Explanation of లా ఇలాహ ఇల్లల్లాహ్

Explanation of La Ilaha illallah (in Telugu)

లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ (తెలుగులో) డాక్టర్. సయీద్ అ’హ్మద్ ఉమరీ మదని హఫిజహుల్లాహ్

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? – షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 – 1433

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.

విషయసూచిక

1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2.  సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3.  పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10.  పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?

“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? – షేఖ్ ఇబ్నె ఉథైమీన్

 “అల్లాహ్ పై విశ్వాసం అంటే ఏమిటి ?
షేఖ్ ఇబ్నె ఉథైమీన్

‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుల పద్ధతికి భిన్నంగా ఉండే ప్రతి దాని నుండి నన్ను దూరంగా ఉంచేలా ‘అల్లాహ్ పై విశ్వాసం’ గురించి వివరించమని మిమ్ముల్ని వేడుకుంటున్నాను. 

అల్హందులిల్లాహ్.

‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే ఆయన ఉనికిని, ఆయన దైవత్వాన్ని, ఆయన శుభనామాలను మరియు దివ్యలక్షణాలను దృఢంగా విశ్వసించడం.

అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.

1 – అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించడం. 

‘అల్లాహ్ యొక్క ఉనికి’ హేతుబద్ధంగా మరియు మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం. దీనిని షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు నిరూపిస్తున్నాయి.

(i)  అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:

తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.]

(ii) అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:

భూత, భవిష్య మరియు వర్తమాన కాలాలలోని ఈ సృష్టితాలన్నీ తమను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తమను తాము సృష్టించుకోలేవు లేదా ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాజాలవు.

అవి తమకు తాముగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు?! అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైన మరియు అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది. మరియు ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?

ఒకవేళ ఇవి తమకు తాముగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి ఉండాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.

అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరహ్ అత్తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):

“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” [అత్తూర్ 52:35]

అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అత్తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):

“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ”  [అత్తూర్ 52:35-37]

ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవాడు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత అతడిలా పలికినాడు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” సహీహ్ అల్ బుఖారీ.

మరింత స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణ క్రింద పేర్కొంటున్నాము:

ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు – ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. మరియు అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరి, భూమ్యాకాశాలతో, నక్షత్రాలతో మరియు అత్యద్భుత, సవిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?!

ఏడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశకు అతడు చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారు పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” అతడి జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”

2 – అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని విశ్వసించడం. 

అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు – ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు.

సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా పేర్కొనబడినాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  [అల్ అరాఫ్ 7:54]

“ప్రకటించు(ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరియు మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’”  [యూనుస్ 10:31]

“భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” [అస్సజదహ్ 32:5]

“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” [ఫాతిర్ 35:13]

సూరతుల్ ఫాతిహా లోని అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“తీర్పుదినం (ప్రతిఫల దినం, అంతిమ దినం) యొక్క (ఏకైక) ప్రభువు [మాలికి యౌమిద్దీన్]” [అల్ ఫాతిహా 1:4]

మరో పద్ధతిలో ఇది మలికి యౌమిద్దీన్ అని పఠించబడుతుంది. ఒకవేళ మనం ఈ రెండు పఠనా పద్ధతులను జత చేస్తే, ఒక అద్భతమైన భావం మన ముందుకు వస్తుంది – మాలిక్ (యజమాని) కంటే మలిక్ (సార్వభౌముడు) ఎక్కువ శక్తి మరియు అధికారం కలిగి ఉంటాడు. అయితే ఒక్కోసారి పేరుకు మాత్రమే అతడు రాజుగా చెలామణీ అవుతాడు, రాజ్యవ్యవహారాలపై అతనికెలాంటి నియంత్రణా, ఆధిపత్యమూ ఉండదు. అలాంటి స్థితిలో అతడు కేవలం నామ మాత్రపు రాజే గాని యజమాని కాడు. అయితే, అల్లాహ్ సార్వభౌముడు మరియు యజమాని కూడా అయి ఉండటం వలన, ఆయన యొక్క సార్వభౌమత్వం మరియు విశ్వవ్యవహారాలన్నింటిపై ఆయన యొక్క సాటి లేని నియంత్రణను ఇది ధృవీకరిస్తున్నది.

3 – అల్లాహ్ యొక్క ఏక దైవత్వాన్ని విశ్వసించడం 

i.e., కేవటం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.

అల్ ఇలాహ్ అంటే ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“మరియు మీ ఆరాధ్యుడు – ఒక్కడే. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. అనంత కరుణా మయుడు మరియు అపార కృపాశీలుడు” [అల్ బఖరహ్ 2:163]

“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” [ఆలె ఇమ్రాన్ 3:18]

అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దాని యొక్క దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్న వన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” [అల్ హజ్  22:62]

దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” [అల్ నజమ్ 53:23]

యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఇలా పలికినట్లు అల్లాహ్ మనకు తెలిపినాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం:

“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” [12:39-40]

అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు. ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు – ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినా, ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ఏ ప్రవక్త అయినా. ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం:

“’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” [అల్ అంబియా 21:35]

“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” [అన్నహల్ 16:36]

అయితే, బహుదైవారాధకులు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి మరియు అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.

4 – అల్లాహ్ యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను విశ్వసించడం. 

i.e., తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, ఆయనకు ప్రయోజనం కలిగేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులు – చేర్పులు చేయకుండా, వాటిని సృష్టితాలతో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా మనం కూడా ధృవీకరించడం. ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం:

“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ అరాఫ్ 7:180]

ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ యొక్క నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.

మరియు అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు. (ఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావానువాదం):

“భూమ్యాకాశాలలో ఆయన ప్రస్తావనయే అత్యున్నతమైన ప్రస్తావన. ఆయన మహోన్నతుడు, అత్యంత వివేకవంతుడు” [అర్రూమ్ 30:27]

పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”. ఈ రెండు వచనాలు సూచిస్తున్నదేమిటంటే, అత్యంత ఉన్నతమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు సాధారణంగా అల్లాహ్ కు మాత్రమే చెందును. ఖుర్ఆన్ మరియు సున్నతులలో దీనిని వివరంగా తెలిపే సమాయారం చాలా ఎక్కువ మోతాదులో ఉంది.

జ్ఞానం యొక్క ఈ విభాగం అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను వివరించే జ్ఞానం గురించి సమాజంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇది చాలా వివాదాస్పదమైన విభాగం. దీని విషయంలో సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది.

