హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు] షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లిం లారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి. మరియు ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. దైవదూతలలో కొందరికి కొందరిపై మరియు దైవప్రవక్తలలో కొందరికి కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. మరియు సమయాలలో, ప్రదేశాలలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యత ప్రసాదించాడు. అందులో నుండి ఒకటి బైతుల్ మఖ్దిస్. దీనిని (అల్-ఖుద్స్) అని పిలుస్తారు. దీనికి ఇతర ప్రదేశాలపై ఆధిక్యత ఇవ్వబడింది. ఇది అల్లాహ్ యొక్క వివేకము మరియు ఆయన యొక్క గొప్ప ఎంపిక కూడా. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) (28:68)
బైతుల్ మఖ్దిస్ అనగా: షిర్క్ లాంటి దురాచారాల నుండి పవిత్రమైన ఇల్లు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త పవిత్ర ఖురాన్ యొక్క ఘనత, విశిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఖురాన్ అల్లాహ్ చేత పంపబడిన చివరి ఆకాశ గ్రంథమని, ఇది మానవాళికి రుజుమార్గం చూపే మార్గదర్శకమని తెలిపారు. పూర్వపు గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ కాలగర్భంలో కలిసిపోయినా లేదా మార్పులకు లోనైనా, ఖురాన్ మాత్రం అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఖురాన్ పఠనం ద్వారా కలిగే పుణ్యాలు, అది కఠినమైన హృదయాలను కూడా ఎలా మెత్తబరుస్తుందో ఉమర్ (రజిyయల్లాహు అన్హు), తుఫైల్ బిన్ అమర్ దౌసీ వంటి వారి జీవిత ఉదాహరణల ద్వారా వివరించారు. ఖురాన్ ను కంఠస్థం చేయడం (హిఫ్జ్) వల్ల కలిగే గొప్పతనం, ఇహపర లోకాలలో లభించే గౌరవం, మరియు ఇది ఆత్మకు, శరీరానికి ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలియజేశారు. చివరగా, ఖురాన్ ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం ద్వారా ముస్లింలు పొందే సాఫల్యాన్ని గుర్తుచేశారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడైన అల్లాహ్ యే కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈనాటి ప్రసంగంలో మనం ఖురాన్ ఘనతల గురించి తెలుసుకోబోతున్నాం.
ఆకాశ గ్రంథం అంటే ఏమిటి?
ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన విషయము. అయితే ఆకాశ గ్రంథము అని దేనిని అంటారు అన్న విషయాన్ని తెలుసుకొని మనం మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిద్దాం.
ఆకాశ గ్రంథము అంటే, భూమండలం మీద మానవులు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయి మార్గభ్రష్టులు అయిపోయారో, అలా దారి తప్పిపోయిన మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకొని రావడానికి సుబ్ హాన వ త’ఆలా మానవుల్లోనే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తల వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు. దైవదూత తీసుకొని వచ్చిన వాక్యాలు ప్రవక్త మానవులకు తెలియజేసి శిష్యుల ద్వారా రాయించారు, ఒకచోట భద్రపరిచారు. అలా భద్రపరచబడిన దైవ వాక్యాల సమూహాన్ని ఆకాశ గ్రంథము అంటారు, దైవ గ్రంథము అని అంటారు.
ఇలాంటి గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో అనేక చోట్ల అనేక గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. సుహుఫ్ ఇబ్రాహీమ్ అని, అలాగే తౌరాత్ అని, ఇంజీల్ అని, జబూర్ అని, ఖురాన్ అని ఇలా కొన్ని ఆకాశ గ్రంథాల దైవ గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో కనబడుతుంది.
సుహుఫ్ ఇబ్రాహీమ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడ్డాయి. తౌరాత్ గ్రంథము మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీల్ గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది.
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ కు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలు, అది ఇంజీల్ కావచ్చు, జబూర్ కావచ్చు, తౌరాత్ కావచ్చు, సుహుఫ్ ఇబ్రాహీమ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి ఏవీ కూడా నేడు ప్రపంచంలో అసలు రూపంలో భద్రంగా లేవు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని మానవుల కల్పితాలకు గురి అయిపోయాయి. కానీ, ఖురాన్ లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో ఖురాన్ ని సుబ్ హాన వ త’ఆలా ఎలా సురక్షితంగా ఉంచాడో వివరంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతాను.
మొత్తానికి ఆకాశ గ్రంథం అంటే ఏమిటో అన్నది మనం తెలుసుకున్నాం. ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఆయన ద్వారా మనందరి వరకు సుబ్ హాన వ త’ఆలా ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని చేరవేర్చాడు.
ఖురాన్ పఠనం యొక్క ఘనత
అయితే ఈ ఖురాన్ గ్రంథానికి అనేక ఘనతలు ఉన్నాయండి. మొదటి ఘనత ఏమిటంటే, ఈ ఖురాన్ లోని ప్రతి అక్షరానికి బదులుగా పారాయణము చేస్తున్న భక్తునికి పది పుణ్యాల చొప్పున ఇవ్వబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ఉదాహరించి మరి తెలియజేసి ఉన్నారు. ఒక వ్యక్తి ‘అలిఫ్ లామ్ మీమ్’ అని పఠిస్తే, అతనికి ‘అలిఫ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘లామ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘మీమ్’ కి బదులుగా పది పుణ్యాలు, మొత్తం ముప్పై పుణ్యాలు అతనికి దక్కుతాయి అని ప్రవక్త వారు ఉదాహరించి మరి తెలియజేశారు.
ఆ ప్రకారంగా ఒక భక్తుడు ఖురాన్ లోని ఒక సూరా ఒక అధ్యాయం పఠిస్తే ఎన్ని పుణ్యాలు పొందుతాడు? ఒక్క పేజీ చదివితే ఎన్ని పుణ్యాలు దక్కించుకుంటాడు? ఒక్క పారా చదివితే ఎన్ని పుణ్యాలు అతనికి దక్కుతాయి? పూర్తి ఖురాన్ పారాయణము పూర్తి చేస్తే, అతను ఎన్ని లక్షల కోట్ల పుణ్యాలు సంపాదించుకుంటాడో ఆలోచించండి మిత్రులారా! ఇంతటి పుణ్యాలు మనిషికి దక్కేలా చేస్తున్న గ్రంథం ఒక ఖురాన్ మాత్రమే. ఇతర గ్రంథాలకు ప్రతి అక్షరానికి బదులుగా పదేసి పుణ్యాలు దక్కుతాయి అన్న ఘనత, విశిష్టత లేదు. ఒక్క ఖురాన్ కు మాత్రమే ఉంది కాబట్టి, ఇది ఖురాన్ యొక్క ఘనత, ప్రత్యేకత మిత్రులారా.
ఖురాన్: మానవాళికి మార్గదర్శి
అలాగే ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ఆధారంగా మనం చూస్తే, ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము, నూట ఎనభై ఐదవ వాక్యంలో సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ లో స్పష్టం చేసేసి ఉన్నాడు అని అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ ఖురాన్ మానవులందరికీ రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ప్రవక్త వారి కాలం నాటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేటికీ కూడా అనేక ఉదాహరణలు మనము చూస్తూనే ఉన్నాం.
