కీడు (చెడు) యొక్క సృష్టి – హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ | నసీరుద్దీన్ జామిఈ

రచయిత: హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ (హఫిజహుల్లాహ్)
అనువాదం: నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.

మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.

{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ}
(అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]

అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
“మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).

ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.

ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:

అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.

కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.

దీనినే ఇలా కూడా అంటారు:
“కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”

అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ»
(మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]

ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?

{فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ}
(కాబట్టి కోరినవాడు విశ్వసించవచ్చు మరియు కోరినవాడు తిరస్కరించవచ్చు). [అల్-కహఫ్: 29]

అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:

{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا}
(నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]

మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:

{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ}
(మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]

ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.

పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.

పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.

{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ}
(మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]

అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:

  1. ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا}
    (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
  2. రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ}
    (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]

    మరియు ఇది కూడా:

    {إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ}
    (నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, సర్వజ్ఞుడు). [అల్-అన్ ఆమ్: 83]

ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.

వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.

అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah/

యేసు జీవిత సత్యాలు [పుస్తకం]

ఖుర్ఆన్ చెబుతున్న యేసు జీవిత సత్యాలు
The truths about Jesus (alaihissalam) (Telugu)
సంకలనం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ, ముహమ్మద్ హమ్మాద్ ఉమరీ
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

ఖుర్ఆన్ చెబుతున్న యేసు జీవిత సత్యాలు
The truths about Jesus (alaihissalam) (Telugu)
సంకలనం: ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ, ముహమ్మద్ హమ్మాద్ ఉమరీ
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [135 పేజీలు] [20 MB] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

[డెస్క్ టాప్ వెర్షన్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]

అవును! ముమ్మాటికీ ఆయన ఓ దైవప్రవక్త. గొప్ప దైవసందేశహరులు. ప్రజలు ఆయన గురించి ఏవేవో ఊహించుకున్నారు. లేనిపోని అసత్యాలు సృష్టించారు. నామమాత్రపు అనుయాయులు ఆయన స్థానాన్ని ఆకాశాలకు ఎత్తేస్తే….. ఆయనంటే గిట్టనివారు ఆయన స్థాయిని పాతాళానికి దిగజార్చారు. నిజానికి ఈ రెండూ అతివాదాలే. ఈ రెండింటికి నడుమ ఓ మధ్యే మార్గం ఉంది. అదే ఇస్లాం మార్గం.

* ఈసా ప్రవక్త (ఆయనపై అల్లాహ్ శాంతి కురుయు గాక!)ను మన`తెలుగు నాట ‘యేసు’గా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచ మానవులకు సన్మార్గం చూపటానికి సర్వ సృష్టికర్త అల్లాహ్ పంపిన చిట్టచివరి ఆకాశగ్రంథమే దివ్య ఖుర్ఆన్. దీని అవతరణ ముఖ్యలక్ష్యం మానవులందరికీ ధర్మ జ్యోతిని పంచటం. మానవులందరికీ సన్మార్గాన్ని, స్వర్గానికి పోయే దారిని చూపటం. సత్యం – అసత్యం, ధర్మం – అధర్మం, సన్మార్గం – దుర్మార్గం…. ఇలా ప్రతి దానిలో మంచీ చెడులను స్పష్టంగా వేరుపరచే గీటురాయి ఈ దివ్య ఖుర్ఆన్.

యేసు (అల్లాహ్ ఆయనపై శాంతిని కురిపించు గాక!) ఓ గొప్పదైవప్రవక్త. ఆయన ఆకాశలోకాలకు వెళ్ళిపోయిన కాలం నుంచే క్రైస్తవ ప్రపంచంలో ఆయన కనుమరుగవటం గురించి ఎన్నో అపోహలు అవాస్తవాలు చెలామణిలోకి వచ్చాయి. యేసు (ఈసా) ప్రవక్త ఆ దివ్య లోకాలకు తరలివెళ్ళిన తొలినాటి నుంచే క్రైస్తవులు సందేహాస్పద అవిశ్వాసాలకు లోనై ఉన్నారు.

మరోవైపు ప్రస్తుత బైబిలు గ్రంథం –

యూద, క్రైస్తవ మత పెద్దలు పదే పదే చేస్తూ వచ్చిన సవరణలకూ, చర్చీ వ్యవస్థ మాటిమాటికీ చేపడుతూ వచ్చిన మార్పులు చేర్పులకూ గురై ఏనాడో తన వాస్తవిక రూపాన్ని కోల్పోయింది. కనుక అలనాటి గ్రంథాలకు ఇక అది ప్రతిరూపం కానేకాదు. తౌరాతు (*), ఇంజీలు (**) మరి అలాంటి సమయంలో-

ఇటు యేసు (ఈసా) గురించి ఎన్నో విషయాల్లో విభేదాలకు, అనుమానాలకు లోనై ఉన్న క్రైస్తవ సోదరులకూ, అటు ప్రపంచ మానవులందరికికూడా – యేసుకు పూర్వం జరిగిన సంఘటనల దగ్గరి నుంచి, ఆయన పుట్టుకను, ప్రవక్త పదవీ బాధ్యతలను, సందేశ ప్రచారాన్ని, చివరకు ఆయన కనుమరుగవటాన్ని గురించి విపులంగా, ప్రామాణికంగా తెలియజేసే దైవ గ్రంథం ఈనాడు దివ్య ఖుర్ఆన్ ఒక్కటే.

నిర్మల మనసుతో సత్యాన్ని అన్వేషించే ప్రతి వ్యక్తికీ దివ్య ఖుర్ఆన్ గ్రంధంలో సన్మార్గం ఉంది. అటువంటి సన్మార్గం వైపు పాఠకులకు మార్గదర్శకత్వం అందించాలన్న సత్సంకల్పంతో రూపొందించబడినదే ఈ చిరు పుస్తకం.

మరి దివ్యఖుర్ఆన్ చిలికించే ఆ సత్యామృతాన్ని ఆస్వాదించటానికి అందరూ సమాయత్తమే కదా?!

– ప్రకాశకులు

[*] తౌరాత్ – దైవప్రవక్త మోషే (మూసా) ప్రవక్త (అలైహిస్సలాం)పై అవతరించిన దివ్యగ్రంథం.
[**] ఇంజీల్ – దైవప్రవక్త ఈసా (యేసు) ప్రవక్త (అలైహిస్సలాం)పై అవతరించిన దివ్య గ్రంథం.

1. ఆయన ఎవరు?
2. దైవప్రవక్తల పుట్టుక పరమార్థం
3. యేసు వంశావళి
4. ఈసా (యేసు) ప్రవక్త పుట్టుపూర్వోత్తరాలు
5. శుభవార్తలు
6. జననం
7. ఇది అద్భుతమైతే అది మహా అద్భుతం కదా!
8. దైవప్రవక్తగా…..
9. మోషే ప్రవక్తకు-ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంధానకర్త
10. “అహ్మద్…..నా తర్వాత రాబోయే ప్రవక్త”
11. సహచరులు, మద్దతుదారులు (హవారీలు)
12. మహిమలు, అనుగ్రహాలు
13. గత ప్రవక్తల మార్గంలోనే
14. యేసు చనిపోలేదు, చంపబడనూ లేదు
15. శిలువ
16. ప్రళయానికి పూర్వం మళ్ళీ వస్తారు
17. యేసు ప్రవక్త బోధించని క్రైస్తవ వైరాగ్యం…
18. యూదుల, క్రైస్తవుల అనాలోచిత మాటలు…
19. మనుషులు కల్పించే కల్లబొల్లి మాటల నుంచి…
20. నిజ ప్రభువు అల్లాహ్ మాత్రమే
21. యేసు ప్రవక్త స్వయంగా ప్రకటిస్తారు
22. క్రైస్తవులకు అల్లాహ్ హితబోధ
23. ముగింపు

ఖవారిజ్ అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

ఖవారిజ్ అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?
Who is Khawarij and What are their Characteristics?
https://youtu.be/xUow1N1qSrg [31:13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖవారిజ్‌లు అనే వర్గం ఇస్లామిక్ చరిత్రలో ఎలా ఏర్పడిందో, వారి లక్షణాలు మరియు ప్రమాదకరమైన సిద్ధాంతాల గురించి ఈ ప్రసంగంలో వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ఈ ఆలోచనా విధానానికి బీజం పడిందని, దుల్-ఖువైసిరా అనే వ్యక్తి ప్రవక్త న్యాయంపై సందేహం వ్యక్తం చేయడం ద్వారా ఇది మొదలైందని వక్త తెలిపారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన యుద్ధం సమయంలో, అల్లాహ్ గ్రంథం ప్రకారం తీర్పు చెప్పడానికి మధ్యవర్తులను పెట్టడాన్ని ఖవారిజ్‌లు వ్యతిరేకించారు. వారు స్వల్ప జ్ఞానంతో, ఖురాన్ ఆయతులను తప్పుగా అర్థం చేసుకుని, సహచరులను (సహబాలను) కాఫిర్లుగా ప్రకటించారు. ఖవారిజ్‌ల ప్రధాన లక్షణాలు: అల్పాచల జ్ఞానం, పండితుల పట్ల అగౌరవం, పాపాత్ములను కాఫిర్లుగా భావించడం, ముస్లింల రక్తాన్ని చిందించడం ధర్మబద్ధం అనుకోవడం, పాపం చేసిన వారు శాశ్వతంగా నరకంలో ఉంటారని నమ్మడం, తమ భావాలకు సరిపోని హదీసులను తిరస్కరించడం మరియు పాలకులపై తిరుగుబాటు చేయడం. ఈ లక్షణాల పట్ల ముస్లింలు జాగ్రత్తగా ఉండాలని మరియు తొందరపడి ఇతరులను ఖవారిజ్‌లుగా నిందించకూడదని వక్త హెచ్చరించారు.

ఇస్లాం మరియు ముస్లిములకు చాలా నష్టం కలిగించిన దుష్ట వర్గాల్లో ఒకటి ’ఖవారిజ్‘. వారి గురించి తెలుసుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత ఈ వీడియోలో సంక్షిప్తంగా వారి కొన్ని లక్షణాలు తెలుపబడ్డాయి. తెలుసుకోండి, వాటికి దూరంగా ఉండండి, ఇతరులకు తెలియజేయండి అల్లాహ్ మనందరికీ ప్రయోజనకరమైన ధర్మజ్ఞానం ప్రసాదించుగాక.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మాబాద్.

సోదర మహాశయులారా! ఈనాటి దర్సులో మనం ఇన్ షా అల్లాహ్ ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము. ఖవారిజ్ అంటే ఎవరు? వారి యొక్క గుణాలు ఏమిటి? మరియు ఈ రోజుల్లో ఎవరిలోనైనా మనం అలాంటి గుణాలు చూస్తే వారి పట్ల మనం ఎలా మసులుకోవాలి? వారితో మన వ్యవహారం ఎలా ఉండాలి?

