[19:09 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia. జకాత్ ఆదేశాలు[పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది
జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)
ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.
జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః
“నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).
జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:
1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.
2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.
3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.
4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.
5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.
ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది
బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.
బంగారం, వెండి జకాత్
బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.
బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.
వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.
పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.
వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).
దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.
ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.
ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.
ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.
వ్యాపార సామాగ్రి యొక్క జకాత్
సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.
ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.
కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.
షేర్స్ యొక్క జకాత్
రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
(3) తౌహీదె అస్మా వ సిఫాత్:
అంటే: అల్లాహ్ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’,త’తీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్'(*) లేకుండా. ఆయన గుణ నామములను యథార్థంగా నమ్మాలి. యథార్దానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. “వేటి గురించి అల్లాహ్ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.
(*) ‘తహ్ రీఫ్’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘త’తీల్’ అంటే: అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్ యీఫ్’ అంటే: అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్సీల్’ అంటే: అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.
పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్ ‘అల్ హయ్య్‘ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్ హయ్య్’ అల్లాహ్ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీ‘ ఆయన పేరు, ‘సమ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.
(యూదులు ‘అల్లాహ్ చేతులు కట్టుబడినవి’ అని పలుకు చున్నారు. వారి చేతులే కట్టుబడుగాక! వారు పలికిన దానికి వారికి శాపమున్నది. అల్లాహ్ చేతులు విచ్చలవిడిగా ఉన్నవి. తాను కోరునట్లు వినియోగ పరుచుచున్నాడు). (మాఇద 5: 64).
పై ఆయతులో అల్లాహ్ తనకు రెండు చేతులున్నవని, అవి విచ్చలవిడిగా ఉన్నవని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టాను సారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్ సూరె షూరా (42: 11) లో ఇలా ఆదేశించాడు:
(ఆయనకు పోలినది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు).
ఈ తౌహీద్ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు ఏ ఏ నామ గుణాలను తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. అయితే. వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్ కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటీ దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
4- ప్రవక్తలపై విశ్వాసం:
ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.
(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్ 16: 36).
ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.
ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:
((మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్ జాబ్ 33: 40).
ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి?
మహాశయులారా! మనం ఇహలోకంలో ఏమి చేసినా, ఏ రవ్వంత, అంతకంటే మరీ చిన్నది, అణువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైనా, దుష్కార్యమైనా అది విశ్వాసానికి సంబంధించినా, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా, ఒకవేళ రవ్వంత ఏ కార్యం అయినా గానీ అల్లాహ్ (తఆలా) దానిని హాజరు పరుస్తాడు.
అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో, అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన, అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది?
అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మలేదు గనుక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని, ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వరోపాసనలో తమ జీవితం గడపలేదు గనుక ఇది మహా పాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాధల పట్ల, నిరుపేదల పట్ల ఇంకా ఏ పుణ్యాలు, సత్కార్యాలైతే వారు చేసుకున్నారో, వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరు అవుతారో వారికి, వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించారు.
“ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, దూరం దారిలో మైదానంలో ఎండమావులు ఎలా కనబడతాయో దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్ళు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది“. వీరు ఏ సత్కార్యాలు అయితే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా! అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా!
గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు ఏదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈవిధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు. ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు! కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహు దైవారాధన కు దూరంగా ఉండడం తప్పనిసరి.
అంతేకాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు. ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాం పై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్,, బిదాత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు, ఏ పాపాలు అయితే వేరే పుణ్యాలను కూడా, సత్కార్యాలను కూడా నాశనం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తరువాత తమకుతాము చాలా నష్టం లో పడి చూసుకుంటారు. తమకు తాము చాలా నష్టం లో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు.
సూరయే కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలి అన్నట్లుగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూరయే కహఫ్ లో “వారికి తెలియజేయండి. స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారు ఎవరో మీకు తెలియ చేయాలా? ఎవరి ఆ కష్టాలు అయితే ఇహ లోకంలోనే వృధా అయిపోయాయి. వారు ఏమి అనుకుంటారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు“. కానీ ఏ షిర్క్ పనులు అయితే వారు చేస్తున్నారో ఎలాంటి బిదాత్ లకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది.
ఆ తరువాత నూట ఐదవ ఆయత్ లో అల్లాహ్ అంటున్నాడు – “ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి. ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. పరలోక దినాన అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు“.
