ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 2 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:55 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 2
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 1 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:50 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 1
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

[ఈ వీడియోలో చెప్పబడిన బుక్ విషయాలు మీ సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాము. వీడియో వింటూ క్రింది టెక్స్ట్ ఫాలో కండి]

త్రిసూత్రాలు

  1. నీ ప్రభువు ఎవరు? 2. నీ ధర్మం ఏది? 3. నీ ప్రవక్త ఎవరు?

కూర్పు : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి M.A.

మనవి

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈ పుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి.

పాఠకులారా…

12వ శతాబ్దము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కు తీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యేభయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది.

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తి… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”.

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ హిజ్ర శకం 1115 సంవత్సరంలో “నజ్ద్ ” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో ” ముహమ్మద్ బిన్ సఊద్ ” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విసృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవరాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి.

  1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు?
  2. నీ ధర్మం ఏది?
  3. నీ ప్రవక్త ఎవరు?

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది.

అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వార ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలు పంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను…ఆమీన్.

ధార్మిక సేవలో……….
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి, M.A.
తెలుగు అనువాదకులు మర్కజుల్ హిదాయ, బహ్రన్.


అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో…

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

పాఠకులారా…

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తు పెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి.

మొదటి విషయం :విద్యా భ్యాసన

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట.

రెండవ విషయం : ఆచరణ

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట.

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. నాలుగో విషయం : ఓర్పు, సహనం
ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట.

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు:

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప“. (అల్ అఫ్ 103: 1-3)

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు:

అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది.”

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు.

“మాట, బాటకు ముందు జ్ఞానం’ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట)

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే :

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేదు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) |

فبدأ بالعلم.

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు.

పాఠకులారా..

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి.

మొదటి సమస్య:

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గ వాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16)

రెండవ సమస్య:

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (జిన్‌ 72:18)

మూడవ సమస్య:

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీప బంధువులైన సరె. ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం:

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా,వారి కుమారులైనా,వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు. ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ షక్షం వారే సఫలీకృతులయ్యే వారు”.(అల్ ముజాదలహ్ 58:22)

పాఠకులారా..

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే “హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు.

నేను సృష్టించలేదు జిన్నాతులను, మానవులను, కాని నా ఆరాధనకు (తప్ప)”. (అజ్జారియాత్ 51:56)

య’బుదూన్” అనే పదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి.

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్” అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు.

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

మరియు మీరందరూ అల్లాహ్ ని ఆరాధించండి, మరి అతనితో ఎవరినీ సాటి కల్పించకండి”. (అన్నిసా 04:36)


బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

ప్రతి మానవుడికి ఏ 3 సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి:

  1. ప్రతి వ్యక్తి తన ప్రభువు గురించి అవగాహన పొందడం.
  2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం.
  3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) గురించి అవగాహన పొందడం.

ప్రధమ సూత్రం:

విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి”నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నాఆరాధ్యదేవుడు. ఆయన తప్ప మరోక ఆరాధ్యదేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి :

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01 :02)

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి.

మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వార కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి.

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి.
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆరెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ.

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు :

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు,అయన (అల్లాహ్) చిహ్నాల్లోనివే, మీరు సూర్యునికి, చంద్రునికి ఆరాధించకండి (సాష్టాంగం చేయకండి). మీరు ఆరాధించేవారైతే వాటిని సృష్టించిన అల్లాహ్ ను అరాధించండి (సాష్టాంగం చేయండి).” (ఫుస్సిలత్ 41:37)

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

వాస్తవానికి మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు తదనంతరం తన సింహాసనం (అర్ప్)ను అధిష్టించాడు. ఆయనే రాత్రిని పగలుపై కప్పుతున్నాడు, మళ్ళీ పగలుని రాత్రి వెంట పరుగులు తీయిస్తున్నాడు.ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మరియు నక్షత్రాలను సృష్టించాడు. అన్ని ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి. గుర్తుంచుకొండి. సృష్టించడం, ఆజ్ఞాపించడం ఆయనకే చెల్లుతుంది. శుభాలుకలవాడు అల్లాహ్ యే, ఆయనే సర్వలోకాలకు ప్రభువు”. (అల్ ఆరాఫ్ 7: 54)

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

ఓ మానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ కూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22)

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు:

పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు” (తఫ్సీర్ ఇబ్నె కసీర్)

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబి వ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి.

అరబి నామాలు (ఆరాధనల పేర్లు)

ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, దుఆ, ఖాఫ్, తవక్కుల్, ఖుషూ, ఇస్తిఆనత్, రఘ్-బత్ , ఖషియత్, ఇస్తి ఆజహ్, ఖుర్బాని, ఉమ్మీద్ వ రజా, రహ్బత్, రుజూ, జబహ్ఇ, ఇస్తిఘాసహ్, నజర్ వ మిన్నత్ మొదలైనవి.

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కే పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్ లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ (ప్రార్ధన) కొరకే ఉన్నాయి. అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి“. (అల్ జిన్న్ 72 :18)

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైన అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ని గమనించండి:

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవరైనా అల్లాహ్ తో పాటు వేరే దైవాన్ని పిలిస్తే (అప్పటికి) అతని వద్ద అలా పిలవటానికి ఎటువంటి ప్రమాణికం (సూచిక) లేదు. అలాంటి వ్యక్తి లెక్క అల్లాహ్ పై ఉన్నది. నిస్సందేహంగా అవిశ్వాసులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు”. (అల్ మొమినూన్ 23:117)

గమనిక :

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ల నుండి పేర్కొనడం జరిగింది గమనించండి

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం, వీడియో పాఠాలు] [మర్కజ్ దారుల్ బిర్ర్]

బిస్మిల్లాహ్


Usool-Thalatha & Qawaid-al-Arba
Shaykh Muhamamd bin AbdulWahhab (rahimahullah)
మూల రచయిత షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
అనువాదం: అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

[Download the Book]
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

[47 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వీడియో పాఠాలు:

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

మనవి 

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈపుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి. 

పాఠకులారా.. 

12వ శతాబ్ధము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కుతీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యే భయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది. 

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తే… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”. 

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్’ హిజ్రి శకం 1115 సంవత్సరంలో “ నజ్ద్” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో “ముహమ్మద్ బిన్ సఊద్” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్నీ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవారాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 

  • 1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు? 
  • 2. నీ ధర్మం ఏది? 
  • 3. నీ ప్రవక్త ఎవరు? 

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది. అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. 

ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వారా  ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలుపంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను… ఆమీన్. 

ధార్మిక సేవలో……… 
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి,M.A. 
తెలుగు అనువాదకులు , మర్కజుల్ హిదాయ, బహ్రేన్. 3-4-2007. 

అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తుపెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి. 

మొదటి విషయం :విద్యాభ్యాసన 

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట. 

రెండవ విషయం : ఆచరణ 

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట. 

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం 

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. 

నాలుగో విషయం : ఓర్పు, సహనం 

ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట. 

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

وَالْعَصْرِ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ . إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 

అర్ధం: “కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప”. (అల్ అస్103:1-3) 

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు: 

لَو مَا أَنْزَلَ اللهُ حُجَّةً عَلى خَلْقِهِ الْاهْذِهِ السُّورَةِ لَكَفَتُهُم 

అర్ధం : అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు. 

మాట, బాటకు ముందు జ్ఞానం‘ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట) 

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే : 

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ

అర్ధం: “తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) 

فَبُدَأَ بِالْعِلْمِ. 

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు. 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి. 

మొదటి సమస్య: 

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గవాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. 

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

అర్ధం : “మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16) 

రెండవ సమస్య: 

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) 

అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు: 

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

అర్ధం : “నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (అల్ జిన్న్ 72:18) 

మూడవ సమస్య: 

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీపబంధువులైన సరె. 

ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం: 

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ

అర్ధం : “అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను  ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు.ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆవనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యే వారు”. (అల్ ముజాదలహ్ 58:22) 

పాఠకులారా.. 

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే ” హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”.(అజ్జారియాత్ 51:56) 

يَعْبُدُونِ : అనేపదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి. 

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్”. అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”.(అన్నిసా 04:36)  

బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

ప్రతి మానవుడికి ఏ మూడు సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి: 

  • 1. ప్రతి వ్యక్తి తనప్రభువు గురించి అవగాహన పొందడం. 
  • 2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం. 
  • 3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గురించి అవగాహన పొందడం. 

ప్రధమ సూత్రం : విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన 

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి “నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దేవుడు. ఆయన తప్పమరోక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం. 

ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి : 

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

అర్ధం : “సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01:02) 

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి. మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వారా కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి. 

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి. 
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆ రెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ. 

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు: 

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు: 

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి (ఫుస్సిలత్ 41:37) 

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు”. (అల్ ఆరాఫ్ 7: 54) 

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది: 

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَالَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

అర్ధం : ఓమానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మిమ్మల్నీ, మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు.దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూకూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22) 

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు: 

الْخَالِقُ لِهذِهِ الأشْيَاءَ هُوَ الْمُسْتَحِقُ لِلْعِبَادَةِ (تفسير ابن كثير : ۱ : ۵۷ طبع مصر) 

అర్ధం : పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు (తఫ్సీర్ ఇబ్నెకసీర్) 

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబివ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి. 

ఆరాధనల అరబి నామాలు:

ఇస్లాం, ఈమాన్ ,ఇహ్సాన్ ,దుఆ ,ఖవ్ ఫ్ ,ఉమ్మీద్ వ రజా ,తవక్కుల్ ,రఘ్బత్ ,ఖుషూ ,ఖషియత్,  రుజూ ,ఇస్తి ఆనత్ ,ఇస్తి ఆజహ్ ,ఇస్తిఘాసహ్, జబహ్ ,ఖుర్బాని ,నజర్ వ మిన్నత్ మొదలైనవి. 

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కు పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. (అల్ జిన్న్ 72:18) 

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైనా అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ను గమనించండి : 

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ – అల్లాహ్‌ తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు”.  (అల్ మొమినూన్ 23:117) 

గమనిక : 

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ నుండి పేర్కొనడం జరిగింది గమనించండి. 