సోదర మహాశయులారా! సహబాల కాలంలోనే ‘ఖవారిజ్’ అని ఒక వర్గం సహబాల సరైన మార్గం నుండి, సన్మార్గం నుండి దూరమైంది, వేరైంది. అది ఒక వర్గం రూపంలో, ఒక ఫిర్కా రూపంలో ప్రస్తుతం మనకు కనబడకపోయినా, వారిలో ఉన్నటువంటి ఎన్నో చెడు గుణాలు ఈ రోజుల్లో ఎంతో మందిలో లేదా ఎన్నో వర్గాలలో మనం చూస్తూ ఉన్నాము. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, స్వయం తమకు తాము ఎన్నో మంచి పేర్లు పెట్టుకొని కూడా కొందరు ఈ ఖవారిజ్‌ల గుణాలు అవలంబించి ఉన్నారు మరియు ఈ గుణాలు ఖవారిజ్‌ల యొక్క గుణాలు అని స్వయం వారికి తెలియదు. అందుకొరకు వారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ఖవారిజ్, వీరి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా ఉంది. వాటి యొక్క కారణాలు కూడా ఇక ముందుకు వస్తాయి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టి ఖవారిజ్‌ల యొక్క బీజం ఆనాడే కనబడింది, చిగురించింది అని కొందరు పండితులు అంటారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో వచ్చిన హదీస్, హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాలె గనీమత్ (యుద్ధ ధనం) పంచిపెడుతున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు అబ్దుల్లాహ్ జుల్-ఖువైసిరా. వచ్చి,

اِعْدِلْ يَا رَسُولَ اللَّهِ
(ఇ’దిల్ యా రసూలల్లాహ్)
ఓ ప్రవక్తా! నీవు న్యాయం పాటించు అని అన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

وَيْلَكَ! وَمَنْ يَعْدِلُ إِذَا لَمْ أَعْدِلْ
(వైలక! వమన్ య’దిలు ఇజా లమ్ అ’దిల్)
నేను ఒకవేళ న్యాయం పాటించకుంటే, ఎవరు న్యాయం పాటిస్తారు మరి?

అక్కడే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉండి:

دَعْنِي أَضْرِبْ عُنُقَهُ
(ద’నీ అద్రిబ్ ఉనుకహు)
ప్రవక్తా నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇతని మెడ నరికేస్తాను” అని చెప్పారు.

ప్రవక్త విషయంలో ఒక చాలా ఘోరమైన అమర్యాద, అగౌరవం పాటించాడు కదా, అసభ్యతగా వ్యవహరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

دَعْهُ فَإِنَّ لَهُ أَصْحَابًا يَحْقِرُ أَحَدُكُمْ صَلَاتَهُ مَعَ صَلَاتِهِمْ وَصِيَامَهُ مَعَ صِيَامِهِمْ
(ద’హు ఫఇన్న లహు అస్ హాబన్, యహ్కిరు అహదుకుమ్ సలాతహు మఅ సలాతిహిమ్ వ సియామహు మఅ సియామిహిమ్)

వదిలేయ్. ఇతని వెనుక ఇతని అనుచరులు వస్తారు. వీరి అనుచరుల్లో ఎలా ఉంటారంటే – మీలో ఒక వ్యక్తి వారిని చూసి, తమ నమాజును “అయ్యో మేమేమి నమాజు చేస్తున్నాము, మాకంటే ఎక్కువ చేస్తున్నారు కదా” అని భావిస్తారు. ఉపవాసాలు కూడా వారు బాగా పాటిస్తారు. మీరు మీ ఉపవాసాలను ఏమీ లెక్కించరు, అంతగా వారు ఉపవాసాలు పాటిస్తారు.

కానీ విషయం ఏంటి?

يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ
(యమ్రుకూన మినద్దీని కమా యమ్రుకుస్సహ్ ము మినర్ రమియ్యతి)

కానీ ధర్మం వారిలో ఉండదు. ధర్మం నుండి వారు వెళ్లిపోతారు. ఎలాగైతే ధనస్సు ఉంటుంది కదా బాణం వదలడానికి, ఇలా బాణం వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి ధనస్సులోకి రావాలంటే వస్తదా బాణం? రాదు. ఏ విధంగానైతే విడిపోయిన బాణం తిరిగి రాదో, వారిలో నుండి ధర్మం అనేది ఆ విధంగా వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు. అలాంటి వారు వారు.

కానీ, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారి యొక్క ఖిలాఫత్ కాలంలో వీరు ముందుకు వచ్చారు. బహిరంగంగా, స్పష్టంగా వెలికి వచ్చారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) వారి మధ్య ఒక యుద్ధం జరిగింది. ‘సిఫ్ఫీన్‘ అని అంటారు. అయితే మన ముస్లింల మధ్యలో ఇలా జరగకూడదు, రక్తపాతాలు కాకూడదు అని ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు వారు ఖురాన్ గ్రంథాన్ని పైకెత్తారు. ఎత్తి, “ఈ గ్రంథం మన మధ్యలో తీర్పు కొరకు మనం ఏకీభవిద్దాము. ఇక యుద్ధాన్ని మనం మానుకుందాము” అన్నారు. అప్పుడు అందరూ యుద్ధాన్ని సమాప్తం చేసి, ఇక సంధి కుదుర్చుకోవడానికి, ‘సులహ్’ కొరకు ముందుకు వచ్చారు.

అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని, ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని ముందుకు పంపడం జరిగింది. వారు అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ వెలుగులో తీర్పు చేయాలి, మనం ఈ యుద్ధాన్ని ఇక ముందుకు సాగకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇది మంచి విషయం. కానీ అక్కడ ఎంతో మంది, వారు అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నవారు, వారు అలీ (రదియల్లాహు అన్హు) కు వ్యతిరేకంగా తిరిగారు. వ్యతిరేకంగా తిరిగి అలీ (రదియల్లాహు అన్హు) ను కాఫిర్ అని చెప్పేశారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్!

ఎందుకని? వారి యొక్క తప్పుడు ఆలోచన చూడండి. ఏమన్నారు? సూరె మాయిదా ఆయత్ నెంబర్ 44 చదివారు:

وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
(వమన్ లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫవూలాయిక హుముల్ కాఫిరూన్)
మరియు అల్లాహ్ అవతరింపజేసిన దానిననుసరించి తీర్పు చేయనివారే అవిశ్వాసులు (కాఫిరులు). (5:44)

అల్లాహ్ అవతరించిన దాని ప్రకారం ఎవరైతే తీర్పు చేయరో వారు కాఫిర్లు. అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ నుండి తీర్పు చేద్దామని చెప్పారు, తర్వాత ఇద్దరు మనుషులను ముందుకు పంపుతున్నారు. ఆ ఇద్దరు మనుషులు ఏం తీర్పు చేస్తారు? ఇద్దరు మనుషులు తీర్పు సరిగా చేయరు, అల్లాహ్ యొక్క గ్రంథం తీర్పు చేయాలి. అందుకొరకు తీర్పు చేయడానికి ఇద్దరు మనుషులను పంపడం జరిగింది, అందుకని అటు అలీ (నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) కాఫిర్ అయిపోయాడు, ఇటు ముఆవియా కూడా కాఫిర్ అయిపోయాడు అని ఈ విధంగా పుకార్లు లేపారు. అస్తగ్ఫిరుల్లాహ్!

వాస్తవానికి గమనిస్తే ఇదేంటి? చూడడానికి ఖురాన్ ఆయత్ ను తెలిపారు. కానీ ఖురాన్ ఆయత్ ను వారు స్వయంగా అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఖురాన్ తీర్పు చెబుతుంది, కానీ ఖురాన్ తీర్పు ఎలా చెబుతుంది? ఖురాన్ స్వయంగా మాట్లాడుతుందా మన మధ్యలో పెట్టిన తర్వాత? ఖురాన్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందో, ఖురాన్ ఎవరు చాలా మంచి విధంగా చదివి, దానిని అర్థం చేసుకుని, దాని యొక్క అన్ని వివరాలు తెలిసి ఉన్నారో, అలాంటి ధర్మ జ్ఞానులు ఆ ఖురాన్ కు అనుగుణంగా తీర్పు చేసే ప్రయత్నం చేస్తారు. ఖురాన్ లో స్వయంగా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి.

స్వయంగా ఈ సూరె మాయిదాలోనే ఒక సంఘటన ఉంది, సూరె నిసాలో కూడా ఉన్నది. ఉదాహరణకు సూరె నిసాలో మీరు కూడా ఎన్నోసార్లు ఈ విషయం విని ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ జరిగింది, ఇప్పుడు విడాకులకు వస్తుంది సమస్య. అప్పుడు అల్లాహ్ ఏమంటున్నాడు?

فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا
(ఫబ్ అథూ హకమన్ మిన్ అహ్లిహి వ హకమన్ మిన్ అహ్లిహా)

ఒకవేళ వారిరువురి (భార్యాభర్తల) మధ్య వైరం ఏర్పడుతుందని మీకు భయముంటే, ఒక మధ్యవర్తిని పురుషుని కుటుంబం నుండి, మరొక మధ్యవర్తిని స్త్రీ కుటుంబం నుండి (పరిష్కారానికి) నియమించండి. (4:35)

భర్త వైపు నుండి ఒక వ్యక్తి తీర్పు చేయడానికి, మరియు భార్య వైపు నుండి ఒక వ్యక్తి. అంటే వారు తమ ఇష్టానుసారం ఏదో రాష్ట్రంలో నడుస్తున్నట్టుగా, మన పల్లెటూర్లో నడుస్తున్నటువంటి చట్టాల మాదిరిగా చేస్తే దాని గురించి అల్లాహ్ చెప్తున్నాడా? లేదు. వారు వారిద్దరి మధ్యలో భార్యాభర్తల్లో తీర్పు చేయాలి అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా మరియు అల్లాహ్ అవతరించిన షరియత్ ను అనుసరించి. కానీ అది చేయడానికి ఎవరు? ఇద్దరు మనుషులే ముందుకు వచ్చేది.

అలాగే సూరె మాయిదాలో ఒక సందర్భంలో, ఎవరైనా ఇహ్రామ్ స్థితిలో ఉండి వేటాడాడు. ఇహ్రామ్ స్థితిలో భూమిపై సంచరించేటువంటి జంతువుల యొక్క వేట ఆడడం నిషిద్ధం. కానీ ఎవరైనా అలా షికారు చేశాడు, వేటాడాడు. దానికి పరిష్కారంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో, అందులో ఇక ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఇహ్రామ్ స్థితిలో ఉండి షికారు చేశాడో, అతడు ఫిదియా – దానికి ఫైన్ గా, పరిహారంగా ఏమి చెల్లించాలి అనేది నిర్ణయం ఎవరు చేస్తారు? న్యాయవంతులైన, ధర్మ జ్ఞానం తెలిసిన మనుషులు చేస్తారు.

విషయం అర్థమవుతుంది కదా. ఇక్కడ నేనిదంతా డీటెయిల్ ఎందుకు చెప్పానంటే, ఖురాన్ ప్రకారంగానే మనం తీర్పు జరగాలి మన మధ్యలో, కానీ చేసేవారు ఎవరుంటారు? మనుషులే ఉంటారు. కానీ ఆ మనుషులు సామాన్య మనుషులు కాదు, ధర్మం గురించి ఎక్కువగా తెలిసిన వారు. కానీ ఈ విషయం వారి బుర్రలో దిగలేదు. వారేమన్నారు? “ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దామని ఇద్దరినీ మనుషులను పంపుతున్నారు, అందుగురించి మీరు కాఫిర్ అయిపోయారు” అని అన్నారు నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్వచ్ఛమైన సహబాలు, ఖులఫాయే రాషిదీన్ లోని ఒకరు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని! ఇలాంటి వారి గుణం.

అయితే అక్కడి నుండి ఒక పెద్ద వర్గం వేరైపోయింది. సామాన్యంగా ‘ఖురూజ్’ అన్న పదం మీకు తెలుసు, వెళ్ళిపోవడం. అయితే వీరు సహబాల జమాత్ నుండి, ముస్లింల ఒక సత్యమైన వర్గం నుండి, ముస్లింల నుండి వేరైపోయారు, బయటికి వెళ్లిపోయారు. ఈ విధంగా వారిని ‘ఖవారిజ్’ అని అనడం జరిగింది. అయితే వారందరూ వెళ్లి ఒక ప్రాంతంలో తమ అడ్డాగా చేసుకొని, అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని ‘హరూరా‘ అని అంటారు. అందుకొరకు వారి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా పడింది.

అయితే ఆ తర్వాత అలీ (రదియల్లాహు అన్హు) ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపించారు. వారింకా మూఢనమ్మకాల్లో ఉన్నారు, వారికి సరైన జ్ఞానం ఇంకా లేదు, వారికి ఇస్లాం విషయంలో ఇంకా మంచి లోతు జ్ఞానం ప్రసాదించాలి అని ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపారు. ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వారి వద్దకు వెళ్లి చాలా సేపు వారితో ఉండి – ఆ యొక్క వివరాలు కూడా మనకు గ్రంథాల్లో ఉన్నాయి – చాలా సేపటి వరకు వారితో డిబేట్ చేశారు, వారితో వాదం చేశారు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల చాలా మంది సరైన విషయాన్ని, సరైన విశ్వాసాన్ని, అసలు ఇక్కడ మనం పాటించవలసిన నమ్మకం, విశ్వాసం, వ్యవహారం ఏంటి అర్థం చేసుకొని, అలీ (రదియల్లాహు అన్హు) వైపుకు వచ్చారు. అయినా కొంతమంది మొండితనం పాటించే వాళ్ళు ఉంటారు కదా, “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్నట్లుగా. అలాంటి మొండితనంలో ఎంతోమంది ఉండిపోయారు.

ఆ తర్వాత వారు తమ మొండితనంలో ఉండి, మౌనంగా ఉంటే కూడా అంత నష్టం కాకపోవచ్చేమో. కానీ అంతకే వారు మౌనంగా ఉండకుండా ఏమన్నారు? “ఎవరైతే మా ఈ విశ్వాసం, మా ఈ పద్ధతిలో లేరో వారందరూ కాఫిర్లు” అస్తగ్ఫిరుల్లాహ్. ఖవారిజ్ అంటే వీరు. వారి తప్ప ఇక వేరే ఎవరినీ కూడా ముస్లింలుగా నమ్మరు. అంతేకాదు, వారు ఉన్న ఆ ప్రాంతానికి చుట్టుపక్కల దగ్గరలో నుండి ఎవరైనా ముస్లింలు పోతే, దాటుతే వారిని హత్య చేసేవారు.

చివరికి అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఖబ్బాబ్ బిన్ అరత్ ఒక గొప్ప సహాబీ, అతని యొక్క ఒక కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఒక సందర్భంలో అతనితో ఉన్నటువంటి ఒక బానిసరాలు వెంట ఆయన వెళ్తున్నాడు, వారికి ఆ విషయం తెలిసింది. ఆ సందర్భంలో ఆ బానిసరాలు గర్భవతి. అయితే ఆ మూర్ఖులు, ఆ దుండగులు, ఆ దౌర్జన్యపరులు, ఖవారిజ్ – ఆ ఒక స్త్రీని కూడా స్త్రీ అని గౌరవించలేదు, అంతేకాకుండా ఆమె గర్భంతో ఉంది కదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెను చంపేశారు. అంతేకాదు ఆమె కడుపులో పొడిచి శిశువుని బయటికి తీసి కూడా.. ఇట్లాంటి దౌర్జన్యాలు చేసేవారు వారు.

అయితే సోదర మహాశయులారా, వారి యొక్క పుట్టుక అనండి, వారి యొక్క ఆరంభం అనండి, దాని గురించి కొన్ని విషయాలు నేను ఇప్పటివరకు చెప్పాను. అయితే సంక్షిప్తంగా వారి యొక్క కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం.

వారిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, ధర్మ జ్ఞాన విషయంలో ఇంకా మనం ముందుకు వెళ్లాలి అన్నటువంటి తపన, ఆలోచన ఉండదు. ధర్మ పండితులతో జ్ఞానం నేర్చుకోరు. అందుకొరకే సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

يَقْرَءُونَ الْقُرْآنَ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ
(యఖ్ రవూనల్ ఖురాన లా యుజావిజు హనాజిరహుమ్)
వారు ఖురాన్ చదువుతారు, కానీ అది వారి ఈ గొంతుకు కిందికి దిగదు.

అంటే ఏంటి? ఖురాన్ పఠన అనేది, తిలావత్ అనేది చాలా మంచిగా చేస్తారు. కానీ చదువుతున్నది ఏమిటి? అది ధర్మ జ్ఞానుల వద్ద, మంచి పెద్ద ఉలమాల వద్ద కూర్చుండి విద్య నేర్చుకోవాలి. తఫ్సీర్ నేర్చుకోవాలి, హదీస్ నేర్చుకోవాలి, ఫిఖహ్ నేర్చుకోవాలి, అఖీదా ఈమాన్ అన్ని వివరాలు నేర్చుకోవాలి, అఖ్లాఖ్, ఆదాబ్, సులూక్ ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ దీని గురించి, పండితులతో, ధర్మవేత్తలతో ధర్మం నేర్చుకోవడంలో మరీ వెనుక ఉంటారు. ఖురాన్ చదవడానికి మహా స్వచ్ఛంగా, ఎంతో మంచిగా చదువుతున్నారు అన్నట్లుగా నటిస్తారు, కానీ ఖురాన్ అర్థభావాలను తెలుసుకోరు.

వారిలో ఉన్నటువంటి రెండవ చెడు గుణం ఏమిటంటే – మొదటి గుణం తెలిసింది కదా, ధర్మ పండితులతో ధర్మ జ్ఞానం నేర్చుకోరు – కానీ రెండో చెడు గుణం ఏమిటి? ధర్మవేత్తల మీద ఆక్షేపణలు, ఏతరాజ్, క్రిటిసైజ్. “మీకు తెలియదు, మీరు మంచిగా చెప్పడం లేదు, మీరు అన్ని స్పష్టంగా చెప్పరు”. ఈ విధంగా ధర్మ పండితుల మీద వారు ఇలాంటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక గొప్ప సాక్ష్యం, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు, చదువుతున్నాడు ఖురాన్ ఆయత్, అలీ (రదియల్లాహు అన్హు), ముఆవియా (రదియల్లాహు అన్హు) వారిని కాఫిర్లు అని అంటున్నాడు. అలీ (రదియల్లాహు అన్హు) గొప్ప ధర్మవేత్త, ఖలీఫా మరియు ఆయన ధర్మవేత్త కూడా. అయితే ఈ విధంగా తమ వద్ద ఉన్న అల్ప జ్ఞానంతో ధర్మ పండితులకు ఛాలెంజ్ చేస్తారు.

వారిలో ఉన్నటువంటి మూడవ చెడు గుణం ఏమిటంటే, పాపాల లో రెండు రకాలు ఉన్నాయి: చిన్న పాపాలు మరియు ఘోరమైన పెద్ద పాపాలు. సామాన్యంగా వాటిని మనం ‘కబీరా గునాహ్’ అని ఉర్దూలో, లేకుంటే ‘కబాయిర్’ అని ఉర్దూ, అరబ్బీ రెండు భాషల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే కబాయిర్, వాస్తవానికి ఇవి చాలా ఘోరమైన పాపాలు. కానీ సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, అయిమ్మా, ముహద్దిసీన్ వీరందరి ఏకాభిప్రాయం ఏమిటంటే – ఎవరైనా కబీరా గునాహ్ చేసినంత మాత్రాన అతడు కాఫిర్ అయిపోడు. కబీరా గునాహ్ కు ఎవరైనా పాల్పడితే వారిని మనం కాఫిర్ అని అనరాదు. కానీ ఈ ఖవారిజ్ ఏమంటారు? “కబీరా గునాహ్ చేసిన వాడు కాఫిర్” అని అనేస్తారు. అర్థమవుతుంది కదా? ఎన్ని గుణాలు తెలుసుకున్నాము ఇప్పటివరకు? మూడు.

నాలుగవ విషయం, నాలుగవ చెడు గుణం వారిలో ఉన్నది – వారి బాటలో, వారి ఆలోచన ప్రకారం ఎవరైతే లేరో, వారి యొక్క ధనం దోచుకోవడం, వారి యొక్క ప్రాణానికి ఏ విలువ లేకుండా హత్య చేయడం వారి వద్ద హలాల్. వారి తప్ప ఇతరుల ధర్మం, ఇతరుల ప్రాణం, ధనం, మానం వీటికి ఏ మాత్రం విలువ వారి వద్ద లేదు.

అందుగురించే సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

يَقْتُلُونَ أَهْلَ الْإِسْلَامِ وَيَدَعُونَ أَهْلَ الْأَوْثَانِ
(యఖ్ తులూన అహ్లల్ ఇస్లాం వ యదవూన అహ్లల్ ఔథాన్)

ముస్లింలను చంపుతారు. కానీ విశ్వాసం, అవిశ్వాసుల మధ్యలో, సత్యం అసత్యం, ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో యుద్ధాలు జరిగే సందర్భంలో అక్కడ వారు పోరు. కానీ ముస్లింలను చంపడానికి అయితే ముందుగా ఉంటారు.

నాలుగవది ఏమిటి? ముస్లింల హత్య చేయడం వారి వద్ద హలాల్.

ఐదవ విషయం, ఐదవ చెడు గుణం వారిది – ఎవరైతే కబీరా గునాహ్ కు పాల్పడ్డారో, వారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అని అంటారు. మరియు సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, ముస్లింలందరి ఏకాభిప్రాయం ఏమిటి? ఎవరైనా కబీరా గునాహ్ కు పాల్పడ్డారంటే అల్లాహ్ క్షమించనూవచ్చు, లేదా అల్లాహ్ క్షమించకుంటే ఆ పాపంకు తగ్గట్టు నరకంలో శిక్ష ఇచ్చిన తర్వాత అతని వద్ద ఏ తౌహీద్ అయితే ఉందో దాని కారణంగా అల్లాహ్ మళ్లీ అతన్ని స్వర్గంలో పంపిస్తాడు. దీని గురించి సహీహ్ బుఖారీ ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇంతకుముందు మనం విశ్వాసపున సూత్రాల్లో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క ఘనతలో ఆ హదీస్ కూడా చదివాము. కానీ వీరేమంటారు? “ఎవరైనా కబీరా గునాహ్ చేశారంటే అతడు శాశ్వతంగా నరకంలో, ఇక స్వర్గంలో పోయే అవకాశమే లేదు” అని అంటారు. ఇది చాలా తప్పు మాట.

ఇక్కడ ఒక విషయం గమనించండి. వారు ఖురాన్ లోని ఒక ఆయత్ కూడా తెలుపుతారు. ఉదాహరణకు అల్లాహ్ తాలా సూరె నిసా ఆయత్ నెంబర్ 93 లో – ఎవరైతే కావాలని, తెలిసి ఒక విశ్వాసుని హత్య చేస్తాడో, అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ తాలా ఐదు రకాల శిక్షలు తెలిపాడు. వాటిలో ఒకటి ఏమిటి? నరకంలో ఉంటాడు అని. కానీ దీని యొక్క తఫ్సీర్ స్వయంగా వేరే ఖురాన్ ఆయత్ ల ద్వారా మరియు వేరే హదీసుల ద్వారా పండితులు ఏం చెప్పారు? దాన్ని ఖవారిజ్ ఏమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? స్వయం వారి దగ్గర ధర్మ జ్ఞానం అనేది సంపూర్ణంగా లేదు. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నారు? ఐదు చెడు గుణాలు.

ఇక రండి, ఆరవది. ఆరవ విషయం ఏమిటి? వారు హదీసులను తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? ఖురాన్ కు వ్యతిరేకంగా ఉంది అని. గమనించండి, ముందే అల్ప జ్ఞానం ఉంది, కానీ అక్కడ తన యొక్క కొరత, తన యొక్క దోషం, తన యొక్క లోపం స్వయం అర్థం చేసుకోకుండా ఎంత చెడ్డ పనికి దిగుతున్నాడో చూడండి. ఖురాన్ కు ఈ హదీస్ వ్యతిరేకంగా ఉంది అని హదీస్ ను తిరస్కరిస్తాడు. కానీ వాస్తవ విషయం ఏంటో తెలుసా? చాలా శ్రద్ధగా మీరు విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఏ ఖురాన్ ఆయత్ మరో ఆయత్ కు, లేదా ఏ ఖురాన్ ఆయత్ సహీహ్ హదీస్ కు వ్యతిరేకంగా కాజాలదు. నేను కాదు చెప్పింది ఈ మాట, పెద్ద పెద్ద ముహద్దిసీన్లు చెప్పారు. ఇమామ్ ఇబ్న్ హిబ్బాన్ (రహిమహుల్లాహ్) ఒక సందర్భంలో చెప్పారు: “తీసుకురండి మీలో ఎవరి వద్దనైనా ఏదైనా ఖురాన్ ఆయత్ మరియు హదీస్ వ్యతిరేకంగా కనబడుతుంది, తీసుకురండి నేను దానికి పరిష్కారం చూపిస్తాను” అని అనేవారు.

అంటే ఏమిటి? నా వద్ద ఉన్న తక్కువ జ్ఞానం, లేదా నాకు జ్ఞానం లేనందువల్ల ఈ ఆయత్ ఈ హదీస్ కు వ్యతిరేకంగా అని నేను చూస్తున్న కావచ్చు. కానీ నేనేం చేయాలి అప్పుడు? పెద్ద పండితుల వద్దకు వెళ్లి దాని యొక్క వివరణ తెలుసుకోవాలి. కానీ అలా తెలుసుకోకుండా వీరేం చేస్తారు? హదీసులను రద్దు చేస్తారు, హదీసులను తిరస్కరిస్తారు.

వాస్తవ విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు చూడడానికి ఏదైనా ఆయత్ మరో ఆయత్ కు వ్యతిరేకంగా, లేదా ఆయత్ హదీస్ కు వ్యతిరేకంగా, లేదా హదీస్ హదీస్ కు వ్యతిరేకంగా ఇలా కనబడినప్పుడు మనం ధర్మవేత్తలతో సంప్రదించి దాని యొక్క వివరణ కోరాలి, తెలుసుకోవాలి.

వారి ఏడవ చెడు గుణం ఏమిటంటే, వారు ముస్లిం నాయకుడు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా మాట చెప్పాడు, ఏదైనా పని చేశాడు అంటే, అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, అతని యొక్క విధేయత నుండి దూరమై, అతనికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి దిగుతారు. మరి ఇస్లాం మనల్ని ఈ విషయం నుండి ఆపుతున్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: ఎవరైతే నాయకులు ఉన్నారో, వారి పరిపాలన విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఎక్కడైనా ఏదైనా వారితో తప్పు జరిగింది అంటే, మీరు వారి పట్ల విధేయత పాటించే బాధ్యత ఏదైతే ఉందో, దాని నుండి మీరు వెనుతిరగకండి. ఉర్దూలో అంటారు ‘అలమె బగావత్ బులంద్ కర్నా’. వారికి విరుద్ధంగా పోరాటం చేయరాదు. ఎందుకు? దీనివల్ల కల్లోలం ఏర్పడుతుంది, అల్లర్లు ఏర్పడతాయి, ఒక మహా ఫసాద్ అయిపోతుంది, ముస్లింల రక్తపాతాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకొరకు ఎవరైనా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే, ఎవరు వారి వద్దకు చేరుకొని వారిని నచ్చజెప్పగలుగుతారో, నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వెంటనే “ఇతడు ఇలా చేశాడు” అని బహిరంగంగా దానికి ప్రచారం చేసి, అతనికి వ్యతిరేకంగా ఏదైనా యుద్ధం చేయడానికి, కత్తి తీయడానికి ప్రయత్నం చేయడం, ఇది ఇస్లాం నేర్పలేదు. కానీ ఖవారిజ్ వారి యొక్క ఏడవ చెడు గుణం – ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా, ముస్లిం పరిపాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతారు.

సోదర మహాశయులారా! చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ టైం ఎక్కువైపోతుంది గనుక మనం ఈ కొన్ని విషయాల మీద, అంటే వారి గుణాలు ఏవైతే తెలుసుకున్నామో, ఆ తర్వాత ఇక ముఖ్యమైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అవేమిటి?

ప్రస్తుతం మనం ఈ చెడ్డ ఏడు గుణాలు తెలుసుకున్నాము. ఎవరిలో మనం ఈ ఏడు గుణాలు, లేదా ఏడిట్లో ఏదైనా ఒకటి చూసామంటే వారిని మనం తొందరగా “ఇతడు ఖారిజీ, ఇతడు ఖవారిజ్ లో ఒకడు” అని పలకాలా? లేదు. ఇక్కడ విషయం గమనించాలి. అల్లాహ్ మనకు నేర్పిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపిన, సహబాలు పాటించినటువంటి ఒక గొప్ప పద్ధతి – సలఫ్ మార్గం అనేది సర్వ మానవాళికి శ్రేయస్కరమైన మార్గం. ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే, ఖవారిజ్‌లకు ప్రత్యేకమైన ఈ గుణాలు అని మనం తెలుసుకున్నాము, కానీ ఈ గుణాలలో ఏదైనా ఒకటి ఎవరిలో ఉంది అంటే వెంటనే “నువ్వు ఖారిజీ అయిపోయావు” అని అతని మీద ఫత్వా ఇవ్వడం ఇది సరికాదు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి.

ముందు మనం పాటించవలసిన విషయం ఏంటి? ఎవరిలోనైనా ఈ ఏడిట్లో ఏదైనా ఒక గుణం చూసామంటే, అలాంటి చెడ్డ గుణం మనలో పాకకూడదు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత, అతన్ని మనం నచ్చజెప్పే అటువంటి ఏదైనా శక్తి, ధర్మ జ్ఞానం, దానికి సంబంధించినటువంటి వివేకం మనలో ఉందా? అది మనం చూసుకోవాలి. ఉంటే అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. లేదా అంటే, ఎవరు నచ్చజెప్పగలుగుతారో, ఎవరు అతనికి బోధ చేయగలుగుతారో వారి వద్దకు మనం వెళ్లి వారికి ఈ విషయం తెలియజేయాలి. కానీ అతని మాటలు వినడంలో, అతని యొక్క స్నేహితంలో మనం పడి ఏదైనా అలాంటి పొరపాటుకు మనం గురి అయ్యే ప్రయత్నం, గురి అయ్యే అటువంటి తప్పులో మనం ఎన్నడూ పడకూడదు. ఎందుకంటే కొందరు “లేదు నేను అతనికి జవాబు ఇస్తాను, నేను అతనికి గుణపాఠం నేర్పుతాను” ఇటువంటి తొందరపాటులో పడి, “అరే అతడు ఖారిజీలో అటువంటి గుణం ఉంది అని అనుకున్నాను కానీ అతడు ఖురాన్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా, హదీస్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా” ఇటువంటి భావనలో పడి, నిన్ను కూడా అతడే లాక్కొని, అతని వైపు లాక్కొని నిన్ను ఎక్కడ ప్రమాదంలో పడవేస్తాడో, అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజుల్లో ఖవారిజ్ అన్న పేరుతో ఒక వర్గం స్పష్టంగా ఎక్కడా కూడా లేదు, కానీ ఈ గుణాలు ఏవైతే తెలుపబడ్డాయో ఎన్నో వర్గాలలో, ఎందరిలో ఉన్నాయి. అందుకొరకే చివరలో నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఇట్లాంటి చెడ్డ గుణాల నుండి దూరం ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇస్లాంను ఖురాన్ హదీసుల ద్వారా సహబాలు అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకొని ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=14412

బిద్అత్ (కల్పితాచారం) – Bidah – మెయిన్ పేజీ
https://teluguislam.net/others/bidah/