాలు చిత్రించేవారు ప్రళయదినాన శిక్షించబడుతారు. మీరు సృష్టించిన వాటిలో ప్రాణం పోయండి అని వారితో అనబడుతుంది”.
మళ్ళీ చెప్పారు:
“ఏ ఇంట్లో బొమ్మలు, చిత్రాలు ఫోటోలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”.
(బుఖారి/అత్తిజారతు. ఫీమా యుక్రహు లుబ్సుహు… 2105, ముస్లిం/తహ్రీము తస్వీరి సూరతిల్ హైవాన్… 2107).
3- పురుషులపై నిషిద్ధమున్న మరో విషయం వారు తమ వస్త్రాలను చీలమండలం క్రిందికి తొడగుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“చీలమండలానికి క్రింద ఉన్న లుంగి (వస్త్రం) వారి ఆ భాగం నరకంలో ఉండును”. (బుఖారి/మా అస్ఫల మినల్ కాబైని… 5787).
అది పైజామా, పైంటు, దుప్పటి తదితర ఏ వస్త్రం అయినా సరే. కొందరి భ్రమ ప్రకారం ‘గర్వంతో తొడిగే వారికి ఈ శిక్ష’ అన్న మాట సరికాదు. గర్వం లేకుండా తొడిగే వారికే ఈ శిక్ష. గర్వంతో తొడిగే వారికి ఇంతకంటే మరీ ఘోరమైన శిక్ష గలదు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:
“అహంకారంతో తన వస్త్రాన్ని (లుంగి, పైంటు వగైరాలు) ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్ పరలోకంలో కన్నెత్తి కూడా చూడడు”.
(బుఖారి/మన్ జర్ర సౌబహు మినల్ ఖయలా 5791, ముస్లిం/తహ్రీము జర్రిస్పౌబి ఖుయలా… 2085).
కాని స్త్రీలు తమ వస్త్రాలను క్రింది వరకు వ్రేలాడదీయాలి. పాదాలు కూడా కనబడకుండా ఉండాలి.
4- తొడిగి కూడా నగ్నంగా కన్పించేటటువంటి పలచని, సన్నటి వస్త్రాలు యోగ్యం కావు. అలాగే శరీరావయవాల పరిమాణాన్ని వర్ణించే విధంగా ఇరుకుగా తొడుగుట యోగ్యం కాదు. ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“ధరించికూడా నగ్నంగా కన్పించే దుస్తులు ధరించే స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసన కూడా పొందరు”. (ముస్లిం 2128).
5-. పురుషులు స్త్రీల లాంటి మరియు స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు తొడుగుట నిషేధం.
ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:
“స్త్రీల వేషాధారణ వేసుకునే పురుషులను, పురుషుల వేషాధారణ వేసుకునే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు”. (బుఖారి/అల్ ముతషబ్బిహూన బిన్నిసా… 5885).
6- అవిశ్వాసులు తమ ధార్మిక చిహ్నంగా ప్రత్యేకించుకున్న వేషాధారణ ముస్లిం ధరించడం నిషిద్ధం.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలు చూసి, “ఇవి అవిశ్వాసులు ధరించే బట్టల్లో ఒక రకమైనవి, నీవు వీటిని ధరించకు” అని చెప్పారు. (ముస్లిం/ అన్నహ్ యు అన్ లుబ్బిర్రజులి… 2077).
వస్త్రధారణ ధర్మములు
1- ముస్లిం పాటించవలసిన ధర్మాల్లో ఒకటి, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ దుఆ చదవడం.
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొత్త బట్టలు ధరించేటప్పుడు చొక్కా, తలపాగ మరేదైనా దాని పేరు చెప్పి ఈ దుఆ చదివేవారు:
అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహీ వ ఖైరి మా సునిఅ లహూ వఅఊజు బిక మిన్ షర్రిహీ వషర్రి మా సునిఅ లహూ (*).
(భావం: ఓ అల్లాహ్! నీకే సర్వ స్తోత్రములు, నీవే నాకు ఈ బట్టలు ధరింపజేశావు. దీనిలోని మేలును మరియు దేని కొరకు అది నేయబడిందో దాని మేలును నీతో కోరుతున్నాను. దాని కీడు నుండి మరియు దేని కొరకు అది నేయబడిందో దాని కీడు నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (అబూ దావూద్ 4020, తిర్మిజి 1767).
(*) పైన ఇవ్వబడిన దుఆ కొత్త బట్టలు ధరించేటప్పుడు చదివేది. అయితే రోజువారి బట్టలు ధరించేటప్పుడు “అల్ హందు లిల్లాహిల్లజీ కసానీ హజస్ సౌబ వరజఖనీహి మిన్ ఘైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్” చదివే వారి పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి. (అబూ దావూదు 4023).
2- బట్టలు తొడుక్కునేటప్పుడు కుడి వైపు నుండి తొడగడం ధర్మం.
ఆయిష (రజియల్లాహు అన్హా) చెప్పారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి చేయడం మరియు మొదలు పెట్టటం ఇష్టపడేవారు. అది వుజూలోనైనా, తల దువ్వుకునేటప్పడైనా మరియు చెప్పులు తొడిగేటప్పుడైనా”. (బుఖారి 426, ముస్లిం 268).
చెప్పులు తొడిగేటప్పుడు ముందు కుడి కాలులో తొడగాలి కాని తీసేటప్పుడు ముందు ఎడమ కాలి నుండి తీయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరయినా చెప్పులు తొడిగేటప్పుడు కుడి కాలు నుండి తొడగాలి. తీసేటప్పుడు ఎడమ కాలు నుండి తీయాలి. తొడిగితే రెండూ తొడగాలి. తీస్తే రెండూ తీయాలి”. (ముస్లిం 2097, బుఖారి 5856).
మరొక హదీసులో ఒక చెప్పు తొడిగి నడవడం నుండి నివారించబడింది. (బుఖారి 5855).
3- ప్రతీ ముస్లిం తన శరీరాన్ని, దుస్తులను పరిశుభ్రంగా, అశుద్ధతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత ప్రతి అలంకారాణికి, అందానికి మూలం లాంటిది.ఇస్లాం పరిశుభ్రత గురించి ప్రోత్సహించడంతో పాటు శరీర, దుస్తుల శుభ్రతపై శ్రద్ధ చూపాలని కూడా చాలా ప్రోత్సహించింది.
తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“మీరు తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్లులలోకెల్లా అతి ఉత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ తెల్లని వస్త్రాలతోనే కఫన్ ఏర్పాటు చేయండి”. (అబూ దావూద్/అత్తిబ్/ ఫిల్ అమ్రి బిల్ కొహ్ లి 3878, తిర్మిజి/మా యుస్తహబ్బు మినల్ అక్సాన్ 994).
ఇతర రంగులు యోగ్యమే.
5- దుస్తులు ఇతర అలంకరణ వస్తువుల ఖరీదులో దుబార ఖర్చులు చేయకుండా, మరీ పిసినారితనం వహించకుండా మధ్యేమారాన్ని అవలంబించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
“వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చేయరు. ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది.” (ఫుర్ఖాన్ 25: 67).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“తినండి, త్రాగండి, ధరించండి మరియు దాన దర్మాలు చేయండి. అయితే దుబారా ఖర్చులు చేయకండి. అహంకారానికి గురికాకండి”. (బుఖారి/ కితాబుల్లిబాస్).
