ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ta7KklHK6V0 [19 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాం అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు శ్రేష్ఠత గురించి 10 ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఇస్లాం అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మరియు ఇష్టపడిన సహజ సిద్ధమైన ధర్మం. ఇది స్వచ్ఛమైన తౌహీద్ (ఏకదైవారాధన) ను బోధిస్తుంది మరియు జ్ఞానం, న్యాయం, సమానత్వం, సులభత్వం, మరియు ఓర్పు వంటి గుణాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ధర్మంలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేస్తుంది మరియు ఇది నైతిక విలువలతో కూడిన ఉత్తమమైన సమాజాన్ని (ఉమ్మతే వసత్) నిర్మిస్తుంది. ఈ అనుగ్రహాలన్నీ ఇస్లాంను ఇతర అనుగ్రహాల కంటే ఉన్నతమైనదిగా నిరూపిస్తాయని వక్త పేర్కొన్నారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతా నిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బ’అద్. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అన్న అంశంపై ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై ఎన్నో అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు. ఆ వరాలలో, ఆ అనుగ్రహాలలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది, దానికి మించినది లేనిది అది ఇస్లాం ధర్మం. దీని గురించి అనేక విషయాలు ఉన్నాయి, కాకపోతే ఈ రోజు మనం 10 విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కొరకు అనుగ్రహించిన ధర్మం, ఇష్టపడిన ధర్మం అన్నమాట. ఈ విషయం అల్లాహ్ సూర ఆలి ఇమ్రాన్ లో ఇలా తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
(ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం)
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. (3:19)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వమయ్ యబతగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలయ్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్)
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా ఆయత్ మూడులో ఇలా సెలవిచ్చాడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను(5:3)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత స్పష్టంగా ఇస్లాం మీ కొరకు ధర్మంగా ఎన్నుకున్నాను, మీ కొరకు దీనిని పరిపూర్ణం చేశాను, దీనిని ,అంటే ఇస్లాంని అల్లాహ్ ఏమన్నాడు? నా అనుగ్రహం అంటున్నాడు. ‘ని’మతీ’, నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. ఇది మొదటి విషయం. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కోసం అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం ఇస్లాం ధర్మం.

ఇక రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన ధర్మం. సహజ సిద్ధమైన, స్వాభావిక ధర్మం. ఇది ప్రత్యేకత ఇది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర రూమ్, ఆయత్ 30లో ఇలా సెలవిచ్చాడు:

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు. (30:30)

ఈ ఆయత్ లో ‘ఫితర‘ అని ఉంది. ఫితరతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా’. ‘ఫితరత్‘ అంటే సహజత్వం లేక నైజం అన్నమాట. వేరే మాటలలో చెప్పాలంటే, అల్లాహ్ మానవుణ్ణి సహజ ధర్మంపై, అంటే దేవుని ఏకత్వంపై, తౌహీద్ స్వభావంపై పుట్టించాడు. కాబట్టి మానవ నైజములోనే ఏకత్వం, తౌహీద్, ఏక దైవ ఆరాధన అంతర్లీనమై ఉంది అన్నమాట. అందుకే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. బుఖారీలో హదీస్ ఉంది:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ
(కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫితర, ఫ అబవాహు యుహవ్విదానిహి అవ్ యునస్సిరానిహి అవ్ యుమజ్జిసానిహి)
ప్రతి బిడ్డ సహజత్వం (ఇస్లాం) తోనే పుడతాడు. అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో చేసేస్తారు.

అంటే ప్రతి బిడ్డ సహజత్వంతోనే పుడతాడు, నైజంతోనే పుడతాడు, సహజత్వంతోనే పుడతాడు, అంటే మువహ్హిద్ గానే పుడతాడు, తౌహీద్ లోనే పుడతాడు. కాకపోతే పెరిగిన కొద్దీ ఆ బిడ్డ యొక్క అమ్మానాన్న అతనికి యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీగానో చేసేస్తారు అన్నమాట. అంటే రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం అన్నమాట.

ఇక మూడవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం. ఖురాన్ లోని సూర ఇఖ్లాస్:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ‎﴿١﴾‏ اللَّهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ‎﴿٤﴾
(ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో మూల సూత్రాలు, సృష్టికర్త అంటే ఎవరు, మూల సూత్రాలు తెలియజేశాడు. అల్లాహ్ ఒకే ఒక్కడు, ఎటువంటి అక్కరా, ఎటువంటి అవసరం లేనివాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. తినటం, త్రాగటం, నిద్రించటం, కునుకు, నిద్ర, అవసరం, సహాయం తీసుకోవటం, ఇలాంటి ప్రపంచములో ప్రతి జీవి, ప్రతి వ్యక్తికి ఇది అవసరం ఉంటుంది. ఎటువంటి అవసరం అక్కర లేకుండా ఏ జీవి ఉండలేదు, జీవించలేదు. కావున సకల లోకాలకు సృష్టికర్త అటువంటి వాడు కాదు. అవసరం లేని వాడు అల్లాహ్, అక్కర లేనివాడు అల్లాహ్. అలాగే ఆయనకి అమ్మానాన్న లేరు, సంతానమూ లేదు. ఆయనకి సమానము ఎవరూ లేరు. ఇంకా మనము ఖురాన్ పరిశీలిస్తే, అల్లాహ్ పుట్టినవాడు కాదు, అల్లాహ్ కి చావు, మరణం రాదు అన్నమాట. ఇది మూడవ విషయం.

ఇక నాలుగవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ‎﴿١﴾‏ خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ‎﴿٢﴾‏ اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ‎﴿٣﴾‏ الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ‎﴿٤﴾‏ عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ‎﴿٥﴾
(ఓ ప్రవక్తా!) సృష్టించిన నీ ప్రభువు పేరుతో చదువు. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞాన బోధ చేశాడు. ఆయన మనిషిని అతడు ఎరుగని, తెలియని దానిని నేర్పించాడు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మొట్టమొదటి సారి వచ్చిన దివ్యవాణి ఇది. అంటే మొదటి దైవవాణి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, విద్య గురించి వచ్చిందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముజాదలలో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ ఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్ లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. (58:11)

మీలో విశ్వసించిన వారిది మొదటి విషయం, రెండవది జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు. అంటే మూడవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞత గల ధర్మం ఇస్లాం ధర్మం. ఇది నాలుగో విషయం.

ఐదవ విషయం ఏమిటంటే, మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం. ఇస్లాం ధర్మం మానవుల మధ్య, జనుల మధ్య, దైవదాసుల మధ్య, సృష్టి మధ్య సమానత్వం కలిగిన ధర్మం, ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ
(వ ఇజా హకమ్తుమ్ బైనన్నాసి అన్ తహ్కుమూ బిల్ అద్ల్)
ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. (4:58)

إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ
(ఇన్నల్లాహ య’మురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి జిల్ ఖుర్బా)
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు.  (16:90)

అంటే ఐదవ విషయం ఏమిటి? మానవుల మధ్య, సృష్టి మధ్య, దైవదాసుల మధ్య పూర్తిగా న్యాయం చేసే ధర్మం ఇస్లాం ధర్మం.

అలాగే ఆరవ విషయం ఏమిటంటే, సులభమైన ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ అంటున్నాడు సూర హజ్ లో:

وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ
(వమా జ’అల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజ్)
ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు (22:78)

మానవ మాత్రులు భరించలేనంతటి కష్టతరమైన, క్లిష్టతరమైన బాధ్యతను అల్లాహ్ మనపై మోపలేదు అన్నమాట. అలాగే అల్లాహ్ సూర బఖరా యొక్క చివరలో ఇలా సెలవిచ్చాడు:

لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا
(లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్’అహా)
అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. (2:286)

అంటే ఇది ఆరవ విషయం, సులభమైన ధర్మం. మనిషి మోయలేని భారం అల్లాహ్ వేయలేదు అన్నమాట.

ఇక ఏడవ విషయం ఏమిటంటే, ఓర్పుని, సహనాన్ని బోధించే ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం ప్రపంచంలో సమస్యలు ఇస్తాడు, మనిషికి సమస్యలు వస్తాయి. రోగాలు వస్తాయి. ఆరోగ్యంతో పాటు అనారోగ్యము ఉంటుంది, లాభంతో పాటు నష్టమూ ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లాహ్ కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వడు. కొందరు ధనవంతులు, కొందరు పేదవారు. ఉన్నవారు, లేనివారు. కానీ ఇదంతా ఎందుకు? పరీక్ష కోసం. కావున సహనాన్ని, ఏ సమయంలో, కష్టంలో, దుఃఖంలో, నష్టంలో, బాధలో సమీప బంధువులు, దగ్గర ఉన్నవారు చనిపోయినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? వ్యాపారంలో నష్టం జరిగింది, ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది, ఇబ్బందుల్లో వచ్చేసాము. కానీ ఇస్లాం ధర్మం సహనం బోధిస్తుంది. ఏ విధంగా? దానికి వివరాలు ఉన్నాయి, నేను వివరం చెప్పటం లేదు. ఖురాన్లో వివరాలు ఉన్నాయి. అల్లాహ్ అంటున్నాడు:

إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు (8:46)

అల్లాహ్ యొక్క సహాయం కోరండి బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకాటాల్లో అల్లాహ్ సహాయం కోరండి. ఏ విధంగా కోరండి? సహనం ద్వారా, నమాజ్ ద్వారా. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అసర్ లో నాలుగు విషయాలు తెలియజేశాడు. ఈ నాలుగు గుణాలు, నాలుగు లక్షణాలు కలిగిన వారు ఇహపర లోకాలలో నష్టపోరు అని. వారిలో ఒకటి ఏమిటి? విశ్వాసం. రెండవది సత్కార్యం. మూడవది హఖ్, సత్యం. నాలుగవది సహనం. కావున ఇస్లాం ధర్మం సహనాన్ని బోధించే ధర్మం.

ఇక ఎనిమిదవ విషయం ఏమిటంటే, ధర్మం విషయంలో బలవంతం చేయదు ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది (2:256)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.(18:29)

అంటే సత్యం మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది, కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్ని సిద్ధం చేసి ఉంచాము. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సత్యం ఏది, అసత్యం ఏది స్పష్టంగా తెలియజేశాడు. బలవంతం చేయడు. ఎటువంటి బలవంతమూ లేదు. మీకు నచ్చితే, మీకు ఇష్టం ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే వదలండి. బలవంతం అనేది లేదు. కాకపోతే మంచి చేసే వారికి ప్రతిఫలం అలాగే ఉంటుంది, చెడు చేసే వారికి ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. అభిమాన సోదరులారా! అంటే ఎనిమిదవ విషయం ఏమిటి? ఇస్లాం ధర్మం ధర్మం విషయంలో బలవంతం చేయదు.

తొమ్మిదవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అంటే ఉమ్మతే ముహమ్మదియా, ఉమ్మతే వసత్. అంటే మెరుగైన, ఉత్తమమైన సమాజం అన్నమాట. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.)(2:143)

అభిమాన సోదరులారా! ఈ ఆయత్ లో ‘వసత్’ అనే పదం వచ్చింది. ‘వసత్’ అనే పదానికి అర్థం మధ్యస్థం, కానీ మెరుగైన, ఉత్తమమైన అని అర్థం కూడా వస్తుంది. ఈ భావములోనే ఇక్కడ ప్రయోగించబడింది. ఉత్తమమైనది, మెరుగైనది అన్నమాట ఇస్లాం ధర్మం.

అభిమాన సోదరులారా! ఇక పదవ విషయం ఏమిటంటే, నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం. ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఖురాన్ లో, ప్రవక్త గారి ప్రవచనాలలో అసంఖ్యాకమైన వచనాలు, వాక్యాలు ఉన్నాయి. నైతికత అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? నడక, నడవడిక, నీతి, నిజాయితీ, సత్యము, న్యాయము, ధర్మము. ఏ విధంగా అమ్మానాన్నతో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలి? జంతువులతో ఎలా ఉండాలి? దారి హక్కు ఏమిటి? శారీరక హక్కు ఏమిటి? జననం నుండి మరణం వరకు నియమాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనకు బోధించారు.

ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ‘అక్సరు మా యుద్ఖిలుల్ జన్నత, తఖ్వల్లాహి వ హుస్నుల్ ఖులుఖ్’. అంటే స్వర్గానికి పోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఎక్కువ మంది, అత్యధికంగా స్వర్గానికి ఏ కారణం వల్ల పోతున్నారు? దైవభీతి మరియు సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పించారు. ఆ దుఆ ఏమిటి? ‘

اللَّهُمَّ أَنْتَ حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖీ ఫహస్సిన్ ఖులుఖీ’.
ఓ అల్లాహ్! నీవు నా రూపురేఖలను అందంగా మలచినట్లే నా నడవడికను కూడా ఉత్తమంగా మలచు.

ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ
‘బు’ఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్’.
నేను నడవడికను, మంచి గుణాలను పూర్తి చేయటానికే నేను పంపబడ్డాను.

అంటే ఇది దీని గురించి చాలా వివరంగా ఖురాన్ లో మరియు హదీస్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా మాట్లాడాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ
‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ అవ్ లియస్ముత్’.
ఎవరికైతే అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనం వహించాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే, పదవ విషయం, ఇస్లాం ధర్మం నైతిక విలువలు గల ధర్మం. నేను ముఖ్యంగా 10 విషయాలు చెప్పాను. ఇస్లాం కి, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అని అంశం పైన నేను పది అనుగ్రహాలు చెప్పాను.