దీని గురించి అల్లాహ్ పంపిన ఈ ఆదేశాలను తు.చ. తప్పక శిరసావహిచాలనేది మా అభిప్రాయం.  (ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం) :

“ఏదైనా విషయం గురించి మీలో మీకు భేదాభిప్రాయాలు వస్తే, దానిని అల్లాహ్ మరియు ఆయన యొక్క సందేశహరుడి వైపుకు మరలండి – ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే.” [అన్నిసాఅ 4:59]

మనం ఈ భేదాబిప్రాయాన్ని కూడా అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథం మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకే మరలిద్దాం – సన్మార్గంలో నడిచిన సలఫ్ (ముందుతరం), సహాబాలు, తాబయీన్ ల నడిచిన మరియు ఈ ఖురఆన్ ఆయతులు మరియు హదీథులు అర్థం చేసుకున్న విధానం నుండే మనం కూడా ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అన్వేషిస్తూ. ఎందుకంటే ఈ సమాజంలో వారు అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయాలలో అత్యుత్తమ జ్ఞానవంతులు. సహాబాల గురించి వివరిస్తూ, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు తన సత్యవాక్కులను ఇలా తెలిపారు: “ఎవరైనా సన్మార్గాన్ని అనుసరించాలనుకుంటే, (తమ జీవితాంతం సన్మార్గంపై నడుస్తూ) మరణించిన సజ్జనుల మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే ప్రస్తుతం జీవించి ఉన్న సజ్జనుల విషయంలో చివరి క్షణం లోపల వారు సన్మార్గాన్ని వదిలి పెట్టరనే గ్యారంటీ ఏదీ లేదు. సహాబాలు ఎంత గొప్ప వారంటే, వారి హృదయాలు మన సమాజంలో మిగిలిన వారందరి కంటే అతి స్వచ్ఛమైనవి, లోతైన అవగాహనను కలిగి ఉండినవి,  ఆడంబరాలకు దూరంగా ఉండినవి, అతి తక్కువ క్లిష్టమైనవి. అంతేగాక అల్లాహ్ వారిని తన ధర్మ స్థాపన కొరకు మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు. కాబట్టి వారి హక్కును మనం తప్పక గుర్తించాలి. మనం వారి మార్గదర్శకత్వాన్ని తప్పక స్వీకరించాలి. ఎందుకంటే వారు నిజమైన మార్గదర్శకత్వాన్ని అనుసరించారు.” ఎవరైతే ఈ విషయంలో సలఫ్ మార్గాన్ని వదిలి, వేరే మార్గాన్ని అవలంబిస్తారో, వారు తప్పు చేసినట్లే మరియు తప్పుడు దారిని అవలంబించినట్లే. అంతేగాక విశ్వాసుల (మోమిన్ల) మార్గాన్ని వదిలి, వేరే మార్గంపై నడుస్తున్న వారవుతారు. అలాంటి వారిని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

“స్పష్టంగా సన్మార్గం చూపబడిన తర్వాత ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుడితో విభేదిస్తారో, వారు విశ్వాసుల మార్గాన్ని కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నట్లే. వారు ఎంచుకున్న (తప్పుడు) మార్గంలోనే మేము వారిని ముందుకు పోనిస్తాము మరియు నరకంలో శిక్షిస్తాము – ఎంత చెడు గమ్యం వారిది!” [అన్నిసాఅ 4:115]

సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలంటే, సహాబాలు విశ్వసించినదే మనం కూడా తప్పకుండా విశ్వసించాలని అల్లాహ్ ఈ ఆయతులో స్పష్టంగా నిర్దేశిస్తున్నాడు. (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

“కాబట్టి మీరు (సహాబాలు) విశ్వసిస్తున్నట్లుగా ఒకవేళ వారు కూడా విశ్వసిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే” [అల్ బఖరహ్ 2:137]

ఎవరైతే సలఫ్ మార్గం నుండి దూరమవుతారో మరియు దాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో అలాటి ప్రతి ఒక్కరూ సరైన మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం జారవిడుచుకున్న వారవుతారు మరియు దిక్కులేని వారవుతారు.

దీని ఆధారంగా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాల విషయంలో దేనినైతే స్వయగా అల్లాహ్ యే ధృవీకరించాడో మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారో, దానినే మనం అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సున్నతులను మనం ఆధారంగా తీసుకోవాలి, సహాబాలు వాటిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ విషయంలో వారు మన సమాజంలో అందరి కంటే ఎక్కువ జ్ఞానం మరియు ఉత్తమ జ్ఞానం కలిగి ఉండినారు.

అయితే మనం క్రింది నాలుగు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఈ నాలుగు: తహ్రీఫ్ (మార్పుచేర్పులు), తఆతీల్ (తిరస్కారం), తమ్హీల్ (అల్లాహ్ ను సృష్టితాలతో పోల్చడం) మరియు తకైఫ్ (ఎందుకు, ఎలా అని చర్చించడం).

కాబట్టి, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించడమంటే “తన దివ్యగ్రంథంలో మరియు తన ప్రవక్త యొక్క సున్నతులలో అల్లాహ్ స్వయంగా ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను వాటి భావార్థాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, తిరస్కరించకుండా లేదా ఎందుకు, ఎలా అని ప్రశ్నించకుండా లేదా వాటిని సృష్టితో పోల్చకుండా ఆయన స్థాయికి తగినట్లు మనం కూడా వాటిని యథాతథంగా ధృవీకరించడం.”

మనం దూరంగా ఉంచవలసిన ఈ నాలుగు విషయాల గురించి క్లుప్తంగా ఇక్కడ చర్చించుకుందాము:

(i) తహ్రీఫ్ (మార్పులు – చేర్పులు చేయడం) 

అంటే, ‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు – చేర్పులు చేయడం.

ఉదాహరణకు:

అనేక ఆయతులలో వచ్చిన ‘అల్లాహ్ చేయి’ అనే పదం యొక్క భావార్థాన్ని వారు ఆయన యొక్క అనుగ్రహాలను లేదా శక్తిని సూచిస్తుందని మార్చడం.

(ii) తఆతీల్ (తిరస్కరించడం) 

అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ అల్లాహ్ కు చెందవని లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.

ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.

(iii) తమ్హీల్ (అల్లాహ్ ను ఆయన యొక్క సృష్టితాలతో పోల్చడం) 

అంటే, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి కూడా మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ యొక్క వినికిడి శక్తి కూడా మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది చాలా తప్పు మరియు ఒక పచ్చి అబద్ధం వంటిది. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి, (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“ఆయనను పోలినదేదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడూ, చూసేవాడూను.” [అష్షూరా 42:11]

(iv) తకైఫ్ (ఎలా సంభవమని చర్చించడం) 

అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం.

ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” [తాహా 20:110]

ఎవరైనా ఈ నాలుగు విషయాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే.

మన అంతిమ ఘడియ వరకు సన్మారంలోనే నిలకడగా నడుపమని మనం అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

మరియు అల్లాహ్ యే సమస్త విషయాలు ఎరుగును.

