ముస్లిం 1151 – “మనిషి చేసే ప్రతి సత్కార్యం పెంచి పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక సత్కార్యం యొక్క పుణ్యం పది నుండి ఏడు వందల రెట్ల వరకు పెంచడం జరుగుంది. అల్లాహ్ చెప్పాడు, కాని ఉపవాస, నిశ్చయంగా అది నా కొరకు, నేను ప్రతిఫలం ప్రసాదిస్తాను, అతను నా కొరకు మాత్రమే మనోవాంఛ, తినత్రాగడం మానుకుంటాడు“
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
బుఖారీ 2840, ముస్లిం 1153లో ఉంది: “ఎవరు అల్లాహ్ మార్గంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటాడో అల్లాహ్ డెబ్బై సంవత్సరాల కొరకు అతని ముఖాన్ని నరకాగ్ని నుండి దూరం ఉంచుతాడు.”
ఉపవాసం యొక్క ఘనతలో అనేక హదీసులున్నాయి.
(2) స్త్రీ – స్త్రీల కొరకు తరావీహ్ నమాజు చేయించవచ్చా?
A) చేయించవచ్చు
స్త్రీ, స్త్రీలకు ఇమాంగా ఉండి నమాజు చేయించవచ్చును. అందరూ ఏకీభవించిన విషయం ఇది.
అబూ దావూద్ 592లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉమ్ము వరఖ (రజియల్లాహు అన్హా)కు ఆదేశించారు, ఆమె తన ఇంటివారికి ఇమాంగా ఉండి నమాజు చేయించాలి అని.
అబూ దావూద్ వ్యాఖ్యానం ఔనుల్ మఅబూద్ లో ఉంది: ఆయిషా (రజియల్లాహు అన్హా) మరియు ఉమ్ము సలమ (రజియల్లాహు అన్హా) ఇమాంగా ఉండి ఫర్జ్ మరియు తరావీహ్ నమాజులు చేయించేవారు.
అయితే స్త్రీ ఇమాం పురషుల మాదిరిగా ఒంటరిగా ముందు నిలబడదు. స్త్రీల మొదటి పంక్తి మధ్యలో నిలబడాలి. కేవలం స్త్రీలకు మాత్రమే ఆమె ఇమామత్ చేయించాలి. స్త్రీ పురుషలకంటే ఎక్కువ ఖుర్ఆన్ తెలిసిననప్పటికీ పురుషులకు ఇమామత్ చేయించరాదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్న: తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చునా?
అవును, తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చును. ఆయిషా రజియల్లాహు అన్హా యొక్క బానిస జక్వాన్ (ذَكْوَان) ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయించేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా అతని వెనక తరావీహ్ లో పాల్గొనేవారు. (సునన్ కుబ్రా బైహఖీ 2/359. 3366, బుఖారీలో ముఅల్లఖన్ వచ్చింది 692కు ముందు హదీసు. బాబు ఇమామతిల్ అబ్ది వల్ మౌలా).
ఒక వ్యక్తి రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయిస్తాడు, అతని గురించి మీరేమంటారు అని ఇమాం జుహ్రీ రహిమహుల్లాహ్ ను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు: “ఇస్లాం ఉన్నప్పటి నుండి మా మంచివారు ఖుర్ఆన్ లో చూసే నమాజు చేస్తూ ఉన్నారు.” (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233).
సఈద్ బిన్ ముసయ్యిబ్, ఖతాద, అతా, యహ్ యా బిన్ సఈద్ అన్సారీ రహిమహుముల్లాహ్, ఈ ఇమాములందరూ రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించవచ్చు, అభ్యంతరం లేదన్నారు. (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233).
ఇంకా ప్రఖ్యాతిగాంచిన ఇమాం అబూ హనీఫా గారి ఇద్దరు శిష్యులు ఇమాం అబూ యూసుఫ్ మరియు ఇమాం ముహమ్మద్, అలాగే ఇమాం మాలిక్, ఇమాం షాఫిఈ మజ్హబ్ లో మరియు ఇమాం అహ్మద్ వారందరూ కూడా రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయవచ్చన్నారు.