ధర్మ శాస్త్ర శాసనాలు (Fiqhiyyah) – పుస్తకం – పేజీలు 24-31 నుండి
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్
వస్త్రధారణ ప్రకరణం (హదీసు కిరణాలు – రియాదుస్ సాలిహీన్ నుండి)
117. తెల్లదుస్తులు ధరించటం అభిలషణీయం . ఎరుపు , ఆకుపచ్చ …
118. చొక్కా ధరించటం అభిలషణీయం
119. చొక్కా , చొక్కా చేతులు , లుంగీ , తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం
120. అణకువ కొద్దీ ఖరీదైన దుస్తుల్ని ధరించకుండా వుండటం
121. వస్త్రధారణలో మధ్యేమార్గాన్ని అవలంబించటం …
122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్దం …
123. గజ్జి , దురద వున్నవారు పట్టుబట్టలు ధరించవచ్చ్చు
124. చిరుత తోలు మీద కూర్చోరాదు … దాన్ని వాహనం మీద ఆసనంగా ఉపయోగించరాదు
125. కొత్తబట్టలు , కొత్తచెప్పులు మొదలగునవి తొడుకున్నప్పుడు ఏమని పలకాలి ?
126. దుస్తులు ధరించేటప్పుడు కుడివైపు నుండి ఆరంభించాలి?
హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) الحيض والنفس
[11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
హైజ్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తం. నలుపు రంగు, దుర్వాసన ఉంటుంది.
నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం.
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِذَا أَقْبَلَتِ الْحَيْضَةُ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي {صحيح البخاري 331، صحيح مسلم 333}.
“నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక రక్తాన్ని కడిగి, తలంటు స్నానం చేసి నమాజు చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
ఈ రోజుల్లో చేయని నమాజులు తిరిగి చేయకూడదు.కాని ఈ రోజుల్లో తప్పిపోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి.అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ రోజుల్లో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును ముట్టుకోవద్దు.
నమాజు సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజు చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురాలయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాహరణకు: జొహ్ర్ నమాజు వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజు చేసుకోలేక పోయింది. ఒకటింటికి ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంటప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజు చేయాలి).
ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజు చేసుకోవాలి. ఉదాహరణకు: ఇషా నమాజు సమయం రాత్రి 11 గం.లకు సమాప్తమవుతుందనుకుందాము, ఒక స్త్రీ 11 గం.కంటే కొంచెం ముందు పరిశుద్ధురాలైతే ఆమె స్నానం చేసిన తర్వాత ఇషా నమాజు చేసుకోవాలి.
ఉపవాస స్థితిలో సూర్యాస్తమయానికి (ఇఫ్తార్ కి) కొన్ని క్షణాల మందైనా ఎవరికైనా ఋతుస్రావం లేదా ప్రసవం జరిగితే ఆ ఉపవాసం లెక్కలోకి రాదు, ఒకవేళ అది రమజాను ఉపవాసం లాంటి విధి ఉపవాసమయితే పరిశుద్ధురాలయిన తర్వాత దానికి బదులుగా మరో ఉపవాసం ఉండడం విధిగా ఉంది.
ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు స్త్రీ బహిష్టులో ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండడం ధర్మం కాదు, ఒక వేళ ఆమె ఫజ్ర్ ప్రవేశించిన కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలయినా సరే. అదే ఫజ్ర్ ప్రవేశించిన కొద్ది క్షణాల ముందు పరిశుద్ధరాలయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.
అలాగే జునుబీ (అంటే సంభోగం లేదా స్వప్నస్ఖలనం వల్ల అశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి) ఫజ్ర్ కు కొంచెం ముందు ఉపవాసం నియ్యత్ చేసుకొని ఫజ్ర్ తర్వాత స్నానం చేసినా అతని ఉపవాసం సరియగును.
బహిష్టు, బాలంత స్త్రీలు జిక్ర్, తక్బీర్, తస్బీహ్ చేయుట, అల్ హందులిల్లాహ్ పలుకుట, దుఆ చేయుట మరియు తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనుట యోగ్యమే. అలాగే హదీస్, ఫిఖ్హ్ చదువుట, ఖుర్ఆన్ పారాయణం వినుట లాంటివేవీ నిషిద్ధం కావు. అలాగే ఖుర్ఆనును ముట్టుకోకుండా తనకు కంఠస్తమున్నదానిలో నుండి పారాయణం చేయవచ్చును.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది(*). స్నానం తర్వాత వారి ఈ గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతమవుతాయి. ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ ను ముట్టుకోవడం లాంటివి.
(*) కొందరు బాలంతలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
ఇతరములు: తహారా
10వ అధ్యాయం – హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ
1763. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హాా)తనపై అపవాదు వేసిన వారి మాటలను గురించి ఇలా తెలియజేశారు :-
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటే, తమ భార్యలను గురించి చీటి వేసి, అందులో ఎవరి పేరు వస్తే ఆమెను తమ వెంట తీసికెళ్ళేవారు. ఒక యుద్ధ [1] సందర్భంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాలో ఎవరిని తమ వెంట తీసికెళ్ళాలనే విషయమయి చీటీ వేశారు. ఆ చీటీలో నా పేరు వచ్చింది. అప్పుడు నేను ఆయన వెంట బయలుదేరాను. ఈ సంఘటన పరదా ఆదేశం అవతరించిన తరువాత జరిగింది. అందువల్ల నన్ను ఒంటె మీద అంబారీలో కూర్చోబెట్టారు. ఒంటె మీది నుంచి దిగవలసి వచ్చినప్పుడు నన్ను అంబారీలో ఉంచే క్రిందికి దించేవారు. సరే మేము బయలుదేరాము. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆ యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో మేము మదీనా పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ప్రదేశానికి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ రాత్రికి అక్కడ విడిది చేయాలని ప్రకటించబడింది.
నేనీ ప్రకటన విని (ఒంటె మీది నుంచి నా అంబారీని దించిన తరువాత) సహజ అవసరార్ధం సైన్యాలకు కాస్త దూరంగా బహిర్భూమికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నా అంబారీ దగ్గరకు తిరిగొచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూసుకుంటే నా ముత్యాల హారం కన్పించలేదు. అది తెగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వెనక్కి వెళ్ళి వెతకడం ప్రారంభించాను. ఇలా వెతుక్కోవడంలో ఆలస్యమయిపోయింది. ఈలోగా నా అంబారీ ఎత్తే వాళ్ళు నేను అంబారీలో కూర్చొని ఉన్నాననుకొని దాన్ని ఎత్తి నా ఒంటె మీద పెట్టారు. ఆ రోజుల్లో మేము స్రీలము అన్నం తక్కువగా తినడం వల్ల బక్కగా ఉండేవాళ్ళము. ఎముకల మీద మాంసమే ఉండేది కాదు. అందువల్ల వారు నా అంబారీ ఎత్తి పెట్టేటప్పుడు బరువును అంచనా వేయలేకపోయారు. అదీగాక నేను నవ యౌవనంలో ఉండిన బాలికను. ఆ తరువాత వారు ఒంటెను లేపి వెళ్ళిపోయారు. నేను నా కంఠహారం వెతుక్కొని తిరిగి వచ్చేటప్పటికి సైన్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడ పిలిచేవారు గాని, కేక వేస్తే జవాబిచ్చేవారు గాని ఎవరూ లేరు. నేను అంబారీలో కన్పించకపోతే వాళ్ళే నా దగ్గరకు తిరిగొస్తారని తలచి నేను సైన్యం విడిది చేసిన ప్రదేశంలోనే కూర్చున్నాను.
