[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది]
నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్ మజార్ షరీఫ్” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్ బాబా” అని “లాల్ దర్గా” పేరుతో ఉంది.
రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.
అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.
ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్ మరియు బిద్అత్ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.
“బారా షహీద్ మజార్ షరీఫ్”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.
అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.
“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్ నజ్మ్:23)
(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్ సబా:22).
అల్లాహ్ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.
“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్ అంబియా:25)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్ జన్నహ్: 316-318).
ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ ఈ రెండవ మాసంలో ఎంతో మంది అపశకునం పాటిస్తారు. ఇలా పాటించడం ధర్మమా అధర్మమా ఈ వీడియోలో తెలుసుకోండి.
సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.
ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)
సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:
మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.
రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.
[24 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
సఫర్ నెల వాస్తివికత
సఫర్ నెల ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం రెండవ నెల. అరబ్బులలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్తగా రాక మునుపు సఫర్ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈనెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు.
ప్రస్తుత కాలంలో మన ముస్లిం సమాజానికి చెందిన కొంత మంది అజ్ఞానులు, అలాంటి మూఢ నమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని నమ్మకాలకు గురికాబడి ఉన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:
1-మొత్తం సంవత్సరంలో పది లక్షల ఎనభై వేల విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తలలో నుండి ఒక్క సఫర్ నెలలోనే తొమ్మిది లక్షల ఇరవై వేల విపత్తులకు గురికాబడతారని భావిస్తారు.
2-సఫర్ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు, సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు.
౩-ఈ నెల మొదటి పదమూడు రోజులను “తేరతేది” అని పేర్కొంటూ, తీవ్రమైన విపత్తులకు గురికాబడే రోజులుగా భావిస్తారు.
4- ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్ళి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒక వేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉన్నా ఆ జంటలను పదమూడు రోజుల వరకు విడదీసి, ఒకరి ముఖాలను మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనుక కలుసుకుంటే, వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు.
యదార్ధం ఏమంటే? అలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత లేదు. పైగా అలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే? నెలలను లేక సమాయాలను అపశకునాలకు విపత్తులకు ప్రత్యేకిస్తే, అల్లాహ్ ను తప్పుపట్టినట్లుగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. కనుక ఒక హదిసు ఖుద్సీలో ఇలా ఉంది:
“అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆదాము పుత్రుడు (మానవుడు) కాలాన్ని (రోజులను, నెలలను, యేడాదిని) తిట్టుతున్నాడు. మరియు నేనే కాలాన్ని. నా చేతిలోనే రాత్రింబవళ్ళ మార్పిడి ఉన్నది.”,(బుఖారి;4452, ముస్లిం:41 70)
మరొక చోట ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు కాలాన్ని తిట్టకండి. నిశ్చయంగా అల్లాహ్ యే కాలము.” (ముస్లిం:4165)
ఆఖరి చహార్షుమ్బా
సఫర్ నెలకు చెందిన చివరి వారంలో ఉన్న బుధవారాన్ని ఊరుబయటకు వెళ్ళి పచ్చగడ్డిపై నడవటం పుణ్య ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే? ఆ రోజే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లభించినది అని, మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సరదాగా ఆ రోజు పచ్చగడ్డిపై నడిచారని అంటారు. దాని కారణంగా ప్రజలు భార్యపిల్లలతో కలిసి పార్కులలో, తోటలలో షికార్లు చేస్తారు. దానిని ప్రవక్త ఆచారం అని అంటారు.