అయితే ఇమాం ఇబ్రాహీం, ముజాహిద్, షఅబీ, సుఫ్యాన్ రహిమహుముల్లాహ్ వారు మక్రూహ్ అన్నారు, ఎందుకంటే ఇది యూదులకు పోలిన విషయం అవుతుందీ అని. (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 234).
మరియు అబూ హనీఫా రహిముహల్లాహ్ చెప్పారు: ఖుర్ఆనులో చూసి చదివితే నమాజ్ ఫాసిద్ అవుతుంది. దీని వల్ల అధిక చలనం అవుతుంది, నమాజులో సజ్దా చేసే చోట దృష్టి కేంద్రికృతమై ఉండదు అని. కాని పైన తెలుసుకున్నట్లు ఆయన ఇద్దరు శిష్యులు స్వయంగా దీనిని వ్యతిరేకించారు.
ఇమాం ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ చెప్పారు: ఇమాం అబూ హనీఫా కంటే ముందు ఎవరు కూడా నమాజ్ ఫాసిద్ అవుతుందని చెప్పలేదు. ‘యూదులకు పోలికవుతుంది’ గనక మక్రూహ్ అని చెప్పారు.
అంతే కాదు ఇమాం నవవీ (రహిముహుల్లాహ్) చెప్పారు: “మనిషికి ఖుర్ఆన్ కంఠస్తం ఉన్నా లేకపోయినా ఖుర్ఆన్ చూసి చదివినంత మాత్రాన నమాజ్ బాతిల్ కాదు. ఒకవేళ సుర ఫాతిహా గనక కంఠస్తం లేకుంటే చూసి చదవడం విధిగా అవుతుంది. చూసి చదివితే నమాజ్ బాతిల్ కాదు అన్న మాట మా మజ్హబ్ (అంటే షాఫిఈ మజ్హబ్), మాలిక్ మజ్హబ్, మరియు అబూ యూసుఫ్, ముహమ్మద్ మరియు అహ్మదులవారి మజ్హబ్. (అల్ మజ్మూఅ షర్హ్ల్ ముహజ్జబ్ : ఇమాం నవవీ 4/27).
సఊదీ అరేబియాలోని షేఖ్ ఇబ్ను బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుమల్లాహ్ కూడా రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడానికి అనుమతించారు.(మజ్మూఅ ఫతావా బిన్ బాజ్ 11/117, ఫతావా నూరున్ అలద్ దర్బ్ 8/2).
ముఖ్య గమనిక:
1- ఖుర్ఆన్ ఉత్తమ రీతిలో కంఠస్తం ఉన్న ఇమాం చూసి చదవడం మంచిది కాదు.
2- ముఖ్తదీలలో ఎవరు కూడా ఇమాం చదువుతున్న ఆయతులు ఖుర్ఆన్ చూస్తూ ఫాలో కావడం కూడా యోగ్యం లేదు. దీని వల్ల దృష్టి సజ్దా చేసే చోట కాకుండా ఖుర్ఆన్ పేజీలలో ఉంటుంది. చేతులు కట్టుకొని ఉండాల్సిన సున్నత్ తప్పిపోతుంది. ఖుర్ఆన్ మూయడం, తెరవడం, పేజీలు తిప్పడం, పక్కన పెట్టడం తీసుకోవడం లాంటి పనుల వల్ల నమాజు మక్రూహ్ అయ్యే కారణాల్లో ఒకటి అధిక చలనం అవుతుంది.
3- ఇమాం ఖుర్ఆన్ లో చూడకుండా చదువుతూ వెనక ఎవరినైనా ఒక్కరిని ఖుర్ఆన ను చూడమని, ఏదైనా తప్పు జరిగితే చెప్పమని అంటే అతను ఖుర్ఆను చూడవచ్చు. (ఫతావా నూరున్ అలద్ దర్బ్ 14/232).