గమనించారా! సోదరులారా, సోదరీమణులారా! పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం? ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలు అన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేసాడు? ఇంతకు ముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! నాన్నా!, పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఇక్కడ పాస్ అవుతావు అని ఎలా అయితే మనం పిల్లలకు తెలియచేస్తామో, అంతకంటే గొప్ప మన కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు, ఆరాధ్య నీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉంటే, అలా తెలుసుకోలేదు. వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినం అయితే మనకు ఇక్కడ చేసుకున్న సత్ కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క సత్కార్యాలు అన్నీ వృధా అయిపోయాయి. “వారి యొక్క సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకం లో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికీ ఏ మాత్రం బరువు ఉండదు“.
ఈ విధంగా మహాశయులారా! మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
మహాశయులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో, అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడ యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు? వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో? అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాం పై సరైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మనం తెలుసుకుంటూ వస్తున్నాము.
ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరినెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరు అయినప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి! ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లాహ్ ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఎంత పరస్పరం ప్రేమ, ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన “ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరం అవుతారు, శత్రువులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది“.
అల్లాహ్ ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్యనీయులు కూడా, ఎవరినైతే ఆరాధించడం జరిగిందో, వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయత్ :
“అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు? అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా? లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడటం జరుగుతుంది“.
అల్లాహ్ మనందరిని అలాంటి పరిస్థితుల నుండి కాపాడుగాక.
“అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి, ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకం లో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. మేము అల్లాహ్ ను వదిలి అల్లాహ్ కు, ఆ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ తో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాహ్ కు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాహ్ కు సమానులుగా చేసి, మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము“.
ఈవిధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఇహలోకంలో ఎంత తప్పు చేసామో కదా! ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనలు వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏమి ప్రయోజనం ఉండదు.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లాహ్ యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాహ్ తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొలిపి మార్గభ్రష్టత్వం లో పడవేసి అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించాలని, వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి, ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు.
అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి. మాకు సహాయం చేయండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు. మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. మీరు జిన్నులను ఆరాధించేవారు, షైతానులను ఆరాధించేవారు. షైతాను మిమ్మల్ని ఇలాంటి పెడమార్గంలో పడవేసాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు.
చదవండి ఈ ఆయత్. ఎన్నో ఆయత్ లు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయత్ నేను చదువుతున్నాను – “ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఆ మహా మైదానంలో అందరిని సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహ్ (తఆలా) దైవదూతలతో ప్రశ్నిస్తాడు. ఏమి? వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవ దూతలు సమాధానం చెబుతారు. నీవు అన్ని రకాల షిర్క్, బహు దైవారాధన నుండి అతీతునివి. నీవు మాకు సాన్నిహిత్యునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కాదు మాకు స్నేహితులు. సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము. నీవు అన్ని రకాల షిర్క్ లకు అతీతునివి. వారు జిన్నులను ఆరాధించేవారు. వారిలో అనేకమంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది. వారిపై విశ్వాసం ఉండింది“.
అలాగే ఏసుక్రీస్తు, హజరత్ ఈసా (అలైహిస్సలాం) “మీరు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి” అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసు క్రీస్తు హాజరవుతారు. ఈసా (అలైహిస్సలాం) హాజరవుతారు. వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు – “అప్పుడు అల్లాహ్ (తఆలా) మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాం ని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ను వదిలి “నన్ను, నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి” అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ (తఆలా) మందలిస్తాడు“. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు? “నీవు పవిత్రునివి, అన్ని రకాల బహు దైవారాధనకు అతీతునివి. ఏ మాట పలకడం నాకు ఏ మాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను? అలాంటి మాట నేను ఎందుకు చెపుతాను? నేను ఒకవేళ చెప్పి ఉంటె నీకు తెలుసు ఆ విషయం. నేను వారికి చెప్పి ఉంటె నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి! నా యొక్క ప్రభు, మీ యొక్క ప్రభువు అల్లాహ్ మాత్రమే గనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా ఏసుక్రీస్తు (అలైహిస్సలాం) తెలియజేస్తారు“.