కాస్సేపటికి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. హజ్రత్ సఫ్వాన్ బిన్ ముఅత్తల్ సలమి జక్వానీ (రది అల్లాహు అన్హాు)సైన్యాలకు వెనకాలగా నడచి వస్తున్నారు. ఆయన మరునాడు ఉదయం నేను నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎవరో పడుకున్నారని తలచి ఆయన సమీపానికి వచ్చి చూశారు. ఆయన లోగడ పరదా ఆదేశం రాక పూర్వం నన్ను చూసి ఉండటం వల్ల, దగ్గరికొచ్చి చూడగానే నన్ను గుర్తుపట్టి “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” అన్నారు. ఈ అలికిడికి నేను కళ్ళు తెరిచాను. ఆయన్ని చూసి వెంటనే ఓణీతో నా ముఖాన్ని కప్పుకున్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మేము ఒకరితోనొకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నేనాయన నోట “ఇన్నాలిల్లాహి” అనే మాట తప్ప మరేదీ వినలేదు. ఆ తరువాత ఆయన ఒంటె (దిగి దాని)ని నేల మీద కూర్చోబెట్టారు. నేను లేచి దాని మీద ఎక్కి కూర్చున్నాను. ఆయన ఒంటె ముక్కుతాడు పట్టుకొని ముందుకు నడిచారు. ఈ విధంగా మేము ఎండ పెటపెటలాడే (మిట్ట మధ్యాహ్నం) వేళకు సైన్యాలు విడిది చేసిన చోటుకు చేరుకున్నాము. (ఈ మాత్రం సంఘటనకే) వారు (నా మీద అపవాదు వేసి) నాశనమయ్యారు. ఈ అపవాదును లేపడంలో అబ్దుల్లా బిన్ ఉబై ప్రధాన పాత్ర వహించాడు.
ఈ హదీసును ఉల్లేఖించిన వారిలో ఒకరైన హజ్రత్ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- అతని (అంటే అబ్దుల్లా బిన్ ఉబై) సమావేశంలో ఈ అపవాదును గురించి బాహాటంగా చర్చ జరిగింది. రకరకాల మాటలు కల్పించబడ్డాయి. అతను వారిని సమర్ధిస్తూ వారు చెప్పే ప్రతి మాటనూ శ్రద్ధగా వింటూ విషయం మరింత తీవ్రరూపం దాల్చేలా (దానికి మిర్చీ మసాలా రాసి) మాట్లాడేవాడు. అపవాదు లేపిన వారిలో హస్సాన్ బిన్ సాబిత్ (రది అల్లాహు అన్హాు), మిస్తహ్ బిన్ ఉసాసా (రది అల్లాహు అన్హాు),హమ్నా బిన్త్ జహష్ (రది అల్లాహు అన్హా)ల పేర్లు మాత్రమే నాకు తెలుసు. వీరే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. వారి [2] పేర్లు నాకు తెలియదు. కాకపోతే దివ్య ఖుర్ఆన్లో “ఈ అపవాదును మీలోనే ఒక ముఠా లేపింది” (24:11) అనే సూక్తిని బట్టి వారొక ముఠాకు చెందిన వారని మాత్రం నాకు తెలుసు. ఆ ముఠాలో ప్రధాన సూత్రధారి అబ్దుల్లా బిన్ ఉబయ్యె. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)తన ముందు ఎవరైనా హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ (రది అల్లాహు అన్హాు)ని మాత్రం నిందిస్తే సహించేవారు కాదు. “నా తల్లిదండ్రులు, నా గౌరవ ప్రతిష్టలు ముహమ్మద్ మహనీయు (సల్లలాహు అలైహి వ సల్లం)ని గౌరవ ప్రతిష్టల పరిరక్షణకై సమర్పితం. అందులోనే నా గౌరవం ఇమిడి ఉంది – అనే కవిత హస్సానే కదా చెప్పింది” అని అంటారు ఆమె. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)(తమ కథనాన్ని) కొనసాగిస్తూ ఇలా తెలియజేస్తున్నారు :-
ఆ తరువాత మేము మదీనాలో ప్రవేశించాము. మదీనా తిరిగొచ్చిన తరువాత నేను ఓ నెల రోజుల దాకా జబ్బుపడ్డాను. అపవాదు లేపిన వారి మాటలు విని ప్రజలు పరి పరి విధాలా చెప్పుకునేవారు. కాని నాకా సంగతే తెలియదు. అయితే నేను ఇది వరకు జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా పట్ల కనబరిచే ప్రేమ, సానుభూతుల్ని ఇప్పుడు జబ్బు పడి ఉన్నప్పుడు కనబరచకపోవడం గమనించి నాక్కొంచెం అనుమానం వచ్చేది. నేనీ జబ్బుపడి ఉన్న రోజుల్లో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా దగ్గరికి వచ్చి సలాం మాత్రం చేసేవారు. (నా ఆరోగ్యం గురించి నన్నడగకుండా) “ఈవిడకు ఎలా ఉంది?” అని (ఇంట్లో ఉండే ఇతర సభ్యుల్ని) అడిగేవారు. ఈ ధోరణి మాత్రమే నాక్కాస్త అనుమానం కలిగించేది (ఆయన నా మీద అలిగారేమోనని). అంతకు మించి నాకు అపవాదు గురించి బొత్తిగా తెలియదు.