రిఫరెన్స్ : రిసాలత్ షరహ్ ఉసూల్ అల్ ఈమాన్ – షేఖ్ ఇబ్నె ఉథైమీన్.
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

ఇస్లాం మూల సూత్రాలు (ఉసూల్ అత్ తలాత & ఖవాఇద్ అల్ ఆర్బా)

usool-thalatha-qawaid-alarba


త్రిసూత్రాలు మరియు షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం: షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లా అలై)
అనువాదకులు: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[32 పేజీలు] [PDF][మొబైల్ ఫ్రెండ్లీ]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/usool-thalatha-qawaid-al-arba-mobile-friendly.pdf

బలవంతుడైన విశ్వాసి – బలహీనుడైన విశ్వాసి (Strong Believer – Weak Believer)

strong-believer-weak-believer-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

 [ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]

అంతిమ దైవప్రవక్త ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివాని లోనూ మంచి ఉంటుంది. మీ కొరకుప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, దైవ సహాయం కోరండి, నిస్పృహకులోనవబాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలాచేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగిఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ మార్గాన్ని తెరచివేస్తాయి.’ (ముస్లిం)

ఈ హదీసులో దైవప్రవక్త (సఅసం) మూడు ముఖ్య విషయాలను ప్రబోధించారు :

“ఇక్కడ బలం అంటే అన్ని రకాల బలం అని భావం. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు – “ఇక్కడ బలం అంటే మనో నిబ్బరం కలిగి ఉండి, పరలోక విషయాలలో ముందంజ వేయడం అని భావం. ఈ గుణాలున్న వ్యక్తి ధర్మ పోరాటంలో అందరికంటే ముందుకు పోయి శత్రువుపై దాడి జరుపుతాడు.అందరికంటే ముందు దైవాన్వేషణలో మునుముందు ఉంటాడు, మంచిని పెంచడంలో, చెడులను నిర్మూలించడంలో, సహనం వహించటంలో వజ్ర సంకల్పుడై ఉంటాడు. దైవ మార్గంలో ఎన్ని ఆపదలు ఎదురైనా ఓరిమిని ప్రదర్శిస్తాడు. నమాజ్, రోజా, జకాత్ తదితర ఆరాధనలకై, ఇంకా వాటి రక్షణకై అందరికంటే ఎక్కువగా చురుకుదనం కలిగి ఉంటాడు.”

శారీరక బలం లేదా శరీర దారుఢ్యం కూడా దైవానుగ్రహమే. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గురించి చెబుతూ అల్లాహ్ ఇలా అన్నాడు:

అల్లాహ్ ఆయనకు బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.” (అల్ బఖర : 247)

జ్ఞానశక్తి కూడా మహదానుగ్రహమే. తన అంతిమ గ్రంథంలో సర్వోన్నతప్రభువు ఏమన్నాడో చూడండి –

మీరు (వారితో) అనండి, జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఒకటేనా? కేవలం బుద్ధిమంతులే హితబోధను స్వీకరిస్తారు.” (అజ్జుమర్ : 9)

ధనబలం కూడా దైవప్రసాదితమైన వరమే. అల్లాహ్ సెలవిచ్చాడు :

ఇంకా చూడండి. అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే ఉపాధివిషయంలో ఆధిక్యత ప్రసాదించాడు. అయితే ఎవరికయితే ఈ ఆధిక్యతఇవ్వబడిందో, వారు తమ ఉపాధిని తమ బానిసల వైపునకు మళ్ళించేవారు కాదు. ఇద్దరూ ఈ ఉపాధిలో సమానమైన భాగస్థులు అయ్యేందుకు.అయితే అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వీరు తిరస్కరిస్తున్నారా?” (అన్ నహ్ల్ – 71)

ఒక మనిషికి రెండో మనిషిపై ఆధిక్యతను ఇచ్చే, ఇంకా అతని వ్యవహారాలలో సరళతను సృష్టించే ప్రతిదీ బలంగానే పరిగణించ బడుతుంది. అటువంటి బలం గనక దైవ విధేయతలో, దైవ ప్రసన్నతను పొందే పనుల్లో వినియోగమైతే అది ఎంతో ప్రశంసనీయమైన దవుతుంది. ఈమాన్ (విశ్వాసం) అనేది ఎలాంటి ప్రేరణంటే అది మనిషి శక్తి సామర్థ్యాలు సరైన మార్గంలో వ్యయమయ్యేలా చేస్తుంది. తద్వారా మేలును, శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే, “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మేలైనవాడు, అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు.

(2). “ప్రతి వానిలోనూ మంచి ఉంది.”

అంటే విశ్వాసి బలవంతుడైనా, బలహీనుడైనా అతను మంచివాడే. ఎందుకంటేఅతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసం స్వతహాగా బలమైనది. అన్ని రకాల శక్తులు క్షీణించినా కనీసం విశ్వాస బలమైతే ఉండనే ఉంటుంది. కనుక ఏ విశ్వాసినైనా హీనుడుగా, అల్పుడుగా పరిగణించడం సమ్మతం కాదు.

(3). “మీ కొరకు మేలైన వాటిని ఆశించండి.”

ఇక్కడ ఆశించడమంటే భావం ప్రయత్నించడం, దానికోసం శక్తియుక్తులన్నీ ఒడ్డటం.ప్రాపంచికంగా నయినా, పారలౌకికంగా నైనా శ్రేయస్కరమైన ప్రతిదాన్నీ పొందమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. విశ్వాసి ప్రతి మంచినీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే అతను తన ప్రభువు అనుగ్రహానికి అతీతుడు కాలేడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

(ఓ ప్రవక్తా! అనండి) నాకే గనక అగోచరాల జ్ఞానం ఉండి ఉంటే,ప్రయోజనకరమైన వాటిని నేను పుష్కలంగా పొందేవాడిని. నాకు నష్టమే వాటిల్లేది కాదు.”(అల్ ఆరాఫ్ – 188)

  1. “దైవ సహాయం అడగండి”

లాభదాయకమైన వాటిని పొందమని ఆదేశించిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం),’లాభకరమైన వస్తువు దైవ ప్రమేయంతోనే ప్రాప్తిస్తుంద’ని కూడా చెప్పారు. అందుకే లక్ష్య సాధన కొరకు దైవ సహాయాన్నే వేడుకోవాలి. ప్రతి మేలు, ప్రతి సహాయంఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది. అల్లాహ్ తలచనంతవరకూ ఏ కారణాలూఏమీ చేయలేవు. ఎందుకంటే కారణాలను పర్యవసానాలను సృష్టించిన వాడు అల్లాహ్ యే గనక. ధర్మసమ్మతమైన కోర్కెల సాధనకై విశ్వాసి ధర్మ సమ్మతమైనఒనరులనే వినియోగిస్తాడు. అయితే నమ్మకం మాత్రం లాభనష్టాలను చేకూర్చగలశక్తిని కలిగిఉన్న దైవంపై పెట్టుకుంటాడు.

  1. “నిస్పృహకు లోనవబాకండి”

అంటే దైవవిధేయతలో, దైవ సహాయం కోరే విషయంలో అలసత్వం, బద్దకంపనికిరావు. దానికి బదులు దైవాన్ని ఆశతో వేడుకోవాలి. వేడుకోవటంతో పాటు’సాధన’ చేయాలి. దైవానుగ్రహాలను పొందే విషయంలో మందకొడిగా ఉండటం, విముఖతను చూపటం ఎంతకీ మంచిది కాదు. అలా చేస్తే దైవానుగ్రహాలనుఆక్షేపించినట్లవుతుంది. విశ్వసించిన వ్యక్తి దైవానుగ్రహాలను ఎన్నడూ ఆక్షేపించడు.

  1. మీకేదయినా బాధ కలిగినపుడు, ‘మేము గనక అలాచేసి ఉంటే ఇలా జరిగిఉండేది’ అని అనటం ఎంతమాత్రం భావ్యం కాదు.

విశ్వాసి సమస్త ప్రయత్నాలను చేసిన తరువాత కూడా అనుకున్నది నెరవేరకపోతే,దాని నష్టం నుండి బయటపడకపోతే, అప్పుడు దైవ నిర్ణయానికి రాజీపడిపోవాలి.దైవచిత్తం కాని దాన్ని సాధించలేనని తెలుసుకోవాలి. ఫలానా కారణంగా ఈ పనికాలేదని నిందమోపటం, లేదా ఒకవేళ ఆ చర్య గైకొని ఉంటే అది నెరవేరేది అనికాకి లెక్కలు వేయటం మోమిన్ (విశ్వాసి) స్థాయికి ఎంతమాత్రం తగదు.