ప్రవక్త కాలంలోని ఉదాహరణలు – తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రజియల్లాహు అన్హు )
ఇప్పుడు మనం ప్రవక్త వారి జీవిత కాలంలోని ఒక రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నాం ఇన్షా అల్లాహ్.
మొదటి ఉదాహరణ తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారిది. ఈయన దౌస్ తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు ఒకసారి వచ్చారు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. అయితే మక్కా పెద్దలు ఆ రోజుల్లో ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న రోజులవి. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లి, “ముహమ్మద్ వారి మాట వినకండి, ముహమ్మద్ వారి మాట వింటే మీరు దారి తప్పిపోతారు, భార్య బిడ్డలకు దూరమైపోతారు, తల్లిదండ్రులకు దూరమైపోతారు” అని రకరకాలుగా ఆయనకు చెప్పి భయపెట్టేశారు. ఆయన ఆ మాటలన్నీ నిజమేమో అని నమ్మేసి, ప్రవక్త వారి మాటలు వినకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ తలిచిందే జరుగుతుంది అన్నట్టుగా, ఒకరోజు కాబా పుణ్యక్షేత్రం వద్ద ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉంటే, సమీపంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం ఆయన చెవిలో పడింది.
ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినేశారో, ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. “నేను చదువుకున్న వ్యక్తిని, ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ణయించుకోగలను. అలాంటప్పుడు ముహమ్మద్ వారి మాట నేను వినడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఆయన మాట విని చూస్తాను, మంచిదా కాదా అని నిర్ణయించుకుంటాను. అంతమాత్రాన నేను కంగారు పడటం ఎందుకు, దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకు?” అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడికి వెళ్లారు. చూస్తే ప్రవక్త వారు ఉన్నారు.
ప్రవక్త వారి వద్దకు వెళ్లి, “ఏమండీ! మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? మీరు చెబుతున్న ఏ మాటలను బట్టి ప్రజలు మీ గురించి ఈ విధంగా చెబుతున్నారు? ఆ మాటలు నాకు కూడా చెప్పండి” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, అటు ఇటు ఏమీ మాట్లాడకుండా ఖురాన్ లోని దైవ వాక్యాలు పఠించి వినిపించారు. ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటే, ఖురాన్ లోని దైవ వాక్యాలు ఆయన విన్న తర్వాత ఏమన్నారంటే: “నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చెబుతున్నది ఇది కవిత్వము కాదు, మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము కాదు. నేను కవిత్వము విని ఉన్నాను, నేను మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని. కానీ మీరు పలుకుతున్నది మాత్రం అది కవిత్వము కాదు, మంత్రతంత్రము కాదు, ముమ్మాటికీ ఇది దేవుని వాక్యము” అని అప్పటికప్పుడే ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయిపోయారు అల్హందులిల్లాహ్.
చూసారా! ఖురాన్ ద్వారా దారి తప్పిపోయిన వాళ్లు మళ్లీ దారి పైకి వచ్చేస్తారు. ఈ ఖురాన్ రుజుమార్గం వైపుకి దారి చూపిస్తుంది.
ప్రవక్త కాలంలోని ఉదాహరణలు – జిమాద్ అజ్దీ (రజియల్లాహు అన్హు)
మరొక ఉదాహరణ విందాం. జిమాద్ అజ్దీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. ఈయన అజ్ద్ తెగకు చెందిన వాళ్లు. ఈయన కూడా మక్కాకు వచ్చారు. కాకపోతే ప్రవక్త వారితో ఆయనకు పరిచయం ఉంది. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లారు. ఈయన దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ! మీకు మంత్రించడం వచ్చు కాబట్టి, మీ మిత్రునికి పిచ్చి పట్టినట్లు ఉంది, ఏదేదో వాగుతూ ఉన్నాడు, కొంచెం మంత్రించి వైద్యము చేయొచ్చు కదా” అని చెప్పారు. ఆయన నిజమేమో అని నమ్మి, ప్రవక్త వారితో పరిచయం ఉండింది కాబట్టి చక్కగా ప్రవక్త వారి దగ్గరికి వెళ్లి, “ప్రజలు ఈ విధంగా మీ గురించి చెబుతున్నారు, అలాంటిది ఏమైనా మీకు సమస్య ఉంటే చెప్పండి, నేను మంత్రించి మీకు వైద్యం చేస్తాను” అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు కూడా కూర్చోబెట్టుకొని, నేను ఏమి చెబుతున్నానో నువ్వు విను అని సూరా ఇఖ్లాస్, సూరా ఫలఖ్, చిన్న చిన్న సూరాలు – ‘ఖుల్ హువల్లాహు అహద్’ అని ఒక సూరా ఉంది కదా, అలాగే ‘ఖుల్ అరూజు బి రబ్బిల్ ఫలఖ్’ అని సూరా ఉంది కదా – ఈ చిన్న చిన్న సూరాలు పఠించి వినిపించగానే, వెంటనే ఆయన కూడా ప్రవక్త వారి సమక్షంలో సాక్ష్యం పలికారు. “అయ్యా! మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో నేను మంత్రాలు నేర్చుకొని ఉన్న వాడిని కాబట్టి, విని ఉన్న వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము ఎప్పటికీ కానే కాదు. అలాగే మీరు చెబుతున్నది ఇది కవిత్వము కూడా కాదు. ఇది స్పష్టమైన దేవుని వాక్యమే” అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి, కలిమా చదివి, అప్పటికప్పుడే ఆయన కూడా ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్.
రెండు ఉదాహరణలు ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేను వినిపించానండి. నేటికీ కూడా అనేకమంది వివిధ భాషలలో అనువాదం చేయబడి ఉన్న దైవ గ్రంథం ఖురాన్ ని చదువుతూ ఉన్నారు. చదివి అల్హందులిల్లాహ్ రుజుమార్గాన్ని పొందుతూ ఉన్నారు. అల్హందులిల్లాహ్ ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయిపోయాము, ఖురాన్ ను చదివి తెలుసుకున్నాము అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనేక ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూడవచ్చు మిత్రులారా.
మొత్తానికి ఖురాన్ కి ఉన్న ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా ప్రజలు రుజుమార్గం పైకి వస్తారు.
ఖురాన్ సురక్షితమైన గ్రంథం
అలాగే ఖురాన్ ఎలాంటి తప్పులు లేని సురక్షితమైన గ్రంథము. ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ [జాలికల్ కితాబు లా రైబ ఫీహ్] “ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు.” (2:2)
అంటే ఇవి దైవ వాక్యాలు అన్న విషయంలో అనుమానానికి తావే లేదు అన్నారు. మరి అనుమానానికే తావు లేనప్పుడు తప్పులు దాంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పులు లేని గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రవక్త వారి కాలంలో కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన తర్వాత నుండి ఇప్పటివరకు కూడా ఎవరూ ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని నిరూపించలేకపోయారు. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అని ఎవరూ నిరూపించలేరు.