దుఆ (ప్రార్ధన) : అన్ని రకాల వేడుకోలు, మొరలు

మన అవసరాలను తీర్చుటకు సృష్టికర్తయిన అల్లాహ్ నే వేడుకుంటాము. కాబట్టి అది (మొరపెట్టుకునే) ఆరాధన. ‘దుఆ’యే ఆరాధన అని చెప్పటానికి దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) హదీసులో దీని గురించి ఇలా ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

الدُّعَاءُ مُخُ الْعِبَادَةِ . (ترمذی) 

అర్ధం : “ దుఆయే ఆరాధనలోని అసలైన పౌష్టికం”. (తిర్మిజి) 

దీనికై దైవ గ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించడం జరిగింది: 

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

అర్ధం: “మీ ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు- నన్ను పిలవండి. నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. ఎవరైన అహంకారంతో నా ఆరాధనను తిరస్కరిస్తే వారు తప్పకుండా హీనులై నరకములో ప్రవేశిస్తారు”. (అల్ మొమిన్ 40:60) 

‘ఖవ్ ఫ్ : భయ భీతి 

కేవలం అల్లాహ్ పట్ల భయభీతి కలిగివుండాలి తప్ప ఇతరుల భయభీతి మనసులో వుంచకూడదు. కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. అల్లాహ్ భయభీతి (అల్లాహ్ కు భయపడటం) కూడ ఆరాధనే. పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ 03:175) 

ఉమ్మీద్ వ రజా: ఆశా & భీతి 

దాసుడు అల్లాహ్ పట్ల విశ్వాసుడై ఆయనపై ఆశలు పెట్టుకుంటాడు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

అర్ధం : “ఎవరైన తన ప్రభువుతో కలవాలని ఆశిస్తున్నప్పుడు అతను సత్కార్యాలు చెయ్యాలి, 

మరియు ఆరాధనల్లో తన ప్రభువుకు సాటి కల్పించకూడదు. (అల్ కహఫ్18:110) 

తవక్కుల్: అల్లాహ్ పై నమ్మకం 

నమ్మకం అంటే ఏదైన కార్యం జరగాలని ఆయన (అల్లాహ్) పైనే నమ్మకం, భారం మోపుతారు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి“. (అల్ మాయిదా 5:23) 

దైవ గ్రంధములో మరో చోట ఇలా తెల్పబడింది: 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు”. (అత్తలాఖ్ 65:3) 

రగ్బత్, రహ్బత్, ఖుషూ: ఆయన వైపే మరలుతూ భయపడాలి 

అంటే ఆశ, భయభీతి తోను, వినమ్రత తోనూ ఆయన వైపే మరలుతారు. ఇదీ ఆరాధనే. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు”. (అల్ అంబియా 21:90) 

ఖష్యత్ : భయ భక్తులు కలిగి వుండటం 

ఎవరైన దౌర్జన్యం చేసినప్పుడు భయపడతాం. కాని అటువంటి సందర్భాల్లో కూడ అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. ఇదీ ఒక ఆరాధనే. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా ప్రస్తావించాడు: 

 فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي

మీరు వారితో భయపడకండి, నా తోనే భయపడండి”. (అల్ బఖర 2:150) 

ఇనాబత్, రుజు : మరలటం 

తప్పు జరిగిన ప్రతిసారి అల్లాహ్ వైపు మరలాలి. ఇదీ ఒక ఆరాధనే. 

దీనికై పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి”. (అజ్జుమర్ 39:54) 

ఇస్తిఆనత్ : సహాయం కొరకు అర్ధించుట 

సర్వశక్తులు కలవాడైన అల్లాహ్ నుండి సహాయం కోరాలి. ఇదికూడ ఒక ఆరాధన. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

మేము నిన్నే ఆరాధిస్తున్నాము, మరియు నీతోనే సహాయాన్ని కోరుతున్నాము”. (అల్ ఫాతిహ 01:05) 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో కూడ ప్రత్యేకించి దీని గురించి చెప్పబడింది. 

إِذَا سُتَعَدُتَ فَاسْتَعِنُ بِاللَّهِ 

అర్ధం : “మీరు సహాయం కోరాలనుకున్నప్పుడు అల్లాహ్ సహాయాన్నే అర్ధించండి”. (తిర్మిజి, హసన్ సహీహ్) 

ఇస్తిఆజాహ్: శరణం, ఆశ్రయం కోరుట 

పరిపూర్ణంగా ఆశ్రయమిచ్చే అల్లాహ్ ఆశ్రయాన్నే కోరాలి. ఇదీ ఒక ఆరాధనే. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ اَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ 

నేను మానవుల ప్రభువుతో, శరణు కోరుతున్నాను. మానవుల చక్రవర్తి (అల్లాహ్) తో (శరణు కోరుతున్నాను)”. (అన్నాస్ 114:1-2) 

ఇస్తిగాస: నిర్బంధత్వంలో అల్లాహ్ సహాయాన్ని అర్జించుట

 ఇదీ ఒక ఆరాధనే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ

అర్ధం : “ఆ సందర్భాన్ని తలచుకొండి అప్పుడు మీరు మీ ప్రభువును మొరపెడుతూ వేడుకున్నారు అప్పుడు ఆయన మీ బాధను విన్నాడు (మీమొరను ఆలాకించాడు)”. (అల్  అన్ ఫాల్  08:09) 

జిబాహ్, ఖుర్బాని : సమర్పణ, బలిదానం 

ఇదికూడ అల్లాహ్ కొరకే చేయాలి. 

అల్లాహ్ పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.” (అల్ అన్ఆమ్ 06:162,163) 

దీనిగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ఇలా ప్రస్తావించారు: 

لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ 

ఎవరైన అల్లాహ్ ను తప్ప మరే ఇతర ఆరాధ్య దేవుళ్ళ (ప్రవక్త, వలి, పీర్, ముర్షద్, బాబా, సమాధిలోని వాడు) సన్నిధి కోరాలని దేనినైనా బలిస్తే, అతని పై అల్లాహ్ శాపం కలుగుతుంది”. (ముస్లిం) 

నజర్ : మొక్కుబడి 

ఇది కూడ అల్లాహ్ కోసమే చేయాలి. ఇది కూడా ఒక ఆరాధనే. దీని గురించి ఖుర్ఆన్ గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అద్దహర్ 76:7) 

رَبِّ زِدْنِي عِلْمًا 

ద్వితీయ సూత్రం: 

ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో తెలుసుకోవడం తప్పని సరి 

అల్లాహ్ ఏకత్వాన్ని సహృదయముతో అంగీకరిస్తూ తమకు తాము అల్లాహ్ కు విధేయులుగా సమర్పించుకోవాలి. ఆయన ఆదేశాలకు అణుగుణంగా విధేయతపాటిస్తూ అనుసరించాలి. ఆయనతో పాటు మరెవ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాటి కల్పించకూడదు. ఇదే సత్య ధర్మం (దీన్). 

ధర్మంలో 3 స్థానాలున్నాయి: 

  • 1. మొదటి స్థానం : ఇస్లాం 
  • 2. రెండవ స్థానం : ఈమాన్ 
  • 3. మూడవ స్థానం : ఇహ్సాన్ 

ఈ మూడింటిలోనూ ప్రతి దానికి కొన్ని మూలాలున్నాయి.

ఇస్లాం – దీనికి 5 మూలాలున్నాయి. 

  • 1. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడని, (తౌహీద్) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్య ప్రవక్త అని సాక్షమివ్వటం. 
  • 2. నమాజు స్థాపించటం. 
  • 3. జకాత్ (ధర్మ దానం) ఇవ్వటం. 
  • 4. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం. 
  • 5. హజ్ (కాబా గృహ దర్శనం) చేయటం. 

పై పేర్కొనబడిన “ఇస్లాంకు గల 5 మూలాల” గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

1. తౌహీద్: అల్లాహ్ ఏకత్వానికి సాక్షమివ్వటం 

అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యదేవుడు. ఆయనకు సాటి ఎవరూలేరు అని నమ్మి, ఉచ్చరించడం. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు”. (ఆలి ఇమ్రాన్ 03:18) 

తౌహీద్ గురించి సాక్ష్యం అంటే అల్లాహ్ తప్ప మరెవరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు. ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ వాక్యపరంగా కలిగివున్న అర్ధం ఏమిటంటే, ‘లాఇలాహ‘ ఏ దేవుడు లేడని, “అల్లాహ్ తప్ప మరిదేనిని ఆరాధించిన, పూజించిన నిరాకరించ బడుతుందనే అర్ధం కలిగివుంది”. మరి ‘ ఇల్లల్లాహ్ ‘ కేవలం ఏకైక అల్లాహ్ కొరకే సమస్త ఆరాధనలు ఉన్నాయనే అర్ధం కల్గియుంది. ఆయన సామ్రాజ్యంలో, ఎలాగైతే ఎవరూ భాగస్వాములు లేరో, అలాగే ఆయన ఆరాధనల్లో ఆయనకు ఎవరూ సాటిలేరు. 

దీని గురించి పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను.“నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.”మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి. (అజ్ జుఖ్ రుఫ్ 43:26-28) 

మరొక చోట ఖుర్ఆన్ గ్రంధములోఇలా ప్రస్తావించబడింది. 

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ

(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి. (ఆలి ఇమ్రాన్ 03:64) 

దైవ సందేశరునికి సాక్ష్యం : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ ప్రవక్త అని సాక్షమివ్వాలి. అందుకు పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు”. (అత్ తౌబా 9:128) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం అంటే ఆయన ఇచ్చిన ఆదేశాలను సంపూర్ణంగా పాటించటం. ఆయన దేనినైతే తెలియచేశారో దానిని సత్యం అని అంగీకరించాలి. దేని గురించైతే నిరాకరించారో దానికి పూర్తిగా కట్టుబడి వుండాలి. అల్లాహ్ ఆరాధన కేవలం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడుగు జాడల్లోనే ఆచరించాలి. 

నమాజ్, జకాత్, తౌహీద్ మూడింటికి సంబంధించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం”. (అల్ బయ్యిన 98:05) 

పవిత్ర రమజాన్ మాసములో ఉపవాసాలు పాఠించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”. (అల్ బఖర 2:183) 

కాబా గృహాన్ని సందర్శించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు: 

فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ

అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఆలి ఇమ్రాన్ 03:97) 

రెండవ స్థానం: ఈమాన్ 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

“ఈమాన్ (విశ్వాసం) కు సంబంధించి డెబ్భైకు పైగా స్థానాలున్నాయి. అందులో ఉన్నత స్థానం “లాఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు) అని సాక్ష్యం పలకటం. అన్నిటి కంటే అల్ప స్థానం దారి నుండి హాని కల్గించే వస్తువు (ముళ్ళు వంటివి)ను దూరం చేయడం.సిగ్గు, వ్రీడ, శీలం కూడ విశ్వాసానికి సంబంధించిన విషయాలే”. (సహీహ్ ముస్లిం). 

ఈమాన్ కు 6 కోణాలున్నాయి 

  • 1. అల్లాహ్ ను విశ్వసించుట.
  • 2. అల్లాహ్ దూతలను విశ్వసించుట.
  • 3. అల్లాహ్ గ్రంధాలను విశ్వసించుట.
  • 4. అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించుట.
  • 5. ప్రళయ దినాన్ని విశ్వసించుట. 
  • 6. విధి వ్రాత చెడైన, మంచిదైన దానిని విశ్వసించుట. 

