అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)
399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ) __________ أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها
399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-
నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)
400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ __________ أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه
400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]
401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا __________ أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر
401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-
మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.
(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
213. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ముస్లింలు మదీనా వచ్చిన తరువాత ప్రారంభంలో నమాజు కోసం అజాన్ చెప్పే సంప్రదాయం ఉండేది కాదు, నిర్ణీత వేళకు ప్రజలు తమంతట తామే (మస్జిద్ లో) గుమిగూడి నమాజు చేసుకునేవారు. కొన్నాళ్ళ తరువాత ఓ రోజు ముస్లింలు దీన్ని గురించి పరస్పరం సంప్రదించుకోవడానికి సమావేశమయ్యారు. అప్పుడు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ “క్రైస్తవుల మాదిరిగా ఒక గంట ఏర్పాటు చేసుకొని మోగించాల’ని అన్నారు. మరి కొందరు యూదుల మాదిరిగా శంఖం ఊదాలని అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ, “మనం నమాజు ప్రకటన కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎందుకు నియమించుకోకూడదు?” అని అన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సలహా విని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)తో “లే, లేచి నమాజు కోసం ప్రకటన చెయ్యి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 1వ అధ్యాయం – బయీల్ అజాన్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఉపదేశం, ముఖ్యంగా 40 సం. దాటిన ప్రతి ఒక్క విశ్వాసికి https://youtu.be/nWrwm6_2jLQ [13 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జిహాద్ అంటే ఏమిటి? అవిశ్వాసుల_సందేహం – చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది? https://youtu.be/gSMYVw32Mr4 [12 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Al-Hajj 22:39 أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا۟ۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.
Al-Baqarah 2:190 وَقَٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمْ وَلَا تَعْتَدُوٓا۟ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.
Al-Anfal 8:61 وَإِن جَنَحُوا۟ لِلسَّلْمِ فَٱجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
An-Nisa’ 4:90 … فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا … కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. అలాగే శ్రేష్ఠ ఖలీఫాలయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గార్లతో కలసి కూడా ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), శ్రేష్ఠ ఖలీఫాలు కూడా మొదట నమాజు చేసి ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవారు. ఆనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఉపన్యాస వేదిక నుంచి) క్రిందికి దిగి, ప్రజలను కూర్చోమని చేత్తో సైగ చేస్తూ (పురుషుల) పంక్తులను చీల్చుకుంటూ స్త్రీల పంక్తుల సమీపానికి చేరుకున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “యా హయ్యుహన్నబియ్యు ఇజా జా అకల్ మూమినాతు యుబాయీనక అలా అల్లా యుష్రిక్ న” (ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరికి వచ్చి తాము అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) మరెవరినీ సాటి కల్పించబోమని, దొంగతనం చేయబోమని, వ్యభిచారానికి పాల్పడబోమని, తమ సంతనాన్ని హతమార్చము అనీ, అక్రమ సంబంధాలను గురించిన అపనిందలు సృష్టించమని, మంచి విషయాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు. అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు.) ( ఖుర్ఆన్ : 60-12) అనే సూక్తి పఠించారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠించిన తరువాత “మీరీ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేస్తారా?” అని మహిళల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒక స్త్రీ మాత్రమే చేస్తానని సమాధానమిచ్చింది. మిగిలిన వారంతా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండిపోయారు. “సరే మీరు సదఖా (విరాళాలు) ఇవ్వండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) తన కండువా తీసి క్రింద పరుస్తూ “నా తల్లిదండ్రుల్ని మీ కోసం సమర్పింతు” అని అన్నారు. అప్పుడు స్త్రీలు తమ ఉంగరాలు, మెట్టెలు తీసి ఆ వస్త్రంలో వేయనారంభించారు.
సహీహ్ బుఖారీ: 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా (యౌముల్ ఈద్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1280 – حديث جُنْدَبٍ، قَالَ: صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَوْمَ النَّحْرِ ثُمَّ خَطَبَ ثُمَّ ذَبَحَ، فَقَالَ: مَنْ ذَبَحَ قَبْلَ أَنْ يُصَلِّيَ فَلْيَذْبَحْ أُخْرَى مَكَانَهَا، وَمَنْ لَمْ يَذْبَحْ فَلْيذْبَحْ بِاسْمِ اللهِ __________ أخرجه البخاري في: 13 كتاب العيدين: 23 باب كلام الإمام والناس في خطبة العيد
1280. హజ్రత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ఈదుల్ అద్ హా (బక్రీద్ పండుగ) రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మొదట నమాజు చేశారు. తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. ఆ తరువాత బలి (ఖుర్బానీ) పశువుని జిబహ్ చేశారు. (ఆ సందర్భంలో) ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరైనా నమాజుకు పూర్వం పశువుని జిబహ్ చేసి ఉంటే అతను దానికి బదులు మళ్ళీ మరొక పశువుని జిబహ్ చేయాలి. నమాజుకు ముందు ఖుర్బానీ ఇవ్వనివాడు (నమాజు తరువాత) అల్లాహ్ పేరుతో (అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి) పశువుని జిబహ్ చేయాలి”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1468. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం :-
నేను ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అసర్ నమాజ్ వేళ చూశాను. ప్రజలు వుజూ చేయడానికి నీళ్ళ కోసం అన్వేషిస్తున్నారు. కాని వారికి ఎక్కడా నీళ్ళు లభించడం లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం మటుకు (కొంచెం) నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆయన ఆ నీళ్ళ పాత్రలో తమ చేతిని ముంచి, ఇక వుజూ చేయండని అన్నారు అనుచరులతో. అప్పుడు ఆయన చేతి వ్రేళ్ళ నుండి ధారాపాతంగా నీళ్ళు వెలువడసాగాయి. మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి దాకా అందరూ వుజూ చేసుకునే వరకు ఆ నీటి ధారలు వెలువడుతూనే ఉండటం నేను కళ్ళారా చూశాను.
(సహీహ్ బుఖారీ:- 4వ ప్రకరణం – వుజూ, 32వ అధ్యాయం – ఇల్తి మాసిన్నాసి అల్ వజూఅ ఇజా హానతిస్సలాహ్)
1469. హజ్రత్ అబూ హమీద్ సాది (రదియల్లాహు అన్హు) కథనం:- మేము తబూక్ పోరాటంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాము. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖురా లోయలోకి చేరుకున్నారు. అక్కడ తోటలో ఒక స్త్రీ కన్పించింది. “ఆమె తోటలో ఎన్ని పండ్లు అవుతాయో అంచనా వేయండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ అనుచరులతో. ఆయన స్వయంగా పది ‘వసఖ్’ల పండ్లు ఉండవచ్చని అంచనా వేసుకున్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ స్త్రీతో “ఈ తోటలో (ఈ యేడు) ఎన్ని పండ్లు కాస్తాయో లెక్క గట్టి ఉంచు” అని అన్నారు. ఆ తరువాత మేము తబూక్ చేరుకున్నాం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో మాట్లాడుతూ “ఈ రోజు రాత్రి తీవ్రమైన తుఫాను గాలి వీస్తుంది. కనుక మీలో ఎవరూ ఆ సమయంలో లేచి నిలబడకూడదు. ఒంటెలు ఉన్నవారు తమ ఒంటెలను కట్టివేయాలి” అని అన్నారు. మేము మా ఒంటెలను కట్టివేశాము. ఆ రాత్రి భయంకరమైన తుఫాను గాలి వీచింది. ఒక వ్యక్తి (ఎందుకో) లేచి నిలబడ్డాడు. మరుక్షణమే అతడ్ని తుఫాను గాలి అమాంతం పైకెత్తి ‘తై’ కొండ మీద విసరివేసింది. ఆ సమయంలోనే ఐలా ప్రాంతపు రాజు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఒక తెల్ల కంచర గాడిదను, ఒక దుప్పటిని కానుకగా పంపాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి అతని రాజ్యాధికారం అతని క్రిందే ఉన్నట్లు ఒక ఫర్మానా వ్రాసిచ్చారు.
ఆ తరువాత మేము ఖురా లోయకు తిరిగొచ్చాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ స్త్రీని “నీ తోటలో ఎన్ని పండ్లు కాశాయి?” అని అడిగారు. దానికామె పది వసఖ్’లు కాశాయి అన్నది. అంటే దైవప్రవక్త అంచనా ప్రకారమే ఉత్పత్తి జరిగింది. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో “నేను తొందరగా మదీనా వెళ్ళిపోదామనుకుంటున్నాను. నాతో పాటు వచ్చే వాళ్ళెవరైనా ఉంటే వెంటనే బయలుదేరండి” అని అన్నారు.
ఆ తరువాత మాకు మదీనా పట్టణం కన్పించసాగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాన్ని చూసి “ఇది తైబా” అన్నారు. తరువాత ఆయన ఉహుద్ పర్వతాన్ని చూసి “ఈ పర్వతం మనల్ని అభిమానిస్తోంది. మనం దీన్ని అభిమానిస్తున్నాం” అని అన్నారు. ఆ తరువాత “నేను మీకు అన్సార్ ఇండ్లలో శ్రేష్ఠమైన ఇండ్లను గురించి చెప్పనా?” అని అన్నారు. దానికి అనుచరులు “తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా!” అన్నారు. “అన్నిటికంటే బనీ నజ్జార్ తెగవారి ఇండ్లు శ్రేష్ఠమైనవి. తరువాత బనీ అబ్దుల్ అష్ హల్ తెగవారి ఇండ్లు, ఆ తరువాత బనీ సాదా తెగవారి ఇండ్లు వస్తాయి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తిరిగి ఆయన “బనీ హారిస్ బిన్ ఖజ్రజ్ తెగవారి ఇండ్లతో బాటు అన్సార్ ముస్లింల ఇండ్లన్నిటిలోనూ శ్రేయోశుభాలు ఉన్నాయి” అని అన్నారు. (సహీహ్ బుఖారీ:- 24వ ప్రకరణం – జకాత్, 54వ అధ్యాయం – ఖర్సిత్తమ్ర్)
(హదీసు ఉల్లేఖకుని కథనం) – ఆ తరువాత హజ్రత్ సాద్ బిన్ ఉబాదా(రదియల్లాహు అన్హు) మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు హజ్రత్ అబూ ఉసైద్ (రదియల్లాహు అన్హు) ఆయనతో “మీరు విన్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్సారుల ఇండ్ల శ్రేష్ఠతను గురించి మాట్లాడుతూ మనల్ని అందరికంటే చివర్లో ఉంచారు” అని అన్నారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి “దైవప్రవక్తా! మీరు అన్సారుల ఇండ్ల ఘనతను గురించి చెబుతూ మమ్మల్ని చివర్లో ఉంచారు” అని అన్నారు.దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “మీరు కూడా శ్రేష్ఠమైన వారిలో ఉన్నారన్న మాట మీకు చాలదా?” అని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
16వ అధ్యాయం – వ్యాధులు, వాటి వైద్యం, మంత్రించడం الطب والمرض والرقي
1411 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَيْنُ حَقٌّ __________ أخرجه البخاري في: 76 كتاب الطب: 36 باب العين حق
1411. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- “దిష్టి తగలడం వాస్తవమే”. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 3వ అధ్యాయం-ఆల్ ఐను హఖ్ )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేతబడి చేయబడింది. దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలను కలుసుకోకపోయినా కలుసుకున్నానేమోనని అనుమానించేవారు – ఈ హదీసు ఉల్లేఖకుల్లో హజ్రత్ సుఫ్యాన్ (రహిమహుల్లాహ్) దీనిపై వ్యాఖ్యానిస్తూ, “ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే అది చాలా తీవ్రమైన చేతబడి అని భావించాలి” అని అన్నారు –
తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో (అంటే హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హాతో) ఇలా అన్నారు. ఆయిషా! నీకు తెలుసా? నేను అల్లాహ్ ని ఈ బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకుంటే ఆయన దీనికి పరిష్కార మార్గం చూపించాడు.