కానీ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాను. అదేమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రపంచానికి నిరూపించడానికి కొంతమంది ముస్లిమేతరులు, పండితులు ఖురాన్ ని పఠించారు. తప్పులు వెతకడానికి పఠించారు. పఠిస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు, చదువుతూ పోతూ ఉన్నారు. చివరికి ప్రభావితులైపోయి సురక్షితమైన గ్రంథం ఖురాన్, దైవ వాక్యాలతో నిండిన గ్రంథం ఖురాన్, సత్యమైన దేవుని గ్రంథం ఖురాన్ అని వారు కూడా అల్హందులిల్లాహ్ కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది పండితులు తప్పులు వెతకడానికి మాత్రమే ఖురాన్ చదివారు. కానీ అల్హందులిల్లాహ్ దారి పైకి వచ్చేశారు, ఇస్లాం స్వీకరించేశారు. ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
ఖురాన్ ద్వారా హృదయాల మార్పు
అలాగే ఖురాన్ ద్వారా హృదయాలు మెత్తబడతాయి. కొంతమంది యొక్క మనస్తత్వం మరియు వారి గుండె చాలా గట్టిది. కానీ ఖురాన్ చదివితే ప్రజల గుండెలు, ప్రజల హృదయాలు మెత్తబడతాయి. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు మరియు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి, గట్టి మనుస్కుడు.
ఒకరోజు అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట దైవ వాక్యాలు వినేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉన్నారు. అల్లాహ్ తెలియజేసిన సూరా హాక్కా లోని వాక్యాలు.
وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ “ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం.నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (69:41-43)
అవి విన్న తర్వాత కొంచెం ఇస్లాం వైపుకి, ప్రవక్త వారి వైపుకి మొగ్గు చూపించారు. కానీ మళ్లీ ఉదయాన్ని చూస్తే, మక్కా పెద్దలు రకరకాలుగా ప్రవక్త వారి గురించి చెబుతూ ఉంటే అయోమయంలో పడిపోయారు. మక్కా పెద్దలు చెబుతున్నది నమ్మాలా? లేదా ప్రవక్త ముహమ్మద్ వారు చెబుతున్నది నమ్మాలా? తేల్చుకోలేకపోతున్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, చిరాకు వచ్చేసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే ముహమ్మద్ వారిని చంపేస్తే సరిపోతుంది అని కత్తి పట్టుకొని బయలుదేరిపోయారు.
దారిలో నుఐమ్ అనే ఒక వ్యక్తి చూసుకున్నారు. చూసుకొని “ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగారు. “ముహమ్మద్ వారిని చంపడానికి” అని చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “అయ్యా, ముహమ్మద్ వారి విషయం తర్వాత, ముందు మీ చెల్లెలు ఫాతిమా, మీ బావ సయీద్, వాళ్లిద్దరూ కూడా ఇస్లాం స్వీకరించేశారు, నీకు తెలుసా?” అని చెప్పారు. ముందే కోపంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో చెల్లెలు, బావ ఇద్దరు కూడా ఆయనకు తెలియకుండానే ఇస్లాం స్వీకరించేశారు అన్న మాట వినగానే, కోపం రెట్టింపు అయిపోయింది. మరింత కోపంలో ఆయన అక్కడి నుంచి చక్కగా చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.
ఆ సమయానికి ఖబ్బాబ్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఉమర్ వారి చెల్లెలకు, బావకు ఖురాన్ నేర్పిస్తూ ఉన్నారు. శబ్దం విని ఆయన, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఇంట్లో దాక్కున్నారు. చెల్లెలు బావ ఇద్దరూ కూడా ఆ ఖురాన్ పత్రాలు దాచిపెట్టేసి తర్వాత తలుపు తెరిచారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు కోపంలో ఉన్నారు, ఆ పారాయణము చేసే శబ్దం కూడా వినేసి ఉన్నారు. “నేను శబ్దం విన్నాను, అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. మీరు తాతముత్తాతల ధర్మాన్ని వదిలేశారంట, ముహమ్మద్ తీసుకొని వచ్చిన కొత్త ధర్మాన్ని మీరు అంగీకరించేశారంట. ఏదో మీరు చదువుతూ ఉన్నారు, నేను శబ్దం బయటి నుంచి విన్నాను” అని అలా ఎందుకు చేశారు అని కొట్టడం ప్రారంభించేశారు. బావను చితకబాదేశారు, చెల్లెలను చితకబాదేశారు. చివరికి చెల్లె తలకు గాయమయింది. ఆమె తిరగబడి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి సమాధానం ఇస్తూ, “ఓ ఉమర్! నువ్వు వినింది నిజమే. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను విన్నాము, నమ్మాము, విశ్వసించాము. ఇక నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ఇక మేము మాత్రము ఆ మార్గాన్ని వదిలేది లేదు, ఆ ధర్మాన్ని వదిలేది లేదు” అని చెప్పేశారు.
చెల్లెలు తిరగబడి మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కొంచెం వెనక్కి తగ్గి, ఆశ్చర్యపోయి, “ఏంటమ్మా! మీలో ఇంత మార్పు తీసుకొని వచ్చిన ఆ మాటలు ఏమిటి? నాకు కూడా వినిపించండి” అన్నారు. “చెల్లెలు ముందు మీరు వెళ్లి స్నానం చేసుకొని రండి” అంటే, వెళ్లి స్నానం చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఖురాన్ పత్రాలలో సూరా తాహా కు చెందిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ వాక్యాలు చదివారు. ఆ వాక్యాలు చదివి ఎంత ప్రభావితులైపోయారంటే, “ముహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను కూడా వెళ్లి ఆయన మాటను అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పారు.
ఆ మాట వినగానే అక్కడ దాక్కొని ఉన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు బయటికి వచ్చి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి శుభవార్త తెలియజేశారు. “ఓ ఉమర్! మీకు శుభవార్త ఏమిటంటే, కొద్ది రోజుల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేసి ఉన్నారు. ‘ఓ అల్లాహ్! ముస్లింలకు, ఇస్లాంకు ఉమర్ లేదా అబూ జహల్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి హిదాయత్ ప్రసాదించి బలం ఇవ్వు’ అని కోరి ఉన్నారు. అల్లాహ్ మీ అదృష్టంలో, మీ విధిరాతలో ఇస్లాం యొక్క భాగ్యం రాసాడని నాకు తెలుస్తూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారే అరఖమ్ లో ఫలానా చోట సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లండి” అనగానే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు అక్కడికి వెళ్లారు.
అక్కడ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు, విద్య నేర్చుకుంటూ ఉన్నారు, ఇస్లామీయ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఉమర్ వచ్చేసాడు అని తెలియగానే కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన కోపిష్టుడు, ఇస్లాం స్వీకరించలేదు. ఏం ఉద్దేశంతో వచ్చారో, ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “ఆయన్ని నా దగ్గరికి రానియ్యండి” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన వెళ్లారు. వెళ్లిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు.
ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరిస్తున్న దృశ్యాన్ని, అక్కడ కూర్చొని భయపడుతూ ఉన్న ఆ శిష్యులందరూ, సహాబాలు చూసి ఒక్కసారిగా ఎంత సంతోషపడిపోయారంటే, బిగ్గరగా “అల్లాహు అక్బర్” అని పలికారు. వారందరూ పలికిన ఆ శబ్దము మక్కా వీధుల వరకు కూడా వెళ్లింది.
