2.19 విధివ్రాత ప్రకరణం – మహాప్రవక్త ﷺ మహితోక్తులు

బిస్మిల్లాహ్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan)

1695 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ: حَدَّثَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَهُوَ الصَّادِق الْمَصْدُوقُ، قَالَ: إِنَّ أَحَدَكُمْ يُجْمعُ خَلْقُهُ فِي بَطْنِ أُمِّهِ أَرْبَعِينَ يَوْمًا ثُمَّ يَكُونُ عَلَقَةً مِثْلَ ذَلِكَ ثُمَّ يَكُونُ مُضْغَةً مِثْلَ ذَلِكَ ثُمَّ يَبْعَثُ اللهُ مَلَكًا فَيُؤْمَرُ بِأَرْبَعِ كَلِمَاتٍ، [ص:208] وَيُقَالُ لَهُ: اكْتُبْ عَمَلَهُ وَرِزْقَهُ وَأَجَلَهُ وَشَقِيٌّ أَوْ سَعِيدٌ ثُمَّ يُنْفَخُ فِيهِ الرُّوحُ فَإِنَّ الرَّجُلَ مِنْكُمْ لَيَعْمَلُ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَ الْجَنَّةَ إِلاَّ ذِرَاعٌ، فَيَسْبِقُ عَلَيْهِ كَتَابُهُ، فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ وَيَعْمَلُ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَ النَّارِ إِلاَّ ذِرَاعٌ، فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ، فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ

أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 6 باب ذكر الملائكة

1695. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సత్యమూర్తి. ఇది తిరుగులేని సత్యం. ఆయన ఇలా ప్రవచించారు :

“మిలో ప్రతి వ్యక్తి మాతృ గర్భంలో ఈ విధంగా రూపొందుతాడు : మొదట నలభై రోజుల దాకా (వీర్యబిందువు రూపంలో) ఉంటాడు. తరువాత అన్ని రోజులే ద్రవరక్తం రూపంలో ఉంటాడు. ఆ తరువాత అన్నే రోజులు మాంసపు ముద్ద (పిండం) రూపంలో ఉంటాడు. ఆ తరువాత అల్లాహ్ ఒక దైవదూతను నాలుగు ఆజ్ఞలు ఇచ్చి పంపుతాడు – అతని కర్మలు, ఉపాధి, ఆయుషును గురించి వ్రాయమని ఆదేశిస్తాడు. అతను దౌర్భాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా అనే విషయాన్ని కూడా వ్రాయమని ఆదేశిస్తాడు. ఆ తరువాత అతనిలో ప్రాణం పోయబడుతుంది. పోతే మీలో ఒక వ్యక్తి (సత్) కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చివరికి (ఆ సత్కర్మల కారణంగా) అతనికి, స్వర్గానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. ఆ తరువాత అతని జాతకం మారిపోయి అతను నరకవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్పర్యవసానంగా అతను నరకం పాలవుతాడు). అదే విధంగా మరొకడు (దుష్) కర్మలు చేస్తూ ఉంటాడు. అలా చివరికి (ఆ దుష్కర్మల కారణంగా) అతనికి, నరకానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. అంతలో అతని జాతకం మారిపోయి అతను స్వర్గవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్ఫలితంగా అతను స్వర్గానికి వెళ్తాడు).”

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్క్, 6వ అధ్యాయం – జిక్రిల్ మలాయికా)

1696 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ اللهَ عَزَّ وَجَلَّ وَكَّلَ بِالرَّحِمِ مَلَكًا، يَقُولُ: يَا رَبِّ نُطْفَةٌ يا رَبِّ عَلَقَةٌ يَا رَبِّ مُضْغَةٌ فَإِذَا أَرَادَ أَنْ يَقْضِيَ خَلْقَهُ، قَالَ: أَذَكَرٌ أَمْ أُنْثى شَقِيٌّ أَمْ سَعِيدٌ فَمَا الرِّزْقُ وَالأَجَلُ فَيُكْتَبُ فِي بَطْنِ أُمِّهِ

أخرجه البخاري في: 6 كتاب الحيض: 17 باب مخلقة وغير مخلقة

1696. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :-

“అల్లాహ్ మాతృగర్భం దగ్గర ఒక దైవదూతను నియమిస్తాడు. ఆ దైవదూత “ప్రభూ! ఇప్పుడు వీర్య బిందువు ….. ప్రభూ! ఇప్పుడు ద్రవరక్తం ….. ప్రభూ! ఇప్పుడు మాంసపు ముద్ద (పిండం)” అని అంటాడు. ఆ తరువాత దేవుడు ఆ పిండాన్ని (మానవుడిగా) సృష్టించడానికి పూనుకుంటాడు. అప్పుడు ఆ దైవదూత “ఇతను బాలుడా, లేక బాలికా? ఇతను దౌర్బాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా? ఇతని ఉపాధి ఎంత? ఇతని ఆయుషు ఎంత?” అని అడుగుతాడు. ఈ విషయాలన్నీ మాతృగర్భంలో ఉండగానే వ్రాయబడతాయి.

