కరుణ చూపే వారిపై అల్లాహ్ కరుణ చూపుతాడు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/eu7r]
[30 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ముహర్రం నెలలో “నెల్లూరు రొట్టెల పండగ” పేరుతో జరిగే షిర్క్ మరియు దురాచారాలు

బిస్మిల్లాహ్

[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది] 

నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్‌ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్‌ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్‌ మజార్‌ షరీఫ్‌” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్‌ బాబా” అని “లాల్‌ దర్గా” పేరుతో ఉంది.

రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.

అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.

ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్‌ మరియు బిద్‌అత్‌ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.

“బారా షహీద్ మజార్‌ షరీఫ్‌”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.

అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.

కనుక అల్లాహ్  వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు:

إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ

“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్‌ వీటిని గురించి ఎట్టి ప్రమాణం  అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్‌ నజ్మ్‌:23)

అల్లాహ్ ఇలా తెలియజేసాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్‌ సబా:22).

అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్‌ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.

కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్‌ అంబియా:25)

అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

“మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాహ్‌నే నమ్ముకోండి” (సూరతుల్‌ మాయిదా:23)

మరోచోట అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

“అల్లాహ్‌ను నమ్మకున్నవారికి అల్లాహ్‌యే చాలు.” (సూరతు తలాఖ్ :3)

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్‌ జన్నహ్‌: 316-318).

ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్‌ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్‌ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇమామ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బిస్మిల్లాహ్

ఇమామ్‌ ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్‌. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీన్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశపరంపర ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ ము’గీరహ్‌.

జననం: ఖురసాన్‌ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్‌, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.).
మరణం: 1-10- 256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖంద్ లో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు.
ఇతని శిక్షకులు: అహ్మద్‌ బిన్‌ హంబల్‌, అలీబిన్‌ మదీనీ , ఇస్-హాఖ్ బిన్‌ రహ్వే.
ఇతని శిశ్యులు: ముస్లిం బిన్‌ హజ్జాజ్‌, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్‌ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్‌ బిన్‌ అనస్‌ శిష్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్దులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లా డుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ) 

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవేకాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్ధించడం, దైవభీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొరపెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్న తనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతు లెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను కలలో చూశారు. ‘నీ ప్రార్దన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్టత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని “తారీఖ్‌ కబీర్‌” అనే పుస్తకం వ్రాశారు.

బాల్యం, విద్యాభ్యాసం, శిక్షణ, గురువులు:

బు’ఖారాలో 194 హిజ్రీ శకంలో రమజాన్‌ 13వ తేదీన జుమ’అహ్‌ నమా’జ్‌ తర్వాత జన్మించారు. బు’ఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా, అతని విద్యాభ్యాసం, శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమ మైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక ‘హదీసు’వేత్త. అతని తండ్రి ఇస్మా’యీల్‌ బాల్యం లోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణా బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయస్సు పెరిగిన తర్వాత ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది ‘హదీసు’వేత్తల కుటుంబం.

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “నేనింకా బడిలో ఉండగానే ‘హదీసు’ విద్య నేర్చు కోవాలనే కోరిక నాకు కలిగింది.” వర్రాఖ్‌ బు’ఖారీని “మీకు ‘హదీసు’ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయస్సు ఎంత” అని అడిగితే “అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బు’ఖారీ ‘హదీసు’వేత్తల సభలలో పాల్గొనసాగారు.

ప్రారంభదశలోనే ఒక సంఘటన జరిగింది. బు’ఖారా లోని ప్రఖ్యాత పండితులు దా’ఖలీ అలవాటు ప్రకారం ‘హదీసు’లను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బు’ఖారీ కూడా ఉన్నారు. దా’ఖలి ఒక ‘హదీసు’ ప్రామా ణికతను పేర్కొంటూ, ‘సుఫియాన్‌ అన్‌ అబి’జ్జుబే ర్‌ అన్‌ ఇబ్రాహీమ్‌” అని అన్నారు. బు’ఖారీ అది విని, “అన్న అబా’జ్జుబేర్‌ లమ్‌ యరౌ ఇబ్రాహిమ్‌” – అంటే ‘అబు ‘జ్జుబేర్  ఇబ్రాహీమ్‌ ద్వారా ఉల్లేఖించ లేదు,’ అని అన్నారు. అప్పుడు బు’ఖారీ వయస్సు 11 సంవత్సరాలు.