ఈమాన్ (విశ్వాసం)కు గల 6 కోణాలకు ఆధారాలు : 

పైన పేర్కొనబడిన ఆరింటిలో ఐదు గురించి దైవగ్రంధం పవిత్ర పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం” (అల్ బఖర 2:177) 

6వ కోణం విధి వ్రాత (మంచి, చెడు) గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా పేర్కొనబడింది: 

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ

నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము”. (అల్ ఖమర్ 54:49) 

మూడవ స్థానం: ఇహ్సాన్: ఉత్తమం 

‘ఇహ్సాన్’కు సంబంధించి ఒకే ఒక మూలం ఉంది. అది మీరు అల్లాహ్ ను  అభిమానంతో, భయభక్తితో, ఆయన వైపు ఏకాగ్రతతో,మరలుతూ ప్రార్ధించాలి. మనస్పూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నట్టు ఆరాధించాలి. మనము చూడలేక పోయినా ఆయన మమ్మల్ని చూస్తునే ఉన్నాడని గ్రహించాలి. 

‘ఇహ్సాన్ ‘కు సంబంధించిన ఆధారాలు : 

‘ఇహ్సాన్’ గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ

నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు” (అన్ నహ్ల్ 16:128) 

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగ పడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు”.  (ఆష్ షుఅరా 26: 217-220). 

మరో చోట ఇలా పేర్కొన్నాడు: 

وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ

(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము” (యూనుస్ 10:61)

పై మూడింటికి సున్నత్ ఆధారాలు: 

ధర్మంలో పై మూడు స్థానాలు ఉన్నాయని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రముఖ, ప్రఖ్యాత హదీసు ‘హదీసె జిబ్రయీల్ ‘ను గమనించండి: 

” عن عمر بن الخطاب رضی الله عنه قال: بينما نحن جلوس عند النبى الله اطلع علينا رجلٌ 

شديد بياض الثياب، شديد سواد الشعر، لأيرى عليه أثر السفر، ولا يعرفه منا احد. فجلس 

الى فـأسـنــدركبتيه إلى ركبتيه ووضع كـفيـه عـلـى فـخـذيــه وقال: يا محمد، أخبرني عن الإسلام، فقال: أن تشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله ، وتقيم الصلوة، وتؤتي الزكاة،وتصوم 

رمضان، وتحج البيت إن استطعت اليه سبيلاً. قال : صدقت. فعجبناله يسأله ويصدقه. قال: أخبرني عن الإيمان، قال أن تؤمن بالله وملائكته وكتبه ورسله واليوم الآخر وبالقدر خيره وشره.قال: أخبرني عن الاحسان، قال: أن تعبد الله كأنك تراه فان لم تراه فانه يراك. قال أخبرني عن الساعة،قال: ما المسؤل عنها بأعلم من السائل. قال أخبرني عن أمارتها، قال: ان تلد الامة ربتها وأن ترى الحفاة العراة العالة رعاء 

الشاء، يتطاولون في البنيان قال : فمضى فلبثنامليا . قال : يا عمر أتدرون من السائل؟ قلنا: الله ورسوله 

أعلم، قال: هذا جبريل أتاكم يعلمكم أمر دينكم .” (صحیح بخاری و صحیح مسلم 

అర్ధం : హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) కధనం: 

“ఒక సారి మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి మా సమావేశంలో వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. తరువాత ఇలా ప్రశ్నించసాగాడు: 

ఓ ముహమ్మద్..! (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్లాం గురించి వివరించండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప మరేఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తూ, ‘నమాజు’ స్థాపించాలి. ధర్మదానం చేయాలి(జకాత్ చెల్లించాలి). పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసాలను పాటించాలి. సిరి, సంపదలు కల్గివుంన్నప్పుడు పవిత్ర ‘ కాబా’ (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే.. అన్నాడు. అతని జవాబుకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తునాడు, తనే నిజమంటున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు: ‘ఈమాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “అల్లాహ్ ను , ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మంచి, చెడు)ను విశ్వసించాలి. 

ఇది విన్న ఆ వ్యక్తి మళ్ళి ఇలా ప్రశ్నించాడు: ‘ఇహ్సాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు మనస్ఫూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నటు ఆరాధించు.. నీవు చూడక పోయిన ఆయన నిన్ను గమనిస్తున్నాడని గ్రహించు”. అనంతరం మళ్ళీ ప్రశ్నించాడా వ్యక్తి: మరి ప్రళయం ఎప్పుడోస్తుందో తెల్పండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ప్రళయం ఎప్పుడోస్తుందో ప్రశ్నించదగిన వానికంటే ప్రశ్నించే వాడికే బాగా తెలుసు” అని అన్నారు. ఆ వ్యక్తి మరల ప్రశ్నించాడు: అయితే దాని చిహ్నాలను చెప్పండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “బానిసరాలు తమ యజమానిని కంటారు. చెప్పులు, వస్త్రాలు లేని మెకల కాపర్లు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”. 

హజ్రత్ ఉమర్(రజి అల్లాహు అను) ఇలా తెలిపారు: ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము కొద్దిసేపు మౌనంగా వున్నాము. అంతలోనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- ఓ ఉమర్..! (రజి అల్లాహు అన్హు) ఆ ప్రశ్నికుడేవరో తెలుసా..? అన్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (బుఖారి, ముస్లిం). 

మూడవ సూత్రం: దైవప్రవక్త ﷺ గురించి అవగాహన 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన తండ్రి పేరు అబ్దుల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల మహా వృక్షము ఇలా ఉంది:  ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం

‘హాషిం’ వంశం పరువు, ప్రతిష్ఠ పేరు ప్రఖ్యాతలకు నిలయం. ఇది ఖురైష్ వంశానికి చెందింది. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అరేబియులు (అరబ్బులు) ప్రవక్త ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) సంతానం. 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) పూర్తి జీవిత కాలం 63సంవత్సరాలు. అందులో 40సంవత్సరాలు దైవ వాణి అవతరించక ముందువి. దైవ వాణి అవతరించి దైవ సందేశహరులుగా సంవత్సరాలు జీవించారు. ఆయన పవిత్ర మక్కా నగరంలో జన్మించారు. ఆయన పై తొలి దైవ వాణిలో ఈ వాక్యాలు అవతరింపబడ్డాయి. 

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ

(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (అల్ అలఖ్ 96:1) 

(వాటి ద్వార దైవప్రవక్తగా నియమితులయ్యారు.)

రెండో సారి దైవ వాణిలో అవతరించిన వాక్యాలు (ఆయతులు): 

يَا أَيُّهَا الْمُدَّثِّرُ

قُمْ فَأَنذِرْ


ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు”. (అల్ ముద్దస్సిర్ 74:1-2) 

ఈ వాక్యాల ద్వార దైవసందేశహరులుగా నియమితులయ్యారు. ప్రజలకు షిర్క్(బహుదైవారాధన) గురించి వారించి, హెచ్చరించి, తౌహీద్ (ఏకదైవారాధన) వైపునకు పిలవటానికి, అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. 

దీని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الْمُدَّثَرُ قُمْ فَانْذِرُ. وَرَبَّكَ فَكَبْرِ ، وَثِيَابَكَ فَطَهِّرُ وَالرُّجُزَ فَاهْجُر. 

وَلَا تَمْنُنْ تَسْتَكْسِرُ. وَلِرَبِّكَ فَاصْبِر) (سورة المدثر: ۱-۷۲) 

అర్ధం : “ ఓ దుప్పటి కప్పుకొని నిద్రించేవాడా..! మేలుకో (నిలబడు), (ప్రజలను)హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. నీ వస్త్రాలను పరిశుభ్రముగా ఉంచుకో. చెడు నుండి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే అత్యాశతో ఉపకారము చేయకు. నీ ప్రభువుకై సహనం వహించు”. 

(అల్ ముద్దస్సిర్74:1-7) 

దైవ వాణిలోని పదాల వివరణ:- 

2 قُمْ فَأَنذِرْ. మీరు ప్రజలను ‘షిర్క్ (బహుదైవారాధన) గురించి హెచ్చరించి భయపెట్టండి. అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవండి. 

3. وَرَبَّكَ فَكَبْرِ అల్లాహ్ ఏకత్వం తోపాటు అతని గొప్పతనాన్ని చాటి చెప్పండి. 

4. وَثِيَابَكَ فَطَهِّرُ  తమ కర్మలను షిర్క్ (బహుదైవారాధన) తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచండి. 

5. وَالرُّجُزَ అంటే విగ్రహాలు. 

6 فَاهْجُر అంటే దానిని విడనాడుట. 

వివరణ: 

విషయం ఏమనగా ఇంత కాలం మీరు ఎలాగైతే దానికి దూరంగా ఉన్నారో, అలాగే దాన్ని తయారు చేసి పూజించే వారితో కూడా దూరంగా ఉండండి. వారితో తమకు ఎటువంటి సంబంధములేదని చాటి (విజ్ఞప్తి చేయండి) చెప్పండి. 

ఈ ఒక్క అంశాన్నే మాటనే కేంద్రీకరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10సంవత్సరాలు అంకితం చేశారు. ప్రజలను ‘తౌహీద్’ (ఏకత్వం) వైపునకు పిలుస్తూవున్నారు. 10సంవత్సరాల తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు గగనయాత్ర (మేరాజ్) చేయించబడింది. ఆ శుభ సందర్భములో ఆయనపై అయిదు పూటల నమాజ్ విధిగా నిర్ణయించబడింది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 3 సంవత్సరాల వరకు పవిత్ర మక్కా నగరంలో నమాజు చేస్తూవున్నారు. ఆ తర్వాత పవిత్ర మదీనా వైపు వలస చేయమని ఆజ్ఞా పించటం జరిగింది. 

హిజ్రత్:(వలసత్వం) 

వలసచేయుట. అంటే షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశము నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ చేయగలిగే ప్రదేశమునకు వలసపోవుట అని అర్ధం. (బహుదైవారాధకుల ప్రదేశంలో ఏకదైవరాధన (అల్లాహ్ ఆరాధన) పట్ల కష్టాలు ఎదురై, సమస్యలు ముదిరినప్పుడు ఆ ప్రదేశం నుండి కేవలం ధార్మికత కోసమే వలస చేయాలి) ఈవిధముగా వలసచేయుట, ప్రదేశాలు మారుట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్ (జాతి) పై విధిగా పరిగణించబడింది. ఇది ప్రళయం వరకు సాగే విధి. దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది: 

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا

فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا

“(ఎవరైతే) తమ ఆత్మలపై అన్యాయం చేసుకుంటు ఉండేవారో, వారి ఆత్మలను దైవదూతలు (తమ) ఆధీనంలో తీసుకున్నప్పుడు (వారిని ప్రశ్నిస్తారు) మీరు ఈ స్థితిలో వున్నారేమిటని? (దానికి వారు బదులు పలుకులో) మేము భూమి పై బలహీనులుగా వున్నాము. దైవ దూతలు అంటారు. అల్లాహ్ యొక్క భూమి విశాలముగా లేదా? మీరు అందులో వలసచేయటానికి? వీరే ఆవ్యక్తులు! వీరి నివాసమే నరకము. అది మహా చెడ్డనివాసం. కాని నిజంగా అవస్థలో పడివున్న ఆ పురుషులు, స్త్రీలు, చిన్నారులు వలస పోవుటకు ఎటువంటి దారి పొందనప్పుడు, అల్లాహ్ వారిని క్షమించే అవకాశం ఉంది.అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు. మన్నించేవాడు”. (అన్నిసా 04:97-99) 

అల్లాహ్ మరొచోట అల్లాహ్ పేర్కుంటున్నాడు: 

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ

విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి”. (అన్కబూత్ 29:56) 

ఇమాం బగ్విఁ (రహ్మతుల్లాహి అలైహి) ఈ ఆయత్ అవతరణ సందర్భము గురించి ఇలా పేర్కొన్నారు: 

ఈ ఆయతు ఎవరైతే వలసచేయకుండా మక్కా ప్రదేశములో ఉన్నారో, ఆముస్లింల గురించి అవతరింపబడింది. అల్లాహ్ వారిని ఈమాన్ (విశ్వాస లక్షణం) తో పిలిచాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా ప్రస్తావించారు: 

لاتنقطع الهجرة حتى تنقطع التوبة ولا تنقطع التوبة حتى تطلع الشمس من مغربها 

“ తౌబా’ తలుపులు మూయబడే వరకు ‘హిజ్రత్’ వలసత్వం ఆగదు. మరి ‘తౌబా’ తలుపులు మూయబడాలంటే సూర్యుడు పడమర నుండి ఉదయిం చాలి. (ప్రళయ దినమే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు). 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. 