సారాంశం ఏమిటంటే: ఖుర్ఆన్ కంఠస్తం లేనందు వల్ల లేదా ఉత్తమ రీతిలో కంఠస్తం లేనందు వల్ల మరియు తరావీహ్ నమాజులు సామాన్య నమాజుల కంటే దీర్ఘంగా, ఆలస్యంగా చేయడం మంచిది గనక ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడం ఒక అవసరం గనక ఇది యోగ్యమే. దీని వల్ల నమాజ్ బాతిల్ కాదు.
అల్లాహ్ మనందరికీ సుఖ దుఃఖ అన్ని స్థితిల్లో ఆయన ఆజ్ఞాపాలన చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మ ఆమీన్
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అవును, తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చును. ఆయిషా (రజియల్లాహు అన్హా) యొక్క బానిస జక్వాన్ (ذَكْوَان) ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయించేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) అతని వెనక తరావీహ్ లో పాల్గొనేవారు. (సునన్ కుబ్రా బైహఖీ 2/359. 3366, బుఖారీలో ముఅల్లఖన్ వచ్చింది 692కు ముందు హదీసు. బాబ్ ఇమామతిల్ అబ్ది వల్ మౌలా).
“ఒక వ్యక్తి రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయిస్తాడు, అతని గురించి మీరేమంటారు?” అని ఇమాం జుహ్రీ (రహిమహుల్లాహ్) ను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు: “ఇస్లాం ఉన్నప్పటి నుండి మా మంచివారు ఖుర్ఆన్ లో చూసే నమాజు చేస్తూ ఉన్నారు.” (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233)
అంతే కాదు ఇమాం నవవీ (రహిముహుల్లాహ్) చెప్పారు: మనిషికి ఖుర్ఆన్ కంఠస్తం ఉన్నా లేకపోయినా ఖుర్ఆన్ చూసి చదివినంత మాత్రాన నమాజ్ బాతిల్ కాదు. ఒకవేళ సుర ఫాతిహా గనక కంఠస్తం లేకుంటే చూసి చదవడం విధిగా అవుతుంది. చూసి చదివితే నమాజ్ బాతిల్ కాదు అన్న మాట మా మజ్ హబ్ (అంటే షాఫిఈ మజ్హబ్), మాలిక్ మజ్హబ్, మరియు అబూ యూసుఫ్, ముహమ్మద్ మరియు అహ్మదులవారి మజ్హబ్. (📚అల్ మజ్మూఅ షర్హ్ల్ ముహజ్జబ్ : ఇమాం నవవీ 4/27).
ముఖ్య గమనిక:
1- ఖుర్ఆన్ ఉత్తమ రీతిలో కంఠస్తం ఉన్న ఇమాం చూసి చదవడం మంచిది కాదు.
సారాంశం ఏమిటంటే: ఖుర్ఆన్ కంఠస్తం లేనందు వల్ల లేదా ఉత్తమ రీతిలో కంఠస్తం లేనందు వల్ల మరియు తరావీహ్ నమాజులు సామాన్య నమాజుల కంటే దీర్ఘంగా, ఆలస్యంగా చేయడం మంచిది గనక ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడం ఒక అవసరం గనక ఇది యోగ్యమే. దీని వల్ల నమాజ్ బాతిల్ కాదు.
తెలుగు, ఇతర భాషల్లో ఖుర్అన్ చూసి చదవడం సరి అయిన విషయం కాదు.
(2) సహరీ మరియు ఇఫ్తార్ ను గూర్చిన సరైన విధానం ఏదీ?
A) ఆలస్యంగా సహరీ – త్వరగా (సమయం అయిన వెంటనే) ఇఫ్తార్ చెయ్యడం
సహరీ చివరి సమయంలో మరియు ఇఫ్తార్ తొలి సమయంలో చేయడం చాలా మేలు. దీని గురించి ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
بَكِّرٌوا بِالإفْطَارِ وَأَخِّرٌوا السُّحُورَ
“ఇఫ్తార్ చేయడంలో తొందరపడండి, సహరి చేయడంలో ఆలస్యం చేయండి“. (సహీహ 1773).