ఆ సాకుతో కొంత మంది ప్రజలు సఫర్ నెల చివరి బుధవారం తమ ఇండ్లలో మంచి వంటకాలు చేసుకొని, స్నానాలు చేసుకొని, క్రొత్త దుస్తులు ధరించి, బాగా అందంగా తయారయ్యి అందాల పోటీల సభలలో పాల్గొన్నట్లు ముస్తాబు అవుతారు. చిన్నాపెద్ద, ఆడామగా అనే తేడా లేకుండా పార్కుల్లో, తోటల్లోకి పోయి ఏ విధంగా కలిసి మెలిసి షికార్లు చేస్తుంటారనేది మనం చెప్పనక్కర లేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి రోజులు:
సఫర్ నెల చివరి బుధవారం రోజున ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లబించిందా అంటే? దానికి జవాబు కానేకాదు. ఎందుకంటే? “అర్రహీఖుల్ మఖ్తూమ్” తెలుగు పేజి: 813లో ప్రవక్త గారి గురించి ఇలా ఉంది: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీర ఉష్ణోగ్రత (జ్వరము) మరింత పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆయన బాధ బాగా ఎక్కువై అపస్మారక పరిస్థితి ఎర్పడింది.” నిజమేమంటే ఆ రోజే ఆయన అస్వస్థకు గురికాబడ్డారు. కాని మనం స్వస్థత చేకూరిందంటూ సంతోషాలు జరుపుకోవడం ధర్మమేనా? దాని వలన మనకు పుణ్యం ప్రాప్తిస్తుందా? లేక పాపం ప్రాప్తిస్తుందా? మనం ఆఖరి చహార్షుమ్బా పేరుతో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్రనే తప్పుగా ప్రచారం చేయడం లేదా?
ప్రియమైన ముస్లిములారా! ఆఖరి చహార్షుమ్బా అంటూ ప్రత్యేకమైన ఎలాంటి పుణ్యకార్యం లేదు. మరియు సఫర్ నెల గురించి ఇస్లాం ధర్మంలో ఎలాంటి అపశకునాలు లేవు. అసలు అలాంటి అపశకునాలకు గురికాకూడదని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు:
“అంటు (వ్యాధులు), దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అపశకునాలు లేవు, గుడ్లగుబ కేకల వలన ఎలాంటి ప్రభావం లేదు, మరియు సఫర్ (నెల) ఏమి కాదు…” (బుఖారి: 5316, ముప్లిం: 4116)
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 71-74). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ(రబీఉస్సానీ నెల 11 వ రోజు)గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు
ఈ ప్రసంగంలో, వక్త షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి జీవిత చరిత్ర, ఆయన వంశం మరియు విద్య గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆయన తౌహీద్ (ఏకదైవారాధన) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అనుసరించడంపై చేసిన స్పష్టమైన బోధనలను ఉటంకిస్తారు. అనంతరం, రబీఉల్-ఆఖర్ నెలలో ఆయన పేరు మీద జరిగే ‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటి ఆచారాలను తీవ్రంగా ఖండిస్తారు. ఈ పనులు షిర్క్ మరియు బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు) అని, ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేస్తారు. ఆయన పట్ల గౌరవం చూపించడం మరియు ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడటం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ, సరైన మధ్య మార్గాన్ని అనుసరించాలని ఉద్బోధిస్తారు. చివరగా, ఇటువంటి మూఢనమ్మకాలకు, కల్పిత కథలకు దూరంగా ఉండి, ఖుర్ఆన్ మరియు సున్నత్ను మాత్రమే అనుసరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిస్తారు.
السلام عليكم ورحمة الله وبركاته [అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد [అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్] సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఇక అసలు విషయానికొస్తే…
మహాశయులారా, పీరానే పీర్, మహబూబే సుబ్ హానీ, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ వారి యొక్క జీవితం మరియు సంక్షిప్తంగా వారి జీవిత చరిత్రతో పాటు వారి యొక్క ముఖ్య బోధనలు ఇంకా రబీఉస్సానీ, రబీఉల్-ఆఖర్ ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఈ నాలుగోవ నెల ఇందులో సామాన్యంగా మన దేశాల్లో పీరానే పీర్ పేరు మీద కొత్త జెండాలు పెట్టడం, గ్యారవీలు చేయడం, ఇంకా ఇలాంటి దురాచారాలు ఏదైతే చేస్తున్నారో వాటి వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
సోదర మహాశయులారా, పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై హిజ్రీ శకం 470 లేదా 471లో జన్మించారు. ఆయన జన్మించిన స్థలం ఇరాక్ లో జీలాన్ మరియు అలాగే కీలాన్ అని కూడా అనబడింది. కానీ జీలానీ అన్న పేరుతో చాలా ప్రఖ్యాతి గాంచారు.