  1. ఈ హదీసులో “ఒకవేళ” అనే పదం ఉపయోగించరాదని చెప్పబడింది. అయితే కొన్ని ఇతర హదీసుల్లో ఈ “పదం” వాడినట్లు కూడా ఉంది. అంతిమ హజ్సందర్భంగా మహాప్రవక్త (సఅసం), ‘ఒకవేళ ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ముందే తెలిసి ఉంటే ఖుర్బానీ పశువుల్ని తెచ్చేవాడ్ని కాను’ అని అన్నారు. అలాగేదివ్య ఖుర్ఆన్,

“ఒకవేళ నాకే గనక అగోచర విషయజ్ఞానం ఉంటే ప్రయోజనకరమైనవాటినెన్నో పొందేవాడిని, నాకు కష్టనష్టాలే రాకుండా ఉండేవి (అని ఓప్రవక్తా వారితో చెప్పివేయండి)” అని అనబడింది.

దీని భావం ఏమంటే భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే, ఉదాహరణకు, ‘ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా నేను బ్రతికి వుంటే హజ్ చేస్తాను’ అనవచ్చు. అందులో తప్పులేదు. లేదా గత జీవితంలో దైవవిధేయత విషయంలో జరిగిన లోటుపాట్లను తల్చుకుని సిగ్గుపడుతూ, ‘ఒకవేళ నేను నమాజ్ను క్రమం తప్పకుండా చేసివుంటే ఎంత బాగుండేది!’ అని అనవచ్చు. ఇంకా, అల్లాహు అయిష్టం కాని రీతిలో ఏదన్నా వాక్యం పలికినా దోషం లేదు. ఉదాహరణకు హిజ్రత్సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రజిఅన్) సూర్ గుహలో, ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)!బహు దైవారాధకులలో ఎవరయినా తల ఎత్తాడంటే చాలు, మిమ్మల్ని చూసేస్తాడు”అని అన్నారు.

అయితే గతంలో జరిగిపోయిన నష్టాన్ని తలచుకుని ‘అరె అలా చేసే బదులు ఇలాచేసి ఉంటే లాభదాయకంగా ఉండేదేమో!’ అని మాత్రం అనకూడదు. అలా అనటం వల్ల దైవంపై నమ్మకం సడలి పోయిన భావం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు,“నేను ఫలానా వస్తువు తిని ఉంటే స్వస్థత చేకూరేదేమో” అని అనడం విశ్వాసరాహిత్యానికి ఆనవాలుగా ఉంటుంది.

ఈ హదీసులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయమేమంటే విశ్వాసులలో ఒకటికి రెండు కోవలకు చెందిన వారుంటారు. అయితే వారిలోనిబలవంతుడంటే అల్లాహ్ కు ఇష్టం. ఎందుకంటే దైవాజ్ఞాపాలనలో అతను తన బలాన్నిశక్తిని ధారపోస్తాడు. బలహీనుడైన విశ్వాసికన్నా సక్రమంగా ఎక్కువగా దైవాన్నిసేవిస్తాడు. అందుకే బలాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నించమని దైవప్రవక్త నొక్కిపలికారు. ఎందుకంటే ప్రతిదీ ప్రయత్నం ద్వారానే హస్తగతమవుతుంది. అలసత్వం సోమరితనాలవల్ల ఏదీ ప్రాప్తించదు. సోమరితనం, బద్దకాలను దూరంచేసి ధర్మసమ్మతమయిన ఒనరులను వినియోగించుకోవాలని చెప్పబడింది.

అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమంటే అతని మనసు ఎంతసేపటికీ భౌతికవనరుల పైకాక, దైవ ప్రోద్బలంపై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎన్ని ఒనరుల్నిసమకూర్చుకున్నా, ఎన్ని జాగ్రత్తలు గైకొన్నా నిర్ణీత లక్ష్యం నెరవేరి తీరుతుందన్ననమ్మకం లేదు. మనిషి విఫలుడవటం సంభవమే. ఒక్కోసారి అతను నిర్ణయించుకున్నలక్ష్యాన్ని అందుకోకపోవటంలోనే అతని శ్రేయస్సు ఇమిడి ఉండవచ్చు. ఎందులోఏం మేలుందో దైవానికే తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి నిరాశకుగురికాకుండా తన ప్రభువేచ్ఛతో రాజీపడిపోతాడు. విధిని విదిలించే, ఒనరులనుతప్పుపట్టే బదులు ‘దైవచిత్తం ఇలా ఉంది కాబోలు. కనుక ఇది నాకు ఆమోదమే’అని అంటాడు. అలాగే అతని ఆంతర్యం ఈర్ష్య, అసూయ, కపటత్వం, ద్వేషంవంటి నకారాత్మక భావనల నుడి, తుచ్ఛమైన భావాల నుండి సురక్షితంగా ఉంటుంది.ఇంకా అతని ఆంతర్యంపై దైవ కారుణ్యం ప్రశాంతత అవతరిస్తాయి.

అల్ కుఫ్ర్ – అవిశ్వాసం (Kufr-Disbelief) – ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ

sad-tree-kufrరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అవిశ్వాసం (అల్ కుఫ్ర్)  – الـْــكُــفْــرْ 

అవిశ్వాసం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

అవిశ్వాసం అంటే ప్రధానంగా ఇస్లాం ధర్మంలోని విశ్వాసపు మూలస్థంభము (అర్కానె ఈమాన్) లలో ఏ మూలస్థంభాన్ని అయినా విశ్వసించక పోవటం.

విశ్వాసపు మూలస్థంభములు (అర్కానె ఈమాన్) ఆరు : అవి

  1. అల్లాహ్ పై విశ్వాసం ఉంచటం,
  2. అల్లాహ్ యొక్క దైవదూతల పై విశ్వాసం ఉంచటం,
  3. అల్లాహ్ యొక్క సందేశహరుల పై విశ్వాసం ఉంచటం,
  4. అల్లాహ్ అవతరింపజేసిన దివ్యగ్రంథాల పై విశ్వాసం ఉంచటం,
  5. పునరుజ్జీవన దినం (తిరిగి లేపబడే తీర్పుదినం) పై విశ్వాసం ఉంచటం,
  6. అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం – సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడు (అల్లాహ్) మానవుల జాతకాలను ముందుగానే నిర్దేశించాడని నమ్మటం, దేనినైతే ఆయన ముందుగానే నిర్దేశించి ఉన్నాడో, మన జీవితంలో అది తప్పక అంటే నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుందని విశ్వసించటం.

ఈ అవిశ్వాసం రెండు రకాలు: –

  1. ఘోరమైన అవిశ్వాసం
  2. అల్పమైన అవిశ్వాలం

1) ఘోరమైన అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అక్బర్): ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కరింపజేస్తుంది.  దీనిలో ఐదు రకాలు ఉన్నాయి.:

  • తిరస్కారపు అవిశ్వాసం – కుఫ్ర్ అత్తఖాదిబ్: దివ్యమైన సత్యసందేశాన్ని నమ్మకపోవటం లేదా విశ్వాసపు మూలస్థంభాలలో దేనినైనా నిరాకరించటం (త్రోసి పుచ్చటం) లేదా ఖండించటం. దివ్యఖుర్ఆన్ లోని 39వ అధ్యాయం 32వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం (దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం) అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్దమని దానిని తిరస్కరిస్తాడో, అతడి కంటే పరమ దుర్మార్గుడెవరు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా?” (V. 39:32)
  • అహంకారపు అవిశ్వాసంకుఫ్ర్ ఇబావత్తకాబ్బుర్ మా అత్తస్ది: అల్లాహ్ ఆదేశాలు సత్యమైనవని తెలిసీ, అహంకారం వలన వాటికి సమర్పించుకోకుండా తిరస్కరించటం. దివ్యఖుర్ఆన్ లోని 2వ అధ్యాయం 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “మేము దైవదూతలకు: ‘మీరందరూ ఆదమ్ కు సజ్దా (సాష్టాంగం)చేయండి.’ అని ఆదేశించినప్పుడు, వారందరూ సాష్టాంగ పడినారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు. దురహంకారానికి గురి అయ్యాడు. అవిధేయులలో కలసి పోయాడు. (అల్లాహ్ కు అవిధేయుడైనాడు)”
  • ధిక్కారపు అవిశ్వాసంకుఫ్ర్ అష్షక్కాజ్జాన్న్: విశ్వాసపు ఆరు మూలస్థంభాలపై సందేహం ఉంచటం లేక స్పష్టమైన అవగాహన లేకపోవటం. దివ్యఖుర్ఆన్ లోని 18వ అధ్యాయం 35 – 38వ వచనాలలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునే వాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ‘ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను. మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను. ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను.’ అతని పొరుగువాడు అతడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ‘నిన్ను మట్టితో, తర్వాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తర్వాత నిన్ను (సంపూర్ణ) మానవునిగా తీర్చిదిద్దిన ఆయన ను నీవు తిరస్కరిస్తున్నావా? కాని నిశ్చయంగా నాకు మాత్రం ఆయనే అంటే అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా కల్పించను”
  • సంకల్పంలో అవిశ్వాసంకుఫ్ర్ అల్ ఇరాదహ్: తెలిసీ సత్యం నుండి తిరిగి పోవటం (ముఖం త్రిప్పుకోవటం) లేదా అల్లాహ్ అవతరింపజేసిన స్పష్టమైన చిహ్నాల నుండి  దృష్టి మళ్ళించటం (ఉల్లంఘించడం). దివ్యఖుర్ఆన్ లోని 46వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీతకాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు.” (V. 46:3)
  • కపటత్వపు అవిశ్వాసంకుఫ్ర్ అన్నిఫాఖ్: మోసపూరితమైన, వంచనతో కూడిన లేక కపటమైన అవిశ్వాసం. దివ్యఖుర్ఆన్ లోని 63వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు. ఆ విధంగా వారు (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి విరోధిస్తున్నారు. నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి. ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అవటం మూలంగానే జరిగినది. కావున వారి హృదయాలు మీద ముద్ర వేయబడి ఉన్నది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు.” (V. 63:2 – 3)

2) అల్పమైన (తక్కువ స్థాయి) అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అస్గర్):

ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. దీనినే కుఫ్ర్ అన్నిఆమాహ్ అని కూడా అంటారు. అల్లాహ్ ప్రసాదిస్తున్న దీవెనలు మరియు శుభాల పై అయిష్టంగా ఉండటం అంటే అల్లాహ్ కే కృతఘ్నత చూపటం. దివ్యఖుర్ఆన్ లోని 16వ అధ్యాయం 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు. మొదట అది శాంతి భద్రతలతో నిండి ఉండేది. దాని (ప్రజలకు) ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత  వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు” (V. 16:112)

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

అన్నిఫాఖ్ – కపటత్వం [ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ]

hypocrisy-nifaqరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అన్నిఫాఖ్الــنــفـــاق

కాపట్యం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు.

కాపట్యం రెండు రకాలు, అవి:

  1. విశ్వాసం (నమ్మకం) లో కాపట్యం
  2. ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

(1) విశ్వాసం (నమ్మకం)లో కాపట్యం: దీనిలో ఆరు రకాలున్నాయి.

  1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తిరస్కరించటం
  2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన (ఆయన పై అవతరించిన లేక ఆయన బోధించిన) వాటిలో కొన్నింటిని తిరస్కరించటం (ఉదాహరణ – ఖుర్ఆన్, సున్నహ్, ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు)
  3. ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం ను ద్వేషించుట, అసహ్యించుట.
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన వాటిలో కొన్నింటిని ద్వేషించటం లేక అసహ్యించుకోవటం (ఉదాహరణ – ఏకదైవత్వం లేక ఏక దైవారాధన మొదలైనవి)
  5. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి ఏదైనా తాత్కాలిక పరాభవం గాని లేదా అపకీర్తి గాని కలిగినప్పుడు సంతోషపడటం.
  6. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి విజయం కలిగినట్లయితే విచారపడటం. (ఇస్లాంధర్మపు సాఫల్యాన్ని చూసి అసంతృప్తి చెందటం)

ఎవరిలోనైతే పైన పేర్కొన్న ఆరు కపటపు గుణాలు ఉంటాయో, వారు నరకాగ్నిలోని అట్టడుగు పొరలలోనికి చేర్చబడతారు. (కపటులు నరకం లోని అట్టడుగు పొరలలోనికి పంపబడతారుఖుర్ఆన్ 4:145)

(2) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేర్వేరు ప్రకటనల ఆధారంగా, దీనిలో ఐదు పద్ధతులు ఉన్నాయి. కపటుల చిహ్నాలు –

  1. అతడు మాట్లాడినప్పుడు, అబద్ధం చెబుతాడు.
  2. అతడు వాగ్దానం చేసినప్పుడు, దానిని పూర్తిచేయడు.
  3. ఒకవేళ అతడిని నమ్మినట్లయితే (అతడిపై భరోసా చేసినట్లయితే), అతడు వంచకుడిగా, మోసగాడిగా తేలుతాడు. (మీరు దేనినైనా అతడి దగ్గర ఉంచినట్లయితే, దానిని తిరిగి వాపసు ఇవ్వడు).
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంకో హదీథ్ లో- ఘర్షణ పడినప్పుడల్లా (పోట్లాటకు దిగినప్పుడు) అతడు తెలివి లేని వాడిగా, అవివేకిగా, దుష్టుడిగా, చెడ్డవాడిగా, ఇతరులకు అవమానం, పరాభవం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు.
  5. అతడు ఒప్పందం చేసినట్లయితే, స్వయంగా అతడు తనకు తానే విశ్వాసఘాతకుడిగా నిరూపించుకుంటాడు.

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

ప్రవక్తలను, సందేశహరులను عليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?

prophets-telugu-islamరచయితలు : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నానుఅని అన్నాడు(7:59)

మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా? (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు): మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి (16:36)

అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను

మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే! (51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

English Source: Appendix II from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [పుస్తకం]

Daiva Pravaktha dharmam - Telugu Islam


రచయిత
:ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

[ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]
https://bit.ly/daiva-pravaktha-dharmam
[PDF] [250 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

ఆప్త వాక్కులు

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి” (దివ్వ ఖుర్ఆన్ 3:103)

వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి“.(దివ్య ఖుర్ఆన్ 33:21)

ప్రస్తుతం ముస్లిం సమాజంలోని అధిక శాతం ప్రజలలో కానవచ్చే విశ్వాసాలు ఆరాధనా పద్ధతులు మరియు ఆచరణా వ్యవహారాలు అన్నీ ధర్మం పేరుమీద ధర్మ వ్యతిరేకమైన కొత్త పద్ధతులు కొనసాతున్నాయి. ఇందుకు కారణం ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ విధానాల గురించి ప్రజలలో నిజమైన అవగాహన లేకపోవటమే.

ప్రస్తుతం ముస్లిములలో తౌహీద్ (దేవుని ఏకత్వ) భావన అధిక శాతం లోపించింది. ఇందుకు భిన్నంగా షిర్క్ (బహుదైవారాధన) భావాలు ప్రజలలో పెరిగి పోతున్నాయి. తత్కారణంగా నేటి ముస్లిం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢ నమ్మకాలు మరియు ఒళ్ళు గగ్గురపరిచే అనేక అజ్ఞానపు చేష్ఠలు సర్వసామాన్యం అయిపోయాయి.

ప్రపంచానికి మార్గదర్శకం వహించాల్సిన ముస్లిం సమాజంలోని అధిక ప్రజలు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నారు.

ఇంతకంటే అనేక రెట్లు అజ్ఞానపు మూఢత్వంలో ఉన్న అరబ్బు జాతిని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు తౌహీద్, ఆఖిరత్ అనే నినాదాన్ని పునాదిగా చేసుకుని పతనావస్థలో ఉన్న ఆ సమాజాన్ని విశ్వాసపరంగా మరియు నైతికపరంగా ఉన్నత స్థాయికి చేర్చి ప్రపంచానికి ఆదర్శంగా మలిచారు. అందుకు కారణం ఖుర్ఆన్లోని వాక్యాలు ఎలా అవతరించాయో అలానే ప్రజలలో సర్వసామాన్యం చేయటమే.

ఈ రోజు ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ యధాస్థితిలో ఉన్నా ముస్లిం సమాజం స్థితి మారకపోవటానికి కారణం, (ఎ) ఆహారం తమ దగ్గర ఉన్నా పస్తులుండే వానివలె (బి) మందులు తమ దగ్గర ఉన్నా అనారోగ్యాన్ని దూరం చేసుకోలేని వాని పరిస్థితి వలె దైవ మార్గదర్శకత్వాన్ని పొంది కూడా దానిని పెడచెవిన పెట్టి అంధకారంలో తచ్చాడుతున్న వారిలా మారిపోయారు ముస్లింలు. అందువల్లనే అల్లాహ్ తన గ్రంథంలో ఇలా అంటున్నాడు.

“ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం మీ దగ్గరకు వస్తే ఎవడు ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకే అవుతుంది. ప్రళయంనాడు మేము అతన్ని అంధుడుగా లేపుతాము” (దివ్యఖుర్ఆన్ 20:123 124)

అందుకే ఈ రోజు ముస్లింలు ప్రపంచంలో తమ స్థితిని చక్కబరచుకోవాలంటే ఒక్కటే మార్గం. అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ బోధనలు మరియు దానిని ఆచరించి చూపిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత విధానాలు సర్వసామాన్యం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రచయిత జనాబ్ మహమ్మద్ ఖలీలుర్రహ్మాన్ గారు తౌహీద్ అంశంపై తెలుగు భాషలో సవివరంగా చర్చించటం జరిగినది. తౌహీద్ వాస్తవికతను అర్థం చేసుకోవ టానికి ఈ పుస్తకం ఉపకారి కాగలదు. పుస్తక రచనలో రచయిత సౌదీ అరేబియాలోని ప్రామాణిక రచయితల గ్రంథాల నుండి సేకరించిన అంశాలను పొందుపర్చటం జరిగినవి. తౌహీద్ తోపాటు ప్రజలు చేసే షిర్క్ దేవుని వేడుకోలు, గుణాలు, నామాలు సోదాహరణగా చర్చించటం జరిగినవి. విశ్వాసాలు, ఆరాధనలలో తౌహీద్ యొక్క వాస్తవ దృక్పథాన్ని వివరించడం జరిగినది. ఈ పుస్తకం దైవదాసులైన మానవాళికి మార్గదర్శి కావాలని, సందేశ దాతలకు సందేశ సామగ్రిగా ఉపయోగ పడాలని, పుస్తక రచయితకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…

హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రి మదని

విషయ సూచిక:

  1. తొలి పలుకులు [PDF]
  2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [PDF]
  3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం [PDF]
  4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు [PDF]
  5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ [PDF]
  6. తౌహీద్ ఆల్ రుబూబియాత్ [PDF]
  7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్ [PDF]
  8. హృదయారాధనలు [PDF]
  9. నోటి ఆరాధనలు [PDF]
  10. ఇతర శారీరక ఆరాధనలు [PDF]
  11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ [PDF]
  12. తౌహీద్ ప్రయోజనాలు [PDF]
  13. షిర్క్ యెక్క ఆరంభము [PDF]
  14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు [PDF]
  15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత [PDF]
  16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు [PDF]
  17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు [PDF]
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత [PDF]
  19. నలుగురు ఇమాములు [PDF]
  20. సున్నత్-బిద్అత్ [PDF]
  21. సలఫ్ మరియు సున్నత్ [PDF]
  22. బిద్అత్ [PDF]
  23. యాసిడ్ టెస్ట్ [PDF]
  24. ఈమాన్ [PDF]
  25. ఇహ్ సాన్ [PDF]

పరలోకం [పుస్తకం & వీడియో పాఠాలు]

paralokam

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [23 పేజీలు]

పరలోకం (పుస్తకం) – నసీరుద్దీన్ జామి’ఈ [యూట్యూబ్ ప్లే లిస్ట్] [8 వీడియోలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3JL2EaR6so-ViMpDU-HFzZ

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు (క్రొత్త వీడియోలు) :

(పాత వీడియోలు) :

[క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]

اليوم الآخر – పరలోకం

సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అల్లాహ్ కరుణ మరియు శాంతి ఘనత గల ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై కురువుగాకా! అమీన్.

విశ్వాస ఆరు స్థంబాల్లో పరలోక విశ్వాసం ఒక మూల స్థంబం. మానవుడు దివ్య గ్రంథం ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల్లో పరలోకము గురించి తెలుపబడిన రీతిలో విశ్వసించనంత వరకు విశ్వాసి కాజాలడు.

పరలోక విషయాలను తెలుసుకొనుట, ఎల్లపుడూ దాని జ్ఞప్తిలో ఉండుట చాలా ముఖ్యం. ఈ మూలంగా ఆత్మ శుద్ధి, దైవ భీతి మరియు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యం కలుగుతుంది. ఆ నాటి కష్టాల, బాధల జ్ఞాపకం పట్ల అశ్రద్ధ కంటే కఠిన హృదయులుగా మార్చునది మరియు పాపానికి ఒడిగట్టే ధైర్యం ఇచ్చునది మరొకటి లేదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

[يَوْمًا يَجْعَلُ الوِلْدَانَ شِيبًا] {المزمل:17}

ఆ దినము బాలురను ముసలి వానిగా చేసివేయునట్టి దినము. (ముజమ్మిల్ 73: 17). మరో చోట ఇలా తెలిపాడుః

[يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ، يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللهِ شَدِيدٌ] {الحج:1، 2}

ఓ ప్రజలారా! మీరు మీ ప్రభువునకు భయపడండి, నిశ్చయంగా ప్రళయ కాలం నాటి భూకంపం చాలా గొప్ప విషయం. మీరు ఆ దినమును చూచునపుడు ప్రతి పాలిచ్చు స్త్రీ తన చంటిబిడ్డను మరచి పోవును. ప్రతి గర్భిణికి గర్భము జారిపడును. ప్రజలు మత్తులుగా కనబడుదురు. వాస్తవంగా వారు మత్తులో ఉండరు. కాని అల్లాహ్ శిక్ష చాలా కఠినమైనది. (హజ్ 22:1,2).

మరణం

1- ప్రతి జీవికి ఇహలోకములో అది చివరి మెట్టు. అల్లహ్ ఆదేశం:

ప్రతి మనిషి చావును చవి చూస్తాడు. (ఆలె ఇమ్రాన్ 3: 185).

భూమి పై ఉన్నవారందరూ నశింతురు. (రహ్మాన్ 55: 26).

[إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ] {الزُّمر:30}

నీవు చావవలసి ఉన్నది. మరి వారూ చావ వలసి ఉన్నది. (జుమర్ 39: 30).

ఇహలోకములో ఏ మానవునికీ శాశ్వతం లేదు. అల్లాహ్ ఆదేశం:

పూర్వం ఏ మానవుడు శాశ్వతంగా జీవించియుండు నట్లుగా మేము చేయలేదు. (అంబియా 21: 34).

1- చావు ఖచ్చితమైన విషయం. అందులో సందేహానికి చోటు లేదు. అయినా అనేక మంది అశ్రద్ధగా ఉన్నారు. కాని ముస్లిం అధికంగా దాన్ని జ్ఞప్తిలో ఉంచాలి. దానికి సిద్ధమై ఉండాలి. వృధా గా సమయం దాటక ముందే ఇహలోకంలోనే పరలోక సామాగ్రి తయారు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(اغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمسٍ: حَياتَكَ قَبلَ مَوتِك، وَ صِحَّتَكَ قَبْلَ سَقمِكَ، وَ فَراغَكَ قَبلَ شُغلِكَ، وَ شَبَابَكَ قَبلَ هَرمِكَ، وَ غِناكَ قَبلَ فَقرِكَ)

“ఐదు విషయాలను మరో ఐదు విషయాలకంటే ఎంతో ఉత్తమమైనవని తెలుసుకోః జీవితాన్ని చావు రాక ముందు. ఆరోగ్యమును వ్యాది, అనా రోగ్యముకు ముందు. తీరికను పనులు మోపు కాక ముందు. యౌవనాన్ని వృద్ధాప్యముకు ముందు మరియు కలిమిని (సిరివంతమును) బీదరికంకు ముందు”. (హాకిం, బైహకీ ఫీ షొఅబిల్ ఈమాన్).

గమనార్హమైన విషయమేమనగాః శవం తన వెంట సమాధిలో ఇహలోక సామాగ్రి తీసుకెళ్ళదు. తన ఆచరణ మట్టుకే తనతో ఉంటుంది. అందుకు సత్కార్యాల సామాగ్రి వెంట తీసుకెళ్ళే ప్రయత్నం చేయు. దాని మూలంగానే నీవు అచ్చట సుఖాలు పొందుతావు. అల్లాహ్ కరుణతో ఆ శిక్షల నుండి రక్షణ కూడా పొందుతావు.

2- మనిషి చావు గుప్తముగా ఉంది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరి చావు ఎక్కడ వచ్చునో ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. ఎందుకనగా ఇది అగోచర జ్ఞానంలో ఒకటి. అందుకే అల్లాహ్ కు మాత్రమే తెలియును.

3- చావు వచ్చిన తరువాత దానిని నెట్టేయడం, ఆలస్యం చేయడం మరియు చావు రాకుండా పరిగెత్తడం కాని పని. అల్లాహ్ ఆదేశం:

ప్రతి జాతి వారికొక గడువు నియమింపబడియున్నది. మరియు వారి గడువు వచ్చినపుడు ఒక గడియ వెనుక గాని ముందు గాని వారు కానేరరు. (ఆరాఫ్ 7: 34).

4- విశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత అందమైన ముఖము, సువాసన దుస్తులతో వస్తాడు. అతనితో కరుణ దూతలు స్వర్గము యొక్క శుభవార్తలు వినిపిస్తూ హాజరవుతారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః

ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మరల అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దేవదూతలు దిగివచ్చి ‘మీరు భయపడకండి. మరియు చింత పడకండి మీతో వాగ్దానం చేయబడుతున్న స్వర్గంతో సంతోషపడండి’ అని పలుకుదురు. (హామ్మీం అస్సజ్దా 41: 30).

అవిశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత భయంకరమైన నల్లటి రూపములో దుర్వాసన దుస్తులతో వస్తాడు. అతనితో శిక్ష దూతలు శిక్షల శుభవార్తతో హాజరవుతారు. ఈ విషయమే అల్లాహ్ ఇలా తెలిపాడుః

ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యా యంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు తనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకర మైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!. (అన్ఆమ్ 6: 93).

చావు వచ్చినపుడు వాస్తవము స్పష్టమయి అసలు సంగతే మిటో ప్రతీ ఒకరికీ తెలుస్తుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః

తుదకు వారిలోనొకనికి చావు వచ్చునపుడు ఓ నాప్రభువా! నన్ను తిరిగి పంపి వేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది. (మూమినూన్ 23: 99-100).

అవిశ్వాసులు మరియు పాపాత్ములు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యములు చేయాలని కోరుదురు కాని అపుడు ఆ పశ్చాత్తాపం ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఆదేశం చదవండిః

మరియు నీవు పాపాత్ములను చూచెదవు, వారు బాధను చూచునపుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు. (షూరా 42: 44).

5- తన దాసులపై అల్లాహ్ కరుణ ఒకటేమనగాః మరణానికి ముందు ఎవరి చివరి మాట “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో అతను స్వర్గ ప్రాప్తుడవుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(مَنْ كَانَ آخِرُ كَلاَمِهِ ، لآ إله إلا الله دَخَلَ الْجَنَّة)

“ఈ ప్రపంచములో ఎవరి చివరి పలుకులు “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అబూ దావూద్ 3114). ఎందుకనగా ఈ క్లిష్ట సమయంలో మనిషి కలిమహ్ పఠించడం అసాధ్యం. అది తను మనుస్ఫూర్తిగా పఠించి దాని ప్రకారం ఆచరించినవాడయితే తప్ప. మనుస్ఫూర్తిగా పఠించని వ్యక్తి మరణ వేదనలో గల కష్టాలను భరించ లేక అది మరచిపోవును. అందుకు సక్రాత్ లో ఉన్న వ్యక్తికి దగ్గర కూర్చున్నవారు అతనికి కలిమహ్ తల్ ఖీన్ చేయడం (ఉపదేశించడం) పుణ్యకార్యం.

సమాధి

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పోతుండగా అతడు వారి చెప్పుల శబ్దం వింటాడు. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘అతను అల్లాహ్ దాసుడు మరియ అల్లాహ్ ప్రవక్త’ అని నేను సాక్ష్యమిస్తున్నానని విశ్వాసి బదులిస్తాడు. ‘ఇదిగో నరకంలో నీ ఈ స్థలాన్ని చూడు దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం అల్లాహ్ నీకు ప్రసాదించాడు’ అని అతనికి చెప్పబడుతుంది. అతడు స్వర్గము నరకము రెండూ చూస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరియు అవిశ్వాసి లేదా వంచకున్ని ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘నాకు తెలియదు. లోకముతీరు నేనన్నాను’ అని అతను సమాధానమిస్తాడు. ‘నీవు తెలుసుకోలేదు మరియు ఖుర్ఆన్ పఠించలేదంటూ ఇనుప గదాలతో ఒక్క సారి కొడితే అతడు దాన్ని భరించలేక అరుస్తాడు. అతని కేకను ఇరుజాతులు తప్ప సమీపములోనున్న వారందరు వింటారు’. (బుఖారి 1338, ముస్లిం 2870).

ఆత్మను సమాధిలో ఉన్న దేహంలో పంపడమనేది పరలోక విషయం. మనిషి ఊహలకు అందనిది. అయినా సమాధిలో శుభాలకు, వరాలకు అర్హులైన విశ్వాసులకు శుభాలు మరియు శిక్షలకు అర్హులైన అవిశ్వాసులకు శిక్షలు జరగడం వాస్తవమేనని ముస్లిములందరూ ఏకీభవించారు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

వారు ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ గడియ వచ్చినపుడు ‘ఫిర్ఔను ప్రజలను తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజెయ్యండి’ అని ఆజ్ఞాపించబడుతుంది. (మోమిన్ 40: 46). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః 

(تَعَوَّذُوا بِاللهِ مِن عَذَابِ الْقَبر)

“సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరండి”. (ముస్లిం 2867).

బుద్ధీ జ్ఞానాలతో గమనిస్తే ఇది తిరస్కరించలేని విషయం. ఇలాంటి ఉదాహరణాలు మానవుడు ఎన్నో చూస్తాడు. నిద్ర పోయిన వ్యక్తి కలలో ఎంతో శిక్షించబడుతున్నట్లుగా చూస్తాడు, అరుస్తాడు, సహాయం కోరుతాడు. కాని అతని ప్రక్కనే ఉన్న వ్యక్తికి అతని గురించి ఏమీ తెలియదు. ఇహలోకములోనే ఇలా ఉన్నప్పుడు చావు బ్రతుకుల్లో ఎంతో తేడా ఉన్న ఆ మరణాంతర విషయాన్ని ఊహించ గలమా? సమాధిలో శిక్ష ఆత్మ, దేహము రెండింటికగును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః సమాధి పరలోకము యొక్క మొదటి మెట్టు అది క్షేమంగా దాటిన వారికి ఆ తరువాత చాలా సుఖము గలదు. మరియు క్షేమంగా దాటని వారికి ఆ తర్వాత చాలా కష్టము గలదు. (తిర్మిజి 2308).

అందుకని విశ్వాసి అధికంగా సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరుతుండాలి. ప్రత్యేకంగా నమాజులో సలాంకు ముందు. మరియు పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పాపాలే సమాధి శిక్షలకు మరియు నరక శిక్షలకు మూల కారణం.

సమాధి శిక్షలు: అనేక మంది సమాధి చేయబడుతారు కాబట్టి సమాధి శిక్ష అనబడింది. నీట మునిగి పోయినవారు, కాలి పోయినవారు మరియు క్రూర జంతువులకు ఆహారముగానైన వారందరికి శిక్షలు బర్ జఖ్ (ఇహపర లోకాల మధ్య స్థానం)లో తప్పవు. సమాధి శిక్షలు అనేక రకాలుగా ఉండును. ఇనుప గదాలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరక పడకలు వేయబడి నరక ద్వారములు తెరువబడును. చెడు కార్యములు దుర్వాసన, అందవికారంగా మరియు భయంకరమైన రూపములో తోడుగా ఉండును. ఈ శిక్షలు అవిశ్వాసులకు మరియు వంచకులకు శాశ్వతంగా ఉండును. కాని విశ్వాసి అయిన పాపాత్మునికి పాపాల ప్రకారంగా శిక్ష జరిగిన తర్వాత అంతమై పోవును.

సమాధి వరాలు:  స్వచ్ఛమైన విశ్వాసుని సమాధి విస్తీర్ణము చేయబడి నూర్ (కాంతి)తో నింపబడును. మరియు స్వర్గ ద్వారములతో సువాసన, స్వర్గము యొక్క గాలి వీస్తుండగా స్వర్గ పడకలు వేసి యుండును. మరియు సత్కార్యాలు సువాసనతో నిండి అందమైన రూపములో తోడుగానుండును.

ప్రళయ దినం మరియు దాని సూచనలు

1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు. (హజ్ 22: 7). మరో చోట ఇలా చెప్పాడుః

మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును. (సబా 34: 3). ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః

[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

తీర్పు కాలం సమీపించినది. (ఖమర్ 54: 1). మరో చోటః

ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు. (అంబియా 21:1)

ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెనుః

ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు. (అహ్ జాబ్ 33: 63).

ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

అందులో ఒకటిః మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః అతడు కాణుడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

ప్రళయదిన సూచనల్లో రెండవదిః ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

ప్రళయదిన సూచనల్లో మూడవదిః పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడుః

“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు. (యాసీన్ 36: 51).

ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము. (మఆరిజ్ 70: 43,44).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. “కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారుః “ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి”. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసు లారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

నరకము మరియు నరకశిక్షలు

అల్లాహ్ ఆదేశం:

ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది. (బఖర 2: 24).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం”. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా “ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును” అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:

[كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا العَذَابَ] {النساء:56}

వారి చర్మము కాలిపోవునపుడల్లా దానికి బదులుగా వేరు చర్మమును వారు బాధ రుచి చూచుటకై కల్పించుచుందుము. (నిసా 4: 56). మరో చోట ఇలా తెలిపాడుః

[وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَى عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا كَذَلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ] {فاطر:36}

తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము. (ఫాతిర్ 35: 36).

వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః

[وَتَرَى المُجْرِمِينَ يَوْمَئِذٍ مُقَرَّنِينَ فِي الأَصْفَادِ ، سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَى وُجُوهَهُمُ النَّارُ] {إبراهيم:49، 50}

ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును. (ఇబ్రాహీం 14: 49,50).

వారి తిండి విషయం ఇలా తెలిపాడుః

నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును. (దుఖాన్ 44: 43-46).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!”. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే “నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది”. (ముస్లిం 2807).

స్వర్గం

అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండిః

వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికీ తెలియదు. (సజ్దా 32: 17).

అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికిని విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా జేయును. (ముజాదల 58: 11).

వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు. అల్లాహ్ ఆదేశం:

పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు. (సాఫ్ఫాత్ 37: 45-47).

అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది”. (బుఖారి 2796).

విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.

స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు”. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.

ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!