روى البخاري (1957) ومسلم (1098) عَنْ سَهْلِ بْنِ سَعْدٍ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ( لا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ (బుఖారీ 1957, ముస్లిం 1098లో ఉంది,
2- సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చెయ్యాలి. రుతబ్ (ఖర్జూరపు ఆరంభపు పండు) తో ఇఫ్తార్ చేయడం సున్నత్. అవి దొరకనప్పుడు ఖర్జూర్లతో, అవీ లేనప్పుడు నీళ్ళతో అది కూడా లభించనప్పుడు ఏది సులభంగా లభ్యమగునో దానితోనే ఇఫ్తార్ చేయాలి.
(3) ఉపవాసి దుఆ ఎప్పుడు స్వీకరించబడుతుంది?
C) ఉపవాస స్థితిలో ఉన్నంత కాలం ( సహరీ నుండీ ఇఫ్తార్ వరకు)
ప్రత్యేకంగా ఉపవాస స్థితిలో ఉన్నంత కాలం దుఆ స్వీకరించబడుతుంది. దీనికి దలీల్ ఉపవాసానికి సంబంధించిన ఆయతుల మధ్యలో అల్లాహ్ దుఆ గురించి ప్రస్తావించడం. అయితే రేయింబవళ్ళలో ఎన్నో సందర్భాలు న్నాయి వాటిలో అల్లాహ్ దుఆ స్వీకరిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం, ‘‘రమ’దాను కు ఒకటి, రెండు రోజులు ముందు ఉపవాసం ఉండరాదు. అయితే అలవాటుగా ఉపవాసం ఉంటూ వస్తున్న వ్యక్తి ఉండవచ్చు.”(బు’ఖారీ 1914, ముస్లిమ్ 1082). మిష్కాత్ 1973, హదీసు కిరణాలు 1225, హదీసు మహితోక్తులు 657.
وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: “مَنْ صَامَ الْيَوْمَ الَّذِيْ يُشَكُّ فِيْهِ فَقَدْ عَصَى أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. [حكم الألباني] : صحيح
‘అమ్మార్ బిన్ యాసిర్ కధనం: “అనుమానం గల దినంలో ఉపవాసం పాటించినవాడు, అబుల్ ఖాసిమ్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిధేయతకు పాల్పడ్డాడు.” (అబూ దావూద్ తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి). మిష్కాత్ 1977 . హదీసు కిరణాలు 1228.
అనుమానంతో కూడిన రోజంటే షాబాన్ మాసపు 30వ తేది. ఆకాశం మేఘావృతమై ఉన్న కారణంగా షాబాన్ మాసపు 29వ తేదీన చంద్రుడు కనిపించనప్పటికి కేవలం ఊహతో, మబ్బుల వెనక చంద్రుడు ఉండి ఉంటాడన్న అనుమానంతో మరునాడు రమజాన్ మాసపు ఒకటో తేదీ అని భావించి ఆ రోజున ఉపవాసం పాటించకూడదు. చంద్రుడు కనిపించాడా లేదా అన్న సందేహం ఏర్పడినప్పుడు ఆ నెలలో ముప్పై రోజులు పూర్తి చేసుకోవాలి. సందేహాస్పద దినాల్లో ఉపవాసం పాటించనవసరం లేదు. (హదీసు కిరణాలు 1228).
(2) ఉపవాసి గూర్చి ప్రత్యేకించబడిన స్వర్గ ద్వారం పేరు ఏమిటి?
C) బాబుర్ రయ్యాన్
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْ الْجَنَّةِ ثَمَانِيَةَ أَبْوَابٍ مِّنْهَا: بَابٌ يُسَمَّى الرَّيَّانَ لَا يَدْخُلُهُ إِلَّا الصَّائِمُوْنَ”.