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి జీవితం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు మనమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ రదియల్లాహు అన్హుమా వీరిద్దరిలో హజ్రత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వంశానికి చెందినవారు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై.
యవ్వనంలో చేరిన తర్వాత ఇంచుమించు సుమారు 17, 18 సంవత్సరాల వయసులో బగ్దాద్ లో వచ్చారు. ఆనాటి కాలంలో బగ్దాద్ లో ప్రఖ్యాతిగాంచిన చాలా గొప్ప పండితులు ఉన్నారు. వారితో విద్య అభ్యసించారు.
[నేను ఎక్కువ వివరాల్లో వెళ్లకుండా, మూడు విషయాలు మీ ముందు తెలియజేస్తాను అని చెప్పాను గనుక ప్రతి దాంట్లో కొంత భాగాన్ని తీసుకుని, ఆయన పేరు మీద జరుగుతున్న దురాచారాల గురించి కొంత వివరంగా, స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.]
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సుమారు 90 సంవత్సరాల వయసు అల్లాహ్ వారికి ఇచ్చారు. ఇంచుమించు 40 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన చాలా లోతుగా, మరీ ఎంతో శ్రమించి, కష్టపడి విద్య నేర్చుకున్నారు. ధర్మ విద్యలో ఎన్నో రకాలు కేవలం ఖుర్ఆన్ హిఫ్జ్ మరియు కొన్ని హదీసులు హిఫ్జ్ చేసుకోవడమే కాదు, ఇందులో ఉసూలె తఫ్సీర్, తఫ్సీర్, ఉసూలె హదీస్, హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా తజ్కియె నఫ్స్ అంటే మనశ్శుద్ధి, మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ పరలోక విషయంలో ఆలోచిస్తూ ఉండే విధంగా, ఇహలోక జీవితంలోని క్షణం క్షణం కూడా పరలోక లాభానికై గడిపేటువంటి ఆలోచన మనసులో రావాలి. దాని గురించి కొన్ని ప్రత్యేక శిక్షణలు ఇస్లాం ఇచ్చిన ఆదేశ ప్రకారం, వేరే తసవ్వుఫ్ మరియు కొన్ని బిద్అతులు తసవ్వుఫ్ పేరు మీద ఏదైతే మొదలయ్యాయో అలా కాకుండా, అందులో కూడా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రఖ్యాతిగాంచారు.
ఇంకా మహాశయులారా, విద్య అభ్యసించే కాలంలో ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎన్నెన్నో రోజులు తినడానికి బుక్కెడు కూడు దొరికేది కాదు. అలాంటి కష్టాలను కూడా ఆయన భరించారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ఇంచుమించు 40 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగా ఆయన ప్రజలకు ఇక విద్య నేర్పడం మొదలుపెట్టారు అంటే అందులో కూడా అల్హందులిల్లాహ్ అల్లాహు తఆలా చాలా సేవలు ఆయన నుండి తీసుకున్నాడు. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించి, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సమాధిని అల్లాహ్ నూర్ తో, కాంతితో నింపుగాక. అల్లాహు తఆలా ఆయన యొక్క సమాధిలో స్వర్గపు ద్వారాలు తెరువగాక. ఎల్లవేళల్లో అల్లాహు తఆలా తన కరుణా కటాక్షాలు ఆయనపై కురిపిస్తూ ఉండుగాక. మరియు అల్లాహు తఆలా ఆయనతో సంతోషించి ఆయన ఇహలోకంలో ఇన్ని సత్కార్యాలు చేశారో వాటన్నిటిని స్వీకరించి, ఆయనతో జరిగిన పొరపాట్లను అల్లాహ్ క్షమించుగాక, మన్నించుగాక. ఆమీన్.