ఇంకా ఏమి జరగనుంది? ఇన్షా అల్లాహ్ తరవాయి భాగంలో మనం తెలుసుకుందాము.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1695. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సత్యమూర్తి. ఇది తిరుగులేని సత్యం. ఆయన ఇలా ప్రవచించారు :
“మిలో ప్రతి వ్యక్తి మాతృ గర్భంలో ఈ విధంగా రూపొందుతాడు : మొదట నలభై రోజుల దాకా (వీర్యబిందువు రూపంలో) ఉంటాడు. తరువాత అన్ని రోజులే ద్రవరక్తం రూపంలో ఉంటాడు. ఆ తరువాత అన్నే రోజులు మాంసపు ముద్ద (పిండం) రూపంలో ఉంటాడు. ఆ తరువాత అల్లాహ్ ఒక దైవదూతను నాలుగు ఆజ్ఞలు ఇచ్చి పంపుతాడు – అతని కర్మలు, ఉపాధి, ఆయుషును గురించి వ్రాయమని ఆదేశిస్తాడు. అతను దౌర్భాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా అనే విషయాన్ని కూడా వ్రాయమని ఆదేశిస్తాడు. ఆ తరువాత అతనిలో ప్రాణం పోయబడుతుంది. పోతే మీలో ఒక వ్యక్తి (సత్) కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చివరికి (ఆ సత్కర్మల కారణంగా) అతనికి, స్వర్గానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. ఆ తరువాత అతని జాతకం మారిపోయి అతను నరకవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్పర్యవసానంగా అతను నరకం పాలవుతాడు). అదే విధంగా మరొకడు (దుష్) కర్మలు చేస్తూ ఉంటాడు. అలా చివరికి (ఆ దుష్కర్మల కారణంగా) అతనికి, నరకానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. అంతలో అతని జాతకం మారిపోయి అతను స్వర్గవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్ఫలితంగా అతను స్వర్గానికి వెళ్తాడు).”
1696. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :-
“అల్లాహ్ మాతృగర్భం దగ్గర ఒక దైవదూతను నియమిస్తాడు. ఆ దైవదూత “ప్రభూ! ఇప్పుడు వీర్య బిందువు ….. ప్రభూ! ఇప్పుడు ద్రవరక్తం ….. ప్రభూ! ఇప్పుడు మాంసపు ముద్ద (పిండం)” అని అంటాడు. ఆ తరువాత దేవుడు ఆ పిండాన్ని (మానవుడిగా) సృష్టించడానికి పూనుకుంటాడు. అప్పుడు ఆ దైవదూత “ఇతను బాలుడా, లేక బాలికా? ఇతను దౌర్బాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా? ఇతని ఉపాధి ఎంత? ఇతని ఆయుషు ఎంత?” అని అడుగుతాడు. ఈ విషయాలన్నీ మాతృగర్భంలో ఉండగానే వ్రాయబడతాయి.
(సహీహ్ బుఖారీ:- 6వ ప్రకరణం – అల్ హైజ్, 17వ అధ్యాయం – ముఖల్ల ఖతిన్ వ గైరి ముఖల్లఖతి)
1697. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం :- మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశాన వాటికకు వెళ్ళాము. . అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్బాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై వుంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్బాగ్యుడయితే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్బుద్ధి పుడ్తుంది” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖురాన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవం పట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము” (92 : 5-10).
1698 – حديث عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَيُعْرَفُ أَهْلُ الْجَنَّةِ مِنْ أَهْلِ النَّارِ قَالَ: نَعَمْ قَالَ: فَلِمَ يَعْمَلُ الْعَامِلُونَ قَالَ: كُلٌّ يَعْمَلُ لِمَا خُلِقَ لَهُ، أَوْ لِمَا يُسِّرَ لَهُ أخرجه البخاري في: 82 كتاب القدر: 2 باب جف القلم على علم الله
1698. హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక వ్యక్తి లేచి “దైవప్రవక్తా! స్వర్గవాసులెవరో నరకవాసులెవరో (ముందుగానే) గుర్తించబడ్డారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లం) ఔనన్నారు. “అలాంటప్పుడు మానవులు కర్మలు ఆచరించడం దేనికి?” అని ప్రశ్నించాడా వ్యక్తి మళ్ళీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ప్రతి మనిషీ తాను దేని కొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు” అని అన్నారు. లేక “ఎలాంటి బుద్ధి ఇవ్వబడిందో అలాంటి పనులే చేస్తాడు” అని అన్నారు.*
(సహీహ్ బుఖారీ :- 82వ ప్రకరణం – ఖద్ర్ , 2వ అధ్యాయం – జప్ఫల్ ఖలము అలా ఇల్మిల్లాహ్)
*ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుంటే అతని అదృష్టంలో స్వర్గం రాసి ఉందని భావించవచ్చు. అలాగే మరొక వ్యక్తి చెడ్డ పనులు చేస్తుంటే అతని అదృష్టంలో నరకం రాసి ఉందని అనుకోవచ్చు. ఈ హదీసు భావం ఇదే. అయితే అదృష్టం గురించిన జ్ఞానం మనకు లేదు గనక నిజంగా ఫలానా వ్యక్తి స్వర్గానికి పోతాడని, ఫలానా వ్యక్తి నరకంలో పడిపోతాడని ఖచ్చితంగా చెప్పలేము. చెప్పకూడదు కూడా. మనం ఏం చేస్తున్నామో, ఏం జరుగుతున్నదో అంతా విధి నిర్ణయమే. అయితే విధి నిర్ణయం, విధి వ్రాత ఏమిటో మనకు తెలియదు గనక మనం చేసే పనులకు మనమే బాధ్యులవుతాము.దాని ప్రకారమే మనకు పరలోక ప్రతిఫలం లభిస్తుంది. అంతేగాని, మనం కావాలని తప్పుడు పనులు చేస్తూ విధి వ్రాత అంటూ వాటి బాధ్యతను దేవునిపై నెట్టి మనం మన పాపాల దుష్పర్యవసానం నుండి బయట పడగలమని భ్రమించకూడదు. (అనువాదకుడు)
1699 – حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ الْجَنَّةِ، فِيمَا يَبْدُو لِلنَّاسِ، وَهُوَ مِنْ أَهْلِ النَّارِ وَإِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ النَّارِ، فِيمَا يَبْدُو لِلنَّاسِ، وَهُوَ مِنْ أَهْلِ الْجَنَّةِ أخرجه البخاري في: 56 كتاب الجهاد: 77 باب لا يقول فلان شهيد
1699. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఒక వ్యక్తి ప్రజల దృష్టిలో స్వర్గవాసులు చేసేటటువంటి పనులే చేస్తాడు. కాని అతను నరకవాసి అవుతాడు. అలాగే మరొకతను జనం దృష్టిలో నరకవాసులు చేసేటటువంటి పనులు చేస్తాడు. కాని అతను స్వర్గనివాసి అవుతాడు.”
1700. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు : (ఓసారి) హజ్రత్ ఆదం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మాట్లాడుతూ “ఆదం గారూ! మీరు మా పితామహులు. కాని వారు మమ్మల్ని దౌర్భాగ్యులుగా చేశారు. మమ్మల్ని స్వర్గం నుంచి తీసివేయించారు” అని ఆరోపించారు. దానికి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) సమాధానమిస్తూ “మూసా! అల్లాహ్ నీకు తనతో ప్రత్యక్ష సంభాషణా భాగ్యం కలిగించాడు. పైగా ఆయన నీకు తన స్వహస్తాలతో (తౌరాత్ పలకలను) రాసిచ్చాడు. (అంతటి హోదా పొంది కూడా) నీవు, నా పుట్టుకకు నలభై ఏళ్ళు పూర్వమే నా అదృష్టంలో రాసిన విషయాల్ని గురించి నన్ను నిందిస్తున్నావా?” అని అన్నారు..ఈ మాట ఆధారంగా హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) హజ్రత్ మూసా (అలైహిస్సలాం) పై సంవాదనలో ఆధిక్యత పొందారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (ఈ మాట దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడుసార్లు అన్నారు).*
(సహీహ్ బుఖారీ:- 82వ ప్రకరణం – ఖద్ర్ , 11వ అధ్యాయం – తహాజ్ఞ ఆదము వ మూసా ఇందల్లాహ్)
* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు: మనలో కూడా ఎవరైనా పాపం చేసినవాడు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)లా సమాధానమిచ్చి నింద, శిక్షల నుండి విముక్తి పొందగలడా? అన్న ప్రశ్న ఉదయిస్తుందిక్కడ. దానికి సమాధానం ఇది – లేదు. విముక్తి పొందలేడు. ఎందుకంటే అంతనింకా ఇహలోకంలోనే ఉన్నాడు. ఇహలోకం ఆచరణా స్థలం. ఇక్కడ ఆచరణకు ఎగనామం పెట్టి మాటల గారడితో మోక్షం పొందడం కుదరదు. హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) క్రియా ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత ఇలా సమాధానమిచ్చారు. అదీగాక అల్లాహ్ ఆయన తప్పును క్షమించాడు. అందువల్ల ఆయన పై ఇక ఎలాంటి నిందను మోపలేము. (అనువాదకుడు)
5వ అధ్యాయం – ఆదం పుత్రుని నొసట వ్యభిచార భాగం కొదో గొప్పో లిఖించబడింది قدِّر على ابن آدم حظه من الزنا وغيره
1701. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు :-
“అల్లాహ్ ఆదం పుత్రుడి అదృష్టంలో వ్యభిచార భాగం (కొద్దీ గొప్పో) లిఖించాడు. అది అతనికి ఎలాగూ లభిస్తుంది. అందుచేత (పర స్త్రీని కామదృష్టితో చూడటం) కళ్ళ వ్యభిచారం, (పర స్త్రీతో అశ్లీల మాటలు పలకడం) నోటి వ్యభిచారం. మానవుని మనస్సు (అశ్లీల చేష్టలను) కోరుతుంది. (ఇది భావ పరమైన వ్యభిచారం). అయితే అతని మర్మాంగం ఆ కోరికకు కార్యరూపం ఇవ్వటమో లేక ధిక్కరించటమో చేస్తుంది.”
6వ అధ్యాయం – ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు معنى كل مولود يولد على الفطرة، وحكم موت أطفال الكفار وأطفال المسلمين
1702 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا مِنْ مَوْلُودٍ إِلاَّ يُولَدُ عَلَى الْفِطْرَةِ فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ كَمَا تنْتَجُ الْبَهِيمَةُ بَهِيمَةً جَمْعَاءَ [ص:213] هَلْ تُحِسُّونَ فِيهَا مِنْ جَدْعَاءَ ثُمَّ يَقُولُ أَبُو هُرَيرَةَ رضي الله عنه: (فِطْرَةَ اللهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا لاَ تَبْدِيلَ لِخَلْقِ اللهِ، ذَلِكَ الدِّينُ الْقَيِّمُ) أخرجه البخاري في: 23 كتاب الجنائز: 80 باب إذا أسلم الصبي فمات هل يصلى عليه
1702. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఇలా అన్నారు :- “ప్రతి పిల్లవాడు (ఏ మతస్థుడైనా) ప్రకృతి ధర్మంపై (అంటే ఇస్లాం ధర్మం పై) పుడతాడు. కాని ఆ తరువాత అతని తల్లిదండ్రులు అతడ్ని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేదా మజూసీ (అగ్ని పూజారి)గానో మారుస్తారు, జంతువుల్ని మార్చినట్లు. జంతువులు పుట్టేటప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి. (ఆ తరువాత ఈ మానవులు వాటి చెవులనో, కొమ్ములనో కోసి పారేస్తారు) ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా? “
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈ క్రింది ( ఖుర్ఆన్) సూక్తిని పఠించేవారు.
“అల్లాహ్ మానవులను ఏ ప్రకృతి ధర్మంపై పుట్టించాడో అది మార్చనలవి కానిది. ఇదే సవ్యమైన, స్థిరమైన ధర్మమార్గం”. (30:30)
1703 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سُئِلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذَرَارِيِّ الْمُشْرِكِينَ، فَقَالَ: اللهُ أَعْلَمُ بِمَا كَانُوا عَامِلِينَ أخرجه البخاري في: 23 كتاب الجنائز: 93 باب ما قيل في أولاد المشركين
1703. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- బహుదైవారాధకుల యుక్త వయస్సుకురాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి కర్మలు ఆచరిస్తారో అల్లాహ్ కే తెలుసు” అని అన్నారు.
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 93 باب ما قيل في أولاد المشركين
1704.హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడగటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “ఆ పిల్లలను అల్లాహ్ పుట్టించాడు గనక వారు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఏం చేస్తారో అల్లాహ్ కి మాత్రమే తెలుసు” అని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.
إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).
రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్ 36: 12).
మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్ (3:40)లో ఉంది:
كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
(అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు).