  1. ఇస్లాం తన దాసుల కోసం అల్లాహ్ అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం.
  2. ఇది సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం.
  3. స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం.
  4. జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల గల ధర్మం.
  5. మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం.
  6. సులభమైన ధర్మం.
  7. సహనాన్ని బోధించే ధర్మం.
  8. ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం చేయని ధర్మం.
  9. ఉమ్మతే వసత్ అంటే మెరుగైనది, ఉత్తమమైన సమాజం.
  10. నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42189

ధార్మిక విద్యార్జనలో సహనం ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్

[48:46నిముషాలు]
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం)[ఆడియో]

బిస్మిల్లాహ్
బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం) [ఆడియో]
https://youtu.be/w-allzUZM6E [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (25 నిముషాలు)

ఈ ఆడియో సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]– 5 వ పార్ట్ నుండి తీసుకోబడింది. ఈ కథ సహీహ్ హదీసులో వచ్చింది మరియు ఖురాన్ లో సూరతుల్ బురూజ్ లో ప్రస్తావించ బడింది 


హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు – హదీసు # 30

ఈ ఆడియో వివరించిన హదీసు క్రింద చదవండి :

30. హజ్రత్ సుహైబ్‌ (రది అల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనం:

“పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలన్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని అన్నాడు.

అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు, అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ అల్లాహ్‌! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే. (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు “నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుం చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!” అని హితవు పలికాడు.

ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు రోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్చారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే” అన్నాడు. దానికి ఆ అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్‌ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)” అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్‌ అతనికి నయం చేశాడు.

ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. దానికతను “నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన మిచ్చాడు. అందుకు రాజు “ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు అల్లాహ్‌ (మాత్రమే)” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు.

బాలుణ్ణి రాజు దర్చారుకి తీసుకురావడం జరిగింది. “నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసే వాడు అల్లాహ్‌ మాత్రమే” అని సమా ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు.

మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలై పోయింది.

ఆ తరువాత రాజ దర్బారు లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలి పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది.

ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని అ బాలుడు కూడా ససేమిరా అన్నాడు. రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి “ఇతన్ని ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు” అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)” అని అడిగాడు. దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు తోడ్పడ్డాడని” సమాధాన మిచ్చాడు.

రాజు కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడిని ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడు వచ్చిన వారంతా మునిగిపోయారు.

తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు కున్నాడు. రాజు అతన్ని చూసి “వాళ్ళు ఏమైపోయారు?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు సహాయపడ్డాడు” అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు.” ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : “ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. అ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు.”

రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఊరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి “బిస్మిల్లాహి రబ్బిల్‌ గులామి (ఈ పిల్ల వాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో)” అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి అ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి గాడు.

జరిగినది చూసిన ప్రజలంతా “మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరి వేయమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు. (ముస్లిం)

ముఖ్యాంశాలు:

1.పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్చించడానికి కూడా వెనుకాడరాదు.

2. అల్లాహ్ ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. అల్లాహ్ తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.

3. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్‌ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.

4. హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన ‘అస్‌హాబుల్‌ ఉఖ్‌దూద్‌‘ (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్ధం అయ్యేది కాదు. ఖురాన్‌ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.

5. ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రధాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.


ఇతర కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు
హదీసులు # 25 – 52

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సహనం, ఓర్పు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3RjoZaSlju7cCMlRuCMNco

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (ఖుర్’ఆన్ అయతులు)  (29 నిముషాలు)

భాగం 02 (హదీసు #25) (34 నిముషాలు)

భాగం 03 (హదీసు #26,27) (29 నిముషాలు)

భాగం 04 (హదీసు #28,29) (25 నిముషాలు)

భాగం 05 (హదీసు #30) (25 నిముషాలు)

భాగం 06 (హదీసు #31 – 35) (29 నిముషాలు)

భాగం 07 (హదీసు #36 – 40) (25 నిముషాలు)

భాగం 08 (హదీసు #41) (36 నిముషాలు)

భాగం 09 (హదీసు #42,43) (27 నిముషాలు)

భాగం 10 (హదీసు #44) (27 నిముషాలు)

భాగం 11 (హదీసు #45-49) (23 నిముషాలు)

భాగం 12 (హదీసు #50-53) (36:22 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సహనం , ఓర్పు [PDF]

సహనం, తృప్తి, నిరపేక్షాభావం అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకండి

26. హజ్రత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ సినాన్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు ) కథనం :

కొంత మంది అన్సారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను యాచించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారడిగింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచించారు. అప్పుడు కూడా ఆయన వారికి (ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన చేతిలో ఉన్నదంతా అయిపోయిన తరువాత ఆయన వారితో ఇలా అన్నారు:

నా వద్దకు ఏ కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్‌ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షాభావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్‌ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్‌ సహనం వహించే సద్బుద్దిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైన, విశాలమైన కానుక మరొకటి లేదు. “

(బుఖారీ – ముస్లిం). (సహీహ్ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది.

నుండిసహనం , ఓర్పు –  హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)