ఉదా : జకాత్ (ధర్మదానం), రోజా(ఉపవాసం), హజ్ (పవిత్ర మక్కా యాత్ర), అజాన్ (నమాజు కొరకు పిలుపు), జిహాద్ (ధార్మిక అంతులే కృషి) ‘అమర్ బిల్ మారూఫ్, నహి అనిల్ మున్కర్’ (మంచిని పెంచుట, చెడును త్రుంచుట) మొదలైనవి. 

పై ఆదేశాలపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం ప్రళయం వరకూ ఉంటుంది. దీనిని అల్లాహ్ యే ప్రళయం వరకు రక్షిస్తాడు. 

ఇస్లాం ధర్మం 

ప్రవక్త ﷺ శాసన సారాంశం 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపబడిన ఈ ధర్మం ఎంతో సంక్షిప్తమైనది, ఉత్తమమైనది. ప్రజలకు ఆ మంచి కార్యము అందలేదు అని చెప్పటానికి మంచిలోని ఏభాగము మిగలలేదు. మంచికార్యాలలో అమితముగా మార్గదర్శకత్వం వహించిన కార్యం ‘తౌహీద్’ (అల్లాహ్ ఏకత్వం) మరియు అల్లాహ్ మెచ్చుకునే ప్రతి మంచి కార్యంకూడ. ఈ పుణ్యకార్యాలు అల్లాహ్ ఇష్టాన్ని పొందుటకు మూలమైనవి. చెడు లో అతి ఎక్కువగా హెచ్చరించిన కార్యం ‘షిర్క్’ (అల్లాహ్ తోసాటి కల్పించడం, బహుదైవారాధన). మరి అల్లాహ్ ఇష్టపడని కార్యాలతో కూడ హెచ్చరించారు. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను అల్లాహ్ సర్వమానవాళి కొరకు దైవ సందేశహరులుగా పంపాడు. మానవులు జిన్నాతులు ఆయనకు విధేయత చూపాలని విధిగా నిర్ణయించాడు. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. (అల్ ఆరాఫ్ 7:158) 

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఇహ, పరలోకాలకు సంబంధించిన అన్ని విషయాల పరిష్కారాల్ని పెట్టాడు. ఎటువంటి లోపం మిగలలేదు. ఇందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అర్ధం : “ఈ రోజు నేను (అల్లాహ్) మీ ధర్మాన్ని మీకోసం పరి పూర్ణం చేశాను,మరి నా అనుగ్రహాన్ని మీపై పూర్తిచేశాను, ఇస్లాం మీ ధర్మంగా అంగీకరించాను”. (అల్ మాయిదా 05:3) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈలోకం నుండి పయనించారు (మరణించారు) అని చెప్పటానికి దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ ఆధారం: 

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

అర్ధం : “ప్రవక్తా..! మీరూ మరణించే వారే, మరియు వారు కూడ మరణించే వారే. చివరికి మీరందరు ప్రళయంలో మీ ప్రభువు ముందు తమ తమ ‘పేషీ’ (హాజరు ఇవ్వవలసి ఉన్నది) చేయవలసి యుంటుంది. (అజ్జుమర్ 39:30 – 31) 

ప్రజలందరూ మరణించిన తర్వాత తమకార్యకలాపాల ఫలితాలను పొందటానికి లేపబడతారు, దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ

“ఇదే భూమి నుండి మేముమిమ్మల్ని సృష్టించాము, మరియు ఇందులోకే తీసుకు వెళ్తాము, దీని నుండే మిమ్మల్ని మరల వెలికితీస్తాము. (మరోసారి సృష్టిస్తాము)”. (తాహా 20:55) 

మరణాంతర జీవితం గురించి మరోచోట ఇలా పేర్కొన్నాడు: 

وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

అల్లాహ్ మిమ్మల్ని ప్రత్యేకించి భూమి నుండి సృష్టించాడు, మరల ఆయన అదే భూమిలోకి తీసుకువెళ్తాడు. (ప్రళయంనాడు అదే భూమి నుండి) మిమ్మల్ని ఒక్కసారిగా లేవతీస్తాడు”. (సూరె నూహ్ 71:17-18) 

మలి విడత సృష్టించిన తర్వాత అందరితో లెక్క తీసుకుంటాడు. వారి పాప పుణ్యకర్మల ప్రకారం ప్రతిఫలాన్ని అందజేస్తాడు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

وَلِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاؤُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ 

الَّذِينَ أَحْسَنُوا بالحسنى (سورة النجم : ٣١) 

భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతిదానికి అల్లాహ్ యే అధిపతి. (ఎందుకంటే) పాపకార్యాలు చేసిన వారికి వారి కర్మఫలాన్ని ఇచ్చేందుకునూ, మరి పుణ్యవంతులకు మంచి ఫలితాన్ని ప్రసాదించేందుకునూ”. (అన్నజ్మ్  54:31) 

ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి, అతని గురించి దైవగ్రంధము ఇలా ప్రస్తావిస్తుంది: 

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.”. (అత్తఘాబున్ 64:7) 

అల్లాహ్ ప్రవక్తలందరికి ‘స్వర్గపు’ శుభవార్త ఇచ్చేవారుగా, ‘నరకము’ నుండి హెచ్చరించేవారుగా చేసి పంపాడు: 

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ

మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి”. (అనిస్సా 4:165) 

ప్రవక్తల్లో తొలి ప్రవక్త హజ్రత్ ‘నూహ్’ (అలైహిస్సలాం) చివరి ప్రవక్త హజ్రత్ ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయనే అంతిమ ప్రవక్త. ప్రవక్త ‘నూహ్’ (అలైహిస్సలాం) కంటే ముందు ఏ ప్రవక్త లేరు. అల్లాహ్ దీని గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ

ఓ ప్రవక్తా! మేము మీవైపు అలాగే దైవవాణి పంపాము, ఎలాగైతే నూహ్ వైపు మరియు వారి తర్వాత ప్రవక్తలవైపు పంపామో”. (అన్నిస్సా 4:163) 

‘నూహ్’ (అలైహిస్సలాం) మొదలుకొని ప్రవక్త ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ప్రతి జాతిలోను మేము సందేశహరులను పంపాము. (వారు) తమ జాతి వారికి అల్లాహ్ ఆరాధించమని, ‘తాఘత్ ‘ను పూజించవద్దని చెప్తూవచ్చేవారు.

అందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఆధారం: 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము”. (అన్ నహ్ల్ 16:36) 

అల్లాహ్ తన దాసులందరి (జిన్నాతులు, మానవులు) పై విధిగా నిర్ణయించింది ఏమనగా వారు ‘తాఘాత్ ‘ను నిరాకరించి, తనను (అల్లాహ్) విశ్వసించి తీరాలి. 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్ ) ‘తాఘాత్’ గురించి వివరిస్తూ ఇలా పెర్కొన్నారు: 

“అల్లాహ్ తప్ప మరి దేనిని ఆరాధించినా, లేక అనుసరించినా (అనుసరించే విధానంలో అల్లాహ్ అవిధేయతను కల్గివుంటే), మరి ‘హలాల్-హరామ్’ విషయాలలో మరొకరికి విధేయత చూపినా, అతడు దైవదాసుల పరిధిని దాటిన వాడవుతాడు. అదే (సమయం) లో వాడు ‘తాఘత్’ను అనుసరించిన వాడవుతాడు. 

లెక్కకు మించిన ‘తాఘాత్’లు ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో అయిదుగురున్నారు. 

1. ఇబ్లీస్ లయీన్. 

2. ఎవరైన వ్యక్తి తన పూజ జరుగుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు.
3. ప్రజలకు తనను పూజించమని ఆహ్వానించే వ్యక్తి. 

4. నేను అగోచర విషయాల(జ్ఞానము కలవాడిని)ను ఎరుగుదును అనే వ్యక్తి. 

5. అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధములో ఇలా సెలవిస్తున్నాడు: 

 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుట మయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు”. (అల్ బఖర 2:256) 

ఇదే ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు) కు అసలైన అర్ధము, వివరణ. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. 

رَاسُ الأمر الاسلامُ وَعَمُودُهُ الصَّلاةُ وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ” اعلم 

(طبرانی کبیر ، صححه السيوطى فى جامع صغير وحسنه المناوي في شرحه والله 

అర్ధం : “ఈ ధర్మానికి అసలు మూలం “ఇస్లాం” మరి దీనిని (పటిష్టంగా నిలబెట్టె బలమైన) స్థంభం నమాజ్. ఇందులో ఉన్నతమైన, ఉత్తమమైన స్థానం దైవ మార్గములో చేసే ధర్మ పోరాటం”. (తబ్రాని కబీర్) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదు సందర్శనం – షేఖ్ బిన్ బాజ్

ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్

ఏడవ అధ్యాయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం

హజ్ ప్రారంభం గాక ముందు లేదా హజ్ పూర్తయిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదును సందర్శించడం సున్నతు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فـِي مَسْجِـدِي هَذَا خَيْـرٌ مِنْ أَلـْفِ صَلاَةٍ فِـيْمـاَ سِـوَاهُ إِلاَّ الـْمَسْجِـدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా ఖైరున్ మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ

మస్జిదె హరమ్ (కాబా) లో తప్ప, ఇతర మస్జిదులలో చేసే ఒక నమాజు కంటే నా మస్జిదులో చేసే ఒక నమాజు వెయ్యి రెట్లు ఉత్తమమైనది.

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు  మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ  

నా ఈ మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప, ఇతర మస్జిదులలో నమాజు చేయడం కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. (ముస్లిం హదీథు గ్రంథం)

అబ్దుల్లాహు బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِـدِي هَذَا أَفْـضَلُ مِنْ أَلْـفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِـدِ الْـحَـرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِـدِ الْـحَـرَامِ أَفْـضَلُ مِنْ مِائَـةٍ صَلاَةٍ فِـي مَسْجِـدِي هَـذَا

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతిన్ సలాతిన్ ఫీ మస్జిదీహదా

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు నా మస్జిదులో చేసే నమాజు కంటే వంద రెట్లు ఉత్తమమైనది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِدِ الْـحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు 

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే లక్ష రెట్లు ఉత్తమమైనది. (అహ్మద్ &ఇబ్నె మాజహ్)

దీని గురించి అనేక హదీథులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించే యాత్రికులు ముందుగా తమ కుడికాలు మస్జిదుల లోపల పెట్టి, ఈ దుఆ చేసుకుంటూ మస్జిదులోనికి ప్రవేశించాలి:

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلَى رَسُولِ اللهِ، أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنْ الشَّيْطاَنِ الرَّجِيْمِ، اَللَّهُمَّ افْتَحْ لـِي أَبْوَابَ رَحْمَتِكَ

బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమి వబి వజ్హిహిల్ కరీమి, వ సుల్తానిహిల్ ఖదీమి, మినష్షయితా నిర్రజీమి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యొక్క ప్రవక్త పై శాంతి మరియు దీవెనలు కురుయుగాక. నన్ను షైతాను బారి నుండి కాపాడమని, అత్యంత పవిత్రమైన ముఖం, అత్యంత పురాతనమైన పరిపాలన మరియు అధికారం కలిగి ఉన్న అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలు నా కొరకు తెరుచు.

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు దుఆ చేసే విధంగానే ఇక్కడ కూడా దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహ అలైహి వసల్లం) మస్జిదులో ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏమీ లేదు.

మస్జిదులో ప్రవేశించిన తర్వాత, రెండు రకాతుల తహయ్యతుల్ మస్జిదు నమాజు చేయాలి. ఇహపరలోకాలలో మేలైన విషయాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను. ఒకవేళ ఈ రెండు రకాతుల నమాజును మస్జిదులోని రౌధతుల్ జన్నహ్ (స్వర్గవనం) అనే ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు:

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

నమాజు చేసిన తర్వాత, ప్రవక్త (సల్లల్లాహు అలైహ వసల్లం) కు మరియు ఆయన యొక్క ఇద్దరు సహచరులు అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)లకు సలాము చేయవలెను. గౌరవ పూర్వకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వైపు తిరిగి నిలబడి, తక్కువ స్వరంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇలా అభివాదం చేయవలెను.        

أَلسَّلاَمُ عَلَيـْكَ يَا رَسُولُ اللهِ وَرَحْـمَـةُ اللهِ وَبَـرَكَاتَـهُ
అస్సలము అలైక యా రసూలుల్లాహ్, వ రహ్మతుల్లాహి వ బరకాతహు
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు  మరియు శుభాశీస్సులూను.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకులను అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు:

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మామిన్ అహదిన్ యుసల్లిము అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్ద అలైహి స్సలామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు జవాబిచ్చేవరకు అల్లాహ్ నా ఆత్మను నా శరీరంలోనికి పంపుతాడు.

తన సలాములో ఎవరైనా క్రింది పదాలను పలికితే ఎలాంటి దోషమూ లేదు:

أَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَ الله، أَلسَّلاَمُ عَلَيْكَ يَا خِيْـرَةَ اللهِ مِنْ خَلْـقِـهِ، أَلسَّلاَمُ عَلَيـْكَ يَا سَيِّـدَ الْـمُرْسَلِيْـنْ وَإِمَامَ الْـمُتَّـقِيْنْ، أَشْهَدُ أَنَّـكَ قَدْ بَلَّغْتِ الرَّسَالَـةَ وَأَدَّيْتَ الْأَمَانَـةَ، وَنَـصَحَتَ الْأُمَّـةَ، وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ

అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా ఖీరతల్లాహి మిన్ ఖల్ఖిహి , అస్సలాము అలైక యా సయ్యదల్ ముర్సలీన్ వ ఇమామల్ ముత్తఖీన్, అష్హదు అన్నక ఖద్ బలగతిర్రసాలత, వ అద్దయితల్ అమానత, వ నసహతల్ ఉమ్మత, వ జాహదత ఫీ అల్లాహి హఖ్ఖ జిహాదిహి.

మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క సృష్టిలోని ఉత్తముడా! నీపై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తల మరియు సజ్జనుల  నాయకుడా! మీరు మీ సందేశాన్ని అందజేసారని, మీకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చారని, సమాజానికి మార్గదర్శకత్వం వహించారని, అల్లాహ్ మార్గంలో పూర్తిగా ప్రయాస పడినారని మరియు శ్రమించారని  నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవర్తనలో, నడతలో ఈ ఉత్తమ గుణగణాలన్నీ ఉండినాయి. ప్రతి ఒక్కరూ ఆయనపై దీవెనలు పంపటాన్ని, ఆయన కొరకు దుఆ చేయటాన్ని షరిఅహ్ పూర్తిగా సమర్ధించింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:

يَا أَ يُّـهَا الَّذِيـْنَ آمَـنـُوا صَلُّوا عَلَيْـهِ وَسَلِّـمُـوا تَـسْلِـيـمـًا
యా అయ్యుహలాదీన ఆమనూ సల్లూ అలైహి వసల్లిమూ తస్లీమన్
ఓ విశ్వాసులారా! ఆయనపై దీవెనలు పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి. 33:56

ఆ తర్వాత అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు)లపై సలాములు పంపి, అక్కడి నుండి ముందుకు కదల వలెను.

 لَعَـنَ رَسُولُ اللهِ صَلَّى الله عَلَيْـهِ وَ سَلَّمَ زُوَّارَاتِ الْـقُـبُـوْرِ مِنَ النِّساَءِ، وَالْـمُـتَّـخِـذِيْـنَ عَلَيْـهاَ الْـمسَاجِدَ وَالسُّرُجَ

లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ జువ్వరాతిల్ ఖుబూరి మిన్నన్నిసాయి వల్ ముత్తఖిదీన అలైహాల్ మసాజిద  వస్సురుజ  

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించే అనుమతిని షరిఅహ్ పురుషులకు మాత్రమే ఇచ్చింది. సమాధుల సందర్శించే అనుమతి మహిళలకు ఇవ్వబడలేదు. అలా షరిఅహ్ కు వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం సమాధులను సందర్శించే మహిళలను, సమాధులపై మస్జిదులు నిర్మించేవారిని మరియు అక్కడ దీపాలు వెలిగించేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించి ఉన్నారు.

ఒకవేళ ఎవరైనా మస్జిదె నబవీ లోపల నమాజు చేయాలని, దుఆలు చేయాలనే సంకల్పంతో మదీనా సందర్శిస్తే, షరిఅహ్ సమర్ధించి ఉండటం వలన అలా చేయడం పూర్తిగా సరైనదే. పై హదీథులో కూడా మేము దీనిని గుర్తించాము. సందర్శకుడు ఐదు పూటలా మస్జిదె నబవీలోనే నమాజులు చేయవలెను మరియు వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవలెను, దుఆలు చేయవలెను మరియు నఫిల్ నమాజులు చేయవలెను. ఈ క్రింది హదీథును మేము ఇంతకు ముందు ఉదహరించి ఉన్నాము,

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ

మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి

నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

తప్పనిసరి ఐదు ఫర్ద్ చేసేటపుడు, మీరు వీలయినంత వరకు ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నించవలెను, ముందు పంక్తిని పొడిగింపులో మీకు చోటు దొరికినా దానిని వదలకూడదు. ముందు వరుసలో నమాజు చేయటం గురించి క్రింది ప్రామాణిక హదీథు సూచిస్తున్నది.

لَوْ يَعْلَمُ النَّاسَ مَا فِـي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَـمْ يَـجِدُوْا إِلاَّ أَنْ يَسْتَـهِمُـوْا عَلَيْهِ لاَسْتَهَمُوْا عَلَيْـهِ

లౌ యఅలమున్నాస మాఫీ న్నిదాయి వ సఫ్ఫిల్ అవ్వలి థుమ్మ లమ్ యజిదూ ఇల్లా అన్ యస్తహిమూ అలైహి అస్తహమూ అలైహి 

ఒకవేళ అదాన్ పిలుపునివ్వడంలో మరియు ముందు వరుసలో నిలబడి నమాజు చేయడంలో ఉన్న పుణ్యాల గురించి తెలిసి ఉండి, వారికి గనక వాటిలో స్థానం లభించకపోతే, వాటిని పొందుట కొరకు ప్రజలు లాటరీ వేయవలసి వచ్చినా, తప్పకుండా వారు లాటరీ వేస్తారు.

మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

تَـقَـدِّمُـوْا فَأْتَـمُّـوا بـِي وَلْـيَـأْتَـمَّ بِكـُمْ مَنْ بَعْدَكُمْ، وَلاَ يَزَالُ الرَّجُلَ يَـتَـأَخَّـرُّ عَنِ الصَّلاَةِ حَتَّى يُـؤَخِّـرَهُ الله

తఖద్దిమూ ఫఅతమ్మూబీ వల్ యఅతమ్మ బికుమ్ మన్ బఅదకుమ్ వలా యజాలుర్రజుల యతఅఖ్ఖర్రు అనిస్సలాతి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ్

ముందుకు కదలండి మరియు నన్ను అనుసరించండి. మరియు ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు మిమ్ముల్ని అనుసరించాలి. అల్లాహ్ అతనిని వెనుక వదిలి వేయునంత వరకు ఆ వ్యక్తి నమాజును అందుకోవటంలో వెనుకబడి ఉంటాడు. ముస్లిం హదీథు గ్రంథం.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఆయెషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

لاَ يَزَالُ الرَّجُلُ يَتَأَخَّرْ عَنِ الصَّفِّ الْـمُقَدِّمِ حَتـَّى يُؤَخِّرَهُ اللهََ فِي النَّارِ

లా యజాలుర్రజులు యతఅఖ్ఖర్ అనిస్సఫ్ఫిల్ ముఖద్దమి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ ఫిన్నారి 

అల్లాహ్ ఆ వ్యక్తిని నరకానికి  పంపే వరకు, (ఫర్ద్ నమాజులో) ముందు వరుస అందుకోవటంలో అతను వెనుకబడే ఉంటాడు.

ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు ఇలా బోధించారు:

أَلاَ تَصُفُّوْنَ كَمـَا تَـصُفُّ الْـمَلَائِكَـةُ عِـنْدَ رَبِّـهَا قَالُوْا يَا رَسُولُ الله وَكَـيْفَ تَـصُفُّ الْـمَلاَئِكَـةُ عِـنْـدَ رَبِّـهاَ؟ قَالَ يُـتِـمُّوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَيَـتَـرَاصُّوْنَ فِـي الصَّفِّ

అలా తసుఫ్ఫూన కమా తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద  రబ్బిహా ఖాలూ యా రసూలుల్లాహ్ వ కైఫ తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాల యుతిమ్మూనస్సుఫూఫల్ అవ్వల వ యతరస్సూన ఫీస్సఫ్ఫి

తమ ప్రభువు ఎదురుగా దైవదూతలు పంక్తులలో నిలబడినట్లు, మీరు ఎందుకని పంక్తులలో నిలబడరు. దైవదూతలు ఎలాంటి పంక్తులను ఏర్పరుచుకున్నారని సహచరులు ప్రశ్నించగా, ఆయనిలా జవాబిచ్చారు: వారు ముందుగా మొదటి పంక్తిని పూర్తి చేసారు మరియు పంక్తులలో వారు ఒకరిని ఆనుకొని మరొకరు నిలబడినారు.  (ముస్లిం హదీథు గ్రంథం).

మస్జిదె నబవీ మరియు ఇతర మస్జిదులకు వెళ్ళడం గురించి మామూలుగా అనేక హదీథులు ఉన్నాయి. కుడివైపు పంక్తిలో నిలబడిమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి ఒక్కరికీ చెప్పేవారు. అప్పటి మస్జిదె నబవీలోని కుడి వైపు పంక్తి, రౌధతుల్ జన్నహ్ ప్రాంతానికి బయట ఉండేదనే విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి సామూహిక నమాజును ముందు వరుసలో, పంక్తి యొక్క కుడివైపున నిలబడి చేయటమనేది రౌధతుల్ జన్నహ్ ప్రాంతంలో నిలబడి నమాజు చేయడం కంటే ఉత్తమమైనదనే ఇక్కడ ముఖ్యంగా గ్రహించదగినది. ఎవరైనా ఇలాంటి ఇతర హదీథులను కూడా పరిశీలిస్తే, పై విషయాన్ని సులభంగా తెలుసుకుంటారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క గ్రిల్ ను స్పర్శించడం లేదా ముద్దాడటం లేదా దాని చుట్టూ తవాఫ్ చేయడం లాంటివి అనుమతించబడలేదు. ఇలాంటి ఆచారం గురించి ముందు తరం సజ్జనులలో నుండి ఎవ్వరూ తెలుపలేదు. ఇలా చేయడమనేది ఒక హీనమైన కల్పితాచారం. తమ అవసరాలు పూర్తి చేయమని లేదా తమ కష్టాలు తొలగించమని లేదా తమ అనారోగ్యాన్ని నయం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎవరైనా వేడుకోవడమనేది ధర్మబద్ధం కాదు. అయితే వీటన్నింటి కోసం తప్పనిసరిగా వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకోవలసి ఉంది. మృతులను వేడుకోవడమనేది అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం మరియు ఇతరులను ఆరాధించడమే అవుతుంది. ఈ క్రింది రెండు ముఖ్య అంశాలపై ఇస్లాం ఆధారపడి ఉంది:

  1. అల్లాహ్ ఏకైకుడు, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు మరియు ఆయనకెవ్వరూ సాటి లేరు. కేవలం ఆయన మాత్రమే ఆరాధింపబడాలి.
  2. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించి ఆరాధనలు జరగాలి.

ఇస్లామీయ ధర్మం యొక్క క్రింది మూలవచనపు అసలు అర్థం ఇదే.

شَهَادَةً أَنْ لاَّ إِلَهَ إِلاَّ اللهِ وَأَنَّ مُـحَمَّداً رَسُوْلُ الله

షహాదతన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహి  వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్

ఆరాధింపబడే వారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప అని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.

అలాగే, అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే నేరుగా వేడుకోవడమనేది ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే ప్రార్థింపబడే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది.

قُـلْ ِلِله الشَّـفَـاعَـةُ جَـمِـيـعًا
ఖుల్ లిల్లాహిష్షఫాఅతు  జమీఅన్
(ఓ ప్రవక్తా) చెప్పు, సిఫారసులన్నీ అల్లాహ్ కే చెందుతాయి. 39:44

అయితే, క్రింది విధంగా వేడుకోవచ్చు.

أَللَّهُمَّ شَفَّعِ فِـي نَـبِـيُّكَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي مَلاَئِكَـتِـكَ وَعِبَادِكَ الْـمُؤمِـنِـيْـنَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي أَفَرَاطِـي

అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ నబియ్యుక, అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ మలాయికతిక, వ ఇబాదతికల్ మోమినీన. అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ అఫరాతీ.

ఓ అల్లాహ్! నీ ప్రవక్త నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! నీ దైవదూతలు మరియు నిన్ను విశ్వసించినవారు నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! చనిపోయిన నా సంతానం నా కొరకు సిఫారసు చేసేలా చేయి.

అయితే, మృతులను సిఫారసు చేయుట కొరకు లేదా వారినే నేరుగా వేడుకోకూడదు – వారు అల్లాహ్ యొక్క సందేశహరులైనా, ప్రవక్తలైనా లేదా పుణ్యపురుషులైన అవులియాలైనా సరే. ఇలా చేయటానికి షరిఅహ్ అనుమతి లేదు. మృతుని గురించిన వాస్తవం ఏమిటంటే, షరిఅహ్ లో మినహాయించబడిన ఆచరణులు తప్ప, అతని ఇతర ఆచరణలన్నీ సమాప్తమై పోతాయి. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖన:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

إِذَا مَاتَ ابْنَ آدَمَ أَنْقَطَعَ عَمَلَهُ إِلاَّ مِنْ ثَلاَثٍ: صَدْقَةٍ جَارِيَـةٍ، أَوْ عِلْمٍ يُـنـْتَـفَـعُ بِـهِ،  أَوْ وَلَـدٍ صَالِـحٍ يَـدْعُـوْ لَـهُ

ఇదా మాతబ్న ఆదమ అంఖతఅ అమలహు ఇల్లా మిన్ థలాతిన్  సదఖతిన్ జారియతిన్ అవ్ ఇల్మిన్ యుంతఫఉ బిహి అవ్ వలదిన్ సాలిహిన్ యద్ఊ లహు 

ఎపుడైతే ఆదం సంతానంలో ఎవరైనా చనిపోతారో, ఈ మూడు తప్ప అతని ఇతర ఆచరణలు సమాప్తమైపోతాయి: నిరంతరాయంగా కొనసాగుతున్న అతని దానం, ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్న అతని జ్ఞానం, దైవభీతిపరులైన సంతానం చేసే అతని కొరకు చేసే దుఆలు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలో తన కొరకు అల్లాహ్ ను ప్రార్థించమని ఆయనను వేడుకోవడం అన్ని విధాలా సరైన మంచి పనే. అలాగే అంతిమ దినాన కూడా ఆయనను నేరుగా వేడుకోవడం సరైన పనే, ఎందుకంటే ఆనాడు సిఫారసు చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఆనాడు తనను సిఫారసు చేయమని అడిగిన వారి కొరకు ఆయన అల్లాహ్ ను ప్రార్థించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచంలో మరణించిన తర్వాత ఆయనకు ఆ శక్తి లేదు. ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకం కాదు. మీతో పాటు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికిది వర్తిస్తుంది. ప్రాణంతో ఉన్న తన తోటి సోదరులతో తన కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని అంటే అల్లాహ్ ను ప్రార్థించమని అడగటం ధర్మసమ్మతమైనదే. తీర్పుదినం నాడు ఎవ్వరూ అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేయలేరు. దీని గురించి అల్లాహ్ యొక్క స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది.        

مَـنْ ذَا الَّـذِي يَـشْـفَـعُ عِـنْـدَهُ إِلاَّ بِـإِذْنِـهِ
మందల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇద్నిహి
ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేయగలిగేది ఎవరు?

ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క స్థితి గురించి మనం ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఆయన యొక్క ప్రస్తుత స్థితి ఒక ప్రత్యేకమైన స్థితి. అది ఈ ప్రపంచంలో ఆయన సజీవంగా ఉన్నప్పటి స్థితికి మరియు అంతిమ దినం నాటి స్థితికి భిన్నమైనది. చనిపోయిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్నపుడు అతను చేసిన పనులే అతనికి ప్రతిఫలాన్ని అందజేస్తాయి – షరిఅహ్ లో మినహాయించబడిన ప్రత్యేక పనులు తప్ప. మృతులను వేడుకోవడమనేది షరిఅహ్ మినహాయించిన పనులలో లేదు. కాబట్టి దానిని ఈ ప్రత్యేక తరగతికి చెందిన పనిగా పరిగణించలేము. నిస్సందేహంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బరజఖ్ జీవితంలో సజీవంగా ఉన్నారు. ఆయన ఉన్న స్థితి ఒక షహీద్ యొక్క మరణానంతర స్థితి కంటే ఎంతో ఘనమైనది. అయితే ఇది చనిపోయే ముందు జీవించే ఈ ప్రాపంచిక జీవితం కంటే మరియు తీర్పుదినం తర్వాత రాబోయే జీవితం కంటే భిన్నమైనది. బరజఖ్ అంటే సమాధి జీవితం యొక్క స్వభావం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,   

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ

మా మిన్ అహదిన్ యుసల్లిమూ అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్దఅలైహిస్సల్లామ

ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు బదులిచ్చే వరకు అల్లాహ్ నా శరీరంలోనికి నా ఆత్మను పునః ప్రవేశింపజేస్తాడు.

పై హదీథు ఆధారంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయారని, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిగా ఉంటుంది మరియు సలాము చేయబడినపుడు మాత్రమే అది ఆయన శరీరంలోనికి ప్రవేశింపజేయబడుతుందనేది స్పష్టమవుతున్నది. ఆయన మరణం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలుపబడిన వాదనలు అందరికీ తెలిసినవే. ఉలేమాల వద్ద ఇది ఎలాంటి అనుమానాలు లేని విషయం. అయితే ఆయన యొక్క బరజఖ్ జీవితానికి మరణమనేది ఆటంకం కాదు. షహీదుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఖుర్ఆన్ లో దీని గురించి ఇలా స్పష్టం చేయబడింది:

وَلا تَـحْسَـبَنَّ الَّـذِيـنَ قُـتِـلُوا فِي سَبِـيـلِ اللهِ أَمْـوَاتًا بَلْ أَحْيَاءٌ عِـنْـدَ رَبِّـهِمْ يُـرْزَقُـونَ

వలా తహ్సబన్నల్లదీన ఖుతిలూ ఫీ సబీలిల్లాహి అంవాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన

మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడినారో, వారిని ఎప్పుడూ మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. వారికి తమ ప్రభువు వద్ద  ఆహారం ఇవ్వబడుతున్నది. 3:169

ఇది షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) వైపు పిలిచే వారు, అల్లాహ్ ను వదిలి మృతులను ఆరాధించేవారు తికమకపెట్టే ఒక ముఖ్యమైన విషయం కావటం వలన దీనిని మేము వివరంగా చర్చించినాము. షరిఅహ్ కు వ్యతిరేకమైన వాటన్నింటి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద తమ స్వరం పెంచే వారి చర్యలు మరియు చాలా ఎక్కువ సేపు వరకు అక్కడే నిలిచిపోయే వారి చర్యలు షరిఅహ్ కు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ఆయన కంటే హెచ్చు స్వరంతో మాట్లాడవద్దని అల్లాహ్ ప్రజలకు ఆదేశించినాడు. అలాగే తమలో తాము మాట్లాడుకునే విధంగా ఆయనతో హెచ్చు స్వరంలో మాట్లాడకూడదని కూడా అల్లాహ్  ఆజ్ఞాపించినాడు. అంతేగాక, ఆయనతో ప్రజలు తక్కువ స్వరంలో మాట్లాడాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:   

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لا تَشْعُرُونَ * إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللَّهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ

యాఅయ్యుహల్లదీన్ ఆమనూ లా తర్ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్ హరూ లహు బిల్ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్ అన్ తహ్బత అమాలుకుమ్ వ అంతుమ్ లా తష్ఉరూన  ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుమ్ ఇంద రసూలిల్లాహి ఉలాయికల్లదీన అంతహనల్లాహ ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమున్

ఓ విశ్వసించిన ప్రజలారా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువగా మీ స్వరాన్ని పెంచి గానీ, మీలో మీరు బిగ్గరగా మాట్లాడుకునేటట్లుగా ఆయనతో బిగ్గరగా గానీ మాట్లాడవద్దు. అలా చేస్తే మీరు గ్రహించకుండానే, మీ ఆచరణలకు ప్రతిఫలం ఏమీ లేకుండా పోతుంది. నిశ్చయంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సమక్షంలో తక్కువ స్వరంతో మాట్లాడే వారి హృదయాలు, అల్లాహ్ యొక్క ధర్మనిష్ఠ పరీక్షలో నిగ్గుతేలుతాయి. అలాంటి వారి కొరకే మన్నింపు మరియు ఘనమైన ప్రతిఫలం ఉంది. 49:2,3.

అంతేగాక, ఆయన సమాధి వద్ద ఎక్కువ సేపు నిలబడటం వలన, రద్దీ మరియు సందడి బాగా పెరిగి పోతుంది. పైగా ఇలా చేయడం పై ఖుర్ఆన్ వచనాలకు విరుద్ధంగా చేసినట్లవుతుంది కూడా. ఒక ముస్లిం కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యంత ఆదరణీయులు. ఆయన సన్నిధిలో షరిఅహ్ కు వ్యతిరేకమైన అలాంటి చర్యలు చేయడమనేది గర్హణీయమైన విషయం. అలాగే, ఆయన సమాధి వద్ద నిలబడినపుడు లేదా సమాధికి ఎదురుగా నిలబడినపుడు రెండు చేతులు పైకెత్తి దుఆలు చేయడమనేది కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల, తాబయీన్ ల మరియు పూర్వం గతించిన పుణ్యపురుషుల ఆచారానికి వ్యతిరేకం. అలా చేయడం ఒక కల్పితాచారం మాత్రమే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

عَلَيْكُمْ بِسُنَّـتِـي وَسُنَّـةِ الْـخُلَفاَءِ الرَّاشِدِيْنَ الْـمَهْدِيِيِّنَ مِنْ بَعَدِي، تَـمَسَّكُوْا بِـهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُـحْدَثَاتِ الْأُمُوْرِ، فَإِنَّ كُلَّ مُـحْدَثَـةٍ بِدْعَـةٌ وَكُلَّ بِدْعَـةٌ ضَلاَلَـةٌ

అలైకుమ్ బిసున్నతీ వ సున్నతిల్ ఖుల్ఫాఇర్రాషిదీనల్మహ్దియ్యిన మిన్ బఅదీ తమస్సకూ బిహా వ అద్దూ అలైహా బిన్నవాజిది వ ఇయ్యాకుమ్ వ ముహ్దథాతిల్ ఉమూరి ఫ ఇన్న కుల్లి ముహ్దథతిన్ బిద్అతున్ వ కుల్ల బిద్అతున్ దలాలతున్ 

నా మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. నా తర్వాత సన్మార్గంలో నడిచే ఖలీఫాల మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. దానినే అంటిపెట్టుకుని ఉండండి మరియు మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. నూతన కల్పితాలకు దూరంగా ఉండండి. కొత్తగా కనిపెట్టబడిన ఏ విషయమైనా నూతన కల్పితమే అవుతుంది మరియు అది మార్గభ్రష్టత్వానికి దారి తీస్తుంది.

ఇంకా ఆయనిలా అన్నారు,

مَنْ أَحْدَثَ فِـي أَمْرِنَا هَذَا مَا لَـيْـسَ مِـنْـهُ فَـهُـوَ رَدٌّ

మన్ అహ్దథ ఫీ అమ్రినా హదా మాలైస మిన్హు ఫహువ రద్దున్  

మా విషయంలో లేని విషయాన్ని ఎవరైనా కొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.

ఒకసారి అలీ బిన్ హుసైన్ జైనుల్ ఆబిదీన్ ఎవరో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద నిలబడి ప్రార్థించడాన్ని చూసారు. వెంటనే ఆయన అతడిని ఆపి, దానిని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నానని, మరియు ఆయన తండ్రి దానిని తాత అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా నేర్చుకున్నారని పలికారు,

لاَ تَـتَّـخِذُوْا قَبَرِي عِيْداً وَلاَ بُـيُـوتَـكُمْ قُـبُـوْرًا، وَصَلُّوْا عَلَـيَّ فَإِنَّ تَسْلِيْمَكُمْ يَـبْلُغُـنِـيْ أَيْـنَمـَا كُنْـتُـمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న తస్లీమకుమ్ యబ్లుగునీ  అయ్ నమా కుంతుమ్    

నా సమాధిని సందర్శనా స్థలంగా చేయవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు (ఇళ్ళలో నమాజు చేయకుండా ఉండవద్దు). మరియు నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఎందుకంటే మీరెక్కడ నుండి పంపినా, మీ సలాము నాకు చేరుతుంది.

అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపేటపుడు కొందరు కుడి చేతిని తమ గుండెకు ఎడమవైపు ఉంచుతారు. ఆయనపై సలాము పంపేటపుడు లేదా ఎవరైనా రాజు, నాయకుడికి సలాము చేసేటపుడు ఈ భంగిమలో నిలబడటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే, ఇలా చేయడంలో చూపే వినయం, అణుకువ, నమ్రత మరియు సమర్పణలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.

ఈ విషయాన్ని గొప్ప ఉలేమాల ప్రామాణిక అభిప్రాయాల ఆధారంగా హాఫిజ్ ఇబ్నె హజర్ చర్చించారు. దీనిపై దృష్టి కేంద్రీకరించినా వారెవరికైనా ఇది స్పష్టమవుతుంది. అయితే అతను అల్లాహ్ కు అంగీకారమైన ముందుతరం పుణ్యపురుషుల మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం ఉన్నవాడై ఉండాలి. పక్షపాతంలో, స్వార్థంతో కూడిన కోరికలలో మరియు గుడ్డిగా అనుకరించడంలో, సజ్జనుల మార్గానికి విరుద్ధంగా పోవడంలో మునిగిపోయిన వారి దుర్గతిని అల్లాహ్ త్వరలోనే నిర్ణయిస్తాడు. అల్లాహ్, మాకూ మరియు వారికీ సన్మార్గం చూపు గాక. ప్రతి దానిపై సత్యానికే ప్రాధాన్యత నిచ్చేటట్లు చేయుగాక. అలాగే దూరంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపు తిరిగి నిలబడి, సలాము కొరకు లేదా దుఆ కొరకు తమ పెదాలను కదిపే వారు కూడా మతభ్రష్ఠుల కోవలోనికే వస్తారు. ధర్మంలో ఇలాంటి నూతన పోకడలు కల్పించడం ఒక విశ్వాసికి తగదు. ఎందుకంటే అలా చేయడానికి అల్లాహ్ అనుమతి నివ్వలేదు. అలా చేయడమనేది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ చూపడం క్రిందికైతే రాదు గానీ, అల్లాహ్ ఆజ్ఞలను దాటి హద్దు మీరిపోవడం క్రిందికి మాత్రం తప్పక వస్తుంది. ఇలాంటి వాటిని ఖండిస్తూ, తర్వాతి తరాల సంస్కరణ కూడా ముందు తరాల సంస్కరణ మాదిరిగానే జరగాలని ఇమాం మలిక్ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని మరియు సన్మార్గంలో నడిచిన ఖలీఫాల మార్గాన్ని, సహాబాల మార్గాన్ని మరియు తాబయీనుల మార్గాన్ని అనుసరించే, ముందు తరాల ప్రజలు తమను తాము సంస్కరించుకున్నారు. తర్వాత తరం ప్రజలకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించటంలోనే ఋజుమార్గం కనబడుతుంది. ఇలా చేయడం ద్వారా మాత్రమే వారి సంస్కరణ సరిగ్గా జరుగుతుంది. తమ సంక్షేమాన్ని పదిలం చేసుకునేందుకు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం సాధించేందుకు, అలా చేసే శక్తిని అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించుగాక.

మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు:

హెచ్చరిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడమనేది ఫర్ద్ (తప్పనిసరి) కాదు మరియు హజ్ నియమాలలోనికీ రాదు. ఇది కొందరి ప్రజల అపోహ మాత్రమే. అయితే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు చేరుకున్నవారు, మస్జిదె నబవీని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం ఉత్తమం. అయితే, మదీనహ్ నగరానికి దూరంగా నివసించే ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే సంకల్పంతో ప్రయాణించడం ధర్మబద్ధం కాదు. కానీ, మస్జిదె నబవీని సందర్శించే సంకల్పంతో అలా ప్రయాణించ వచ్చు. మదీనహ్ నగరంలోనికి చేరుకున్న తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు సహాబాల సమాధులను సందర్శించాలి. సహీహ్ బుఖారీ మరీయు ముస్లిం హదీథు గ్రంథాలు రెండింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది:

لاَ تُـشَـدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَـلاَ ثَـةِ مَسَاجِـدَ: أَلْـمَسْجِدِ الْـحَـرَامِ، وَمَسْجِـدِي هَـذَا، وَالْـمَسْجِـدِ الْأَ قْـصَى

లాతుషద్దుర్రిహాల ఇల్లా ఇలా థలాథతి మసాజిద అల్ మస్జిదిల్ హరామి వ మస్జిదీ హదా వల్ మస్జిదిల్ అఖ్సా

ఈ మూడు మస్జిదులను సందర్శించడం కొరకు మాత్రమే ఎవరైనా ధార్మిక ప్రయాణం చేయవచ్చు: మస్జిద్ అల్ హరామ్ (కఅబహ్ మస్జిద్), నా మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు మస్జిద్ అల్ అఖ్సా.

ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని లేదా ఎవరైనా ఇతరుల సమాధిని సందర్శించుట ధర్మసమ్మతమైనదైతే, తప్పకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాజాన్ని అలా చేయమని ఆదేశించి ఉండేవారు. ఎందుకంటే వారి గురించి ఆయన చాలా సద్భావంతో ఉండేవారు, అల్లాహ్ కు ఎక్కువగా భయపడేవారు మరియు అల్లాహ్ గురించి బాగా ఎరిగిన ఉండినారు. తనకివ్వబడిన ప్రవక్త బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించినారు. సమాజాన్ని ప్రతి మంచితనం వైపు దారి చూపినారు మరియు ప్రతి చెడు నుండి హెచ్చరించినారు. పై మూడింటిని సందర్శించడానికి చేసే ప్రయాణం తప్ప ఇతర మస్జిదులను సందర్శించడానికి చేసే ప్రయాణాన్ని ఆయన నిషేధించినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

لاَ تَـتَّـخِذُوا قَبَرِي عِيْداً، وَلاَ بُـيُـوتَـكُمْ قُبُـوراً، وَصَلُّوا عَلَـيَّ فَإِنَّ صَلاَتِـكُمْ تَبْلُغُـنِـي حَيْثُ كُـنْـتُمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న సలాతికుమ్  యబ్లుగునీ  హైథు  కుంతుమ్ 

నా సమాధిని తిరునాళ్ళ ప్రాంతంగా మార్చవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు. నా పై దరూద్ పంపండి. మీరెక్కడ నుండి దరూద్ పంపినా, అది నాకు చేర్చబడుతుంది.

ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ ఆచరణయే అని సమర్ధించుకోవడానికి, దానిని యాత్రా స్థలంగా మార్చడం మరియు హద్దు మీరి ఆదరించడం జరగవచ్చని ఆయన భయపడి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయన భయపడినట్లుగానే అనేక మంది ప్రజలు ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ లోని భాగమేనని నమ్ముతూ, దారి తప్పిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించుట షరిఅహ్ లోని భాగమనే తమ అభిప్రాయానికి సమర్ధనగా వారు పేర్కొనే హదీథులు ఉల్లేఖకుల పరంపర విషయంలో బలహీనమైనవే గాక, అవన్నీ కల్పితమైనవి కూడా. ప్రఖ్యాత హదీథు పండితులు దర్ఖుత్నీ, బైహఖీ మరియు హాఫిద్ ఇబ్నె హజర్ మొదలైన వారు ఆ హదీథుల బలహీనత గురించి హెచ్చరించారు. కాబట్టి అలాంటి బలహీనమైన హదీథులను మూడు మస్జిదులను సందర్శించడానికి తప్ప, ఏ సంకల్పంతోనైనా సరే చేసే ఇతర సందర్శన ప్రయాణాలు నిషేధించబడినాయనే ప్రామాణిక హదీథుకు వ్యతిరేకంగా పేర్కొనడమనేది అస్సలు చేయకూడదు. అలాంటి అసత్య హదీథులను గుర్తించి, దారి తప్పిపోకుండా తమను తాము కాపాడుకొనుట కొరకు పాఠకులు వాటిని తెలుసుకొనుట అవసరమని భావిస్తూ, అలాంటి కొన్నింటిని క్రింద పేర్కొంటున్నాము.

ఎవరైతే హజ్ చేస్తారో మరియు నన్ను సందర్శించరో, అలాంటి వారు నా విషయంలో తప్పు చేసారు – అసత్య హదీథు.

నా మరణం తర్వాత ఎవరైతే నన్ను దర్శిస్తారో, వారు నా జీవితంలో నన్ను దర్శించినట్లే – అసత్య హదీథు.

ఎవరైతే నన్ను మరియు నా పూర్వీకులైన ఇబ్రాహీంను ఒకే సంవత్సరంలో దర్శిస్తారో, అల్లాహ్ ప్రమాణంగా వారికి స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను – అసత్య హదీథు

ఎవరైతే నా సమాధిని దర్శిస్తారో, వారి పై నా సిఫారసు తప్పని సరై పోతుంది – అసత్య హదీథు.

అలాంటి హదీథులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేర్చే సరైన జాడ ఉండదు. హాఫిద్ ఇబ్నె హజర్ పరిశోధన ప్రకారం అలాంటి వాటి ఉల్లేఖకుల పరంపర కల్పితమైనది. హాఫిద్ ఉఖైలీ ఇలా పలికారు, “అలాంటి ఏ హదీథు ప్రామాణిక మైనది కాదు”. ఇబ్నె తైమియా అభిప్రాయం ప్రకారం అలాంటి హదీథులు అక్రమంగా కల్పించబడినవే. మీ జ్ఞానం కోసం మరియు సంరక్షణ కోసం కల్పిత హదీథుల గురించి ఇక్కడి వరకు ఇవ్వబడిన సమాచారం సరిపోతుందని భావిస్తున్నాము. ఒకవేళ పై వాటిలో ఏ హదీథైనా ప్రామాణికమైనదై ఉండినట్లయితే, మన కంటే ముందు సహాబాలు దానిని ఆచరించి ఉండేవారే మరియు అలా చేయమని సమాజానికి కూడా దారి చూపి ఉండేవారే. ఎందుకంటే ప్రవక్తల తర్వాత అంతటి ఉత్తములైన ప్రజలు సహాబాలే కదా. మరియు అల్లాహ్ విధించిన హద్దుల గురించి వారు బాగా ఎరిగినవారు. అల్లాహ్ తన దాసులకు ఆదేశించిన షరిఅహ్ గురించి వారికి చాలా బాగా తెలుసు. అల్లాహ్ గురించి మరియు అల్లాహ్ దాసుల గురించి వారు చాలా ఎక్కువ చిత్తశుద్ధి కలిగి ఉండినారు. పై వాటి గురించి వారి నుండి ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి, ఇవన్నీ అసత్యమైన హదీథులని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఏదైనా హదీథు ప్రామాణికమైనదైతే, దానికి సంబంధించిన షరిఅహ్ నియమం ఆచరణలో ఉండేది. పై హదీథులు అసత్యమైనవి లేదా కల్పితమైనవనే తుది నిర్ణయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. అన్నీ ఎరిగిన అల్లాహ్ యే మహోన్నతుడు, లోపాలకు అతీతుడు, ఘనమైన వాడు.

ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:

మదీనహ్ దర్శించే ప్రజలు ఖుబా మస్జిదును దర్శించడం మరియు దానిలో నమాజు చేయడం ఉత్తమం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలి నడకన, ఒక్కోసారి సవారీపై ఈ మస్జిదును దర్శించేవారు మరియు అందులో రెండు రకాతుల నమాజు చేసేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు

సహల్ బిన్ హనీఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

مَنْ تَـطَهَّـرَ فِـي بَـيْـتِـهِ ثُـمَّ أَتَـى مَسْجِـدَ قُـبَاءَ فَصَلَّى فِـيْـهِ صَلاَةً كَانَ لَـهُ كَـأَجْـرِ عُـمْـرَةٍ

మన్ తతహ్హర ఫీ బైతిహి థుమ్మ ఆతా మస్జిద ఖుబాఅ ఫసల్ల ఫీహి సలాతన్ కాన లహు కఅజ్రి ఉమ్రతిన్

ఎవరైతే ఇంటిలో వుదూ చేసి, తర్వాత ఖుబాఅ మస్జిదుకు వెళ్ళి, అందులో నమాజు చేస్తారో, అలాంటి వారికి ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (అహ్మద్, నసాయి, ఇబ్నె మాజా మరియు హాకిమ్)

అలాగే, జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:

زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ

జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత

స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి. ముస్లిం హదీథు.

సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,

أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ

అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్  మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.

మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:

أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ

అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్

సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.

ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.

మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.

అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:

زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً

జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్

సమాధులను దర్శించండం, కానీ చెడు పలుకులు పలుకవద్దు.

ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.

ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.

ఇది ఈ చిరు పుస్తకం యొక్క అంతిమ చివరి విషయం.

وَالْـحَمْـدُ للهِ أَ وَّلاً وَآخِراً، وَصَلَّى اللهُ وَسَلَّمَ عَلَى عَبْـدُهُ وَرَسُـولُـهُ وَخَـيْـرَتِـهُ مِنْ خَـلَـقَـهُ مُـحَـمَّـدٍ وَعَلَى آلِـهِ وَأَصْحَابِـهِ وَمَـنْ تَـبَـعَـهُمْ بِـإِحْـسَانِ إِلَى يَـوْمُ الـدِّيْـنَ

వల్ హందులిల్లాహి అవ్వలన్ వ ఆఖిరన్. సల్లల్లాహు అలైహి వసల్లం అలా అబ్దుహు, వ రసూలుహు, వ ఖైరతిహు మిన్ ఖలఖహు ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి, వ అస్హాబిహి, వ మన్ తబఅహుమ్ బిఇహ్సాని ఇలా యౌముద్దీన్.

ఆరంభంలో మరియు అంతంలో సకల స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ దాసుడు, ప్రవక్త మరియు సృష్టితాలలో అత్యుత్తములూ అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమ దినం వరకు మంచితనంలో వారిని అనుసరించేవారిపై అల్లాహ్ యొక్క కరుణ కురియుగాక.  

నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 10 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -10

1) సమాధిలో అడిగే 3 ప్రశ్నలు ఏమిటి?

A) నీ పేరు ఏమిటి ? / నీ వంశం ఏమిటి ? /  నీ మతం ఏమిటి  ?
B) నీ నమాజు ఏది? / నీ ఉపవాసం ఏది ? / నీ జకాత్ ఏది ?
C) నీ ప్రభువు ఎవరు ? /నీ ధర్మం ఏమిటి ? / నీ ప్రవక్త ఎవరు ?

2) జిన్నాతులు దేనితో సృష్టించబడ్డాయి ?

A) మట్టితో
B) అగ్ని జ్వాలలతో
C) గాలితో

3) పుట్టే ప్రతీ శిశువు ఏ విశ్వాసంతో  పుడుతుంది?

A) ఏక దైవారాధనా  విశ్వాసం
B) తల్లిదండ్రుల యొక్క విశ్వాసం
C) బహు దైవారాధన యొక్క విశ్వాసం

క్విజ్ 10. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 9:40]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!

బిస్మిల్లాహ్

grave

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!

అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.

ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.

ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్‌లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్‌, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.

ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.

మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!

అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!

శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!

“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)

ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!

మనోమస్తిష్కాలు కలవారలారా!

ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!

వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు, హజ్‌, ఉమ్రా, ఖుర్‌ఆన్‌ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్‌ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.

కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!

బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త  హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!

ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:

“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),

మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…

ఆయన పిలుపుకు హాజరు పలికి…

ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!

వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్‌.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ 
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

మృతునికి అతని అసలు స్థానం స్వర్గం లేక నరకం చూపబడుతుంది

బిస్మిల్లాహ్

1822. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్‌ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్‌, 90వ అధ్యాయం – అల్‌మయ్యతి యూరజు అలైహి మఖ్‌ అదుహు బిల్‌ ఘదాతి వల్‌ అషియ్యి)

[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]