(సహీహ్ బుఖారీ:- 6వ ప్రకరణం – అల్ హైజ్, 17వ అధ్యాయం – ముఖల్ల ఖతిన్ వ గైరి ముఖల్లఖతి)

1697 – حديث عَلِيٍّ رضي الله عنه، قَالَ: كُنَّا فِي جَنَازَةٍ، فِي بَقِيعِ الْغَرْقَدِ فَأَتَانَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَعَدَ وَقَعَدْنَا حَوْلَهُ، وَمَعَهُ مِخْصَرَةٌ، فَنَكَّسَ، فَجَعَلَ يَنْكُتُ بِمِخْصَرَتِهِ ثُمَّ قَالَ: مَا مِنْكُمْ مِنْ أَحَدٍ، مَا مِنْ نَفْسٍ مَنْفُوسَةٍ إِلاَّ كُتِبَ مَكَانُهَا مِنَ الْجَنَّةِ وَالنَّارِ، وَإِلاَّ قَدْ كُتِبَ شَقِيَّةً أَوْ سَعِيدَةً فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَفَلا نَتَّكِلُ عَلَى كِتَابِنَا، وَنَدَعُ الْعَمَلَ فَمَنْ كَانَ مِنَّا مِنْ أَهْلِ السَّعَادَةِ فَسَيَصِيرُ إِلَى عَمَلِ أَهْلِ السَّعَادَةِ وَأَمَّا مَنْ كَانَ مِنَّا مَنْ أَهْلِ الشَّقَاوَةِ فَسَيَصِيرُ إِلَى عَمَلِ أَهْلِ الشَّقَاوَةِ قَالَ: أَمَّا أَهْلُ السَّعَادَةِ فَيُيَسِّرُونَ لَعَمَلِ السَّعَادَةِ، وَأَمَّا أَهْلُ الشَّقَاوَةِ فَبُيَسِّرُونَ لِعَمَلِ الشَّقَاوَةِ [ص:210] ثُمَّ قَرَأَ (فَأَمَّا مَنْ أَعْطَى وَاتَّقَى) الآية

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 83 باب موعظة المحدث عند القبر وقعود أصحابه حوله

1697. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం :- మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశాన వాటికకు వెళ్ళాము. . అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్బాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై వుంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్బాగ్యుడయితే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్బుద్ధి పుడ్తుంది” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖురాన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవం పట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము” (92 : 5-10).

(సహీహ్ బుఖారీ :- 23వ ప్రకరణం – జనాయిజ్, 83వ అధ్యాయం – మౌఇజతిల్ ముహద్దిసి ఇన్దల్ ఖబ్ర్ వఖువూది అహాబిహీ హౌలహు)

1698 – حديث عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَيُعْرَفُ أَهْلُ الْجَنَّةِ مِنْ أَهْلِ النَّارِ قَالَ: نَعَمْ قَالَ: فَلِمَ يَعْمَلُ الْعَامِلُونَ قَالَ: كُلٌّ يَعْمَلُ لِمَا خُلِقَ لَهُ، أَوْ لِمَا يُسِّرَ لَهُ

أخرجه البخاري في: 82 كتاب القدر: 2 باب جف القلم على علم الله

1698. హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక వ్యక్తి లేచి “దైవప్రవక్తా! స్వర్గవాసులెవరో నరకవాసులెవరో (ముందుగానే) గుర్తించబడ్డారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లం) ఔనన్నారు. “అలాంటప్పుడు మానవులు కర్మలు ఆచరించడం దేనికి?” అని ప్రశ్నించాడా వ్యక్తి మళ్ళీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ప్రతి మనిషీ తాను దేని కొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు” అని అన్నారు. లేక “ఎలాంటి బుద్ధి ఇవ్వబడిందో అలాంటి పనులే చేస్తాడు” అని అన్నారు.*

(సహీహ్ బుఖారీ :- 82వ ప్రకరణం – ఖద్ర్ , 2వ అధ్యాయం – జప్ఫల్ ఖలము అలా ఇల్మిల్లాహ్)

*ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుంటే అతని అదృష్టంలో స్వర్గం రాసి ఉందని భావించవచ్చు. అలాగే మరొక వ్యక్తి చెడ్డ పనులు చేస్తుంటే అతని అదృష్టంలో నరకం రాసి ఉందని అనుకోవచ్చు. ఈ హదీసు భావం ఇదే. అయితే అదృష్టం గురించిన జ్ఞానం మనకు లేదు గనక నిజంగా ఫలానా వ్యక్తి స్వర్గానికి పోతాడని, ఫలానా వ్యక్తి నరకంలో పడిపోతాడని ఖచ్చితంగా చెప్పలేము. చెప్పకూడదు కూడా. మనం ఏం చేస్తున్నామో, ఏం జరుగుతున్నదో అంతా విధి నిర్ణయమే. అయితే విధి నిర్ణయం, విధి వ్రాత ఏమిటో మనకు తెలియదు గనక మనం చేసే పనులకు మనమే బాధ్యులవుతాము.దాని ప్రకారమే మనకు పరలోక ప్రతిఫలం లభిస్తుంది. అంతేగాని, మనం కావాలని తప్పుడు పనులు చేస్తూ విధి వ్రాత అంటూ వాటి బాధ్యతను దేవునిపై నెట్టి మనం మన పాపాల దుష్పర్యవసానం నుండి బయట పడగలమని భ్రమించకూడదు. (అనువాదకుడు)