బు’ఖారీ అప్రమత్తత: అజ్‌లోనీ బు’ఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొన్నారు. “బు’ఖారీ తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అష్రఫీ లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బు’ఖారీకి సేవలుచేసి, చాలా గౌరవభావం వ్యక్తం చేశాడు. బు’ఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించ సాగాడు. బు’ఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అష్రఫీ లు ఉన్నాయని కూడా అతనికి తెలుపడం జరగింది.

ఒక రోజు బు’ఖారీ మిత్రుడు నిద్రలేచి ఏడ్వటం పెడబొబ్బలు పెట్టటం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడసాగారు. అసలు  ఏమయిందని అడిగారు.’ ప్రజలు అంతగా అడుగుతుంటే, ఆ వ్యక్తి నా దగ్గర 1000 అష్రఫీల సంచి ఉండేది. అది పోయింది అని ఏడ్వసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బు’ఖారీ ఎవరికీ తెలియకుండా తన అష్రఫీల సంచిని సముద్రంలో పారవేశారు. ఆ తరువాత బు’ఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్దా అది దొరక్కపోయేసరికి, వారు ఆ వ్యక్తినే చీవాట్లు పెట్టారు.

ప్రజలందరూ ఓడనుండి దిగారు. ఆవ్యక్తి ఏకాంతంలో బు’ఖారీని కలిశాడు. ‘తమరు ఆ అష్రఫీల సంచి ఏం చేశారు?’ అని అడిగాడు. బు’ఖారీ, ‘ఆ సంచిని సముద్రంలో పారవేశాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసెలా ఒప్పింది,’ అని అడిగాడు. “నీకు బుద్దుందా? నా జీవిత మంతా ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ‘హదీసు’లను రాయడంలోనే గడచి పోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం నిందరావటాన్ని నేనెలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అష్రఫీలకు ఎలా బలి చేయగలను,” అని సమాధానం ఇచ్చారు.

సద్గుణాలు, అలవాట్లు, ప్రవర్తన: బు’ఖారీకి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రిగారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటుపాట్లు జరుగుతుంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బు’ఖారీ తండ్రి ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్స్‌తో, ‘నేను నా ధనంలో ఒక్క దిర్‌హమ్‌ కూడా అధర్మమైనదిగా ఎరుగను.’ అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మా’యీల్‌ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండే వారు. ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో అబూ హఫ్స్‌తో నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచివెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు,’ అని హితవుచేశారు.

‘హదీసు’వేత్త ముహమ్మద్‌ బిన్‌ అబీ  హాతిమ్‌ కథనం: బు’ఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమై పోయారు. అల్లాహ్‌ అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురికాకుండా సంరక్షించాడు.

స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25వేల దిర్‌హమ్‌లు నొక్కేశాడు. శిష్యులు, ‘అప్పు తీసుకున్న వాడు వచ్చాడు, అతన్నుండి అప్పు వసూలు చేసుకోండి, ‘ అని అన్నారు. దానికి బు’ఖారీ, ‘అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు’ అని అన్నారు. బు’ఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్దులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్‌హమ్‌లు దీనికి కేటాయించేవారు. పండితులకు, విద్యార్దులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్నపానీయాల విషయంలో భోగ, విలాసాలకు దూరంగా ఉండేవారు.

బు’ఖారీ గుమస్తా అయిన ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ కథనం: ఒకసారి విద్యార్జన  కాలంలో ఆదమ్‌ బిన్‌ అబీ అయాస్‌ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామగ్రి అంతా అయిపోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు అలములు తిని గడిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ ఏదీ అడగలేదు. బు’ఖారీ దైవభీతి, దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ అస్సియార్ ఫీ   కథనం: నేను ఒకసారి ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని ప్రక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది. వెంటనే బు’ఖారీ ఆగ్రహంచెంది, ‘ఎలా నడుస్తున్నావు?’ అని అన్నారు. దానికి సేవకురాలు, ‘దారిలేకపోతే ఎలా నడిచేది? ‘ అని చెప్పింది. అది విని బు’ఖారీ ఆగ్రహం చెందడానికి బదులు, “పో నిన్ను నేను విడుదల చేసి వేశాను,” అని అన్నారు. అప్పుడు నేను “ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది. తమరు కోప్పడటానికి బదులు ఆమెను విడుదల చేసివేశారా?” అని అడిగాను. దానికి బు’ఖారీ, “ఆమె చేసిందానికి నన్ను నేను సంతృప్తి పరచుకున్నాను.” అంటే బు’ఖారీ ఆమెను చీవాట్లు పెట్టేబదులు తన్ను తాను చీవాట్లు పెట్టుకున్నారు.

ఒకసారి బు’ఖారీ తండ్రిగారి శిష్యుడైన అబూ ‘హఫ్‌స్‌ కొంతసరుకును బు’ఖారీ వద్దకుపంపారు. కొంత మంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5000 రుసుము ఇచ్చి సరుకు తీసుకొని వెళతామని అన్నారు. దానికి బు’ఖారీ ‘ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, ఇచ్చి తీసుకువెళ్ళండి’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి, 5వేలకు బదులు 10 వేలు ఇచ్చి సరకు తీసుకువెళతా మన్నారు. కాని బు’ఖారీ తరువాత వచ్చిన వ్యాపారులను రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపి వేశారు. అనంతరం మొదట వచ్చిన వ్యాపారులకు ఆ సరకును అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చారు.

‘హదీసు’వేత్తల నాయకుడు బగ్దాద్‌ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్‌ బనీ ‘అబ్బాస్‌ పరపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్‌, మామూన్‌ వంటి మహారాజులు దీని అభివృద్ధికి కృషి చేశారు. బగ్దాద్‌ గొప్పగొప్ప పండితులకు, ధార్మికవేత్తలకు నిలయంగా మారింది. బు’ఖారీ పేరు ప్రఖ్యాతులు బగ్దాద్‌ వరకు వ్యాపించాయి.

బు’ఖారీ బగ్దాద్‌ వచ్చారు. అతని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించటానికి బగ్దాద్‌ నగర పండితులు, ‘హదీసు’వేత్తలందరూ ఏకమయ్యారు. వంద ‘హదీసు’లను వాటి సాక్ష్యాధారాలను కలగా పులగం చేసి, బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహా విద్యావంతు లందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు ‘హదీసు’లు చదవసాగారు. బు’ఖారీ, “నాకు తెలియదు” అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన, మార్పులు చేర్పులు చేసిన ‘హదీసు’లు చదవగా బు’ఖారీ కేవలం, “నాకు తెలియదనే” సమాధానం ఇచ్చారు. ఈవిధంగా నిర్ణయించిన ‘హదీసు’లన్సీ అయిపోయాయి.

బు’ఖారీని ఎరుగని వారు, బు’ఖారీ ఓడిపోయారని భావించారు. కాని అతన్ని గురించి తెలిసిన వారు బు’ఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బు’ఖారీ వెంటనే నిలబడి వారు కలగాపులగం చేసి, మార్పులు చేర్పులు చేసి చదివిన ‘హదీసు’లను సరైన రీతిలో ఏమాత్రం తప్పులేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన ‘హదీసు’లన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా  వినిపించారు. అది చూసి బగ్దాద్‌ ప్రజానీకం ఆశ్చర్య పడకుండా ఉండలేక పోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు.

మరణం: బు’ఖారీ 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయస్సులో ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రాత్రి 256 హిజ్రీ శకంలో మరణించారు. మరణించిన తరువాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్‌ చుట్టువేయడం జరిగింది. కొంతమంది సమర్‌ఖంద్‌ తీసుకువెళదామని కోరారు. ఇంకా ఖనన ప్రదేశం విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాని తరువాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు “జుహర్‌ నమాజు తర్వాత ఖననం చేయబడ్డారు.

వర్రాఖ్  కథనం: బు’ఖారీ తన మరణానికి ముందు తనను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) సాంప్రదాయం ప్రకారం 3 వస్త్రాల్లో  ఖననం చేయాలని ఉపదేశించారు.

ఖతీబ్‌ అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ ఆదమ్‌ అత్తవాల్‌లేసీ  యొక్క సంఘటన పేర్కొన్నారు, “నేను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను తన సహచరుల బృందం వెంట ఒకచోట వేచిఉన్నారు. ఎవరి గురించో ఎదురుచూస్తున్నారు. నేను సలామ్‌ చేసి, ‘ఎవరి గురించి ఎదురుచూస్తున్నారు’ అని అడిగాను. దానికి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం), ‘నేను ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీ’ల్‌ గురించి ఎదురుచూస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బు’ఖారీ మరణవార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని, మరణసమయాన్ని కలిపి చూశాను. ఆ రెండూ ఒకే సమయం, ఒకే దినంగా నిర్దారించాను. ఎందు కంటే షరీఅత్‌లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలో ని 46వ భాగంగా నిర్దారించటం జరిగింది. బు’ఖారీ మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

బు’ఖారీ రచనలు; అత్తార’ఖుల్‌ కబీర్‌, అత్తారీఖుల్‌ అవ్‌ సత్‌, అత్తారీఖ్‌ అస్సగీర్‌, అల్‌ జామిఉల్‌ కబీర్‌, ఖల్‌ఖు అఫ్‌ఆలిల్‌ ఇబాద్‌, కితాబుద్దుఅఫాయిల్‌ అస్సగీర్‌, అల్‌ ముస్నదుల్‌ కబీర్‌, అత్తఫ్‌సీరుల్‌ కబీర్‌, కితాబుల్‌ హిబహ్‌, అసామిస్సహాబహ్‌, కితాబుల్‌ విజ్‌ దాన్‌, కితాబుల్‌ మబ్‌సూత్‌, కితాబుల్‌ ఇలల్‌, కితా బుల్‌ కినా, కితాబుల్‌ ఫవాయిద్‌, అల్‌ అదబుల్‌ ముఫ్రద్‌, జుజ్ఉరఫ్‌ఉల్‌ యదైన్‌, బిర్రుల్‌ వాలిదైన్‌, కితాబుల్‌ అష్‌రిబహ్‌, ఖ’దాయస్సహాబహ్‌ వత్తాబి యీన్‌, కితాబుర్రిఖాఖ్‌, అల్‌ జామిఉస్సగీర్‌ పిల్‌ ‘హదీస్‌’, జు’జ్‌ ఉ ఖిరాఅతి ‘ఖల్‌ఫల్‌ ఇమామ్‌ మొదలైనవి.

సహీ బు’ఖారీ ఆదరణ, దాని గొప్పతనం: బు’ఖారీ రచనల్లో ”అల్‌ జామిఉ’స్స’హీ’హ్‌” ఈనాడు ‘స’హీహ్‌ బు’ఖారీ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఇస్లామీయ  ప్రాంతాలన్నింటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బు’ఖారీకి ‘హదీసు’వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ పుస్తకం కూడా ఒక కారణమే. దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ తరువాత ఏ పండితుని పుస్తకానికి ఈ స్థానం  లభించలేదు.

‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయాలనే ఆలోచన: ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ బు’ఖారీని ‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయమని కోరారు. ఇబ్రాహీమ్‌ బిన్‌ మాఖల్‌ నసఫీ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, “ఒకరోజు మేము ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పు డతను, “నువ్వు ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ప్రామాణిక ‘హదీసు’లను ఒకచోట చేర్చితే బాగుండు,” అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుంది. నేను అప్పటి నుండే ‘స’హీ’హ్‌ బు’ఖారీని వ్రాయడం ప్రారంభించాను.

మరో కారణం ఏమిటంటే, బు’ఖారీ ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూశారు. “నేను ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసనకర్రతో ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై నుండి ఈగలను తోలుతున్నాను.”” మేల్కొన్న తరువాత పండితులతో దాని పరమార్దాన్ని  గురించి అడిగాను. దానికి వారు, ‘ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై కల్పించిన అసత్య ‘హదీసు’లను నీవు తొలగిస్తావు ,’ అని పరమార్దం తెలిపారు. ఎందు కంటే సత్యస్వప్పాలు దైవదౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూసిన వారు నిజంగా కలలోచూశారు. ఈకల కూడా మరింత కుతూహలాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈవిధంగా “జామె’ ‘స’హీహ్‌” రచనలో బు’ఖారీ నిమగ్నంఅయిపోయారు.

రచనా సమయం మరియు సరళి: ‘స’హీహ్‌ బు’ఖారీని, బు’ఖారీ ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఎలా రచించారు. రచించిన తరువాత, ఎవరి ముందు ప్రవేశపెట్టారు. ప్రతి విషయంపై చర్చించారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు: “నేను జామె’ ‘స’హీహ్‌ను మూడుసార్లు రచించాను. అంటే దాన్ని మూడుసార్లు సరిదిద్దాను.”