(కలలో) నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు నా తలవైపు, మరొకడు నా కాళ్ళవైపు కూర్చున్నాడు. తలవైపు కూర్చున్నవాడు “ఇతనికి ఏమయింది?” అని అడిగాడు రెండవ వ్యక్తిని. “ఇతనికి చేతబడి చేశారు” అన్నాడు రెండవ వ్యక్తి. “ఎవరు చేశారు?” అడిగాడు మొదటి వ్యక్తి. “లుబైద్ బిన్ ఆసిమ్ చేశాడు” అన్నాడు రెండవ వ్యక్తి. (లుబైద్, బనీ జరఖ్ తెగకు చెందిన వాడు, కపట విశ్వాసి, యూదుల పక్షపాతి). “ఈ చేతబడి ఎందులో చేశాడు?” మొదటి వ్యక్తి ప్రశ్నించాడు. “దువ్వెన, దువ్వెనతో రాలిన వెండ్రుకలలో” సమాధానమిచ్చాడు రెండవ వ్యక్తి. “ఎక్కడ చేశాడు?” అడిగాడు మొదటి వ్యక్తి, “పోతు ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ బావిలో ఒక రాతి క్రింద అదిమి పెట్టాడు” అన్నాడు రెండవ వ్యక్తి.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతబడిని (వస్తువుల్ని) తీసి వేయించడానికి (అనుచరుల్ని వెంట బెట్టుకొని) ఆ బావి దగ్గరకు వెళ్ళారు. “నాకు (కలలో) చూపించబడిన బావి ఇదే” అన్నారు ఆయన. ఆ బావిలోని నీరు గోరింటాకు రంగులా (ఎర్రగా) మారిపోయింది. అక్కడి ఖర్జూర చెట్లు కూడా పిశాచ తలలు మాదిరిగా తయారయిపోయాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞతో ఆ బావిలోని చేతబడి (వస్తువుల)ని తీసివేయడం జరిగింది. ఆ తరువాత నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “మీరు చేతబడికి విరుగుడు ఎందుకు చేయలేదు?” అని అడిగాను. దానికి ఆయన సమాధానమిస్తూ, “దైవసాక్షి! అల్లాహ్ నాకు స్వస్థత చేకూర్చినప్పుడు, నేను అనవసరంగా ఇతరుల మీద లంఘించి జనంలో అలజడి సృష్టించడం బాగుండదు. అలా చేయడం నాకిష్టం లేదు” అని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1746. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు :-
అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు – “నా దాసుడు నా గురించి ఎలా ఊహించుకుంటాడో నేనతని కోసం అలాగే ఉంటాను. నా దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా పేరు స్మరిస్తున్నప్పుడు నేనతని వెన్నంటి ఉంటాను. అతను నన్ను మనసులో జ్ఞాపకం చేస్తే నేను కూడా మనసులో జ్ఞాపకం చేస్తాను. అతను గనక ఏదైనా సమావేశంలో నా గురించి ప్రస్తావిస్తే నేను అంతకంటే శ్రేష్ఠమైన (దైవదూతల) సమావేశంలో అతడ్ని గురించి ప్రస్తావిస్తాను. నా దాసుడు నా వైపు ఒక జానెడు జరిగి వస్తే నేనతని వైపుకు ఒక బారెడు జరిగి వస్తాను. అతను నా వైపుకు ఒక బారెడు పురోగమిస్తే నేనతని వైపుకు రెండు బారలు పురోగమిస్తాను. అతను నా వైపుకు నడచి వస్తే నేనతని వైపుకు పరుగెత్తుకొస్తాను.”
1747. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు :
“ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరికి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తల పైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా)పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.”
1748 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضٍ فَلاَةٍ __________ أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة
1748. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“ఎలాంటి అన్న పానీయాలు లభించని భయంకర ఎడారి ప్రాంతంలో తప్పిపోయిన తన ఒంటె తిరిగి లభించినపుడు ఒక బాటసారి ఎంత సంతోషిస్తాడో అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం పట్ల అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.