సహల్ బిన్ స’అద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: ”స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసకులు ఈ ద్వారం గుండానే స్వర్గం లోనికి ప్రవేశిస్తారు.” (బు’ఖారీ, ముస్లిమ్) మిష్కాత్ 1957,
అబూ హురైరహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం: “అల్లాహ్ మార్గంలో ఒక వస్తువును జతలుగా (డబల్) దానం చేస్తే తీర్పుదినం నాడు స్వర్గద్వారాల వద్దనుండి అతన్ని పిలవటం జరుగుతుంది. స్వర్గానికి (8) ద్వారాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి అధికంగా నమా’జులు చదివే వాడైతే అతన్ని నమా’జు ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేవాడైతే అతన్ని జిహాద్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అధికంగా ‘సదఖహ్ చేసేవాడైతే, ‘సదఖహ్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది, అధికంగా ఉపవాసాలు ఉండేవాడైతే అతన్ని రయ్యాన్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది.” వెంటనే అబూబకర్ (రజియల్లాహు అన్హు), అన్ని ద్వారాల నుండి పిలువబడటం ఎందుకు, స్వర్గంలో ప్రవేశించడానికి ఒకే ద్వారం చాలు, అన్ని ద్వారాల నుండి పిలువబడేవారు కూడా ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ‘అవును, నువ్వూ వారిలోని ఒకడవని నేను భావిస్తున్నాను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్). (మిష్కాత్ 1890, హదీసు కిరణాలు 1217.)
(3) రమజాన్ లో ఉపవాసం యొక్క సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి?
‘హఫ్’సహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”రాత్రి ఫజ్ర్ కు ముందే ఉపవాస సంకల్పం చేయని వాని ఉపవాసం నెరవేరదు.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దారమి) . మిష్కాత్ 1987
వివరణ-1987: విధి ఉపవాసానికి రాత్రే సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ రాత్రి సంకల్పం చేసుకోకుండా, తెల్లవారిన తర్వాత సంకల్పం చేస్తే, ఉపవాసం నెరవేరదు. అయితే అదనపు ఉపవాసాలు ఏమీ తినకుండా మిట్టమధ్యాహ్నానికి ముందు సంకల్పించు కుంటే సరిపోతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం పునాది ఐదు మూలస్తంభాలపై ఉంది: (1) సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధిదానం) చెల్లించుట. (4) హజ్ చేయుట. (5) రమజాన్ ఉపవాసాలు పాటించుట. (బుఖారి 8, ముస్లిం 16).
(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?
C ) ఇఫ్తార్ వరకు
وتستغفر لهم الملائكةُ حتى يُفطروا
ఈ హదీసును తమ హదీసు గ్రంథాలలో ప్రస్తావించిన ఇమాముల్లో: ఇమాం అహ్మద్, 7917, ఇమాం బజ్జార్ 963, ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ ఖియాము రమజాను 112లో, ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ 3602లో
ఈ హదీసును ఇంత మంది ఇమాములు ఉల్లేఖించినప్పటికీ ఇది జఈఫ్, దీనికి కారణం ఈ హదీసు పరంపరలో ఒకరు హిషామ్ బిన్ అబీ హిషామ్ జఈఫ్ అని హదీసు శాస్త్రవేత్తలందరూ ఏకీభవించారు. ఇక ముహమ్మద్ బిన్ అస్వద్ గురించి మజ్ హూలుల్ హాల్ అని చెప్పడం జరిగింది. ఇది జఈఫ్ అన్న విషయం మీకు తెలియజేస్తూ కొంత వివరణ ఇవ్వడానికే ఈ ప్రశ్న తీసుకురావడం జరిగింది.
అయితే దైవదూతలు సర్వ సామాన్యంగా విశ్వాసుల కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన సూర ఘాఫిర్ 40:7 లో వచ్చి ఉంది.
అర్ష్ (అల్లాహ్ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. “వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”
(3) మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు ఉపవాసాల ఎన్ని రోజుల లెక్క పూర్తి చేయాలి?
A) 30 రోజుల లెక్క పూర్తి చేయాలి
فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَأَكْمِلُوا الْعِدَّةَ ثَلَاثِينَ
“మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు మీరు 30 రోజుల లెక్క పూర్తి చేయండి” (బుఖారి 1907, ముస్లిం 1081)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
రోజాను భంగ పరుచు విషయాలు:
1- గుర్తుండి తిని త్రాగడం వల్ల రోజా భంగమగును. కాని మరచిపోయి తిన త్రాగటం వల్ల రోజా భంగం కాదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) అతను తన రోజాను కొనసాగించాలి. (ముస్లిం 1155).
ముక్కు ద్వారా కడుపులో నీళ్ళు పోయినా రోజా భంగమవుతుంది. నాడి ద్వారా ఏదైనా ఆహారం అందించడం, రక్తం ఎక్కించడం వల్ల రోజా వ్యర్థమవుతుంది. ఇవి ఉపవాసికి ఆహారంగా పని చేస్తాయి.
2- సంభోగించడం. ఉపవాసమున్న వ్యక్తి సంభోగించినచో ఉపవాసం భంగమగును. దానికి బదులుగా రమజాను తర్వాత ఒక రోజు ఉపవాసం ఉంటూ ఈ పరిహారం చెల్లించుటవిధిగా ఉంది. (1) ఒక బానిసకు విముక్తి కలిగించాలి. ఈ శక్తి లేనిచో (2) వరుసగా రెండు నెలల ఉపవాసాలుండాలి. అకారణంగా వరుస తప్పవద్దు. ఉదాః రెండు పండుగలు, ఈదుల్ అజ్హా తర్వాత మూడు రోజులు, లేదా అనారోగ్యం మరియు ప్రయాణం లాంటి కారణాలు. రోజా తప్పాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అకారణంగా ఒక రోజు కూడా ఉపవాసం మానుకున్నా మళ్ళీ కొత్త వరుసతో ఉపావాసాలు మొదలు పెట్టాలి. ఒకవేళ రెండు నెలల ఉపవాసాలు కూడా ఉండే శక్తి లేనిచో (3) అరవై మంది పేదలకు అన్నం పెట్టాలి.
3- ముద్దులాట, హస్తప్రయోగం వల్ల వీర్యం పడి పోతే ఉపవాసం భంగమవుతుంది. (హస్త ప్రయోగానికి ఇస్లాంలో అనుమతిలేదు). వాటికి పరిహారం లేదు కాని తర్వతా ఒక రోజా ఉండాలి. ఒకవేళ నిద్రలో స్ఖలనమైనచో రోజా భంగం కాదు.
4- కరిపించి దేహం నుండి రక్తం తీయించుట, లేదా రక్తదానం కొరకు ఆధునిక పద్ధతిలో రక్తం తీయుంచుట వల్ల రోజా భంగమగును. కాని రక్తపరీక్ష ఉద్దేశంతో కొంచం తీయుట వల్ల రోజా భంగం కాదు. అలాగే పుండు నుండి, ముక్కు నుండి రక్తం వెలితే, పన్ను వూడి రక్తం వెలితే రోజా భంగం కాదు.
5- ఉద్దేశ్యంతో కావాలని వాంతి చేస్తే రోజా భంగమవుతుంది. కాని మనిషి తన ప్రమేయం లేకుండా అదే వస్తే రోజా భంగం కాదు.
పై విషయాలు, ఏ మనిషి తెలిసి చేస్తాడో అతని రోజా మాత్రమే భంగమగును. వాటి ధార్మిక ఆదేశాలు తెలియక లేదా సమయం తెలియక (ఉదా: ఉషోదయం కాలేదని అను కొనుట, లేదా సూర్యాస్తమయం అయినది అనుకొనుట లాంటివి) ఏదైనా తప్పు జరిగితే రోజా భంగం కాదు.
గుర్తుండి వాటికి పాల్పడ కూడదు. మతి మరుపుతో జరిగిన విషయంలో కూడా పట్టు బడరు. తాను కావాలని చేయకూడదు. ఎవరైనా అతనిపై ఒత్తిడి, బలవంతం చేసినందు వల్ల అతను వాటికి పాల్పడితే రోజా భంగం కాదు. తర్వాత దాన్ని పూర్తి చేయనవసరం లేదు.