నాల్గవది: అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
(వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు). (సూరె సాఫ్ఫాత్ 37: 96).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్ (అల్లాహ్ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త (సల్లల్హాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[1:34 నిముషాలు] అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[17:20 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
జిబహ్ చేసే పద్ధతి, దాని ఆదేశాలు
భూనివాస జంతువులు ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయ(కోయ)బడినప్పుడే అవి తినుటకు ధర్మసమ్మతం.
జిబహ్ అంటే: గొంతు, ఆహారనాళం మరి కంఠనాళాలను కోయుట. గత్యంతరం లేని పరిస్థితిలో ఎక్కడి నుండైనా రక్తం ప్రవహించాలి.
ఎందుకనగా ఏ జంతువును, పక్షులను వశపరుచుకొని జిబహ్ చేయగలమో వాటిని ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయకుంటే వాటిని తినుట ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా జిబహ్ చేయబడనివి మృతుల్లో లెక్కించబడుతాయి.
జిబహ్ నిబంధనలు
1-జిబహ్ చేయు వ్యక్తి: బుద్ధిమంతుడు, ఆకాశ ధర్మాన్ని అవలంభించినవాడయి ఉండాలి. అంటే ముస్లిం లేదా యూదుడు మరియు క్రైస్తవుడు. కాని పిచ్చివాడు, త్రాగుబోతు మరియు జిబహ్ పద్ధతులు తెలియని బాలుడు జిబహ్ చేస్తే తినడం యోగ్యం కాదు. ఎందుకనగా వీరిలో బుద్ధీజ్ఞానాల కొరత వల్ల జిబహ్ ఉద్దేశ్యం పూర్తి కాదు. అలాగే అవిశ్వాసి, బహుదైవారాధకుడు, మజూసి (అగ్ని పూజారి), సమాధుల పూజారులు జిబహ్ చేసినది ధర్మసమ్మతం కాదు.
2-జిబహ్ చేసే ఆయుధం: రక్తాన్ని ప్రవహింపజేసే పదునైన మొనగల ఏ వస్తువుతో జిబహ్ చేసినా అది యోగ్యమే. అది ఇనుపదైనా, రాయి అయినా లేదా మరేదైనా సరే. అయితే అది దంతం, ఎముక, గోరు అయి ఉండకూడదు. వాటితో జిబహ్ చేసినవి యోగ్యం కావు.
3- గొంతు (శ్వాస పీల్చు మార్గం), ఆహారనాళం మరియు కంఠనాళాలను కోయాలి.
జిబహ్ కొరకు కచ్చితంగా ఈ అవయవాలను ప్రత్యేకించడంలోని మర్మం ఏమిటంటేః వివిధ నరాలు అక్కడే ఉంటాయి గనుక రక్త ప్రవాహం మంచి విధంగా జరుగుతుంది. తొందరగా ప్రాణం పోతుంది. జంతువుకు ఎక్కువ అవస్థ ఏర్పడదు. దాని మాంసం కూడా రుచిగా ఉంటుంది.
వేటాడినప్పుడు లేదా వేరే ఏదైనా సందర్భంలో పై తెలిపిన ప్రకారం జిబహ్ చేయడం అసాధ్యమైనప్పుడు బిస్మిల్లాహ్ అని పదునైన ఆయుధం దాని వైపు విసిరినప్పుడు అది దాని శరీరంలో తాకి వెంటనే చనిపోయినా, లేదా ప్రాణంగా ఉన్నప్పుడు దానిని వశపరుచుకొని జిబహ్ చేసినా అది ధర్మసమ్మతం అవుతుంది.
తినుటకు యోగ్యమైన జంతువులు ఊపిరాడక, గట్టి దెబ్బ తాకి, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి, పరస్పర కొమ్ములాట వల్ల లేదా ఏదైనా క్రూరమృగం దాడితో మరణిస్తే అవి నిషిద్ధం. అయితే అవి మరణించే ముందు కొంత ప్రాణం ఉన్నప్పుడు వశపరుచుకొని జిబహ్ చేయగలిగితే అవి ధర్మసమ్మతం అవుతాయి.
4- జిబహ్ చేయు వ్యక్తి జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం సున్నత్.
జిబహ్ కు సంబంధించిన ధర్మాలు
1- జంతువును పదును లేని ఆయుధంతో జిబహ్ చేయడం “మక్రూహ్”.