నేను జబ్బు నుండి కొంచెం కోలుకున్న తరువాత ఓ రోజు ఉమ్మె మిస్తహ్ (రది అల్లాహు అన్హా)తో కలసి “మనాసా” ప్రదేశానికి బయలుదేరాను. ఇది మా స్త్రీల బహిర్భూమి. మేమక్కడికి రాత్రి వేళల్లో మాత్రమే వెళ్ళొస్తుంటాము. ఇది మా ఇండ్ల దగ్గర మరుగుదొడ్లు నిర్మించబడని నాటి సంగతి. ప్రాచీన అరబ్బుల అలవాటు ప్రకారం మేము బహిర్భూమి కోసం (ఊరి బయట చెట్టు చేమలుండే) అడవి ప్రదేశానికి వెళ్ళేవారము. ఆనాడు ఇండ్ల సమీపంలో మరుగుదొడ్లు నిర్మించడాన్ని జనం అసహ్యించుకునేవారు. ఉమ్మె మిస్తహ్ (అంటే మిస్తహ్ తల్లి) అబూరహమ్ బిన్ ముత్తలిబ్ బిన్ అబ్దుమునాఫ్ గారి కుమార్తె. ఆమె తల్లి బిన్తె సఖర్ బిన్తె ఆమిర్ (మా నాన్న) హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హాు)కు పినతల్లి అవుతుంది. నేను ఉమ్మె మిస్తహ్ (రది అల్లాహు అన్హా)ఆ తరువాత బహిర్భూమి నుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాము. దారిలో ఉమ్మె మిస్తహ్ (రది అల్లాహు అన్హా)కాలు దుప్పటిలో ఇరుక్కుపోయి ఆమె తూలి పడిపోయింది. అప్పుడామె (అప్రయత్నంగా) “మిస్తహ్ పాడుగాను!” అని అన్నది. నేను (విషయం అర్ధం గాక) “నువ్వు చాలా దారుణమైన మాటన్నావు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నిందిస్తున్నావా నువ్వు?” అని అడిగాను. దానికామె “పిచ్చి పిల్లా! అతనేమన్నాడో నీకేమైనా తెలుసా?” అని అన్నది. నేను “ఎమన్నాడేమిటి?” అని అడిగాను. అప్పుడామె నాపై అపనింద వేసిన వారు ఎలాంటి మాటలు కల్పించి ప్రచారం చేస్తున్నారో తెలియజేసింది. ముందే జబ్బు పడి ఉన్న నేను ఈ మాటలు వినడంతో నా జబ్బు మరింత ఎక్కువైపోయింది. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వచ్చి ఉన్నారు. నన్ను చూసి ఆయన సలాం చేశారు. ఆ తరువాత “ఈవిడ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగారు (ఇంట్లోని ఇతర సభ్యులతో). నేనాయనతో “నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా?” అని అన్నాను. ఈ అనుమతి అడగడంలో నా ఉద్దేశ్యం, నా తల్లిదండ్రుల ఇంటికెళ్ళి ఈ వదంతి గురించి నిజానిజాలు తెలుసుకోవాలన్నదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు పుట్టింటికి వెళ్ళేందుకు అనుమతిచ్చారు. నేను (వెళ్ళి మా అమ్మతో “అమ్మా! జనం ఏమిటి ఇలా చెప్పుకుంటున్నారు?” అని అడిగాను. దానికామె సమాధానమిస్తూ “అమ్మా! బాధపడకు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండి అతనామెను బాగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమె సవతులు ఆమెలో ఎదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇది సహజం” అని అన్నది. నేనీ మాట విని “సుబ్హానల్లాహ్! (ఆశ్చర్యార్ధక పదం) ఇప్పుడు మరికొందరు కూడా ఇలాంటి అభూత కల్పనలకు పాల్పడుతున్నారా?” అని అన్నాను. ఆ రాత్రంతా నా కంటిమీద కునుకే లేదు. తెల్లారే దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. తెల్లవారిన తరువాత కూడా నా కన్నీరు ఆగలేదు.
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) దివ్యావిష్కృతి (వహీ) అవతరణలో ఆలస్యమయినందున హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (రది అల్లాహు అన్హాు), హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రది అల్లాహు అన్హాు)లను పిలిపించి, ఆయన తమ భార్య నుండి (అంటే నా నుండి) విడిపోయే విషయమయి వారిద్దర్నీ సంప్రదించారు. అప్పుడు హజ్రత్ ఉసామా (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ భార్యామణిని మీ నుండి వేరు చేయకండి. ఆమెలో మేము మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. అయితే హజ్రత్ అలీ మాట్లాడుతూ “దైవప్రవక్తా! అల్లాహ్ మీకు ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. ఆయిషా (రది అల్లాహు అన్హా)యే గాకుండా (లోకంలో) చాలా మంది స్త్రీలున్నారు. మీరామె సేవకురాలిని అడిగి చూడండి, ఆమె వాస్తవమేమిటో చెబుతుంది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (నా సేవకురాలు) హజ్రత్ బరీరా (రది అల్లాహు అన్హా)ను పిలిపించి “బరీరా! నీకు ఆయిషా (రది అల్లాహు అన్హా) పట్ల అనుమానం కలిగించే సంఘటన ఎదైనా జరిగినట్లు నువ్వు చూశావా?” అని అడిగారు. హజ్రత్ బరీరా (రది అల్లాహు అన్హా)సమాధానమిస్తూ “మీకు సత్యధర్మమిచ్చి పంపిన శక్తి స్వరూపుని సాక్షి! హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)లో నాకు అనుమానం కలిగించే ఎలాంటి చెడు విషయం నేనింతవరకు చూడలేదు. కాకపోతే ఆమె ఇంకా చిన్నపిల్లే అయినందున, ఇంట్లో పిండి కొట్టి ఉంచితే దాన్ని (నిర్లక్ష్యంగా) వదిలేసి నిద్రపోతుంది. ఈలోగా మేక వచ్చి దాన్ని కాస్తా తినిపోతుంది” అని అన్నది.
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విన్న తరువాత ఆ రోజే (మస్జిద్లో) వేదిక ఎక్కి (కపట విశ్వాసి) అబ్దుల్లా బిన్ ఉబైని శిక్షించే విషయం గురించి ప్రజలను అడిగారు. ఆయన ప్రజలను సంబోధిస్తూ ఇలా అన్నారు: “(సోదర) ముస్లింలారా! నా భార్యపై అపనింద మోపి నన్ను, నా కుటుంబాన్ని బాధించిన వ్యక్తిపై నా తరపున ప్రతీకారం తీర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యలలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు. అపవాదు మోపబడిన ఆ వ్యక్తిలో కూడా నేనింతవరకు ఎలాంటి చెడు చూడలేదు. అతను నా ఇంటికి ఎప్పుడొచ్చినా నేనింట ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు.”
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పలికిన ఈ మాటలు విని బనీ అబ్దుల్ అష్హల్ ఉప తెగకు చెందిన హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రది అల్లాహు అన్హాు)లేచి “దైవప్రవక్తా! నేను మీ తరపున ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తి ఔస్ తెగవాడై ఉంటే నేను స్వయంగా అతడ్ని హతమారుస్తాను. ఒకవేళ అతను మా సోదర తెగ ఖజ్రజ్ కు చెందిన వాడయితే అతడి గురించి మీరు ఆజ్ఞాపించండి, మేము మీ ఆజ్ఞను పాటిస్తాము” అని అన్నారు. ఈ మాట విని ఖజ్రజ్ తెగ నాయకుడు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రది అల్లాహు అన్హాు)లేచి నిలబడ్డారు. ఆయన హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ (రది అల్లాహు అన్హాు)తల్లికి వరుసకు సోదరుడవుతారు. (అంటే ఆమె పిన తండ్రి కొడుకు). ఆయన సాధారణంగా మంచి మనిషే. కాని సాద్ బిన్ ముఆజ్ (రది అల్లాహు అన్హాు)మాటలు విన్న తరువాత ఆయనలో అజ్ఞాన కాలంనాటి జాతీయ దురభిమానం పెల్లుబికింది. దాంతో ఆయన (ఉద్రేక పూరితుడయి) “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నీవు అబద్ధమాడుతున్నావు. నీవతడ్ని హతమార్చవు, హతమార్చలేవు కూడా. అతను గనక నీ తెగవాడయి ఉంటే, అతను చంపబడటానికి నీవు ఎన్నటికీ కోరవు” అని అన్నారు హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రది అల్లాహు అన్హాు)తో.
హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రది అల్లాహు అన్హాు)పిన తండ్రి కొడుకు హజ్రత్ ఉసైద్ బిన్ హజీర్ (రది అల్లాహు అన్హాు)ఈ మాట విని (దిగ్గున) లేచి నిలబడ్డారు. ఆయన సాద్ బిన్ ఉబాదా (రది అల్లాహు అన్హాు)ని సంబోధిస్తూ “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నువ్వొట్టి అబద్దాల రాయుడివి. మేమతడ్ని తప్పకుండా సంహరిస్తాం. నువ్వు కపట విశ్వాసిలా ఉన్నావు. అందుకే నువ్వు కపట విశ్వాసుల కొమ్ముకాస్తున్నావు అని అన్నారు.” ఈ సంభాషణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఔస్, ఖజ్రజ్ రెండు తెగలు పరస్పరం భగ్గుమన్నాయి. కొట్లాటకు సిద్దమయ్యాయి. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వేదికపై నిలబడి ఉభయ తెగల వారికీ మాటి మాటికి సర్ది చెబుతూ వారిని శాంతపరచడానికి ప్రయత్నించారు. చివరికి ఎలాగో అందరూ శాంతించారు. గొడవ సద్దుమణిగింది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా మౌనంగా ఉండిపోయారు. నేనా రోజంతా ఏడుస్తూనే ఉండిపోయాను. కంటి మీద కునుకు కూడా రాలేదు.
నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. నేనిలా ఒక పగలు, రెండు రాత్రులు నిరంతరాయంగా దుఃఖిస్తూ ఉన్నాను. కన్నీరు ఆగలేదు. నిద్ర కూడా పట్టలేదు. ఏడ్చి ఏడ్చి నా గుండె పగిలి పోతుందా అన్పించింది. కాస్సేపటికి ఒక స్త్రీ వచ్చి లోపల ప్రవేశించడానికి అనుమతి అడిగింది. నేనామెకు అనుమతిచ్చాను. ఆమె కూడా నాతోపాటు కూర్చొని ఏడ్వసాగింది. మేమా స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (మా ఇంటికి) వచ్చారు. ఆయన సలాం చేసి కూర్చున్నారు. నా మీద అపనింద మోపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన నా దగ్గర కూర్చోలేదు. ఒక నెల గడచిపోయినా అపనింద విషయంలో ఆయనపై ఎలాంటి దివ్యావిష్కృతి (వహీ) అవతరించలేదు.
ఆయన కూర్చొని ముందుగా షహాదత్ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. ఆ తరువాత ఇలా అన్నారు : “ఆయిషా! నీ గురించి నేనీ మాట విన్నాను. నీవు ఏ పాపమెరగని దానివయితే త్వరలోనే అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ నీ వల్ల ఎదైనా తప్పు జరిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకో. దాసుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని (తప్పకుండా) క్షమిస్తాడు.”
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సంభాషణ ముగించగానే నా కన్నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత నా కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు. నేను మా నాన్నగారి వైపుకు తిరిగి “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పిన దానికి నా తరఫున మీరు సమాధానం ఇవ్వండి” అని అన్నాను. (మా నాన్న) హజ్రత్ అబూ బకర్ (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “(అమ్మాయ్!) అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ విషయంలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఏమని సమాధానమివ్వాలో నాకేమో అర్ధం కావడం లేదు” అని అన్నారు. ఆ తరువాత నేను మా అమ్మతో “(అమ్మా!) దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు నువ్వయినా సమాధానమివ్వు” అని అన్నాను. కాని మా అమ్మ కూడా “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఎం సమాధానమివ్వాలో నాకేమో తోచడంలేదు” అని అన్నది.
ఆ తరువాత నేను మాట్లాడటం మొదలెట్టాను. అప్పటికి నేను పెద్దగా వయసు లేని బాలికను. ఖుర్ఆన్ కూడా నేనెక్కువగా పఠించలేదు. అయినానేను మాట్లాడటానికి ఉపక్రమించాను. “మీరీ (అపనింద) మాటను బాగా విని ఉండటం వల్ల అది మీ అందరి హృదయాల్లో తిష్టవేసింది. అందరూ దీన్ని నిజమని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏ పాపమెరుగని దాననంటే మీకు నమ్మకం కలగదు. ఒకవేళ నేను తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటే మీరు వెంటనే నమ్ముతారు. కాని నేను ఎలాంటి పాపానికీ ఎంత మాత్రం పాల్పడలేదు. ఆ సంగతి అల్లాహ్ కి తెలుసు. అందువల్ల అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి, మీ పరిస్థితి హజ్రత్ యాఖూబ్ (అలైహిస్సలాం) పరిస్థితిలా ఉంది. ఈ స్థితిలో నేను హజ్రత్ యాఖూబ్ (అలైహిస్సలాం) అన్న మాటనే అంటాను. “ఇప్పుడు నేను ఉత్తమ రీతిలో సహనం వహిస్తాను. మీరు కల్పించి చెబుతున్న దాని గురించి నేనిక అల్లాహ్ ను మాత్రమే సహాయం అర్ధించాలి’ (యూసుఫ్-18) అని అన్నారు ఆమె.”
…… ఇలా మాట్లాడిన తరువాత నేను పడక మీదికెళ్ళి పక్కకు తిరిగి పడుకున్నాను. నేను ఏ పాపమెరగని అమాయకురాలినని అల్లాహ్ కి బాగా తెలుసు. అందువల్ల ఆయన నా పాతివ్రత్యాన్ని తప్పకుండా బహిర్గతం చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉండింది. అయితే అల్లాహ్ నా ఈ వ్యవహారంలో (ప్రళయం దాకా) నిత్యం పఠించబడేలా దివ్య వచనాలను అవతరింపజేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా వ్యవహారంలో అల్లాహ్ ప్రత్యేకంగా (దివ్య)వాణిని అవతరింపజేయడానికి నేనంతటి గొప్పదానిని కూడా కాను. కాని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కలలో అలాంటిదేదైనా కన్పిస్తుందని మాత్రం నాకు నమ్మకముండింది.
అయితే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ స్థానం నుండి లేవకుండా అలాగే కూర్చున్నారు. అటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేచి బయటకు వెళ్ళలేదు. (ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా కూర్చుండిపోయారు). అంతలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై ‘దివ్యావిష్కృతి’ (వహీ) అవతరించింది. దివ్యావిష్కతి సమయంలో ఎర్పడే అనిర్వచనీయమైన బాధ ఆయన్ని క్రమ్ముకుంది. దైవవాణి మోపిన భారం వల్ల తీవ్రమైన చలిలో సయితం ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలసాగాయి. కాస్సేపటికి ఈ పరిస్థితి దూరమయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పెదవులపై దరహాసం తొణికిసలాడింది. ఆయన నోట వెలువడిన మొట్టమొదటి వాక్యం (చూడండి). “ఆయిషా! అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని ధృవపరిచాడు” అని అన్నారు ఆయన.
మా అమ్మ ఈ మాట వినగానే “ఇక లే. లేచి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు కృతజ్ఞతలు చెప్పుకో” అని అన్నది. నేను (తల అడ్డంగా తిప్పుతూ) “నేను లేవను. అల్లాహ్ సాక్షి! పరమోన్నతుడయిన నా ప్రభువుకు తప్ప మరెవరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోను” అని అన్నాను – దివ్యావిష్కృతి ద్వారా నూర్ సూరాలోని ఈ సూక్తులు వెలువడ్డాయి :
“ఈ అపవాదును మీలోనే ఒక వర్గం లేవదీసింది. (జరిగిందేదో జరిగింది, కాని) దీన్ని మీరు (మీ విషయంలో) చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు) మంచిదే. ఇందులో ఎవరు ఎంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారం గురించి అత్యధిక బాధ్యతను నెత్తిమీద వేసుకున్న ప్రధాన పాత్రధారికి మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష కాచుకొని ఉంది.” (11)
“ఈ నిందారోపణను వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి లోనుకాకుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ఇది పూర్తిగా నిరాధారమైన అపనింద అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ నిందారోపణను నిరూపించుకోవడానికి) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు. (తీసుకు రాలేరు కూడా, కనుక) అల్లాహ్ దృష్టిలో వారే పచ్చి అబద్దాలరాయుళ్ళు. (12, 13).
“మీ మీద ఇహపరలోకాల్లో అల్లాహ్ అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయి ఉంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఓ ఘోరమైన విపత్తు వచ్చిపడేదే. ఈ అసత్యారోపణ (ఎంత చెడ్డ విషయమో కాస్త మీరే ఆలోచించండి అది) మీ మధ్య ఒకరి నుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూ పోయింది. మీకు వాస్తవం ఎమిటో తెలియని విషయం మీనోట వెలువడసాగింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తూ ఉండేవారు. కాని అల్లాహ్ దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం. (14-15)
“ఈ విషయం వినగానే “ఇలాంటి మాటలు పలకడం మనకు తగదు, అల్లాహ్ పరిశుద్దుడు. ఇది పూర్తిగా నీలాపనింద అని మీరు ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నటికీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. (మీరు విషయాన్ని అర్ధం చేసుకోవడానికి) అల్లాహ్ మీకు తన బోధనలను విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసిన వాడు, ఎంతో వివేకవంతుడు.” (16-18)
‘“విశ్వసించినవారి మధ్య అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (అశ్లీలం సమాజం మీద ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహ్ కి తెలుసు; మీకు తెలియదు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలు గనక లేకపోయి ఉంటే, అల్లాహ్ వాత్సల్యమూర్తి, దయామయుడు అయి ఉండకపోతే (మీ మధ్య వ్యాపింపజేయబడిన ఈ విషయం దారుణమైన పరిణామాలకు దారి తీసి ఉండేది). (19, 20)
“కనుక విశ్వాసులారా! షైతాన్ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి చెడు, అశ్లీలతలను గురించే ఆదేశిస్తాడు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏ ఒక్కడూ పరిశుద్ధుడు కాలేడు. అయితే అల్లాహ్ తాను కోరిన వ్యక్తిని పరిశుద్ధం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు. సమస్తం ఎరిగిన వాడు.” (21)
“మీలోని ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు. (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలి వదలి వలస వచ్చిన వారికి సహాయం చేయము అని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, ఉదారంగా వ్యవహరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి, దయామయుడు.” (22)
“శీలవంతులయిన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు. వారి కోసం కఠినాతి కఠిన శిక్ష ఉంది.” (23)
“ఇలా అపనిందలు మోపేవారు, స్వయంగా తమ నోళ్ళు, తమ కాళ్ళు చేతులే తమ అకృత్యాలను గురించి (తమకు వ్యతిరేకంగా) సాక్ష్యమిచ్చే రోజు ఒకటి వస్తుందన్న సంగతి మరచిపోకూడదు. ఆ రోజు అల్లాహ్ వారి కర్మలను బట్టి వారికి పూర్తి ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి అల్లాహ్ యే సత్యమని, అల్లాహ్ యే నిజాన్ని నిజం చేసి చూపేవాడని.” (24, 25)
అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటల నుండి వారు పరిశుద్ధులు, పవిత్రులు. వారి కోసం మన్నింపు, ఉదారమైన ఉపాధి ఉన్నాయి.” (26)
(దివ్య ఖుర్ఆన్ – 24:11-26)
ఈ సూక్తుల్ని అల్లాహ్ నా పవిత్రత, పాతివ్రత్యాలను గురించి అవతరింపజేశాడు. (మా నాన్న) హజ్రత్ అబూ బకర్ (రది అల్లాహు అన్హాు)(తమ నిరుపేద బంధువయిన;) మిస్తహ్ బిన్ అసాసా (రది అల్లాహు అన్హాు)కు ధన సహాయం చేస్తుండేవారు. అయితే (నా మీద వచ్చిపడిన అపనిందలో ఆయన కూడా భాగం పంచుకోవడం వల్ల) ఆయన (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “అల్లాహ్ సాక్షి! (నా కుమార్తె) ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి మిస్తహ్ (రది అల్లాహు అన్హాు)అన్న మాటలకు (నా హృదయం తూట్లు పడింది) నేనిక నుండి అతని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను ‘ అని అన్నారు. ఆయనలా అన్నందుకు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు : “మీలో దయానుగ్రహం పొందినవారు, (ఆర్థిక) స్తోమత కలిగిన వారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, ఇల్లు వాకిలి వదలి అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేయబోమని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, వారి పట్ల ఉదారంగా మసలుకోవాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి. దయామయుడు.” (24:22) ఈ సూక్తి అవతరించిన తరువాత హజ్రత్ అబూ బకర్ (రది అల్లాహు అన్హాు)(మనసు మార్చుకొని) “ అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను క్షమించాలనే నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి నేనీ సహాయాన్ని ఎన్నటికీ నిలిపి వేయను” అని అన్నారు. ఆయన మిస్తహ్ (రది అల్లాహు అన్హాు)కు ఇది వరకు ఎంత ధన సహాయం అంద చేస్తుండేవారో ఆ సహాయాన్ని తిరిగి అందజేయడం (ప్రారంభించారు.
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా వ్యవహారం గురించి (విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రది అల్లాహు అన్హా)ని కూడా విచారించారు. “ఈ విషయంలో నీకేమయినా తెలుసా?” అన్నారు ఆయన. దానికామె “దైవప్రవక్తా! నేను నా కళ్ళు చెవుల విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటాను. (చూడకుండా, వినకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడను ). అల్లాహ్ సాక్షి! నేనామెలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) భార్యలలో ఒక్క జైనబ్ (రది అల్లాహు అన్హా) మాత్రమే నాకు పోటీగా నిలిచే స్రీ. (అయినప్పటికీ ఆమె ఈ వ్యవహారంలో సవతి అసూయ ప్రదర్శించకుండా న్యాయంగా మాట్లాడారు) ఆమెలోని భక్తి పరాయణత వల్ల అల్లాహ్ ఆమెను (ఈ రొంపి నుండి) కాపాడాడు. అయితే హజ్రత్ జైనబ్ (రది అల్లాహు అన్హా)ను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ మాట్లాడే ఆమె సోదరి మాత్రం అపవాదు లేపిన వారితో చేరి నాశనమయిపోయింది.