6- ఉపవాస స్థితిలో స్త్రీలకు బహిష్టు వచ్చినా, వారు ప్రసవించినా రోజా భంగమగును. అలాగే రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసం ఉండరాదు. ఎన్ని రోజుల ఉపవాసం ఉండలేక పోయారో శుద్ధి పొందిన తర్వాత అన్ని రోజుల ఉపవాసం పూర్తి చెయ్యాలి.
రోజాను భంగపరచని విషయాలు:
1- స్నానం చేయుట, ఈతాడుట, వేసవిలో నీళ్ళు పోసుకొని శరీర భాగాన్ని చల్లబరుచుట.
2- ఉషోదయం వరకు తిని త్రాగుట మరియు సంభోగించుట.
3- ఏ సమయములోనైనా మిస్వాక్ చేయుట వల్ల రోజా భంగము కాదు, మక్రూహ్ కాదు. అది ఏ స్థితిలో కూడా చేయుట అభిలషణీయం.
4- ఆహారముగా పని చేయని ధర్మసమ్మతమైన ఏ రకమైన చికిత్స అయినా సరే చేయవచ్చును. ఇంజక్షన్, చెవుల్లో, కళ్ళల్లో మందు వేయించటం, దాని రుచి ఏర్పడినా సరే. ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగటం వల్ల ఏ నష్టం లేకుంటే ఆలస్యం చేయడం మంచిది. ఉబ్బసం (Asthma)తో బాధపడు తున్నవారికి ఆక్సిజన్ (Oxygen) ఎక్కించడం వల్ల రోజా భంగం కాదు. కడుపులో చేరకుండా జాగ్రత్త పడుతూ వంటకాల రుచి చూడడం. అలాగే పుక్కిలించడం, తిన్నగా ముక్కులో నీళ్ళు ఎక్కించడం తప్పు కాదు. అయితే తిన్నగా ఎక్కించే విషయంలో అజాగ్రత్త వల్ల ముక్కు ద్వారా నీళ్ళు కడుపులో పోయే ప్రమాదం ఉంటుంది. సువాసన పూసుకోవడం, దానిని ఆఘ్రాణించడం కూడా తప్పు లేదు.
5- రాత్రి సమయంలో రకస్రావం నిలిచిన బహిష్టురాలు, బాలింతలు అలాగే సంభోగించుకున్న దంపతులు సహరీ తర్వాత ఫజ్ర్ నమాజుకు ముందు గుస్ల్ (స్నానం) చేసినా అభ్యంతరం లేదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
ఈ ఉపవాసాలు ఎవరిపై విధి?
ప్రతీ తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ, పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్ఖలనమగుట మరియు బాలికలకు పై మూడింటితో పాటు నెలవారి రక్తస్రావమగుట. వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే.
ఎవరిపై రోజా విధిగా లేదు?
1- రోగి: స్వస్థత పొందే నమ్మకం ఉన్న వ్యాదిగ్రస్తుడు. అతనికి ఉపవాసం ఉండుట కష్టంగా ఉంటే, కష్టం ఉన్న రోజుల్లో ఉపవాసం మానుకొని, అన్ని రోజుల ఉపవాసం తర్వాత ఉండాలి.
స్వస్థత పొందే నమ్మకం లేని వ్యాదిగ్రస్తుడు ఉపవాసం ఉండనవసరం లేదు. కాని ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజుల ఉపవాసం మానేశాడో లెక్కేసుకొని అంత మంది బీదవాళ్ళకు ఒకే రోజు విందు చేయాలి.
2- ప్రయాణికుడు: ఇంటి నుండి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానేయవచ్చును. అయితే అక్కడ నివసించే ఉద్దేశం ఉండకూడదు.
3- గర్భిణి, పసి బిడ్డలకు పాలిచ్చు తల్లి: తనకు లేదా పసిబిడ్డకు అనారోగ్య భయం ఉన్నచో ఉపవాసం మానేసి, ఈ ఆటంకం దూరమయ్యాక అన్ని రోజుల ఉపవాసం వేరే రోజుల్లో ఉండాలి.
4- ఉపవాసముండే శక్తి లేని వృద్ధులు: వారు ఉపవాసం మానుకోవచ్చు. కాని ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.