2- ఏ జంతువును జిబహ్ చేయనున్నామో దాని ముందు అది చూస్తుండగా కత్తికి పదును పెట్టడం “మక్రూహ్”.
3- జంతువును ఖిబ్లాకు వ్యెతిరేక దిశలో పెట్టి జిబహ్ చేయడం “మక్రూహ్”.
4- పూర్తిగా ప్రాణం పోక ముందే దాని మెడ విరుచుటగాని లేదా చర్మం తీయుటగాని “మక్రూహ్”.
మేక, ఆవులు ఎడమ వైపు పరుండబెట్టి జిబహ్ చేయడం సున్నత్. ఒంటెను నిలబెట్టి దాని ఎడమ చెయిని (ముందు కాళును) కట్టేసి జిబహ్ చేయుట సున్నత్. వల్లాహు అఅలమ్.
వేట
అవసర నిమిత్తం వేటాడుట తప్ప కాలక్షేపం కోసం, మనోరంజన కోసం వేటాడుట యోగ్యం కాదు.
వేటాడుతూ వేటాడబడిన జంతువును పట్టుకున్నాక రెండు స్థితులుః
1- దానిని పట్టుకున్నప్పుడు దానిలో ప్రాణం ఉంటే తప్పక దానిని జిబహ్ చేయాలి.
2- పట్టుకున్నప్పడు అది చనిపోయి ఉండవచ్చు. లేదా ప్రాణం ఉండి కూడా లేనట్లుగానే ఏర్పడితే అది ధర్మసమ్మతమే.
జిబహ్ నిబంధనల మాదిరిగానే వేట నిబంధనలు ఉన్నాయిః
1- బుద్ధిజ్ఞానం గల ముస్లిం లేదా యూదుడు, క్రైస్తవుడై ఉండాలి. పిచ్చివాడు, త్రాగుబోతు, మజూసి, బహుదైవారాధకులు జిబహ్ చేసిన దానిని తినుట ముస్లింకు యోగ్యం కాదు.
2- వేటాయుధం పదునుగా ఉండాలి. రక్తం ప్రవహించాలి. గోరు, ఎముక, దంతాలు ఉపయోగించరాదు. పదునైన మొనగల వైపు నుండి జంతువు గాయమైతే అది ధర్మ సమ్మతం. దాని మొన వెనక భాగం నుండి దెబ్బ తగిలి చనిపోతే యోగ్యం కాదు. శిక్షణ ఇవ్వబడిన వేట కుక్క మరియు పక్షులు చంపిన జంతువులు కూడా యోగ్యమే. అయితే అవి వేట శిక్షణ ఇవ్వబడినవి అయి ఉండుట తప్పనిసరి.
వేట శిక్షణ అంటే దానిని వదిలినప్పుడు లేదా ‘పో’ అన్నప్పుడు పోవాలి. అది ఏదైనా జంతువును వేటాడిన తర్వాత తన యజమాని వచ్చే వరకు అతని కొరకు పట్టి ఉంచాలి. అది స్వయంగా తినకూడదు.
3- ఆయుధాన్ని వేట ఉద్దేశ్యంతో విడవాలి. ఆయుధం చేతి నుండి జారిపడి ఏవైనా పశుపక్షాదులు చనిపోతే అవి ధర్మసమ్మతం కావు. అలాగే వేట కుక్క దానంతట అదే వెళ్ళి వేటాడి తీసుకువస్తే అదీ ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా వేటాడే మనిషి తనుద్దేశ్యంతో దానిని పంపలేదు గనక. ఎవరైనా ఒక జంతువు లేదా పక్షికి గురి పెట్టి బాణం వదిలాడు కాని అది మరో దానికి తగిలితే, లేదా గుంపులో ఉన్న వాటికి తగిలి కొన్ని చనిపోతే అవన్నియూ ధర్మసమ్మతమే.
4- వేట పశువు లేదా వేట పక్షి లేదా బాణం ఏదీ విడిసినా అల్లాహ్ పేరుతో విడవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనుట సున్నత్.
గమనికః కుక్కను పెంచటం నిషిద్ధం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన ఉద్దేశ్యాలకు తప్ప. ఆయన సల్లల్లహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం ఈ మూడిట్లో ఏదైనా ఒకటై ఉండాలిః వేట కొరకు, లేదా పశుసంపద భద్రత కోసం, లేదా వ్యవసాయోత్పత్తుల, పైరుపంటల పరిరక్షణ కోసం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.