1699 – حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ الْجَنَّةِ، فِيمَا يَبْدُو لِلنَّاسِ، وَهُوَ مِنْ أَهْلِ النَّارِ وَإِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ النَّارِ، فِيمَا يَبْدُو لِلنَّاسِ، وَهُوَ مِنْ أَهْلِ الْجَنَّةِ

أخرجه البخاري في: 56 كتاب الجهاد: 77 باب لا يقول فلان شهيد

1699. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఒక వ్యక్తి ప్రజల దృష్టిలో స్వర్గవాసులు చేసేటటువంటి పనులే చేస్తాడు. కాని అతను నరకవాసి అవుతాడు. అలాగే మరొకతను జనం దృష్టిలో నరకవాసులు చేసేటటువంటి పనులు చేస్తాడు. కాని అతను స్వర్గనివాసి అవుతాడు.”

(సహీహ్ బుఖారీ:- 56వ ప్రకరణం – జిహాద్, 77వ అధ్యాయం – లా యుఖాలు ఫులానన్ షహీద్)

1700 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: احْتَجَّ آدَمُ وَمُوسى فَقَالَ لَهُ مُوسى: يَا آدَمُ أَنْتَ أَبُونَا، خَيَّبْتَنَا، وَأَخْرَجْتَنَا مِنَ الْجَنَّةِ قَالَ لَهُ آدَمُ: يَا مُوسى اصْطَفَاكَ اللهُ بِكَلاَمِهِ، وَخَطَّ لَكَ بِيَدِهِ، أَتَلُومُنِي عَلَى أَمْرٍ قَدَّرَ اللهُ عَلَيَّ قَبْلَ أَنْ يَخْلُقَنِي بِأَرْبَعِينَ سَنَةً فَحَجَّ آدَمُ مُوسى ثَلاَثًا

أخرجه البخاري في: 82 كتاب القدر: 11 باب تحاج آدم وموسى عند الله

1700. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు : (ఓసారి) హజ్రత్ ఆదం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మాట్లాడుతూ “ఆదం గారూ! మీరు మా పితామహులు. కాని వారు మమ్మల్ని దౌర్భాగ్యులుగా చేశారు. మమ్మల్ని స్వర్గం నుంచి తీసివేయించారు” అని ఆరోపించారు. దానికి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) సమాధానమిస్తూ “మూసా! అల్లాహ్ నీకు తనతో ప్రత్యక్ష సంభాషణా భాగ్యం కలిగించాడు. పైగా ఆయన నీకు తన స్వహస్తాలతో (తౌరాత్ పలకలను) రాసిచ్చాడు. (అంతటి హోదా పొంది కూడా) నీవు, నా పుట్టుకకు నలభై ఏళ్ళు పూర్వమే నా అదృష్టంలో రాసిన విషయాల్ని గురించి నన్ను నిందిస్తున్నావా?” అని అన్నారు..ఈ మాట ఆధారంగా హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) హజ్రత్ మూసా (అలైహిస్సలాం) పై సంవాదనలో ఆధిక్యత పొందారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (ఈ మాట దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడుసార్లు అన్నారు).*

(సహీహ్ బుఖారీ:- 82వ ప్రకరణం – ఖద్ర్ , 11వ అధ్యాయం – తహాజ్ఞ ఆదము వ మూసా ఇందల్లాహ్)

* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు: మనలో కూడా ఎవరైనా పాపం చేసినవాడు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)లా సమాధానమిచ్చి నింద, శిక్షల నుండి విముక్తి పొందగలడా? అన్న ప్రశ్న ఉదయిస్తుందిక్కడ. దానికి సమాధానం ఇది – లేదు. విముక్తి పొందలేడు. ఎందుకంటే అంతనింకా ఇహలోకంలోనే ఉన్నాడు. ఇహలోకం ఆచరణా స్థలం. ఇక్కడ ఆచరణకు ఎగనామం పెట్టి మాటల గారడితో మోక్షం పొందడం కుదరదు. హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) క్రియా ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత ఇలా సమాధానమిచ్చారు. అదీగాక అల్లాహ్ ఆయన తప్పును క్షమించాడు. అందువల్ల ఆయన పై ఇక ఎలాంటి నిందను మోపలేము. (అనువాదకుడు)

1701 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ كَتَبَ عَلَى ابْنِ آدَمَ حَظَّهُ مِنَ الزِّنَا أَدْرَكَ ذَلِكَ، لاَ مَحَالَةَ فَزِنَا الْعَيْنِ النَّظَرُ، وَزِنَا اللِّسَانِ الْمَنْطِقُ وَالنَّفْسُ تَمَنَّى وَتَشْتَهِي وَالْفَرْجُ يُصَدِّقُ ذَلِكَ وَيُكَذِّبُهُ

أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 12 باب زنا الجوارح دون الفرج

1701. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు :-

అల్లాహ్ ఆదం పుత్రుడి అదృష్టంలో వ్యభిచార భాగం (కొద్దీ గొప్పో) లిఖించాడు. అది అతనికి ఎలాగూ లభిస్తుంది. అందుచేత (పర స్త్రీని కామదృష్టితో చూడటం) కళ్ళ వ్యభిచారం, (పర స్త్రీతో అశ్లీల మాటలు పలకడం) నోటి వ్యభిచారం. మానవుని మనస్సు (అశ్లీల చేష్టలను) కోరుతుంది. (ఇది భావ పరమైన వ్యభిచారం). అయితే అతని మర్మాంగం ఆ కోరికకు కార్యరూపం ఇవ్వటమో లేక ధిక్కరించటమో చేస్తుంది.”

(సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 12వ అధ్యాయం – జినల్ జవారి హిదూనల్ ఫర్జ్)

1702 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا مِنْ مَوْلُودٍ إِلاَّ يُولَدُ عَلَى الْفِطْرَةِ فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ كَمَا تنْتَجُ الْبَهِيمَةُ بَهِيمَةً جَمْعَاءَ [ص:213] هَلْ تُحِسُّونَ فِيهَا مِنْ جَدْعَاءَ
ثُمَّ يَقُولُ أَبُو هُرَيرَةَ رضي الله عنه: (فِطْرَةَ اللهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا لاَ تَبْدِيلَ لِخَلْقِ اللهِ، ذَلِكَ الدِّينُ الْقَيِّمُ)

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 80 باب إذا أسلم الصبي فمات هل يصلى عليه

1702. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఇలా అన్నారు :- ప్రతి పిల్లవాడు (ఏ మతస్థుడైనా) ప్రకృతి ధర్మంపై (అంటే ఇస్లాం ధర్మం పై) పుడతాడు. కాని ఆ తరువాత అతని తల్లిదండ్రులు అతడ్ని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేదా మజూసీ (అగ్ని పూజారి)గానో మారుస్తారు, జంతువుల్ని మార్చినట్లు. జంతువులు పుట్టేటప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి. (ఆ తరువాత ఈ మానవులు వాటి చెవులనో, కొమ్ములనో కోసి పారేస్తారు) ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా? “

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈ క్రింది ( ఖుర్ఆన్) సూక్తిని పఠించేవారు.

అల్లాహ్ మానవులను ఏ ప్రకృతి ధర్మంపై పుట్టించాడో అది మార్చనలవి కానిది. ఇదే సవ్యమైన, స్థిరమైన ధర్మమార్గం”. (30:30)

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 8వ అధ్యాయం – ఇజా అస్లమస్సబియ్యు ఫమాత హల్ యుసల్లా అలైహి)

1703 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سُئِلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذَرَارِيِّ الْمُشْرِكِينَ، فَقَالَ: اللهُ أَعْلَمُ بِمَا كَانُوا عَامِلِينَ

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 93 باب ما قيل في أولاد المشركين

1703. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- బహుదైవారాధకుల యుక్త వయస్సుకురాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి కర్మలు ఆచరిస్తారో అల్లాహ్ కే తెలుసు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 93వ అధ్యాయం – మాఖీల ఫీ ఔలాదిల్ ముష్రికీన్ )

1704 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: سُئِلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ أَوْلاَدِ الْمُشْرِكِينَ فَقَالَ: اللهُ، إِذْ خَلَقَهُمْ، أَعْلَمُ بِمَا كَانُوا عَامِلِينَ

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 93 باب ما قيل في أولاد المشركين

1704.హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడగటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ ఆ పిల్లలను అల్లాహ్ పుట్టించాడు గనక వారు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఏం చేస్తారో అల్లాహ్ కి మాత్రమే తెలుసు అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 93వ అధ్యాయం – మాఖీల ఫీ ఔలాదిల్ ముష్రికీన్)

తఖ్దీర్ (విధి వ్రాత) పై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[3:40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
విశ్వాస మూల సూత్రాలు (Fundamentals of Belief in Islam) [పుస్తకం & వీడియోలు]

6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:

‘తఖ్దీర్‌’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:

మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్‌. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.

إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

(నిశ్చయముగా అల్లాహ్‌ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).

రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ

(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్‌ 36: 12).

మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్‌ (3:40)లో ఉంది:

كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ

(అలానే అవుతుంది. అల్లాహ్‌ తాను కోరినదానిని చేస్తాడు).

నాల్గవది: అల్లాహ్‌ దేని తఖ్దీర్‌ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ

(వాస్తవానికి అల్లాహ్‌ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు). (సూరె సాఫ్ఫాత్‌ 37: 96).

దేవదూతలపై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[4:21 నిముషాలు]

ఈమాన్ (విశ్వాసం), దాని మూలస్థంబాలు
https://teluguislam.net/2019/08/21/belief-eman-pillars/

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్‌ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్‌ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్‌, మీకాఈల్‌, నరక పాలకుడు మాలిక్‌, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్‌. అల్లాహ్‌ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త (సల్లల్హాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

pillars of iman angels

“అల్లాహ్‌ దూతలు నూర్‌ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).