అంటే అర్థం ఏమిటండీ? ఖురాన్ చదివి, అప్పటికే చంపాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎంత మారుమనసు పొందారంటే, ఆయన హృదయం ఎంతగా మెత్తబడిపోయింది అంటే, వచ్చి ప్రవక్త వారి శిష్యుడిగా మారిపోయారు. ప్రవక్త వారిని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి, దారిలో ఖురాన్ వాక్యాలు చదివారు, ప్రవక్త వారి వద్దకు వచ్చి శిష్యుడిగా మారిపోయారు. చూసారా! కాబట్టి ఖురాన్ పారాయణము ద్వారా హృదయాలు మెత్తబడతాయి అనటానికి ఇది గొప్ప ఉదాహరణ మిత్రులారా.
ఖురాన్ సంరక్షణ
అలాగే ఖురాన్ కి చాలా ఘనతలు ఉన్నాయండి. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవలసి ఉంది కాబట్టి, క్లుప్తంగా ఇన్షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ సురక్షితమైన గ్రంథం. ఇంతవరకే మనం విని ఉన్నాం, ఇతర గ్రంథాలన్నీ కూడా కల్పితాలకు గురైపోయాయి, లేదా కాలగర్భంలో కలిసిపోయాయి అని. కానీ ఖురాన్ అలా కాదు. ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది. ఖురాన్ గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ [ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్] “మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” (15:9)
మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని సురక్షితంగా ఉంచుతూ ఉన్నాము అన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు అన్నది రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి ఇన్షా అల్లాహ్.
ప్రపంచవ్యాప్తంగా ఒకే ఖురాన్
మొదటి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇండియాలో ఖురాన్ చూడండి, అరేబియా దేశాలలోని ఖురాన్ చూడండి, యూరప్ దేశాలలో ఖురాన్ చూడండి, ఇతర ఖండాలలో, ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఖురాన్ ఉన్నా మీరు చూడండి, ప్రతి చోట మీకు ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది.
ఒక దేశంలో వంద సూరాల ఖురాన్, మరొక దేశంలో యాభై సూరాల ఖురాన్, మరొక దేశంలో నూట పద్నాలుగు సూరాల ఖురాన్ – కనిపించదు. పూర్తి ప్రపంచంలో నూట పద్నాలుగు సూరాలు, నూట పద్నాలుగు అధ్యాయాలు కలిగిన ఖురాన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. అదే మీరు వేరే గ్రంథాలని చూడండి. వేరే గ్రంథాలు మీరు చూస్తే, ఒక దేశంలో కొన్ని పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తే, మరొక దేశంలో అంతకు మించిన పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తుంది. ఒకచోట ఎక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము, మరొక చోట తక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము. వీళ్లేమంటారంటే అందులో ఎక్కువైపోయింది అంటారు. వాళ్లేమంటారంటే అందులో కొన్ని తీసేశారు అంటారు. మొత్తానికి తీయటమో లేదా జొప్పించటమో జరిగింది స్పష్టంగా.
కానీ ఖురాన్ లో అలా జరగలేదు. పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్ ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది. ఇది ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
ఖురాన్ కంఠస్థం (హిఫ్జ్)
మరొక ఉదాహరణ, అదేంటంటే: నేడు భూమండలం మీద మస్జిద్ లలో గాని, మదరసాలలో గాని, లైబ్రరీలలో గాని, ఇంకా ఎక్కడైనా గాని ఖురాన్ ఉంది అంటే, ఆ ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని వెళ్లి ఒక సముద్రంలో పడవేసేస్తే, ఖురాన్ గ్రంథము ప్రపంచంలో నుంచి తొలగిపోదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాగితాలలోనే ఈ ఖురాన్ భద్రంగా లేదు, మానవుల గుండెల్లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని భద్రంగా ఉంచి ఉన్నాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏడు సంవత్సరాల కుర్రాడు, తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, పూర్తి ఖురాన్ గ్రంథం “అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్” నుంచి మొదలెట్టి “ఖుల్ అరూజు బి రబ్బిన్ నాస్” అనే సూరా వరకు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. ఇలా ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్లను ‘హుఫ్ఫాజ్‘ అని అంటారు. ఇలాంటి హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో అల్హందులిల్లాహ్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్.
పూర్తి కాగితాలలో ఉన్న ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని పోయి సముద్రంలో పడవేసినా, ఈ ఖురాన్ ని కంఠస్థం చేసిన ఈ హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్లు మళ్లీ మరుసటి రోజే ఖురాన్ ని మళ్లీ రాయగలరు, ముద్రించగలరు, సిద్ధం చేసుకోగలరు. కాబట్టి ఖురాన్ ప్రపంచంలో నుంచి తొలగిపోదు, అది కాగితాలలోనే కాదు, హృదయాలలో కూడా భద్రంగా ఉంది. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖురాన్ ని సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు.
ఒక ప్రశ్న, అదేమిటంటే: ఖురాన్ గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఖురాన్ కాకుండా వేరే గ్రంథాలు ఇవి కూడా దేవుని గ్రంథమే అని పలుకుతున్నారు కదా, అందులోని సగం గ్రంథం ప్రపంచం లోనుంచి తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేస్తే, ఆ సగం గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? లేదా పావు గ్రంథాన్ని కూడా చూడకుండా కంఠస్థం చేసిన వాళ్లు ప్రపంచంలో ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఖురాన్ ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత భద్రంగా ఏ విధంగా ఉంచాడో చూడండి, ఇది ఖురాన్ యొక్క ఘనత మరియు ప్రత్యేకత.
ఇహపర లోకాలలో గౌరవం
అలాగే ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవం, పరలోకంలో కూడా గౌరవం దక్కించుకుంటాడు భక్తుడు, విశ్వాసుడు. ఎలాగంటే చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا [ఇన్నల్లాహ యర్ ఫఉ బిహాజల్ కితాబి అఖ్వామన్] “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతులకు (లేదా సముదాయాలకు) సాఫల్యం ప్రసాదిస్తాడు (గౌరవం ప్రసాదిస్తాడు).”
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ [ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు] “మీలో ఎవరైతే ఖురాన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో, వారు సమాజంలోని ఉత్తమమైన వాళ్లు” అని చెప్పేశారు.