అపవాదు వ్యవహారంలోకి, నాతో పాటు ఈడ్చబడిన ఆ వ్యక్తి [3] అన్న పలుకులు కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన “అల్లాహ్ మాత్రమే పరిశుద్దుడు, పవిత్రుడు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు వరకు నేను ఏనాడూ ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నారు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారని హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)తెలిపారు.
(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజీ, 34వ అధ్యాయం – హదీసిల్ ఇఫ్క్)
1764. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)కథనం :- నా మీద లేనిపోని అపనింద మోపబడినప్పుడు నాకా సంగతే తెలియదు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రసంగించడానికి (వేదికపై) నిలబడ్డారు. మొదట ఆయన షహాదత్ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. తరువాత అల్లాహ్ ని ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా స్తుతించారు. ఆ తరువాత ఇలా అన్నారు. “నా భార్య మీద అపనింద మోపిన వ్యక్తిని గురించి మీరు నాకేదయినా సలహా ఇవ్వండి. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నా కుటుంబ నభ్యులను గురించి ఎలాంటి చెడు విషయం కూడా ఎన్నడూ నా దృష్టికి రాలేదు. నా భార్యతో పాటు ఈ అపనిందలో ఇరికించబడిన వ్యక్తి గురించి కూడా నేనెప్పుడూ చెడు విషయం వినలేదు. అతను నా ఇంటికి నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు. నేనెప్పుడైనా ప్రయాణమయి ఎక్కడికైనా వెళ్తే అతను కూడా నాతో పాటే ఉండేవాడు.”
హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా )కథనం :- దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా యింటికి వచ్చి నా గురించి నా సేవకురాలిని విచారించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ఎంత మాత్రం లేదు. నేను ఆయిషా (రది అల్లాహు అన్హా)లో ఏనాడూ ఎలాంటి చెడునూ చూడలేదు. కాకపోతే ఆమె (అప్పుడప్పుడు) ఆదమరచి నిద్ర పోతుంది, అప్పుడు మేక వచ్చి పిండి తినిపోతుంది’ అని అన్నది. నా ఈ సేవకురాలిని ప్రవక్త అనుచరులలో కొందరు గదమాయించారు, కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆమె “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. స్వర్ణకారుణికి మేలిమి బంగారం గురించి ఏం తెలుసో ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి కూడా నాకు అదే తెలుసు. (అంతకు మించి మరేమో తెలియదు)” అని అన్నది. ఈ అపవాదులో నాతోపాటు ఇరికించబడిన వ్యక్తికి అపవాదు సంగతి తెలిసినపుడు “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేనీ రోజు వరకు ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నాడు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 24వ సూరా – నూర్, 11వ అధ్యాయం – ఇన్నల్లజీన యుహిబ్బూన అన్తషీ అల్ ఫాహిషతు ఫిల్లజీన ఆమనూ)
Footnotes:
[1] | ఒక యుద్ధం అంటే ఇక్కడ “బనీ ముస్తలిఖ్ యుద్ధం” అని అర్థం. దీన్నే ‘మురసీ యుద్ధం” అని కూడా అంటారు. (సంకలనకర్త)
[2] | ఇక్కడ మూలభాషలో ప్రయోగించిన ‘ఉస్బా’ అనేపదానికి పది నుండి నలభై మంది వ్యక్తుల ముఠా అని అర్ధం వస్తుంది (సంకలనకర్త)
[3] ఈ వ్యక్తి పేరు హజ్రత్ సఫ్వాన్ బిన్ ముఅత్తల్ (రది అల్లాహు అన్హాు)- (సంకలనకర్త)
ఇది మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) లో పశ్చాత్తాప ప్రకరణం నుండి తీసుకోబడింది.
షైతాన్ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచెయ్యడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.
“విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు” (సూర నూర్ 24:21)
మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవులను అశ్లీల కార్యం (వ్యభిచారం)లో పడవేయడానికి షైతాన్ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారు?
“వినండి! ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఉంటాడో వారిద్దరితో మూడోవాడు షైతాన్ ఉంటాడు”. (తిర్మిజి 2165. మిష్కాతుల్ మసాబీహ్ 3118).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”.(ముస్లిం 2173).
ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్ష౦లో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/
తల్లిదండ్రుల ఆస్తిలో కూతుర్ల హక్కు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=YLpOMHUjZH0 [ 7 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వారసత్వపు హక్కుల గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెల వాటా గురించి వివరించబడింది. సూరహ్ అన్-నిసాలోని ఆయతుల (వచనాల) ఆధారంగా, కుమారులతో పాటు కుమార్తెలకు కూడా ఆస్తిలో నిర్ధారితమైన వాటా ఉందని స్పష్టం చేయబడింది. ఆస్తి తక్కువైనా, ఎక్కువైనా సరే, ఈ వాటాను ఇవ్వడం అల్లాహ్ నిర్దేశించిన విధి (ఫర్ద్) అని నొక్కి చెప్పబడింది. ఆడపిల్లల వారసత్వపు హక్కును కాలరాయడం, కట్నకానుకలు ఇచ్చామనే సాకుతో వారి వాటాను నిరాకరించడం ఘోరమైన పాపమని హెచ్చరించబడింది. ప్రతి చర్యకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడని, ప్రళయ దినాన ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం నిలదీస్తారని, అప్పుడు న్యాయం జరుగుతుందని గుర్తుచేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్.
لِلرِّجَالِ نَصيِبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ وَلِلنِّسَاء نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ نَصِيبًا مَّفْرُوضًا
“తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” (సూరహ్ నిసా 4:7)
ఈ ఆయత్ ను గమనించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, “విశ్వాసులారా, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు వదిలిన ఆస్తిలో మీకు హక్కు ఉంది” అని చెప్పలేదు. పురుషులకు ప్రత్యేకంగా “లిర్రిజాలి నసీబ్” – పురుషులకు హక్కు ఉంది, పురుషులకు వాటా ఉంది. అలాగే “వలిన్నిసాఇ నసీబ్” – స్త్రీలకు. పురుషులు, తల్లిదండ్రుల యొక్క సంతానమైనా లేదా బంధువులలో పురుషులు. అలాగే, ఎవరైనా తల్లిదండ్రులకు కూతుళ్ళు ఉన్నారు, అలాగే కుమారులు ఉన్నారు. అయితే ఎలాగైతే కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉందో, అలాగే కూతుళ్ళకు కూడా ఉంది.
ఇక్కడ గమనించవలసిన మరో విషయం, “మిమ్మా ఖల్ల మిన్హు అవ్ కసుర్” – ఆస్తి ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా. అరే, మా తల్లిదండ్రి చాలా తక్కువ వదిలి వెళ్లారు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు లేదు అని ఎవరూ అనరాదు. ఎక్కువ వదిలినా, తక్కువ వదిలినా, ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఎవరెవరి పేర్లు చెప్పి వారి యొక్క హక్కులు నిర్ణయించాడో, వారికి తప్పకుండా అవి ఇవ్వాలి.
మరో విషయం గమనించాల్సింది, “నసీబమ్ మఫ్రూదా”. “మఫ్రూదా” అన్న దానికి మన కొన్ని తెలుగు ఖురాన్ అనువాదాల్లో “నిర్ధారితం” అన్న పదం వచ్చింది. కానీ “మఫ్రూదా” ఫర్ద్ నుండి. అంటే ఇది ఒక విధి. ఈ విధిని తప్పనిసరిగా పాటించాలి. ఇందులో ఎలాంటి కొరత అనేది చేయకూడదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలుపుతున్నాడు.
మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎంతోమంది తమ అక్కచెల్లెళ్లకు సంబంధించినటువంటి, వారి తల్లిదండ్రులు ఏదైతే వదిలి వెళ్లారో, ఎందరో కొడుకులు, ఆ అక్కచెల్లెళ్ల యొక్క సోదరులు స్వయమే, మా హక్కు అని తీసుకుంటారు. మీకు మీ పెళ్లిళ్లలో కట్నకానుకల రూపంలో ఇచ్చేశాము, అయిపోయింది అని అంటారు. కానీ, ఈ కొడుకులకు వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క పెళ్లిళ్ల కొరకు, వారి యొక్క ఇంకా వేరే అవసరాలకు, ఉద్యోగం లేనందుకు ఏదైతే తండ్రి ఖర్చు పెట్టాండో, అవన్నీ కూడా మా తండ్రి మాకు ఖర్చు పెట్టాడు కదా, చెల్లెళ్లకు కట్నకానుకలు ఇచ్చినట్లుగా అని భావించకుండా, మీకు కట్నకానుకలు ఇవ్వడం జరిగింది, ఇక మీకు ఏ హక్కు లేదు అని కొట్టేస్తారు. అల్లాహ్ తో భయపడండి. ఒక ఫర్ద్ నమాజ్ ను వదులుట ఎంత పాపమని మీరు భయపడతారో, ఒక జకాత్ ఇవ్వడం విధిగా ఉంటే దానిని ఇవ్వకుంటే ఎంత పాపమని భయపడతారో, ఉపవాసం రమదాన్ లో ఉండడం విధి, అది ఉండకుంటే ఎంత పాపమని భయపడతారో, అలాగే అల్లాహ్ ఎవరికి ఆస్తిలో ఏ హక్కు నిర్ణయించాడో అది వారికి ఇవ్వకపోవడం అంతకంటే ఘోరమైన పాపం అని కూడా గమనించాలి. ఎందుకు? నమాజ్, రోజా, ఉపవాసాలు ఇలాంటివి అల్లాహ్ కు సంబంధించిన హక్కు. కానీ ఇక్కడ ఇది దాసులకు సంబంధించిన హక్కు.
ఇంకా మరొక ఆయత్ ఇదే సూరహ్ నిసాలో, ఆయత్ నెంబర్ 33 గమనించండి.
وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ إِنَّ اللّهَ كَانَ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدًا
“తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.” (4:33)
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించాము. ఎవరికి ఏ వారసులు అనేది అల్లాహ్ నిర్ధారించాడు అని స్పష్టంగా చెప్పాడు. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. “ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా” అల్లాహు అక్బర్. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.
ఈ రోజు చెల్లెల్ల హక్కు ఏదైతే తినేస్తున్నారో, ఇహలోకంలో ఎవరు మీకు మీ వ్యతిరేకంగా సాక్షి ఉండకున్నా గానీ, అల్లాహ్ సాక్షిగా ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. ప్రళయ దినాన అల్లాహ్ ముందు నిలబడినప్పుడు, అక్కడ మీ చెల్లెళ్లు, మీ సోదరీమణులు మీకు వ్యతిరేకంగా, మా తల్లిదండ్రులు వదిలిన ఆస్తిలో మా ఈ సోదరులు మాకు ఇవ్వలేదు అని అన్నప్పుడు, అక్కడ ఇవ్వడానికి ఏ ఇల్లు ఉండదు, ఏ భూమి ఉండదు, ఏ డబ్బు ఉండదు, ఏ బంగారం ఉండదు. ఆ రోజు మీ వద్ద ఏదైనా పుణ్యాలు ఉండేది ఉంటే అవి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అంటే, మీ సోదరీమణుల యొక్క పాపాలు దానికి పరిమాణంలో మీపై వేయబడుతుంది మరియు మీరు ఇహలోకంలో ఏదైతే మీ సోదరీమణుల హక్కులు చెల్లించలేదో, దానికి బదులుగా నరకంలో పోవలసి వస్తుంది. ఆ నరకం నుండి భయపడండి. సూరహ్ నిసాలో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి ఈ ఆస్తికి సంబంధించిన, ఆయతులు చదవండి, గుణపాఠం నేర్చుకోండి.
అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5948
వారసత్వపు విద్య – మెయిన్ పేజీ
https://teluguislam.net/2026/01/27/laws-of-inheritance/
యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3vXEPX1zXyjGB6v0YY4opo
మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లాహ్ ధర్మం ఆదేశం తెలిపి, దాని నిరూపణలు, నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతివిరోధి, సంకీర్ణవాది, బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానపడేవాడు అని నానారకాలుగా దూషిస్తారు. పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్దగా చదవండి:
“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టుకునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్ జామి 4921).
ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండి:
“రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది“. (అహ్మద్ 1/412, సహీహుల్ జామి 4126).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవరైనా ఉన్నారా? (సమాధానం ఎవరూ లేరు అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండి:
“నేను స్త్రీలతో కరచాలనం చేయను”.
(ముస్నద్ అహ్మద్ 6/357, సహీహుల్ జామి 2509).
మరో సందర్భంలో ఇలా అన్నారు:
“నేను స్త్రీల చేతులను తాకను“.
(తబ్రానీ కబీర్ 24/342, సహీహుల్ జామి 7054. ఇంకా చూడండి: ఇసాబ 4/354, దారుల్ కితాబిల్ అరబీ ముద్రణ).
ఆయిషా (రది అల్లాహు అన్హా) ఇలా చెప్పారు:
“ఎన్నడూ లేదు, అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో మాట ద్వారా బైఆత్ (విధేయత ప్రమాణం) చేసేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).
జాగ్రత్త! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్గా కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్దితుల్లో పరస్త్రీలతో కరచాలనం నిషిద్దమే అవుతుంది .
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది. పదాలలో కొన్ని చిన్న మార్పులు చేశాము ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/
https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్లో తరావీహ్ నమాజ్కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.
నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?
أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్ అహ్మద్ 4/418, సహీహుల్ జామి 105).
అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?
కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్మేన్ మరియు పాఠశాలల వాచ్మేన్ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?
ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.
أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్ వస్తుందో, ఆమె జనాబత్ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్ అహ్మద్ 2/444, సహీహుల్ జామి 2703).
అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.
ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.
ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.
విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.
—
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5314
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
You must be logged in to post a comment.