అబుల్‌ ‘హైస’మ్‌ కష్‌మిష్నీ కథనం: నేను ఫర్‌బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు. బు’ఖారీ కథనం: “నేను ఏ ‘హదీసు’నూ స్నానం చేసి రండు రకాతులు చదవనంత వరకు అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌లో చేర్చలేదు.”

మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: “దాన్ని నేను మస్టిదె ‘హరామ్‌లో రచించాను. ఇంకా ప్రతి ‘హదీసు’పై రెండు రకాతుల నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవాడిని. దానిపట్ల పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే ‘అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌’లో చేర్చేవాడిని. దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను. 6 లక్షల ‘హదీసుల్లో ప్రామాణికమైన ‘హదీసు’లను ఎంచి వ్రాశాను.”

ఇబ్నె అదీ తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు: బు’ఖారీ అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌ యొక్క అధ్యాయాలన్నిటిని ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గది మరియు మింబర్ల మధ్య కూర్చొని, ప్రతి అధ్యాయానికి ముందు రెండు రకాతులు నమా’జు చదివి వ్రాసేవారు.

వర్రాఖ్‌ కథనం: నేను బు’ఖారీ వెంట ఉన్నాను. నేను బు’ఖారీని కితాబుత్తఫ్‌సీర్‌ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15, 20 సార్లు లేచి దీపం వెలిగించి ‘హదీసు’లపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్నిబట్టి బు’ఖారీ ఎల్ల ప్పుడూ, ప్రతిచోట తన ధ్యానం అంతా దానిపైనే పెట్టే వారు. ఒక ‘హదీసు’ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తు పెట్టేవారు. ఇక అధ్యాయాలను బు’ఖారీ ఒకసారి ‘హరమ్‌లో మరోసారి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గదికి మింబరుకు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో ‘హదీసు’లను సంకలనం చేసినపుడు ముందు స్నానం చేసి నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవారు.

అబూ జ’అఫర్‌ అఖీలీ కథనం: బు’ఖారీ, ‘స’హీహ్‌ బు’ఖారీని రచించి, ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్‌ బిన్‌ హంబల్‌, ‘అలీ బిన్‌ మదీనీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలామెచ్చుకున్నారు. ఇంకా ప్రశంసించారు. దాని ప్రామాణికతను మెచ్చుకున్నారు. కాని నాలుగు ‘హదీసు’ల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ నాలుగు ‘హదీసు’ల విషయంలో కూడా బు’ఖారీ అభిప్రాయం సరైనదిగా తేలింది. ఆ నాలుగు ‘హదీసు’లు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి.(సీరతుల్‌ బు’ఖారీ).


ఇది మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] అను పుస్తకంలో “హదీసు వేత్తల జీవిత విశేషాలు నుండి తీసుకోబడింది

అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)- డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
https://tinyurl.com/aqeeda-tawheed
[228 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ 

తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా 

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

అల్లాహ్‌ (త’ఆలా) స్తోత్రం తర్వాత ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను పూర్తిగా అనుసరించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ‘హదీసు‘లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్‌ ‘హుసైన్‌ బిన్‌ మస్‌’ఊద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ ఫరాఅ’ అల్‌ బ’గవీ (రహిమహుల్లాహ్). అల్లాహ్‌ (త’ఆలా) అతని తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు. ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.

తరువాత ము’హమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్ అల్‌ ఖ’తీబ్‌ అత్‌ తబ్రే’జీ (రహిమహుల్లాహ్) గారు. బ’గవీ గారి మ’సాబీహ్‌లో గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపుపెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసిపెట్టిన ‘హదీసు’వేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. బ’గవీ గారు సమకూర్చిన ఈ “అల్‌ మ’సాబీ’హ్” కు, ‘తబ్రీ’జీ గారు “మిష్కాతుల్‌ మసాబీహ్‌” అని పేరు పెట్టారు.

ఏవిధంగా బ’గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రే’జీ గారు కూడా అలాగే చేసారు. బ’గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రే’జీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.

“మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య ‘హదీసు’ అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషలలోనికి అనువాదాలు చేయబడ్డాయి.

దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహిమహుల్లాహ్) ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాసారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.

ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.

ఏవిషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ “మిష్కాతుల్‌ మసాబీహ్‌” చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగుపరచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటిని, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీగారి ధృవీకరణ కూడా ‘హదీసు’ మొదటలో పేర్కొనబడింది.

“మిష్కాతుల్‌ మసాబీహ్‌” యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1012 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1019 పేజీలు) ఉన్నాయి.

విషయ సూచిక

మొదటి సంపుటం అధ్యాయాలు 

అధ్యాయ సూచిక – సంపుటం-1 : అధ్యాయాలు 1-11 (4 పేజీలు)

రెండవ సంపుటం అధ్యాయాలు

అధ్యాయ సూచిక – సంపుటం-2 : అధ్యాయాలు 12-30 (4 పేజీలు)

కలిమహ్ నిబంధనలలో రెండవది: నమ్మకం (యఖీన్‌) [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు]

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


2- యఖీన్‌ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.

సూర హుజురాత్‌ (49: 15)లో అల్లాహ్‌ ఆదేశం:

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا

(ఎవరు అల్లాహ్‌ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).

conditions-of-laa-ilaaha-illallaah

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్‌ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ  లేడని మరియు నేను అల్లాహ్‌ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్‌ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).


షహాదహ్

దివ్య ఖురాన్ సందేశం [ఆడియో MP3]

బిస్మిల్లాహ్

దివ్య ఖురాన్ సందేశం ఆడియో  
Divya Qur’an Sandesham

[యూట్యూబ్ ప్లే లిస్ట్ | దివ్య ఖురాన్ సందేశం |అరబిక్-తెలుగు | 30 పారాలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2yL91eY7XtuZ6Nlk2moXWU

అరబిక్-తెలుగు ఆడియో MP3 :

ప్రతి ఆయత్ అరబీలో చదివిన తర్వాత, తెలుగు అనువాదం చదవబడుతుంది.

పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు 

పారా  01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10

పారా  11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20

పారా  21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30

[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]

Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina
Translated by Dr Abdul Raheem Mohammed Moulana

తెలుగు అనువాదం మాత్రమే ఆడియో MP3 :

అరబీ ఆయత్ చదవకుండా, తెలుగు అనువాదం మాత్రమే చదవబడుతుంది.

పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు 

పారా  01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10

పారా  11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20

పారా  21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30

[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]

Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina
Translated by Dr Abdul Raheem Mohammed Moulana

ఇతరములు:

దివ్య ఖురాన్ సందేశం – చదవండి 

ఇస్లాం ధర్మం సంపూర్ణత మరియు శ్రేష్ఠత [వీడియో]

బిస్మిల్లాహ్

[13 నిముషాలు]

كمال الدين الإسلامي وفضله

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సఫర్ మాసం, దాని దురాచారాలు صفر وبدعاته [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లామీయ ఈ రెండవ మాసంలో ఎంతో మంది అపశకునం పాటిస్తారు. ఇలా పాటించడం ధర్మమా అధర్మమా ఈ వీడియోలో తెలుసుకోండి.

సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.

ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)

సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:

మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.

రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.

[24 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


సఫర్‌ నెల వాస్తివికత

సఫర్‌ నెల ఇస్లామీయ క్యాలండర్‌ ప్రకారం రెండవ నెల. అరబ్బులలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్తగా రాక మునుపు సఫర్‌ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈనెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు.

ప్రస్తుత కాలంలో మన ముస్లిం సమాజానికి చెందిన కొంత మంది అజ్ఞానులు, అలాంటి మూఢ నమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్‌ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని నమ్మకాలకు గురికాబడి ఉన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:

1-మొత్తం సంవత్సరంలో పది లక్షల ఎనభై వేల విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తలలో నుండి ఒక్క సఫర్‌ నెలలోనే తొమ్మిది లక్షల ఇరవై వేల విపత్తులకు గురికాబడతారని భావిస్తారు.

2-సఫర్‌ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు, సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు.

౩-ఈ నెల మొదటి పదమూడు రోజులను “తేరతేది” అని పేర్కొంటూ, తీవ్రమైన విపత్తులకు గురికాబడే రోజులుగా భావిస్తారు.

4- ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్ళి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒక వేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉన్నా ఆ జంటలను పదమూడు రోజుల వరకు విడదీసి, ఒకరి ముఖాలను మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనుక కలుసుకుంటే, వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు.