ఇంట్లో పెంపుడు కుక్కను ఉంచుకోవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:34 నిముషాలు]
అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

బిస్మిల్లాహ్

[17:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జిబహ్ చేసే పద్ధతి, దాని ఆదేశాలు

భూనివాస జంతువులు ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయ(కోయ)బడినప్పుడే అవి తినుటకు ధర్మసమ్మతం.

జిబహ్ అంటే:   గొంతు, ఆహారనాళం మరి కంఠనాళాలను కోయుట. గత్యంతరం లేని పరిస్థితిలో ఎక్కడి నుండైనా రక్తం ప్రవహించాలి.

ఎందుకనగా ఏ జంతువును, పక్షులను వశపరుచుకొని జిబహ్ చేయగలమో వాటిని ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయకుంటే వాటిని తినుట ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా జిబహ్ చేయబడనివి మృతుల్లో లెక్కించబడుతాయి.

జిబహ్ నిబంధనలు

1-జిబహ్ చేయు వ్యక్తి: బుద్ధిమంతుడు, ఆకాశ ధర్మాన్ని అవలంభించినవాడయి ఉండాలి. అంటే ముస్లిం లేదా యూదుడు మరియు క్రైస్తవుడు. కాని పిచ్చివాడు, త్రాగుబోతు మరియు జిబహ్ పద్ధతులు తెలియని బాలుడు జిబహ్ చేస్తే తినడం యోగ్యం కాదు. ఎందుకనగా వీరిలో బుద్ధీజ్ఞానాల కొరత వల్ల జిబహ్ ఉద్దేశ్యం పూర్తి కాదు. అలాగే అవిశ్వాసి, బహుదైవారాధకుడు, మజూసి (అగ్ని పూజారి), సమాధుల పూజారులు జిబహ్ చేసినది ధర్మసమ్మతం కాదు.

2-జిబహ్ చేసే ఆయుధం: రక్తాన్ని ప్రవహింపజేసే పదునైన మొనగల ఏ వస్తువుతో జిబహ్ చేసినా అది యోగ్యమే. అది ఇనుపదైనా, రాయి అయినా లేదా మరేదైనా సరే. అయితే అది దంతం, ఎముక, గోరు అయి ఉండకూడదు. వాటితో జిబహ్ చేసినవి యోగ్యం కావు.

3- గొంతు (శ్వాస పీల్చు మార్గం), ఆహారనాళం మరియు కంఠనాళాలను కోయాలి.

జిబహ్ కొరకు కచ్చితంగా ఈ అవయవాలను ప్రత్యేకించడంలోని మర్మం ఏమిటంటేః వివిధ నరాలు అక్కడే ఉంటాయి గనుక రక్త ప్రవాహం మంచి విధంగా జరుగుతుంది. తొందరగా ప్రాణం పోతుంది. జంతువుకు ఎక్కువ అవస్థ ఏర్పడదు. దాని మాంసం కూడా రుచిగా ఉంటుంది.

వేటాడినప్పుడు లేదా వేరే ఏదైనా సందర్భంలో పై తెలిపిన ప్రకారం జిబహ్ చేయడం అసాధ్యమైనప్పుడు బిస్మిల్లాహ్ అని పదునైన ఆయుధం దాని వైపు విసిరినప్పుడు అది దాని శరీరంలో తాకి వెంటనే చనిపోయినా, లేదా ప్రాణంగా ఉన్నప్పుడు దానిని వశపరుచుకొని జిబహ్ చేసినా అది ధర్మసమ్మతం అవుతుంది.

తినుటకు యోగ్యమైన జంతువులు ఊపిరాడక, గట్టి దెబ్బ తాకి, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి, పరస్పర కొమ్ములాట వల్ల లేదా ఏదైనా క్రూరమృగం దాడితో మరణిస్తే అవి నిషిద్ధం. అయితే అవి మరణించే ముందు కొంత ప్రాణం ఉన్నప్పుడు వశపరుచుకొని జిబహ్ చేయగలిగితే అవి ధర్మసమ్మతం అవుతాయి.

4- జిబహ్ చేయు వ్యక్తి జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం సున్నత్.

జిబహ్ కు సంబంధించిన ధర్మాలు

1- జంతువును పదును లేని ఆయుధంతో జిబహ్ చేయడం “మక్రూహ్”.

2- ఏ జంతువును జిబహ్ చేయనున్నామో దాని ముందు అది చూస్తుండగా కత్తికి పదును పెట్టడం “మక్రూహ్”.

3- జంతువును ఖిబ్లాకు వ్యెతిరేక దిశలో పెట్టి జిబహ్ చేయడం “మక్రూహ్”.

4- పూర్తిగా ప్రాణం పోక ముందే దాని మెడ విరుచుటగాని లేదా చర్మం తీయుటగాని “మక్రూహ్”.