ఉత్తమమైన వారు అన్న యొక్క ఘనత, గౌరవం వారికి ప్రపంచంలో దక్కింది. దీనికి ప్రాక్టికల్ గా ఒక మాట చెబుతాను చూడండి. మనం ప్రతిరోజు మస్జిద్ కి వెళ్తాం. నమాజు ఐదు పూటలా ఆచరిస్తాం. ఇమాం గారు ఫర్జ్ నమాజు ఆచరిస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. వెనకాల నిలబడిన వాళ్లలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రిన్సిపల్ లు ఉంటారు, పండితులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇంకా ఏదేదో నేర్చుకొని ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్లందరూ వెనుక ఉంటే, వారి ముందర ఒక వ్యక్తి ఇమాం గా నిలబడి అందరికీ నమాజు చేయిస్తారు. ఆయన దగ్గర ఇంజనీరింగ్ పట్టా ఉండదు, అలాగే డాక్టర్ పట్టా ఉండదు, ఆయన గొప్ప కోటీశ్వరుడు కూడా కాడు. కానీ అందరి ముందర నిలబడి అందరికీ నమాజు చేయించే గౌరవం ఆయనకు దక్కుతా ఉంది అంటే ఆయన దగ్గర ఏముందో తెలుసా? ఆయన హృదయంలో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఆ గౌరవం ఇచ్చాడు. ఆయన గురువుగా అందరికీ నమాజు చేయిస్తారు, అందరూ ఆయనను గౌరవిస్తూ ఆయన వెనకాల నమాజు చేసుకొని వస్తారు. అల్హందులిల్లాహ్, ప్రపంచంలో ఇది అల్లాహ్ ఇచ్చిన గౌరవం.
పరలోకంలో కూడా గౌరవం దక్కుతుంది. అదేంటో కూడా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: ఎప్పుడైతే లెక్కంపు రోజు వస్తుందో, ఆ లెక్కంపు రోజున ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్! ఫలానా భక్తుడు ప్రపంచంలో ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు, అందులో ఉన్న విషయాల ప్రకారం అమలు పరిచాడు కాబట్టి ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా చేయండి”.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా గౌరవ కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఒక రాజు పిలిచి ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చేస్తే దాన్ని ఎంత గౌరవంగా భావిస్తాడు మనిషి? పేపర్లలో, న్యూస్ ఛానల్ లలో ప్రతి చోట అదే సంచలనమైన వార్తగా మారిపోతుంది. ఆయన ఫలానా అవార్డు దక్కించుకున్నాడు, ఫలానా ప్రధాని చేతి మీద లేదా రాజు చేతి మీద ఆ అవార్డు ఆయన తీసుకున్నాడు చూడండి, చూడండి అని ప్రతి వీడియోలో ఆయనదే వీడియో, ప్రతి పేపర్లలో ఆయనదే ఫోటో కనిపిస్తుంది. కానీ పూర్తి ప్రపంచానికి రారాజు, విశ్వానికి మొత్తానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆ రోజు మానవులందరి ముందర ఆ భక్తుని తల మీద కిరీటం ధరింపజేస్తాడు.
అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అంటుంది: “ఓ అల్లాహ్! మరింత గౌరవం వచ్చేలాగా ఆయనకి గౌరవించండి” అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఖరీదైన బట్టలు ధరింపజేస్తాడు.
అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడుగుతుంది: “ఓ అల్లాహ్! ఇతని తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చేలాగా చేయండి” అంటే, అప్పుడు ఆ భక్తుని యొక్క తల్లిదండ్రులకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరి ముందర కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ప్రపంచంలో ఖురాన్ నేర్పిస్తారో, ఖురాన్ ప్రకారంగా జీవించుకోవడానికి మార్గదర్శకత్వం చేస్తారో, అలాంటి తల్లిదండ్రులు కూడా పరలోకంలో లెక్కంపు రోజున గౌరవం పొందుతారు మిత్రులారా.
ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవము ఉంది, పరలోకంలో కూడా గౌరవము ఉంది. ఖురాన్ ను కాకుండా వేరే గ్రంథాల వలన ఇలాంటి గౌరవం కలుగుతుంది అన్న విశిష్టత ఉందా? లేదు. ఒక ఖురాన్ కు మాత్రమే ఉంది, ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
అంతేకాదండి, ఖురాన్ కి ఉన్న మరో ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా మానవుడు స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటాడు. ఎలాగా? ఎలాగంటే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గానికి చేరినప్పుడు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని, కంఠస్థం చేసి, పఠించి, దాని ప్రకారంగా అమలు పరిచిన భక్తులతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటాడు: “ఓ భక్తుడా! ఎలాగైతే నీవు ప్రపంచంలో ప్రశాంతంగా ఖురాన్ పారాయణము చేసేవాడివో, ఈరోజు స్వర్గంలో కూడా ఖురాన్ పారాయణము చేస్తూ పో మరియు స్వర్గం యొక్క స్థానాలు ఎక్కుతా పో” అని చెప్పేస్తాడు. అతను ఖురాన్ పారాయణము మొదలెట్టి, స్వర్గపు యొక్క స్థాయులు ఎక్కుతా పోతాడు. ఎక్కడైతే ఆయన ఖురాన్ పారాయణము పూర్తి అయిపోతుందో, అప్పటివరకు ఎంత పైకి వెళ్ళిపోతాడో, అంత పైకి వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోతాడు. అల్లాహు అక్బర్! ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
అంతే కాదండి, ఖుర్ఆను ద్వారా సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ పారాయణం చేస్తారో, ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు సూరా ముల్క్ 67వ అధ్యాయాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకు సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
చూశారా? ప్రపంచంలో గౌరవం, సమాధి శిక్షల నుండి రక్షణ, మరియు పరలోకంలో గౌరవం, స్వర్గంలోని ఉన్నత స్థానాలు, ఎన్ని ఘనతలు దక్కుతున్నాయో చూడండి మిత్రులారా ఈ ఖుర్ఆన్ ద్వారా. మరి,
ఖుర్ఆన్ – స్వస్థత మరియు కారుణ్యం
ఖుర్ఆను ద్వారా మనుషులు స్వస్థత కూడా పొందగలరు. పదిహేడవ అధ్యాయం 82వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ “మేము అవతరింపజేసే ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.” (17:82)
అంటే, ఇది స్వస్థత ఇస్తుంది అని అన్నారు. మనిషికి శారీరక వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. హృదయాలలో మనిషికి అసూయ, అహంకారం, ఇలాంటి కుళ్ళు బుద్దులు, కొన్ని దురలక్షణాలు ఉంటాయి, అవి హృదయాలలో ఉంటాయి. ఖుర్ఆన్ పఠిస్తే, ఖుర్ఆన్ ప్రకారంగా నడుచుకుంటే ఆ రోగాలన్నీ దూరమైపోతాయి, మనిషి స్వస్థత పొందుతాడు, మంచి స్వభావము కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. అలాగే శారీరక వ్యాధులకు కూడా ఖుర్ఆన్ పారాయణము ద్వారా స్వస్థత లభిస్తుంది అని తెలియజేయడం జరిగి ఉంది.
ఖుర్ఆన్ – సమగ్ర గ్రంథం
అంతే కాదండి, మనిషికి మేలు చేసే అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ లో తెలియజేసి ఉన్నాడు. కాకపోతే దాని బాగా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఖుర్ఆన్ చదివి చూడండి. ప్రపంచం ఎలా మొదలైందో కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం మొదలైన తర్వాత నేటి వరకు ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రళయం వరకు ఏమేమి సంభవిస్తాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత మరణానంతరం ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి అవసరమైన అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇందులో తెలియజేశేశాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, ఏమండీ, సైన్స్ గురించి కూడా ఉందా ఖుర్ఆన్ లో అంటారు. సైన్స్ గురించి కూడా ఉంది. ఖుర్ఆన్ మరియు సైన్స్ అనే ఒక పుస్తకం ఉంది, అది చదవండి ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి పరిశీలించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులారా.
ఇక చివరిగా మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము ఎవ్వరూ సృష్టించలేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పదిహేడవ అధ్యాయము 88వ వాక్యంలో తెలియజేశాడు, మానవులందరూ కలిసిపోయినా, మానవులతో పాటు జిన్నాతులు, షైతానులు కూడా కలిసిపోయినా, అందరూ కలిసి ప్రయత్నించినా ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము తయారు చేయలేరు.
అలాగే, ఖుర్ఆన్ సులభమైన గ్రంథము. యాభై నాలుగవ అధ్యాయము 22వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వలఖద్ యస్సర్నల్ ఖుర్ఆన. మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని సులభతరం చేసేశాము అని అన్నారు. కాబట్టి ఖుర్ఆను గ్రంథాన్ని పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు, పురుషులు, మహిళలు, అందరూ కూడా ఖుర్ఆను గ్రంథాన్ని నేర్చుకోవచ్చు, చదవవచ్చు, కంఠస్థం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అల్ హందులిల్లాహ్.
మిత్రులారా, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహిమలు, ఘనతలు, ప్రత్యేకతలు కలిగిన ఖుర్ఆను గ్రంథాన్ని చదువుకొని, కంఠస్థం చేసుకొని, అర్థం చేసుకొని, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖుర్ఆను ద్వారా ప్రపంచంలోనూ, పరలోకంలోనూ గౌరవమైన స్థానాల వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ యొక్క అనేక గొప్ప ప్రత్యేకతలు మరియు ఘనతలు వివరించబడ్డాయి. ఇది అల్లాహ్ చే స్వయంగా ప్రళయం వరకు భద్రపరచబడిన, ఎలాంటి సందేహాలకు తావులేని ఏకైక గ్రంథమని నొక్కి చెప్పబడింది. ఖుర్ఆన్ పఠనం హృదయాలకు శాంతిని, మార్గదర్శకత్వాన్ని మరియు శారీరక, ఆత్మిక రోగాలకు స్వస్థతను ఇస్తుందని ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు తుఫైల్ (రదియల్లాహు అన్హు) వంటి వారి ఇస్లాం స్వీకరణ గాథలతో వివరించబడింది. ఖుర్ఆన్ పారాయణ ప్రతి అక్షరానికి పది పుణ్యాలను ఇస్తుందని, ఇది ఇహలోకంలోనే కాక, సమాధిలో మరియు పరలోకంలో కూడా తన సహచరుడికి రక్షణగా, సిఫారసుగా నిలిచి స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేరుస్తుందని చెప్పబడింది.
అల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను’మినుబిహి వ నతవక్కలు అలైహ్. వ న’ఊదుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యి’ఆతి అ’మాలినా. మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్, వ మై యుద్లిల్ ఫలా హాదియ లహ్.వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నదీరా. అమ్మా బ’అద్
ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్. వ ఖైరల్ హద్యి హద్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా. వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్. వ కుల్ల దలాలతిన్ ఫిన్ నార్.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ఓ విశ్వాసులారా! అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. (3:102)
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.(4:1)
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (33:70-71)
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా.
ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకతలు
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానం ఏమిటంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు.
ఆ విధంగా ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే, ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒకచోట పొందుపరిచి, ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనం చూచినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.
అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్ షా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని సూర బఖరా, రెండవ అధ్యాయం, 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖుర్ఆన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖుర్ఆన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఖుర్ఆన్ యొక్క భద్రత
అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది, ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇన్ షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖుర్ఆన్ లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ (ఇన్నా నహ్ను నజ్జల్ నజ్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్) మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.(15:9)
అనగా, మేమే ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవలసిన ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు, ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు, మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు.
ఈ రోజు మనం కువైట్ లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూచినా పూర్తి ఖుర్ఆన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖుర్ఆన్, మరో దేశంలో మరోలాంటి ఖుర్ఆన్ మీకు కనిపించదు. ప్రపంచ నలుమూలలా మీరు ఎక్కడికి వెళ్లి చూసినా ఒకే రకమైన ఖుర్ఆన్ దొరుకుతుంది.
అలాగే, ఖుర్ఆన్ కి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖుర్ఆన్ గ్రంథాలన్నిటినీ తీసుకుని వెళ్లి సముద్రంలో పడివేసినా, మళ్లీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫిజ్ లు, ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో, వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్లీ ఖుర్ఆన్ ను రచించుకోగలరు. ఎందుకంటే ఖుర్ఆన్ ని ప్రారంభం నుండి చివరి వరకు, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ అ’ఊదు బిరబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫిజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు. అల్ హమ్దులిల్లాహ్. ఏడు సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి కూడా ఖుర్ఆన్ ని కంఠస్థం చేసినవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు.
అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజల హృదయాలలో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖుర్ఆన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూచినట్లయితే, ఆ గ్రంథములోని ఒక్క చాప్టర్ నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ ని మళ్ళీ రచించుకోవడానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసినవాళ్లు ఎవరూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.
సందేహాలకు అతీతమైన గ్రంథం
అలాగే ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరికీ ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవితకాలం నుండి నేటి వరకు కూడా ఎవరూ ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్ షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభువు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి, ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరూ తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరా, రెండవ అధ్యాయం, రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ (దాలికల్ కితాబు లా రైబ ఫీహ్) “ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” (2:2)
ఈ గ్రంథంలో ఎంతమాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూచినట్లయితే అభిమాన సోదరులారా, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట దేవుడు ఒక్కడు అంటే, ఒకచోట దేవుడు ఇద్దరు, ముగ్గురు అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖుర్ఆన్ ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము.
అల్లాహ్ ఖుర్ఆన్ పై చేసిన ప్రమాణం
అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప ఘనుడు కాబట్టి, ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూచినట్లయితే సూర యాసీన్, 36వ అధ్యాయము, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:
يس وَالْقُرْآنِ الْحَكِيمِ (యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్) “యాసీన్. వివేకంతో నిండిన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!” (36:1-2) అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.
మార్గదర్శకత్వం చూపే గ్రంథం
అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖుర్ఆన్ ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖుర్ఆన్ రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖుర్ఆన్ చదివిన వాళ్ళు చాలామంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి చాలామంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి రెండు ఇన్ షా అల్లాహ్ ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను.
ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్, దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైనవారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, “చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్.” విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. “అతని మాటలు నువ్వు వినకు. ఎందుకంటే అతని మాటలు నీవు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు. నీ తల్లిదండ్రులకు, నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు. అతనితో నువ్వు దూరంగా ఉండు. నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా” అన్నారు.
వారి మాటలని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసీ, ముహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని. నేను ముహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిదైతే మంచిదనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డదనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకొని ఆయన ముహమ్మద్ వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన చదువుతున్న గ్రంథాన్ని, చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించారు.
ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడికక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, “ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్ర తంత్రాలు కావు. అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు. నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజల వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు ప్రవక్త అని. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ యే దేవుడు అని” అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూశారా అభిమాన సోదరులారా.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, “ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా. ఏదేదో వాగేస్తున్నాడు. నీకు ఏదో మంత్ర తంత్రాలు వచ్చు కదా. పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా. నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా” అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మాడు. నిజమే అని నమ్మి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉంది కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు. నాకు వైద్యం చేయడం వచ్చు. కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను. మీరు వైద్యం చేయించుకోండి” అన్నారు.
దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను. నువ్వు విను. విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తున్నది పిచ్చివాని మాటలా, మంత్ర తంత్రాలా, ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు” అని చెప్పారు. “సరే చెప్పండి ఓ ప్రవక్త” అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ లోని రెండు చిన్న సూరాలు వినిపించారు. సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్. రెండు చిన్న సూరాలు వినిపించగానే, అక్కడికక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేయి పట్టుకొని ఏమన్నాడంటే, “నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను. నేను మాంత్రికుల నోటి నుండి మంత్ర తంత్రాలు విని నేర్చుకొని ఉన్నాను. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది మంత్రము కాదు. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది కవిత్వము కాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్ర తంత్రాలకు అతీతమైన పలుకులు” అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని అల్లాహ్ యే ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు.
చూశారా అభిమాన సోదరులారా, అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ అంధకారంలో ఉన్నవారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత.
హృదయాలకు నెమ్మదినిచ్చే గ్రంథం
అలాగే, మనం ఖుర్ఆన్ కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూచినట్లయితే, ఖుర్ఆన్ ద్వారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్నవారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలిచి నిలబడిపోతాయి ఖుర్ఆన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే గనుక. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి. బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్.
ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేవో చెప్తా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖుర్ఆన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశాడు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖుర్ఆన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా? లేదా మక్కా పెద్దలు చెప్తున్న మాటలు నిజమని నమ్మాలా? అయోమయంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్.
చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువైపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే కదా జరుగుతా ఉండేది, కాబట్టి ముహమ్మద్ నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకొని ఆయన కత్తి పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈ రోజు ప్రాణం తీసేస్తాడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓ ఉమర్, ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసాడు. “ఈ ముహమ్మద్ వల్ల నేను అయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను” అని చెప్పేసాడు.
అప్పుడు ఆయన అన్నారు, “అయ్యా, ముహమ్మద్ విషయం తర్వాత. ముందు నీ చెల్లెలు, నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు. ముహమ్మద్ మాటల్లో వచ్చేసారు. ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో” అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటివారు, సొంత వాళ్ళ చెల్లెలు, బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు అన్న విషయాన్ని తెలుసుకోగా, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళాడు.
దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖుర్ఆన్ చదువుతూ ఉండింది, కొన్ని పత్రాలు తీసుకుని. అవి బంద్ చేసేసి ఒకచోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్లి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు. “నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను నేను. మీరు ఏదో చదువుతా ఉన్నారు. ఏంటి అది?” అని ప్రశ్నించాడు. “నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా. తాత ముత్తాతల ధర్మాన్ని, మార్గాన్ని వదిలేశారంట కదా. నిజమేనా?” అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆవిడ అంది, “లేదు లేదు” అని ఏదో రకంగా ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే, “ఆ నేను వినింది నిజమే” అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని, బావని ఇద్దరినీ చితకబాదేశాడు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనింది అంటే, “ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. మేము ముహమ్మద్ వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాము. అల్లాహ్ యే ప్రభువు అని నమ్మేసాము. తాత ముత్తాతల మార్గాన్ని వదిలేసాము. నువ్వు చంపుతావో, ఏమి చేస్తావో చేసుకో. ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము. ఏం చేస్తావో చేసుకో” అని.
అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, “అమ్మా, నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో, నాకు కూడా కొంచెం వినిపించు చూద్దాం” అన్నాడు. అప్పుడు చెల్లెలు అన్నారు, “లేదయ్యా, ముందు వెళ్లి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను.” వెళ్లి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెలు వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా, ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం ముహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి, ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, “సుబ్ హా నల్లాహ్! ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి! ముహమ్మద్ వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ముహమ్మద్ వారు తీసుకువచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.
చూశారా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లిపోయారు. చూసిన వాళ్ళు కంగారుపడిపోయారు, ఉమర్ వచ్చేసాడు ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. అల్లాహ్ యే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త” అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ “అల్లాహు అక్బర్” అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసివచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి శక్తి అల్లాహ్ పెట్టి ఉన్నాడంటే కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది. హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ఖుర్ఆన్ పారాయణ యొక్క పుణ్యం
అలాగే అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ కు ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకుని వ్యక్తి ప్రారంభిస్తే, ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తికి పదేసి పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్లీ చెప్పారు, “ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి మూడు అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి మూడు అక్షరాలు చదివిన పుణ్యం, అనగా ముప్పై పుణ్యాలు అతనికి లభిస్తాయి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖుర్ఆన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు, కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.
శారీరక మరియు ఆత్మిక రోగాలకు స్వస్థత
అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు, మనిషి శరీరంలో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖుర్ఆన్ ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతని ఇస్తుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా.
సమగ్ర విజ్ఞానం గల గ్రంథం
అలాగే ఈ ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, “మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గానీ, సైన్స్ కూడా ఖుర్ఆన్ లో ఉందా?” అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకునిపోతే చాలా విషయాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించేవాళ్లు అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది, “రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, రండి చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి చదివి గ్రహించండి” అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనం.
పరలోకంలో ఖుర్ఆన్ ద్వారా కలిగే లాభాలు
అలాగే, పరలోకంలో కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఇన్ షా అల్లాహ్ రెండు మూడు విషయాలు చెప్పేసి నా మాటను ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖుర్ఆన్ ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న.
ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, “నీ ప్రభువు అల్లాహ్ అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని నీకు ఎలా తెలిసింది?” అని నాలుగవ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, “నేను దైవ గ్రంథమైన ఖుర్ఆన్ ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను” అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారట, “నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభము కలుగుగాక. నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో” అని దూతలు అతనికి చూపించేస్తారట. అతను సంతోషపడిపోతాడు అభిమాన సోదరులారా.
చూశారా? సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖుర్ఆన్ గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తల వైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తల వైపు నుంచి వస్తారో, ఖుర్ఆన్ గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందట, “ఈ వ్యక్తి ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివిన వాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పేస్తుందట. అల్లాహు అక్బర్. చూశారా.
ఆ తర్వాత దూతలు అతని కుడి వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దానధర్మాలు అక్కడికి వచ్చి, “మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఈ భక్తుడు ప్రపంచంలో దానధర్మాలు చేసేవాడు కాబట్టి, మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని దానధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రపంచంలో అతను నమాజ్ చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ, వెళ్తూ, వస్తూ, వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, “మీరు ఎక్కడికి వస్తున్నది? ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్ళతోనే నడిచి నమాజ్ కు వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూశారా అభిమాన సోదరులారా. సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం.
ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరినీ మళ్లీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు. ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గానీ, తండ్రి గానీ, స్నేహితుడు గానీ, సోదరి గానీ, భార్య గానీ, బిడ్డలు గానీ ఎవరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారుపడిపోతూ ఉంటే, ఖుర్ఆన్ గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖుర్ఆన్ గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖుర్ఆన్ చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను. ఇతనిని మన్నించి నీవు స్వర్గానికి పంపించు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఈ ఖుర్ఆన్ గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖుర్ఆన్ యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట.
చూశారా అభిమాన సోదరులారా. ఎవరూ పనికిరాని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా.
మరొక విషయం ఏమిటంటే, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునితో అంటారట, ఏమని అంటాడో తెలుసా? “ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివేవాడివో, ఇక్కడ కూడా స్వర్గంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు, ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం పూర్తి అవుతుందో అప్పటివరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ, ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం ఆగిపోతుందో అదే నీ స్థానము” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటిస్తాడు. చూశారా. ఈ ఖుర్ఆన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, ఖుర్ఆన్ గ్రంథం యొక్క ప్రత్యేకతలని అర్థం చేసుకుని ఖుర్ఆన్ గ్రంథాన్ని గౌరవిస్తూ, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖుర్ఆన్ ద్వారా ప్రపంచంలో కూడా మాకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు స్వర్గం ప్రసాదించు.” ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త, సూరహ్ అల్ మాయిదాలోని 3వ ఆయతును వివరిస్తూ, అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఎలా సంపూర్ణం చేశాడో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి సుమారు 83-84 రోజుల ముందు, అరఫా మైదానంలో అవతరించిన ఈ ఆయతు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దీని గురించి ఒక యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను సహీహ్ బుఖారీ హదీసు ద్వారా ఉదహరించారు. నిండుగా ఉన్న గ్లాసులో నీరు ఎలాగైతే ఇంకా పట్టదో, అలాగే సంపూర్ణమైన ఇస్లాంలో కొత్తగా చేర్చడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. చివరగా, ధర్మంలో లేని మొహర్రం పీరీలు, రజబ్ కుండల వంటి బిద్అత్ (నూతన కల్పనల) కు ఆస్కారం లేదని, ఖురాన్ మరియు హదీసులను మాత్రమే అనుసరించాలని హెచ్చరించారు.
ధర్మం పరిపూర్ణం చేయబడింది
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
మహాశయులారా ! సూరతుల్ మాయిదా ఆయతు నంబర్ మూడులోని ఒక భాగం:
అల్లాహ్ ఏమంటున్నాడు?
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا [అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా] “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను మరియు నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా ఇష్టపడ్డాను”.(5:3)
ఈ ఆయతు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే 83, 84 రోజుల ముందు మాత్రమే అవతరించింది. అంటే ఇంచుమించు ప్రవక్త జీవితంలోని చివరి రోజుల్లో అవతరించింది. ఈ ఆయతు ఎంత గొప్ప ఆయతు, ఇందులో ఎంత గొప్ప సందేశం ఇవ్వబడింది అంటే, సహీహ్ బుఖారీలో ఈ హదీస్ వచ్చి ఉంది.
యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) సంభాషణ
యూదులలోని ధర్మ పండితుడు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హుతో కలిసి, “ఓ ఉమర్! మీ ఖురాన్ లో ఒక ఆయతు ఉంది, అది గనక తౌరాత్ లో అవతరించి ఉంటే, ఆ అవతరించిన దినాన్ని మేము పండుగ రోజుగా చేసుకునేవాళ్ళము” అన్నాడు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు అడిగారు, “ఏ ఆయతు గురించి నీవు అంటున్నావు?”. ఆ యూదుడు:
హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తెలిపారు: “నాకు తెలుసు, ఇది ఏ రోజు అవతరించింది, ఏ సందర్భంలో అవతరించింది, ఏ ప్రదేశంలో అవతరించింది, అప్పుడు ప్రవక్త ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో నాకు బాగా తెలుసు. అది విశ్వాసుల కొరకు ఒక వీక్లీ ఫెస్టివల్ (వారాంతపు పండుగ) లాంటిది, అంటే వారము రోజుల్లో ఒక రోజు ఏదైతే పండుగ రోజుగా ఉందో, ‘ఈదుల్ మోమినిన్’ జుమా రోజు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో లక్ష కంటే పైగా సహాబాల మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతు అవతరించింది. ఈ రకంగా ఆ రోజు ముస్లింల కొరకు రెండు రెండు పండుగలు ఉండేవి, అప్పుడు అవతరించింది”.
ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది – బిద్అత్ (నవీన పోకడల) ఖండన
అంటే దీని భావం ఏంటో అర్థమైందా మీకు? అల్లాహ్ యే ఇస్లాం ధర్మాన్ని ఇక సంపూర్ణం చేశాడు. ఇస్లాం ధర్మమే సర్వ మానవాళి కొరకు అతి పెద్ద అనుగ్రహం, అతి గొప్ప వరం. దీనిని అల్లాహ్ యే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిపూర్ణం చేశాడు. ఇక సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఒక గ్లాస్ ఈ గ్లాస్ నీళ్లతో సంపూర్ణంగా నిండి ఉన్నది అని ఎప్పుడైతే మనం అంటామో, అందులో ఇంకా నీళ్లు చేర్చడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఉండదు కదా.
అలాగే ఈ ధర్మం సంపూర్ణమైనది అని అంటే, ఇందులో ఏ విషయాన్ని కూడా మనం ధర్మం పేరుతో కలపడానికి, యాడ్ చేయడానికి అవకాశం లేదు, అలాంటి అవసరం లేనే లేదు. మరియు సంపూర్ణమైనది అన్నదానికి మరొక భావం, ఇందులో నుండి ఏ విషయం కూడా తీయకూడదు. అందుగురించే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఏం తెలిపారు? “ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే ముందు ఏదైతే ధర్మంగా ఉండినదో, అదే ధర్మం. ఆ తర్వాత ఏవైనా విషయాలు పుట్టుకొచ్చాయి అంటే అవి ధర్మంలోనివి కావు. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను”.
ఇక మొహర్రం మాసంలో నిలబెట్టే పీరీలు గాని, వాటికి సంబంధించిన ఎన్ని దురాచారాలు, షిర్క్ పనులు ఉన్నాయో. రజబ్ మాసంలో రజబ్ కే కుండే అని, లేదా ఇంకా వేరే రోజుల్లో ఏ ఏ ఉత్సవాలు పండుగల పేరు మీద ముస్లింలు జరుపుకుంటున్నారో, అవి వాస్తవానికి వాటి ప్రస్తావన ఖురాన్ లో ఉన్నాయా? హదీసులో వాటి ప్రస్తావన ఉందా? మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేని విషయాల్ని వదిలేసేయాలి. లేదా అంటే మనం చాలా నష్టానికి గురవుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net