యదార్ధం ఏమంటే? అలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత లేదు. పైగా అలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే? నెలలను లేక సమాయాలను అపశకునాలకు విపత్తులకు ప్రత్యేకిస్తే, అల్లాహ్ ను తప్పుపట్టినట్లుగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. కనుక ఒక హదిసు ఖుద్సీలో ఇలా ఉంది:

“అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “ఆదాము పుత్రుడు (మానవుడు) కాలాన్ని (రోజులను, నెలలను, యేడాదిని) తిట్టుతున్నాడు. మరియు నేనే కాలాన్ని. నా చేతిలోనే రాత్రింబవళ్ళ మార్పిడి ఉన్నది.”,(బుఖారి;4452, ముస్లిం:41 70)

మరొక చోట ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“మీరు కాలాన్ని తిట్టకండి. నిశ్చయంగా అల్లాహ్ యే కాలము.” (ముస్లిం:4165)

ఆఖరి చహార్షుమ్బా 

సఫర్‌ నెలకు చెందిన చివరి వారంలో ఉన్న బుధవారాన్ని ఊరుబయటకు వెళ్ళి పచ్చగడ్డిపై నడవటం పుణ్య ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే? ఆ రోజే ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లభించినది అని, మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సరదాగా ఆ రోజు పచ్చగడ్డిపై నడిచారని అంటారు. దాని కారణంగా ప్రజలు భార్యపిల్లలతో కలిసి పార్కులలో, తోటలలో షికార్లు చేస్తారు. దానిని ప్రవక్త ఆచారం అని అంటారు.

ఆ సాకుతో కొంత మంది ప్రజలు సఫర్‌ నెల చివరి బుధవారం తమ ఇండ్లలో మంచి వంటకాలు చేసుకొని, స్నానాలు చేసుకొని, క్రొత్త దుస్తులు ధరించి, బాగా అందంగా తయారయ్యి అందాల పోటీల సభలలో పాల్గొన్నట్లు ముస్తాబు అవుతారు. చిన్నాపెద్ద, ఆడామగా అనే  తేడా లేకుండా పార్కుల్లో, తోటల్లోకి పోయి ఏ విధంగా కలిసి మెలిసి షికార్లు చేస్తుంటారనేది మనం చెప్పనక్కర లేదు.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి రోజులు:

సఫర్‌ నెల చివరి బుధవారం రోజున ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లబించిందా అంటే? దానికి జవాబు కానేకాదు. ఎందుకంటే? “అర్రహీఖుల్‌ మఖ్తూమ్‌” తెలుగు పేజి: 813లో ప్రవక్త గారి గురించి ఇలా ఉంది: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీర ఉష్ణోగ్రత (జ్వరము) మరింత పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆయన బాధ బాగా ఎక్కువై అపస్మారక పరిస్థితి ఎర్పడింది.” నిజమేమంటే ఆ రోజే ఆయన అస్వస్థకు గురికాబడ్డారు. కాని మనం స్వస్థత చేకూరిందంటూ సంతోషాలు జరుపుకోవడం ధర్మమేనా? దాని వలన మనకు పుణ్యం ప్రాప్తిస్తుందా? లేక పాపం ప్రాప్తిస్తుందా? మనం ఆఖరి చహార్షుమ్బా పేరుతో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్రనే  తప్పుగా ప్రచారం చేయడం లేదా?

ప్రియమైన ముస్లిములారా! ఆఖరి చహార్షుమ్బా అంటూ ప్రత్యేకమైన ఎలాంటి పుణ్యకార్యం లేదు. మరియు సఫర్‌ నెల గురించి ఇస్లాం ధర్మంలో ఎలాంటి అపశకునాలు లేవు. అసలు అలాంటి అపశకునాలకు గురికాకూడదని ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు:

సఫర్ మాసం, దాని దురాచారాలు

“అంటు (వ్యాధులు), దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అపశకునాలు లేవు, గుడ్లగుబ కేకల వలన ఎలాంటి ప్రభావం లేదు, మరియు సఫర్‌ (నెల) ఏమి కాదు…” (బుఖారి: 5316, ముప్లిం: 4116)


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 71-74). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

గడుస్తున్న రోజులతో గుణపాఠం (العبرة والموعظة من مرور الأيام) [వీడియో]

బిస్మిల్లాహ్

ఈ వీడియో భాద్యత భావం నేర్పుతుంది.

[25 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia