353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.
” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా! మీరు కూడానా?” అని అడిగారు. “ఔను, నేను కూడా కర్మల బలంతో మోక్షం పొందలేను. మోక్షం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది, దేవుడు నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలి. కనుక మీరు సరయిన రుజుమార్గంలో నడవండి (ముక్తి విషయాన్ని దైవానుగ్రహం పై వదలి పెట్టండి)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
1. అందరికంటే ఎక్కువ దేవుడ్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అభిమానించడం,
2. ఎవరిని అభిమానించినా కేవలం దైవప్రసన్నత కోసం అభిమానించడం,
3. (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం.
(పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయటకు తీయండి” అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో (చాలామంది) మానవులు నరకం నుండి బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షనది లేక ‘జీవనది’ లో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?