మేక, ఆవులు ఎడమ వైపు పరుండబెట్టి జిబహ్ చేయడం సున్నత్. ఒంటెను నిలబెట్టి దాని ఎడమ చెయిని (ముందు కాళును) కట్టేసి జిబహ్ చేయుట సున్నత్. వల్లాహు అఅలమ్. 

వేట

అవసర నిమిత్తం వేటాడుట తప్ప కాలక్షేపం కోసం, మనోరంజన కోసం వేటాడుట యోగ్యం కాదు.

వేటాడుతూ వేటాడబడిన జంతువును పట్టుకున్నాక రెండు స్థితులుః

1- దానిని పట్టుకున్నప్పుడు దానిలో ప్రాణం ఉంటే తప్పక దానిని జిబహ్ చేయాలి.

2- పట్టుకున్నప్పడు అది చనిపోయి ఉండవచ్చు. లేదా ప్రాణం ఉండి కూడా లేనట్లుగానే ఏర్పడితే అది ధర్మసమ్మతమే.

జిబహ్ నిబంధనల మాదిరిగానే వేట నిబంధనలు ఉన్నాయిః

1- బుద్ధిజ్ఞానం గల ముస్లిం లేదా యూదుడు, క్రైస్తవుడై ఉండాలి. పిచ్చివాడు, త్రాగుబోతు, మజూసి, బహుదైవారాధకులు జిబహ్ చేసిన దానిని తినుట ముస్లింకు యోగ్యం కాదు.

2- వేటాయుధం పదునుగా ఉండాలి. రక్తం ప్రవహించాలి. గోరు, ఎముక, దంతాలు ఉపయోగించరాదు. పదునైన మొనగల వైపు నుండి జంతువు గాయమైతే అది ధర్మ సమ్మతం. దాని మొన వెనక భాగం నుండి దెబ్బ తగిలి చనిపోతే యోగ్యం కాదు. శిక్షణ ఇవ్వబడిన వేట కుక్క మరియు పక్షులు చంపిన జంతువులు కూడా యోగ్యమే. అయితే అవి వేట శిక్షణ ఇవ్వబడినవి అయి ఉండుట తప్పనిసరి.

వేట శిక్షణ అంటే దానిని వదిలినప్పుడు లేదా ‘పో’ అన్నప్పుడు పోవాలి. అది ఏదైనా జంతువును వేటాడిన తర్వాత తన యజమాని వచ్చే వరకు అతని కొరకు పట్టి ఉంచాలి. అది స్వయంగా తినకూడదు.

3-  ఆయుధాన్ని వేట ఉద్దేశ్యంతో విడవాలి. ఆయుధం చేతి నుండి జారిపడి ఏవైనా పశుపక్షాదులు చనిపోతే అవి ధర్మసమ్మతం కావు. అలాగే వేట కుక్క దానంతట అదే వెళ్ళి వేటాడి తీసుకువస్తే అదీ ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా వేటాడే మనిషి తనుద్దేశ్యంతో దానిని పంపలేదు గనక. ఎవరైనా ఒక జంతువు లేదా పక్షికి గురి పెట్టి బాణం వదిలాడు కాని అది మరో దానికి తగిలితే, లేదా గుంపులో ఉన్న వాటికి తగిలి కొన్ని చనిపోతే అవన్నియూ ధర్మసమ్మతమే.

4- వేట పశువు లేదా వేట పక్షి లేదా బాణం ఏదీ విడిసినా అల్లాహ్ పేరుతో విడవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనుట సున్నత్.

గమనికః కుక్కను పెంచటం నిషిద్ధం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన ఉద్దేశ్యాలకు తప్ప. ఆయన సల్లల్లహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం ఈ మూడిట్లో ఏదైనా ఒకటై ఉండాలిః వేట కొరకు, లేదా పశుసంపద భద్రత కోసం, లేదా వ్యవసాయోత్పత్తుల, పైరుపంటల పరిరక్షణ కోసం.


ముందు పాఠాలు:

అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) హంతకులెవరు? [వీడియో]

బిస్మిల్లాహ్

[50:41 నిముషాలు]
ఫజీలతుష్షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

ముహర్రం నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఈ నెలతో హుస్సైన్ (రజియల్లాహు అన్హు) కు సంబంధం ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

[60 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

పరలోక విశ్వాసం – 3 : స్వర్గ శుభాలు, నరక శిక్షలు [వీడియో]

బిస్మిల్లాహ్

[15:58 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

నరకము మరియు నరకశిక్షలు

అల్లాహ్ ఆదేశం:

فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ

ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (బఖర 2: 24).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం“. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:

[كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا العَذَابَ] {النساء:56}

వారి చర్మము కాలిపోవునపుడల్లా దానికి బదులుగా వేరు చర్మమును వారు బాధ రుచి చూచుటకై కల్పించుచుందుము“. (నిసా 4: 56).

మరో చోట ఇలా తెలిపాడు:

[وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَى عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا كَذَلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ] {فاطر:36}

తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము“. (ఫాతిర్ 35: 36).

వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః

[وَتَرَى المُجْرِمِينَ يَوْمَئِذٍ مُقَرَّنِينَ فِي الأَصْفَادِ ، سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَى وُجُوهَهُمُ النَّارُ] {إبراهيم:49، 50}

ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును“. (ఇబ్రాహీం 14: 49,50).

వారి తిండి విషయం ఇలా తెలిపాడు:

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ طَعَامُ الْأَثِيمِكَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِكَغَلْيِ الْحَمِيمِ

నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును“. (దుఖాన్ 44: 43-46).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం: జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది“. (ముస్లిం 2807).

స్వర్గం

అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండి:

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికీ తెలియదు“. (సజ్దా 32: 17).

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ

అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికిని విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా జేయును“. (ముజాదల 58: 11).

వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు.

అల్లాహ్ ఆదేశం:

يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍبَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَلَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ

పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు“. (సాఫ్ఫాత్ 37: 45-47).

అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది“. (బుఖారి 2796).

విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.

స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారు: స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు“. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.

ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

బిస్మిల్లాహ్

[14:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అన్నపానీయాల ఆదేశాలు

అల్లాహ్ తన దాసులకు పవిత్రమైన వస్తువులు తినుటకు ఆదేశించి, అపవిత్రమైన వాటిని వారిం- చాడు. అల్లాహ్ ఆదేశం సూర బఖర 2:172లో:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ]
ఓ విశ్వాసులారా! మేమొసంగిన పవిత్ర వస్తువులను భుజించండి“.  (2:172)

అన్నపానీయాల విషయంలో నియమం ఏమిటంటే: నిషేధింపబడిన కొన్ని వస్తువులు తప్ప అన్నియూ ధర్మసమ్మతమే (హలాల్). అల్లాహ్ తన దాసుల కొరకు పవిత్ర వస్తువులను ధర్మసమ్మతం చేసింది వారు వాటి నుండి ప్రయోజనం పొందాలని. అయితే వాటిని అల్లాహ్ అవిధేయత కొరకు ఉపయోగించుట ఎంత మాత్రం యోగ్యం కాదు.

తిను త్రాగు వస్తువుల్లో అల్లాహ్ తన దాసుల కొరకు నిషేధించిందేమిటో ఇలా స్పష్టపరిచాడు.

[وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ] {الأنعام:119}

వాస్తవానికి గత్యంతరంలేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు“. (అన్ఆమ్ 6: 119).

ఏ వస్తువు నిషిద్ధం అని తెలుపబడలేదో అది ధర్మసమ్మతం అన్న మాట. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:

إِنَّ اللهَ فَرَضَ فَرَائِضَ؛ فَلاَ تُضَيِّعُوْهَا، وَحَدَّ حُدُوْدًا؛ فَلاَ تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاء؛ فَلاَ تَنْتَهِكُوْهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ مِنْ غَيْرِ نِسْيَانٍ؛ فَلاَ تَبْحَثُوا عَنْها. [سنن الدارقطني 4/184، حسنه النووي ].

“అల్లాహ్ మీపై కొన్ని విధులను విధించాడు; మీరు వాటిని వృధా చేయకండి. కొన్ని కట్టుబాట్లను నిర్ణయించాడు; వాటిని అతిక్రమించకండి. కొన్ని వస్తువులను నిషిద్ధపరిచాడు; వాటిని ఉల్లఘించకండి. మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు. మరచిపోయి కాదు, వాస్తవంలో మీపై కరుణిస్తూ; మీరు వాటి వెంటబడకండి”. (హాకిం 4/129. జామిఉల్ ఉసూల్ 5/59, నవవీ హసన్ అన్నారు).

తిను, త్రాగు, ధరించు ఏ విషయాలు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషిద్ధం అని తెలుపలేదో వాటిని నిషేధించుట యోగ్యం కాదు.

నియమం ఏమిటంటేః నష్టం లేని పవిత్రమైన ప్రతి వస్తువు ‘ముబాహ్‘ (యోగ్యం). అపవిత్రమైన మరియు నష్టంగల వస్తువులు నిషిద్ధం. ఉదా: పీనుగు [1], రక్తం [2], మత్తుపదార్థాలు, ధూమపానం మరియు అపరిశుభ్రంతో కలుషితమైన వస్తువులన్నియూ నిషిద్ధం. ఎందుకనగా అవి అపవిత్రంతో పాటు హాని కలిగించునవి కూడాను.

  • [1] పీనుగు అంటే ధార్మిక పద్ధతితో జిబహ్ చేయకుండానే దానంతట అది చనిపోయినది.
  • [2] రక్తం అంటే జిబహ్ చేసేటప్పుడు స్రవించే రక్తం. ధార్మిక పద్ధతితో జిబహ్ చేసిన తర్వాత మాంసం మధ్యలో లేదా నరాల్లో ఉండిపోయే కొంతపాటి రక్తం ధర్మసమ్మతమే.

యోగ్యమైన ఆహారాలు రెండు రకాలు: జంతువులు (మాంసాహారాలు). కూరగాయలు. (శాఖాహారాలు). వీటిలో నష్టం లేనివి యోగ్యం.

జంతువులు రెండు రకాలు: జలనివాస జంతువులు. భూనివాస జంతువులు. జల నివాస జంతువులన్నీ ధర్మసమ్మతమే. వాటిని జిబహ్ చేయాలన్న నిబంధన కూడా లేదు. చివరికి అవి దానంతటవే చనిపోయినవైనా యోగ్యమే.

భూనివాస జంతువుల్లో ఇస్లాం నిషేధించినవి తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే. (కాని వాటిని జిబహ్ చేయాలి). ఇస్లాం నిషేధించినవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • 1- పెంపుడు గాడిదలు.
  • 2- కోరలు గల మృగాలన్నియూ నిషిద్ధం, సివంగి (దుమ్ముల గొండి) తప్ప.

పక్షులన్నియూ ధర్మసమ్మతమే. ఈ క్రింది పక్షులు తప్పః

(1) కాళ్ళ గోళ్ళ ఆధారంగా వేటాడే పక్షులు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

نَهَي رَسُولُ الله عَنْ كُلِّ ذِىْ نَابٍ مِنَ السِّبَاعِ، وَ عَنْ كُلِّ ذِيْ مِخْلَبٍ مِنَ الطُّيُوْر

కోరలు గల ప్రతి మృగ జంతువు, మరియు కాళ్ళతో పట్టుకొని భక్షించే ప్రతి పక్షిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించారు“. (ముస్లిం 1934).

(2) గద్ద, కాకి, రాబందుల్లాంటి శవాలను తినే పక్షులు. అవి మలినము, అపరిశుభ్రమైనవాటిని తింటాయి గనుక నిషిద్ధం.

(3) పాము, ఎలుక మరియు పురుగులు, క్రిమికీటకాలు లాంటి అశుద్ధమైనవి కూడా నిషిద్ధం.

పైన తెలుపబడిన జంతువులు, పక్షులు తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే: గుఱ్ఱం, ఒంటె, ఆవు, ఎద్దు, మేక, గొర్రె, బర్రె, కోడి, అడవిగాడిద, నిప్పుకోడి, కుందేలు, ఉడుం వగైరాలు.

జల్లాల‘ నిషిద్ధం. జల్లాల అంటే ఎక్కువ శాతం మలినం తినే పక్షి, పశువు అని అర్థం. కాని దానిని మూడు రోజులు అలాంటి పదార్థాలు తినకుండా ఆపి, పరిశుభ్రమైన తిను పదార్థాలు ఇస్తూ ఉంటే ఆ తర్వాత అది ధర్మసమ్మతం అమవుతుంది.

ఉల్లి, ఎల్లి లాంటి దుర్వాసన గల వస్తువులు (ధర్మసమ్మత మైనప్పటికీ) మస్జిదుకు వెళ్ళే ముందు అవి పచ్చివిగా తినుట ‘మక్రూహ్’ (ఇష్టం లేని కార్యం).

ప్రాణం పోవులాంటి పరిస్థితి ఏర్పడి నిషిద్ధ వస్తువు తప్ప మరేది లేనప్పుడు ప్రాణం కాపాడుటకు సరిపడునంత పరిమాణంలో నిషిద్ధ వస్తువు తినవచ్చు. కాని విషం తినకూడదు.

చుట్టూ గోడ లేని మరియు కాపలాదారుడు లేని పండ్ల తోట నుండి దాటుతూ క్రింద పడిన పండ్లు తినవచ్చు. కాని తన వెంట తీసుకెళ్ళ కూడదు. అలాగే రాళ్ళు విసిరి పండ్లు క్రింద పడగొట్టి, లేదా చెట్టు ఎక్కి తినడం యోగ్యం కాదు. అలాగే ఒక చోట కుప్పజేసియున్న దానిలో నుండి తీసుకోవడం కూడా యోగ్యం కాదు. కాని మరీ అత్యవసర పరిస్థితిలో ఆకలిని తీర్చు పరిమాణంలో తింటే తప్పు లేదు.


తరువాతి పాఠం:
అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

పరలోక విశ్వాసం – 2 : ప్రళయం, దాని సూచనలు & తీర్పుదిన విశేషాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[29:27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا

పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు“. (హజ్ 22: 7).

మరో చోట ఇలా చెప్పాడు:

وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ

మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును“. (సబా 34: 3).

ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

తీర్పు కాలం సమీపించినది“. (ఖమర్ 54: 1).

మరో చోట:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ – 21:1

ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు“. (అంబియా 21:1)

ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెను:

يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا – 33:63

ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు“. (అహ్ జాబ్ 33: 63).

ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

అందులో ఒకటి: మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అతడు ఒంటి కన్ను వాడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. అతడు 40 రోజులు నివసిస్తాడు.ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

ప్రళయదిన సూచనల్లో రెండవది: ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

ప్రళయదిన సూచనల్లో మూడవది: పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ

“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51

సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు“. (యాసీన్ 36: 51).

يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ

ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము“. (మఆరిజ్ 70: 43,44).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు”. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారు: ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి“. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :