సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం)
(970-931 క్రీ.పూ.)

“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.

ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.

రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.

ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.

తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.

దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.

తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.

ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.

వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.

చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.

హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.

హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.

కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.

సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.

రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.

సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.

బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.

ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)

సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)

సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.

ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”

ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)

  • సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
  • వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
  • ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
  • మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
  • మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
  • ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
  • అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
  • వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
  • పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
  • శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
  • లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
  • సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
  • బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) – Uthman bin Affan (radhiyallahu anhu) – The 3rd Khalifa [వీడియో]

బిస్మిల్లాహ్
ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) – Uthman bin Affan (radhiyallahu anhu) – The 3rd Khalifa –
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[36 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా

అబూబకర్ (రదియల్లాహు అన్హు) – Biography of Abu Bakr (radhiyallahu anhu), the 1st Khalifa [వీడియో]

బిస్మిల్లాహ్
అబూబకర్ (రదియల్లాహు అన్హు) – Biography of Abu Bakr (radhiyallahu anhu), the 1st Khalifa –
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[32 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – Bilal bin Rabah [ఆడియో]

బిస్మిల్లాహ్

[23 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

విశ్వాసుల మాతృమూర్తులు: జువైరియా & ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[44 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[36 నిముషాలు]
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉమర్‌ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్‌ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్‌!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్‌ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్‌! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.

ఉమర్‌ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్‌ బిన్‌ అరత్త్‌ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్‌ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్‌ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్‌ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్‌ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్‌ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్‌! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్‌ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్‌ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్‌ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌ హదు అన్న ముహమ్మదర్‌ రసూలుల్లాహ్‌“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్‌ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్‌ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్‌ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్‌ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్‌! “అల్లాహ్‌! ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లేదా అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్‌ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్‌ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్‌ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్‌ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్‌ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్‌ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్‌) చేయగలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌ఊద్‌ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

ముహమ్మద్ – అంతిమ ప్రవక్త (Muhammad, the final Prophet)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

సహాబా

విశ్వాసుల మాతృమూర్తులు: సౌదా బిన్త్ జమ్ ‘అ & హఫ్సా బిన్త్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[54 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

హజ్రత్ జైనబ్ బిన్తు ఖుజైమా & హజ్రత్ ఉమ్మె సలమా రజియల్లాహు అన్హుమాల జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ఆయేషా బిన్త్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) [వీడియోలు]

బిస్మిల్లాహ్
ఆయేషా బిన్త్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) – 5 వీడియోలు – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

5 ఆడియో భాగాలు :

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్‌ను స్తుతించిన తర్వాత ఇస్లాంలో స్త్రీ యొక్క ఉన్నత స్థానాన్ని వివరిస్తారు, సుగుణవతి అయిన స్త్రీ ఈ ప్రపంచంలోని ఉత్తమ సామాగ్రి అని తెలిపే ఒక హదీస్‌ను ఉదహరిస్తారు. ఆ తర్వాత, వక్త విశ్వాసుల తల్లి ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆమె వంశం, ఆమెకు సంతానం లేకపోయినప్పటికీ “ఉమ్మె అబ్దుల్లా” అనే కున్నియత్ (బిరుదు పేరు) ఎలా వచ్చిందో వివరిస్తారు. ఇంకా, ఆమె యొక్క అనేక బిరుదులైన ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి), హబీబా (ప్రియమైనది), హుమైరా మరియు మువఫ్ఫకా వంటి వాటి వెనుక ఉన్న కారణాలను మరియు ప్రాముఖ్యతను హదీసులు మరియు ఖురాన్ ఆధారంగా వివరిస్తారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
[వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్]
మరియు అంతిమ విజయం దైవభీతిపరులకే.

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
[వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు శాంతి మరియు శుభాలు ప్రవక్తల నాయకునిపై మరియు దైవసందేశహరులపై వర్షించుగాక.

وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ
[వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్]
మరియు ప్రళయదినం వరకు ఉత్తమ రీతిలో వారిని అనుసరించిన వారిపై కూడా.

أَمَّا بَعْدُ
[అమ్మాబాద్]
ఇక ఆ తర్వాత.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ రోజు మనం ఆదర్శ మూర్తి, ఆదర్శ మహిళ, విశ్వాసుల మాతృమూర్తి, ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం.

స్త్రీ స్థానం

ప్రపంచపు గొప్ప సౌభాగ్యం స్త్రీ. ఆ కోమలాంగి గనక భార్య రూపంలో వస్తే, ఆమె తన భర్త పాలిట, తన పిల్లల పాలిట సౌభాగ్యవతిగా అవతరిస్తుంది.

సత్కార్యం అంటే కేవలం తల మీద గుడ్డ కప్పుకోవటం, ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవటం మాత్రమే కాదు. అది అందులో భాగం కావచ్చు. అయితే, నిజమైన సత్కార్యం ఏమిటంటే, స్త్రీ తనకు శోభాయమానమైన మౌలిక సుగుణాలను కలిగి ఉండాలి. ఏ స్త్రీలోనైనా ఆ ప్రాథమిక గుణాలు లేకపోతే ఆ వైవాహిక జీవితం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

స్త్రీ గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు.

ఉత్తమ సామాగ్రి గురించి హదీస్

الدُّنْيَا كُلُّهَا مَتَاعٌ وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا الْمَرْأَةُ الصَّالِحَةُ
[అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాయిద్దునియా అల్ మర్అతుస్సాలిహా]
ఈ ప్రపంచమంతా ఒక తాత్కాలిక వసతి, మరియు ఈ ప్రపంచంలోని ఉత్తమ వసతి సుగుణవతి అయిన స్త్రీ.

ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.

ప్రపంచం మొత్తం కేవలం కొన్ని రోజుల జీవన సామగ్రి. అందులో అన్నిటికంటే మేలైన సామగ్రి సుగుణవతి అయిన స్త్రీ.

الله أكبر
[అల్లాహు అక్బర్]
అల్లాహ్ గొప్పవాడు.

స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క ప్రాముఖ్యత, స్త్రీ యొక్క గొప్పతనం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఈ పూర్తి ప్రపంచం, ఈ ప్రపంచం యొక్క విలువ, ఈ ప్రపంచంలోని అందచందాలు, ఆస్తి, ఐశ్వర్యాలు, హోదాలు, పదవులు, డబ్బు, బంగారం, వెండి, ఆణిముత్యాలు, వజ్రాలు, ఈ పూర్తి ప్రపంచం, ప్రపంచం యొక్క సామగ్రి ఇవన్నీ ఒక పక్క పెట్టి, మరో పక్క సుగుణవతి అయిన స్త్రీ. అంటే ఈ మొత్తం ప్రపంచపు సామగ్రి కంటే సుగుణవతి అయిన స్త్రీ గొప్పది, మేలైనది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

ప్రియ సోదరులారా, ఇటువంటి గొప్ప సుగుణవతులలో ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒకరు. ఆవిడ రదియల్లాహు అన్హా గురించి ఇన్షా అల్లాహ్ మనం ఈ రోజు క్లాసులో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి వంశం మరియు జీవితం

ఆవిడ పేరు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. తండ్రి పేరు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ప్రవక్త గారి ప్రాణమిత్రులు, పురుషులలో అందరికంటే ముందు ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు. ఆ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు కూతురు ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా.

ప్రవక్త గారి వంశం, ఆయిషా రదియల్లాహు అన్హా గారి వంశం ఏడు లేదా ఎనిమిదవ తరములో ఒకటైపోతుంది. ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ముర్రా బిన్ కాబ్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశంలో ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఈ వంశంలో ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ఆ తైమ్ నుంచి అబూబకర్ రదియల్లాహు అన్హు, ఆయిషా రదియల్లాహు అన్హా. అదే ముర్రా బిన్ కాబ్ యొక్క ఇంకో కుమారుడు కిలాబ్ నుంచి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఏడు లేదా ఎనిమిదవ తరములో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వంశం ఒకటైపోతుంది.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి కున్నియత్: ఉమ్మె అబ్దుల్లా

ఇక బిరుదుల కంటే ముందు కున్నియత్ గురించి చెప్తాను ఇన్షా అల్లాహ్. కున్నియత్. కున్నియత్ అంటే అరబ్ దేశాలలో ఉన్న వారికి బాగా తెలుసు ఇది. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. అబూ అబ్దుల్లా, అబ్దుల్లా కి తండ్రి. అబూ ముహమ్మద్, ముహమ్మద్ కి తండ్రి. ఆ విధంగా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కున్నియత్ ఏమిటి? అబుల్ ఖాసిం. మన ప్రవక్త గారి ఒక కుమారుడు ఖాసిం. బాల్యంలోనే మరణించారు. ఆ ఖాసిం పేరుతో అబుల్ ఖాసిం. ఖాసిం కి తండ్రి అని అర్థం.

ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు ఉమ్మె అబ్దుల్లా. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. అబ్దుల్లా కి తల్లి అని. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా కడుపున సంతానం పుట్టలేదు. సంతానం కలగలేదు. మరి సంతానం లేకుండా అబ్దుల్లా కి తల్లి ఎలా అయింది? ఆ కున్నియత్ ఎలా వచ్చింది? అనే విషయం తెలుసుకోవాలంటే ఒక హదీస్ మనం తెలుసుకోవాలి.

ఆ హదీస్ అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ వగైరా హదీస్ గ్రంథాలలో ఉంది. ఈ హదీస్‌ని అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి సహీ అన్నారు. అన్ ఉర్వా, ఉర్వా రదియల్లాహు అన్హు కథనం. ఒకసారి ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇలా విన్నవించుకున్నారు. యా రసూలల్లాహ్, ఓ దైవ ప్రవక్తా, కుల్లు సవాహిబీ లహున్న కునా. నా స్నేహితులందరికీ, స్నేహితురాళ్ళందరికీ కున్నియత్ ఉంది. నా స్నేహితురాలు వారందరూ తమ తమ బిడ్డల తల్లులు అని పిలువబడుతున్నారు. వారందరికీ కున్నియత్ ఉంది. మరి నేను ఎవరి తల్లి అని అనిపించుకోవాలి, పిలిపించుకోవాలి అని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా విన్నవించుకుంటే, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు. ఖాల్, ఫక్తునీ బిబ్నికి అబ్దుల్లాహిబ్ని అజ్జుబైర్ యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. ఓ ఆయిషా, నువ్వు నీ కొడుకు అయిన అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి అని పిలిపించుకో. అంటే నీ అక్క కొడుకు. యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. నీ అక్క కొడుకు. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అక్క కూతురు. అస్మా రదియల్లాహు అన్హా. అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క పెద్ద కూతురు అస్మా రదియల్లాహు అన్హా గురించి మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఘారె సౌర్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ ఉన్నప్పుడు అస్మా రదియల్లాహు అన్హా ఆ ముఖ్యమైన విషయాలు, అన్నం, పానీయాలు తీసుకుని పోయి ఇచ్చేవారు. ఆ అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్. అబ్దుల్లా బిన్ జుబైర్ ముహాజిర్లు మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత ముహాజిర్లలో మొట్టమొదటి సంతానం అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు. ముహాజిర్లు హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనాకు వచ్చాక ఆ ముహాజిర్లలో మొదటిగా ఎవరు పుట్టారంటే వారు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు.

ఆ విధంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఓ ఆయిషా నువ్వు నీ అక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ కి తల్లి అని పిలిపించుకో అని సమాధానం ఇస్తే, ఫకానత్ తుద్ఈ బి ఉమ్మి అబ్దిల్లా హత్తా మాతత్. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా పరమపదించే వరకు ఉమ్మె అబ్దుల్లా అనే కున్నియత్‌తో పిలువబడేవారు. ఈ హదీస్ అనేక హదీస్ గ్రంథాలలో ఉంది. ఉదాహరణకు అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ, అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్‌ని సహీ అన్నారు. అంటే ఈ హదీస్ పరంగా మొదటి విషయం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారి కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. రెండో విషయం, సంతానం లేకపోయినా కున్నియత్ పెట్టుకోవచ్చు అని అర్థమయింది. ఇది కున్నియత్ గురించి.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి బిరుదులు (అల్ఖాబ్)

ఇక అల్ఖాబ్, బిరుదులు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అనేక బిరుదులు ఉన్నాయి. మనం కూడా సమాజంలో చూస్తున్నాము. అనేక మందిని వారి ప్రత్యేక సేవల వల్ల కొన్ని బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రభుత్వం కూడా కొంతమందిని బిరుదు కేటాయిస్తుంది. ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులు అనేకం ఉన్నాయి. ఆ అనేక బిరుదులలో కొన్ని బిరుదులు మనం తెలుసుకుందాం.

ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి)

అన్నిటికంటే గొప్పది ఆ బిరుదు ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. విశ్వాసుల తల్లి. విశ్వాసుల మాతృమూర్తి. ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. ఈ బిరుదు స్వయంగా సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ బిరుదు. ఈ ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణిలందరికీ ఈ బిరుదు అల్లాహ్ ఇచ్చాడు. ప్రవక్త గారి భార్యలందరికీ ఈ బిరుదు వర్తిస్తుంది. ఇది అల్లాహ్ ఇచ్చిన బిరుదు. సూరతుల్ అహ్‌జాబ్ ఆయత్ నెంబర్ ఆరులో ఇలా ఉంటుంది.

النَّبِيُّ أَوْلَى بِالْمُؤْمِنِينَ مِنْ أَنْفُسِهِمْ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ
[అన్నబియ్యు ఔలా బిల్ ముఅమినీన మిన్ అన్ఫుసిహిమ్ వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్]
ప్రవక్త విశ్వాసులకు వారి ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియమైనవారు, మరియు ఆయన భార్యలు వారి తల్లులు.

దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. దైవ ప్రవక్తకు విశ్వాసులపై, మూమినీన్‌లపై వారి ఆ విశ్వాసుల, ఆ మూమినీన్‌ల ఆత్మ కన్నా, ప్రాణం కన్నా ఎక్కువ హక్కు ఉంది. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ఆయన భార్యలు, అంటే ప్రవక్త గారి సతీమణులు విశ్వాసుల కొరకు తల్లులు. ప్రతి విశ్వాసికి ప్రవక్త గారి ఏ భార్య అయినా సరే తల్లి. ఉమ్ముల్ మూమినీన్. ఈ బిరుదు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన బిరుదు సూరా అహ్‌జాబ్, సూరా నెంబర్ 33, ఆయత్ నెంబర్ ఆరు. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ప్రవక్త గారి భార్యలు విశ్వాసులకు తల్లులు. ఇది మొదటి బిరుదు, ఉమ్ముల్ మూమినీన్.

హబీబా (ప్రియమైనది)

ఇక రెండో బిరుదు హబీబా. ఇది హబీబ్ దీనికి స్త్రీ వచనం హబీబా. హబీబ్ మేల్ అయితే హబీబా ఫీమేల్. హబీబ్ పురుషులకి వర్తిస్తుంది, హబీబా స్త్రీలకు వర్తిస్తుంది. దాని అర్థం ఏమిటి? ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. హబీబా అంటే ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో ఒక బిరుదు హబీబా. ప్రియమైన వారు. ఆవిడ పట్ల మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ వల్ల ఈ బిరుదు ఇవ్వబడింది.

బుఖారీ మరియు ముస్లిం సంయుక్తంగా ఒక హదీస్ ఉంది. ముత్తఫకున్ అలైహి హదీస్. ఫకద్ సుఇల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడగడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి? ఒక్క సహాబీ అడిగారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక సహాబీ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి? అయ్యున్నాసి అహబ్బు ఇలైక్? ఓ దైవ ప్రవక్తా, అందరికంటే ప్రియమైన వారు ఎవరు? మీకు, మీ దృష్టిలో, మీ వద్ద అందరికంటే ప్రియమైన వారు, ఇష్టమైన వారు ఎవరు అని ఆ సహాబీ ప్రవక్త గారిని అడిగితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటి? ఖాల్, ఆయిషా. నాకు అందరికంటే ప్రియమైన వారు ఆయిషా అని సమాధానం ఇచ్చారు రదియల్లాహు అన్హా.

ఫకుల్తు, మినర్రిజాల్? ఆ సహాబీ మళ్ళీ అడిగాడు. ఓ దైవ ప్రవక్తా, పురుషులలో ఎవరు? ఖాల్, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. అబూహా. ఆవిడ తండ్రి అన్నారు. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా తండ్రి అబూబకర్ గారు. స్త్రీలలో నాకు అందరికంటే ప్రియమైన వారు, హబీబా ఆయిషా అయితే పురుషుల్లో అబూబకర్ అన్నారు. కుల్తు, సుమ్మ మన్? ఆ సహాబీ మూడోసారి అడిగారు. ఓ దైవ ప్రవక్తా, ఆ తర్వాత ఎవరు? ఖాల్, ఉమరుబ్నుల్ ఖత్తాబ్. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ అని సెలవిచ్చారు. రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. ఈ హదీస్ ముత్తఫకున్ అలైహి. ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని అందరికంటే ప్రియమైన వారు అన్నారు గనక ఆ హబీబా అనే బిరుదు ఆమెకు ఉంది.

ఇంకా అహ్మద్ మరియు హాకింలో ఒక ఉల్లేఖనం ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు కాలములోని ఇరాఖ్ యుద్ధం గురించి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలములో ఇరాఖ్ విజయంలో గనీమత్ సొమ్ము వస్తుంది. ఇరాఖ్ విజయములో ఖిలాఫతే ఉమర్ బిన్ ఖత్తాబ్. ఇరాఖ్ విజయములో చాలా గనీమత్ సొమ్ము వస్తుంది, ధనం వస్తుంది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం కూడా ఉన్నింది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం ఉన్నింది. ఆ ఆభరణం చూసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి అడిగారు. ఈ ఆభరణం యొక్క విలువ మీకు తెలుసా అని. సహాబాలందరూ మౌనం వహించారు. చాలా ఖరీదైన, విలువైన ఆభరణం అది. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి మీరందరూ అనుమతిస్తే నేను ఈ విలువైన ఆభరణాన్ని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాకి ఇస్తాను. ఆవిడ వద్దకు పంపిస్తాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాల అనుమతి తీసుకుని ఆ విలువైన ఆభరణం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వద్దకి పంపిస్తారు. ఈ ఉల్లేఖనంలో చివర్లో నేను ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఈ ఆభరణం ఎందుకు ఇస్తున్నాను అని కారణం చెప్పారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. కారణం ఏమిటంటే ఎందుకంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అంటున్నారు, నేను ఈ ఆభరణం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఎందుకు ఇస్తున్నాను? కారణం చెప్తున్నారు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల అంటే ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు. అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు కాబట్టి నేను ప్రవక్త గారి ఆ ప్రేమ మూలంగా ఈ విలువైన ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి ఇస్తున్నాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈ ఉల్లేఖనంలో మన కోసం అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటి గుణపాఠం ఏమిటి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ సహాబాలని అసలు అనుమతి కోరే అవసరమే లేదు. ఖలీఫా ఆయన. అయినా కూడా ఆయన యొక్క దైవభీతి, న్యాయం, నీతి, నిజాయితీ ఆ విధంగా ఉన్నింది. ఆయన అనుమతి కోరారు. రెండవది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తన కూతురు హఫ్సాకి అయినా ఇవ్వచ్చు కదా ఈ ఆభరణం. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా ఉమ్ముల్ మూమినీన్ కదా. ఉమ్ముల్ మూమినీన్ ఇంకా కూతురు. హఫ్సా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుకి కూతురు అవుతుంది. ఇంకా ప్రవక్త గారి భార్య గనక ఉమ్ముల్ మూమినీన్ కూడా. ఆ ఉద్దేశంతో నా కూతురు ఉమ్ముల్ మూమినీన్ కదా అని ఉద్దేశంతో ఇస్తే తప్పు ఏముంది? ఇవ్వచ్చు. కానీ నా కూతురు కూడా ఉమ్ముల్ మూమినీన్, ఆయిషా కూడా ఉమ్ముల్ మూమినీన్, ఇంకా ఇతర ఉమ్మహాతుల్ మూమినీన్ కూడా ఉన్నారు. అయినప్పటికిని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే ఎందుకు ఇచ్చారంటే అదే కారణం. ఎందుకంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉన్నవారు. మాషా అల్లాహ్, చూడండి సహాబాలు ఏ విధంగా ప్రవక్త గారి హదీసులను, ప్రవక్త గారి ప్రేమని, ప్రవక్త గారి ప్రసన్నతను, ప్రవక్త గారి విధేయతను ఏ కోణములో ఆలోచన చేసేవారు? ఏ విధంగా ప్రవక్త గారిని ప్రసన్నత పొందపరిచాలి? అలాగే ఆయన విధేయత ఎలా చూపాలి? ప్రవక్త గారికి ఏ విషయంలో ప్రేమ ఉన్నింది? ఎవరితో ప్రేమ ఉన్నింది? ఆ విధంగా సహాబాలు గమనించేవారు, ఆలోచించేవారు.

సిద్దీఖా, తయ్యిబా, ముబర్రఆ

అభిమాన సోదరులారా, అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో సిద్దీఖా అని ఒక బిరుదు. ఎల్లప్పుడూ సత్యం పలికేవారు. తండ్రి సిద్దీఖ్, కూతురు సిద్దీఖా. అలాగే తయ్యిబా ఒక బిరుదు ఉంది. ముబర్రఆ ఒక బిరుదు ఉంది. తయ్యిబా అంటే పవిత్రురాలు. ముబర్రఆ అంటే దోషాల నుంచి ఆ పాపం ఏ అభాండం వేయబడిందో, అపనింద మోపబడిందో దాని నుంచి బరాఅత్. ముబర్రఆ. ఏ అభాండం మీరు వేశారో ఆ విషయంలో ఆవిడ పవిత్రురాలు అని అర్థం. ఇది స్వయంగా ఖురాన్‌లో ఉంది ఇది. తయ్యిబా, ముబర్రఆ అనేది.

హుమైరా

ఇంకో బిరుదు ఉంది, హుమైరా. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు హుమైరా. హుమైరా అంటే అరుణిమ లేక ఎరుపు రంగుని హుమైరా అంటారు అరబీలో. అరుణిమ లేక ఎరుపు రంగు. అంటే తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటం. తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటాన్ని అరబీలో హుమైరా అంటారు. తెలుపు ఎరుపు రంగు అన్నమాట. ఇటువంటి రంగు హిజాజ్‌లో బహు తక్కువ అని ఇమాం జహబీ, ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలాలో తెలియజేశారు. ఈ తెలుపు రంగులో ఎరుపు రంగు, ఇటువంటి రంగు హిజాజ్‌లో చాలా తక్కువ, అరుదు అని ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలా, భాగం ఏడు, పేజ్ నెంబర్ 168లో ఈ విషయం తెలియజేశారు.

ఈ హదీస్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని యా హుమైరా అనే పదంతో సంబోధించిన, సంభాషించిన హదీస్ నసాయీలో ఉంది. ఇమాం నసాయీ రహమతుల్లాహి అలైహి సుననుల్ కుబ్రాలో ఈ హదీస్ ని సున వచ్చారు. ఈ హదీస్ ఈ విధంగా ఉంటుంది. దఖలల్ హబశతు యల్అబూన్. హబశాకి చెందిన వారు, ఇథియోపియన్‌లు ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి మస్జిద్ నబవీలో ప్రవేశించారు. ఆ ప్రత్యేకమైన ఆట వారు ప్రదర్శించేటప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఇలా అన్నారు. ఫఖాల లియన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా స్వయంగా అంటున్నారు, దైవ ప్రవక్త నాతో అన్నారు. ఏమన్నారు?

يَا حُمَيْرَاءُ أَتُحِبِّينَ أَنْ تَنْظُرِي إِلَيْهِمْ
[యా హుమైరా అతుహిబ్బీన అన్ తన్జురీ ఇలైహిమ్]
ఓ హుమైరా, నువ్వు వారిని చూడటానికి ఇష్టపడుతున్నావా?

ఓ హుమైరా, నువ్వు ఆ హబశా చెందిన వారి ఆ ప్రత్యేకమైన ఆటను నువ్వు చూడాలనుకుంటున్నావా? అతుహిబ్బూన, చూడటం ఇష్టపడతావా? అంతన్జురీ ఇలైహిమ్. ఆ ఆట ప్రదర్శన. ఫకుల్తు నఅమ్. నేను అవునన్నాను అని ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా తెలియజేశారు. అంటే ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని హుమైరా అనే బిరుదుతో పిలిచారు.

అభిమాన సోదరులారా, ఇక్కడ హదీస్ పరంగా ఒక ముఖ్యమైన గమనిక ఉంది. హదీస్ పరంగా, ఉసూలే హదీస్ పరంగా. ఆ గమనిక ఏమిటి? ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఒక పుస్తకం ఉంది, దాని పేరు అల్ ఇజాబా. ఆ పుస్తకంలో ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి యొక్క కౌల్ ఆయన నఖల్ చేశారు. ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఇమాం మిజ్జీ రహమతుల్లాహి యొక్క కౌల్ ని నఖల్ చేశారు. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఈయన కూడా పెద్ద పండితులు, ముహద్దిస్. అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఏం చెప్తున్నారంటే, ఏ హదీస్‌లో యా హుమైరా అనే పదం ఉంటుందో ఆ హదీస్ జయీఫ్ లేదా మౌజూ అయి ఉంటుంది అన్నారు. నసాయీలోని ఈ ఒక్క హదీస్ తప్ప. ఇప్పుడు నేను చెప్పిన హదీస్ నసాయీలో ఉంది. దఖలల్ హబశతు యల్అబూన హబశాకి చెందిన వారు మస్జిద్ నబవీలో ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి వచ్చారు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని ఉద్దేశించి యా హుమైరా అంటే ఓ ఆయిషా నువ్వు ఈ ప్రదర్శన చూస్తావా, నీకు ఇష్టంగా ఉందా అని అడిగారు అనే ఈ హదీస్ తప్ప, ఈ హదీస్‌లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని యా హుమైరా అన్నారు. నసాయీలోని ఈ హదీస్ తప్ప మిగతా హదీసులన్నీ ఏ హదీసులో యా హుమైరా అనే పదం ఉంటుందో అవి జయీఫ్ లేక మౌజూ అయి ఉంటుందని ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి తెలియజేశారు. ఈ విషయం మనం ఇమాం జరకశీది అల్ ఇజాబాలో చూడగలం.

మువఫ్ఫకా

అభిమాన సోదరులారా, ఇక అనేక బిరుదులు ఉన్నాయి. ఒక్క బిరుదు చెప్పి నేను ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిస్తాను. వచ్చే వారం ఇన్షా అల్లాహ్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి వేరే విషయాలు తెలుసుకుందాం. ఆ బిరుదు ఏమిటంటే మువఫ్ఫకా. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు మువఫ్ఫకా. మువఫ్ఫకా అంటే సద్బుద్ధి ప్రసాదింపబడిన వారు. మనం ఉర్దూ భాషలో దుఆ చేస్తాం. ఓ అల్లాహ్, అయ్ అల్లాహ్, ముఝే నేక్ తౌఫీఖ్ దే. నేక్ తౌఫీఖ్ దే. తౌఫీఖ్. ఈ తౌఫీఖ్ ఎవరికి ఇవ్వబడుతుందో వారు మువఫ్ఫఖ్ అవుతారు. పురుషుడు అయితే పురుషుడు అయితే మువఫ్ఫఖ్, స్త్రీ అయితే మువఫ్ఫకా.

ఒక హదీస్ ఉంది. తిర్మిజీ, అహ్మద్ మరియు తబరానీలో. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అంటున్నారు, సమీతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా నేను విన్నానని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ చెప్తున్నారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. ఎవరికి నా ఉమ్మత్‌లోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం ప్రాజ్ఞ వయసు బాలిగ్ అవ్వకముందే మరణించారు, అటువంటి తల్లిదండ్రులు స్వర్గానికి పోతారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. నా అనుచర సమాజములోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం, ఫరతున్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తికి ఫరత్ అంటారు. ఫరతాన్ ముందు వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు. అంటే ప్రాజ్ఞ వయసు చేరకముందే, బాలిగ్ అవ్వకముందే, బాల్యములోనే ఎవరి ఇద్దరి సంతానం మరణిస్తారో అటువంటి వారు స్వర్గములో పోతారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తే, ఆ సందర్భంలో ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒక ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే, వమన్ కాన లహు ఫరద్? ఓ దైవ ప్రవక్తా, మీ మాట పరంగా ఎవరి సంతానంలోని ఇద్దరు పిల్లలు బాల్యంలో మరణిస్తే అని చెప్పారు కదా మీరు, మరి ఎవరి తల్లిదండ్రుల ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో మరణిస్తే? అని ప్రశ్న. దానికి ప్రవక్త గారు, వమన్ కాన లహు ఫరద్ యా మువఫ్ఫకా. ఓ తౌఫీఖ్ ఇవ్వబడిన ఆవిడ, ఒక సంతానమైనా బాల్యంలో మరణిస్తే అటువంటి అమ్మ నాన్న కూడా, అటువంటి వారి అమ్మ నాన్న కూడా స్వర్గంలో పోతారు అని ప్రవక్త గారు సెలవిచ్చారు. ఇంకో ప్రశ్న అడిగారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. ఫమన్ లం యకున్ లహు ఫరదున్ మిన్ ఉమ్మతిక్? ఓ దైవ ప్రవక్తా, మీ ఉమ్మత్‌లోని కొంతమంది ఉంటారు, వారి సంతానం బాల్యంలో చనిపోలేదు, ఒక సంతానం కూడా, ఒక బిడ్డ కూడా బాల్యంలో చనిపోలేదు. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? చూడండి ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఉమ్మత్ గురించి ఎంత ఆలోచన చేసేవారు మాషా అల్లాహ్. మన గురించి ఎంత ఆలోచన చేసేవారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి మాట ఏమిటి? ఇద్దరు సంతానం, ఇద్దరు పిల్లలు బాల్యంలో చనిపోతే వారి అమ్మ నాన్న స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో చనిపోతే? వారు కూడా స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా మూడో ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, చాలా మంది ఉంటారు, వారికి సంతానం ఉండదు లేకపోతే సంతానం అయినా కూడా బాల్యంలో చనిపోరు. మరి వాటి పరిస్థితి ఏమిటి? దానికి సమాధానం ప్రవక్త గారు ఇచ్చారు. ఫఅన ఫరతు ఉమ్మతీ లం యుసాబూ బి మిస్లీ. అటువంటి వారి కోసం నేను ముందు వెళ్ళిపోయి ఉంటాను. ముందు వెళ్ళిపోయిన వ్యక్తిని నేనవుతాను అటువంటి వారి కోసం. ఎందుకంటే నాలాంటి బాధలు ఎవరికీ రాలేదు. అంటే ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఎవరి సంతానం బాల్యంలో చనిపోతే వారు ముందుగా వెళ్ళిపోయి వారి ఆతిథ్యం కోసం సిద్ధం ఉంచి ఉంచుతారు. అందుకు నా ఉమ్మత్‌కి నేను ఫరత్ అవుతాను. నేను ముందు వెళ్ళిపోయి నా ఉమ్మత్ కోసం నేను సిద్ధం చేసి ఉంచుతాను ఆ ఆతిథ్యం అని దానికి అర్థం.

అభిమాన సోదరులారా, కాకపోతే ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారిని మువఫ్ఫకా అనే బిరుదుతో సంభాషించారు. కాకపోతే అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని జయీఫ్ అన్నారు. ఇమాం అహ్మద్ షాకిర్ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని సహీ అన్నారు. సారాంశం ఏమిటంటే ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారికి అనేక బిరుదులు ఉన్నాయి. ఉమ్ముల్ మూమినీన్ అల్లాహ్ ఇచ్చిన బిరుదు. హబీబా ఆవిడ పట్ల ప్రవక్త గారి ప్రేమ వల్ల హబీబా అనే బిరుదు. ఆమె పవిత్రత, విశ్వాసం, తఖ్వా, దైవభీతి వలన ఇంకా అల్లాహ్ ఆమె గురించి బరాఅత్ ఆయత్ అవతరింపజేశాడు దాని మూలంగా తయ్యిబా, ముబర్రఆ అనే బిరుదులు. అలాగే హుమైరా అనే బిరుదు, అలాగే మువఫ్ఫకా అనే బిరుదు. అభిమాన సోదరులారా, ఇంకా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి ఇన్షా అల్లాహ్ వచ్చే క్లాసులలో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఉమ్మహాతుల్ మూమినీన్‌ల జీవితాల చరిత్రను చదివి అర్థం చేసుకుని ఆ చరిత్రను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ చరిత్రను మనం కేవలం చరిత్ర మాదిరిగానే కాకుండా వారి జీవితంలోని మన కోసం ఆదర్శం ఏమిటి? ఈ విషయాలు మనము గ్రహించాలి. ఇవన్నీ ఇన్షా అల్లాహ్ మనము వచ్చే క్లాసులలో ఇంకా వివరంగా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా జీవితం చాలా వివరంగా ఉంటుంది. అవన్నీ వివరాలు ఇన్షా అల్లాహ్ మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మరియు మా చివరి ప్రార్థన, సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
[వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/