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు కూడా రచించారు. అందులో “గునియతుత్ తాలిబీన్” అని చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంకా వేరే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారు వారి యొక్క బోధనలు, వారు తమ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే, చదివితే మరియు వారి పేరు తీసుకొని ఈ రోజుల్లో ఎవరెవరైతే గ్యారవీలు, జెండాలు ఇట్లా అన్నీ చేస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనబడుతుంది.
తౌహీద్, సున్నత్ పై ఆయన బోధనలు
ఉదాహరణకు, తౌహీద్ విషయంలో ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై చెప్పారు, “ఓ ప్రజలారా, ఏ సృష్టి చేతిలో కూడా ఎలాంటి అధికారం లేదు. అందరూ కూడా బలహీనులు మరియు ఇహలోకంలో ఎవరైనా రాజు అయినా, ప్రజా అయినా, సిరిసంపదలు గలవాడైనా లేక పేదవాడైనా అందరూ కూడా అల్లాహ్ విధివ్రాతకు లొంగిబడి ఉన్నారు. వారందరి యొక్క హృదయాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ తాను కోరినట్లు వారి యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు.” ఈ విషయం ఆయన రచించిన ఒక గ్రంథం “అల్-ఫత్హుర్ రబ్బానీ” అని 88వ పేజీలో ఉంది.
ఇంకా మహాశయులారా, ఇదే గ్రంథంలోని 191వ పేజీలో,
“ఓ ప్రజలారా, షరీఅత్ ను అనుసరించండి. బిద్అత్లను మీరు కల్పించకండి. మీరు షరీఅత్ ను అనుసరిస్తూ దాని వ్యతిరేకత నుండి దూరం ఉండండి. అల్లాహ్ యొక్క మాట విని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ఎప్పుడూ కూడా అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయులుగా కాకండి. తమలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా షిర్క్ మరియు దాని దరిదాపులకు తాకకండి. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దర్బార్, అల్లాహ్ యొక్క ముందు నుండి మీరు దూరం కాకండి. కేవలం అల్లాహ్ తో మాత్రమే అర్ధించండి. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి ముందు కూడా మీరు మీ చెయ్యి చాపకండి. ఏ సహాయమైనా గాని అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కోరకండి. కేవలం అల్లాహ్ మీద మాత్రమే మీరు నమ్మకం, భారం వేసి ఉండండి. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి మీద కూడా మీరు మీ నమ్మకాన్ని ఉంచుకోకండి.”
ఇంకా, ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై తమ యొక్క శిష్యునికి బోధ చేస్తూ, “వాస్తవమైన సాఫల్యం పొందడానికి ఒక ఉత్తమమైన చిట్కా తెలుసుకో” అని ఇలా తెలిపారు, “ఒకవేళ నీవు సాఫల్యం కోరితే, నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ కూడా తీసేసెయ్. అంటే, అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కూడా భయపడకు. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి మీద కూడా ఎలాంటి ఆశ పెట్టుకోకు. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితోనైనా నీకు ఏదైనా శాంతి లభిస్తుంది అని కూడా నీవు ఆశించకు. ఇంకా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా నీవు అందరినీ అసహ్యించుకొని కేవలం అల్లాహ్ ను మాత్రమే ఇష్టపడి, ఆయన ప్రేమను మాత్రమే పొందే ప్రయత్నం చెయ్.” ఇక్కడ అందరినీ అసహ్యించుకోవడము అంటే అల్లాహ్ ఎదుట. అంటే అల్లాహ్ కంటే ఎక్కువగా వేరే ఎవరినైనా ప్రేమించడం, అల్లాహ్ కంటే ఎక్కువగా ఎవరితోనైనా భయపడడం, దీన్ని ఖండిస్తున్నారు. “గమనించు, నీవు అల్లాహ్ ను కాకుండా ఎవరిదైనా ప్రేమ నీ మనసులో వచ్చింది అంటే, నీవు ఒక ముర్దార్, ఒక శవాన్ని, ఒక చనిపోయిన దానిని ఎలా చూసి నీ మనసులో ఛీ అనుకుంటావో అలా భావించు. ఎందుకంటే అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ తప్ప నీకు ఎక్కడా కూడా ఆత్మశాంతి అనేది లభించదు. అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను స్మరిస్తూ ఉంటే, అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను నీవు ఇష్టపడినావంటే నీకు ఎప్పుడూ కూడా సుఖము, శాంతి లభించదు.”
ఈ విధంగా మహాశయులారా, చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే విషయంలో కూడా ఎంతో ఖరాఖండిగా, ఎంతో క్లియర్ గా చెప్పేశారు. “ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం లేదో, అంటే ప్రవక్త తీసుకువచ్చిన ధర్మానిని అనుసరించకుండా ఆయన యొక్క అనుసరణను వదిలి ఇంకా వేరే ఎవరినైనా అనుసరణను అతడు అవలంబిస్తాడో, అతడు ఎన్నటికీ అల్లాహ్ వద్దకు చేరుకోలేడు. అల్లాహ్ యొక్క ప్రవక్త అల్లాహ్ వద్ద చేరుకోవడానికి ఒక మాధ్యమంగా వచ్చారు. ఆయనను అనుసరించడం తప్పనిసరి. ఆయన అనుసరణ ఎవరైతే వదులుకుంటారో, అతడు నాశనమైపోతాడు. నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. అతడు దుర్మార్గంలో పడిపోతాడు, దుర్మార్గంలో పడిపోతాడు.” ఈ విషయం “అల్-ఫత్హుర్ రబ్బానీ” పేజీ నంబర్ 115 లో రాసి ఉంది.
ఇంతేకాకుండా ఇంకా షిర్క్ నుండి, అల్లాహ్ ను కాకుండా వేరే వారిపై నమ్మకాలు ఉంచుకునే దాని గురించి కూడా ఇంకా ఎంతో స్పష్టంగా తెలిపారు. అయితే మహాశయులారా, ఇక రండి మనం కొన్ని క్షణాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న గ్యారవీ మరియు జెండాలు, గుండాలు వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మార్గభ్రష్ట ఆచారాలు – గ్యారవీ
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై విషయంలో మన సమాజంలో ఒక రకం ప్రజలలో ఎలా ఉన్నారు? ఆయనను ఎంతో గొప్పగా భావించి, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ యొక్క వలీ, అల్లాహ్ యొక్క భక్తుడు అని అంటారు కానీ, ఆయన గురించి నమ్మకం, ఆయన గురించి విశ్వాసం, ఆయన గురించి మనసులో ప్రేమ, ఆయన గురించి తమ మనసులో భయం అల్లాహ్ పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది కొందరికి. ఇది చాలా తప్పు విషయం. చెప్పడానికి నోటితో చెబుతారు, నేను ఈ మాట అన్నందుకు “లేదు నువ్వు తప్పు చెబుతున్నావు” అని తిరుగబడతారు. కానీ నేను చెప్పే ఈ మాట వారి యొక్క రోజువారీ జీవితం ఏదైతే ఉందో, దైనందిన జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏదైతే మనం కళ్ళారా చూసామో దానిని చూసి నేను చెబుతున్నాను.
ఉదాహరణకు, మన సమాజంలో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. గ్యారవీ చేయకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైనా నష్టం చేకూరుతుంది. పీరానే పీర్ సాబ్ యొక్క గ్యారవీ అది చేస్తేనే కదా మనకు అన్ని రకాల బాగులు, అన్ని రకాల మంచితనాలు మన ఇంట్లో జరిగేది. చివరికి ప్రతి ఈ నెలలో కొత్త జెండాలు ఏదైతే నాటుతారో, పచ్చ జెండాలు ఏదైతే తమ ఇంటి మీద ఎగురవేస్తారో ఈ జెండాలు ఎప్పటివరకైతే పచ్చగా ఉంటాయో అప్పటివరకు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. చివరికి కొందరు పల్లెటూర్లలోని విషయం, గ్రామాల్లోని విషయం స్వయంగా నేను ఎందరో గ్రామస్థులతో విన్న విషయం. ఈ సంవత్సరం మా బర్రె ఏదైతే చనిపోయిందో, ఈ సంవత్సరం మా పంటలో, పొలంలో ఏదైతే నష్టం జరిగిందో ఎవడో మొల్వి సాబ్ అట వాడు వచ్చి చెప్పిండు గ్యారవీ చేయొద్దు అని. అందు గురించి మేము చేయడం మానేసుకున్నాము. మాకు ఇదంతా నష్టం జరిగింది. పీరానే పీర్ సాబ్ మా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో మేము ఆయన పేరు మీద ఈ సంవత్సరం గ్యారవీ చేయలేదని. ఈ విధంగా వారి యొక్క నమ్మకాలు ఉన్నాయి.
వారు అల్లాహ్ ఎవరు అని అడిగితే మీరు “అల్లాహ్ ఒక్కడే, మన యొక్క దేవుడు” అని అంటారు. మన యొక్క ఆరాధనీయుడు అని అంటారు. అందరికంటే ఎక్కువగా ఎవరితో భయపడతావు అని అంటే “అల్లాహ్ తో” అని అంటారు. ఎవరి మీద నీకు నమ్మకం అనేది ఉంటే “అల్లాహ్ మీద” అని అంటారు. అయితే కేవలం నోటితో అనడం సరిపోదు సోదరులారా. వారి యొక్క జీవితంలో వ్యవహారం ఎలా ఉంది? ఏదైనా నష్టం జరిగింది అంటే “అయ్యో ఫలానా దర్గా కాడికి మేము పోలే కదా. మేము ఫలానా పీరానే పీర్ సాబ్ యొక్క చిల్లాఖానా నుండి మేము దాటాము కానీ కనీసం మేము అక్కడ కొంచెం చందా కూడా ఇయ్యలేదేమో, నజరానా వేయలేదు. అందుగురించి వాళ్ళ యొక్క పీడ మా మీద పడింది.” ఇది ఏంటి? లాభనష్టాలు అల్లాహ్ కాకుండా, అల్లాహ్ చేతిలో కాకుండా ఇంకా వేరే వారి చేతిలో కూడా ఉన్నాయి అని నమ్మడమే కదా! అందు గురించి మనం మహాశయులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఏమంటున్నారు? “నీ మనసులో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ తీసేసెయ్. అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ, అల్లాహ్ తో మాత్రమే భయం, అల్లాహ్ తో మాత్రమే ఆశ, అల్లాహ్ మీదనే నమ్మకం నీవు ఉంచుకో. అప్పుడే నీవు సాఫల్యం పొందుతావు” అని పీరానే పీర్ రహమతుల్లాహి అలై గారు తెలుపుతున్నారు.
సరైన మధ్య మార్గం
ఒక రకం మన ప్రజలలో ఇలాంటి వారు. ప్రజలు కొందరు ఇలా చేస్తున్నారు అని మరికొందరు ఏక్ దం అపోజిట్ గా మారుతారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ప్రవక్తనా? ఏమైనా నబీనా? మనం వారిని అంతగా పొగడడానికి, అంతగా వారిని ప్రశంసించడానికి, ఆయన యొక్క పేరు అంతగా తీసుకోవడానికి, ఆయన కూడా ఒక సామాన్య మనిషి, ఆయన యొక్క ప్రస్తావనే ఎందుకు మనం తీసుకురావాలి? అని ఏ మాత్రం విలువ లేకుండా కూడా చేస్తూ ఉంటారు. అయితే మధ్యే మార్గం అదే సరైన మార్గం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘంలోని ఒక ఉత్తమ వ్యక్తి మరియు ఆయన ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని కూడా మనం నమ్మవచ్చు. ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ సేవలైతే అందించారో వాటిని బట్టి మనం అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని అనడంలో కూడా ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు.
కల్పిత కథలు
కానీ ఎన్నో చరిత్ర పుటల్లో మరియు ఈ రోజుల్లో రాయబడే ఎన్నో పుస్తకాల్లో కూడా ఆయన గురించి ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో వింటే కూడా ఆ విషయాలు వింటే మన విశ్వాసం ఎక్కడ పాడైపోతుందో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది.
మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు ధర్మం గురించి. ఇంకా చాలా చిన్న వారిమి. బహుశా 13-14 సంవత్సరాల వయసు ఉండవచ్చు, బహుశా. రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక మస్జిద్ లో ప్రసంగం జరుగుతుంది. ఈ రోజు ఇంత రాత్రి ప్రసంగం ఏంటి? ఇషా నమాజ్ అయిపోయి గంట, రెండు గంటలు అయిపోయింది కదా అని అక్కడ కొంతసేపు వెళ్లి కూర్చున్నాము. బహుశా అది ఈ రబీఉల్ ఆఖర్ నెల, ప్రజలు కొందరు ఏమంటారు దీన్ని? గ్యారవీ కా మహినా. రబీఉల్ ఆఖర్, రబీఉస్సానీ అని కూడా గుర్తు లేదు. అయితే అక్కడ మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ చేస్తూ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క కరామతులు తెలుపుతూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ ఒక వ్యక్తి ఏమన్నాడు మాట్లాడుతూ, అల్లాహు తఆలా మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇద్దరూ, మన వాడుక భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే, వాకింగ్ చేస్తున్నారు ఆకాశం మీద. నడుస్తూ నడుస్తూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ నకలె కుఫ్ర్ కుఫ్ర్ న బాషద్, అల్లాహ్ యొక్క కాలు జారిపడిందంట నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ అల్లాహ్ ను పట్టుకున్నాడంట. అందు గురించే అప్పటి నుండి ఆయన పేరు దస్తగీర్ అని పడ్డది. ఈ బిరుదు ఆయనకు లభించినది. దస్తగీర్ ఈ పేరు, ఈ బిరుదు ఎలా లభించినది అని వావ్ వావ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పట్ల ఎలాంటి పరిహాసం జరుగుతుంది? ఎలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని గమనించడం లేదు.
కానీ అస్తగ్ఫిరుల్లాహ్ మనం నేను ఈ మాట చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు అని అంటారు. కానీ అక్కడ వారి పండితులు చెప్పే యొక్క ఆ విధానం, ఉర్దూలో సామాన్యంగా మేము విన్న విషయాలు కదా ఇవి, ఇప్పుడు నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఉర్దూలో పాడుకుంటూ ఎంతో ఆ..ఆ అనుకుంటూ ఏదైతే చెబుతారో దాంట్లో ప్రజలు అల్లాహ్ పట్ల ఎలాంటి అవిశ్వాస మాటలు, పరిహాసం జరుగుతుంది అది ఆలోచించరు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ వారు వెళ్తారు. అదే ధోరణిలో వారికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆయనను ప్రశంసించడం, ఆయన యొక్క గొప్ప విషయాలు అన్నట్టుగా వారు అర్థం చేసుకుంటారు. కానీ సోదరులారా, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తప్పుడు భావనలు.
ఇంకో మాట కొందరితో విన్నాను. నేను స్వయంగా వినలేదు కానీ ఎంతోమంది చెప్పారు. వారు విన్నారు ప్రసంగాలలో అని. ఒక ముసలామె ఆమెకు కేవలం ఒకే ఒక కొడుకు ఉండేనట. అయితే ఆ కొడుకు చనిపోతే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వద్దకు ఆమె వచ్చింది. చాలా బతిమిలాడింది. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ డైరెక్ట్ ఆదేశించాడంట మలకుల్ మౌత్ కు. ప్రాణాలు తీసే ఆత్మ దూత ఎవరైతే ఉన్నారో ఆయనకు మలకుల్ మౌత్ కు “నీవు ఈ రోజు ఆ అబ్బాయి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నావో తిరిగి వేసెయ్. ఆ అబ్బాయి యొక్క అవసరం ఆ అతని యొక్క తల్లి ముసలామెకు చాలా ఉంది అని.” నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. మలకుల్ మౌత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మాట వినలేదంట. దాని మూలంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కోపంతో ఆయన ఆ రోజు ఎవరెవరి ప్రాణాలైతే తీసుకుని పోతున్నాడో ఆ సంచిని కొట్టేస్తే, ఎంతమంది ప్రాణాలు ఆ రోజు తీసుకోబడ్డాయో వారందరూ బ్రతికిపోయారంట నఊదు బిల్లాహ్. ఇంకా ఇదే సంఘటనను ఇంకా వేరే ఎన్నో రకాలుగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు.
ఏంటి ఇవన్నీ విషయాలు? ఇలాంటి అతిశయం, ఇలాంటి మితిమీరిన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన విశ్వాసాలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇలాంటి మాసాల్లో ఈ గ్యారవీల యొక్క మహఫిల్లు, సమావేశాలు ఏదైతే జరుగుతాయో అందరూ కొందరు ప్రసంగం చేసేవారు, ప్రసంగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటారు.
గ్యారవీకి సమర్థనల ఖండన
అయితే మహాశయులారా, ఇలాంటి విశ్వాసాలకు, ఇలాంటి తప్పుడు ధోరణికి, ఇలాంటి మూఢనమ్మకాలకు మనం చాలా దూరం ఉండాలి. ఆయన అల్లాహ్ యొక్క మంచి భక్తులు, ఇస్లాం వ్యాప్తి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చాలా కృషిపడ్డారు. ఇస్లాం అభ్యాసన గురించి మరియు తర్వాత ఇస్లాం యొక్క శిక్షణ ప్రజలకు ఇవ్వడానికి చాలా ఆయన యొక్క త్యాగాలు ఉన్నాయి. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించుగాక అని మనం చెప్పాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలలో మనం వెళ్ళకూడదు.
ఇక గ్యారవీ విషయం నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొందరు రాశారు కొన్ని పుస్తకాలలో. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలీస్వా చేసేవారంట. అంటే వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఈ మాటనే తప్పు. మరియు ఒకవేళ ఈ మాట చెప్పినా గాని కొంచెం ఆలోచించి చెప్పలేదు గనుక ఆ తప్పు మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏంటి? గ్యారహ్, పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు. పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు అనేది ఉంటే ఎక్కడ కుదురుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పన్నెండు రబీఉల్ అవ్వల్ కు చనిపోయారు కదా. పన్నెండు తర్వాత చాలీస్వా ఎప్పుడు వస్తుంది? నలభైవ రోజులు ఎప్పుడు వస్తాయి? రబీఉస్సానీ 22వ తారీఖు, 23వ తారీఖు. కానీ మరి ఇక రాసేవాళ్ళు ఎలాంటి ఆలోచనలో రాశారో. అందు గురించేమంటారు? బిద్అతులు ఏవైతే ఉంటాయో, దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి కాళ్ళు, రెక్కలు, వాటికి పునాదులు అనేటివి ఉండవు.
అయితే, రాసిన విషయం ఏంటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఈ రబీఉస్సానీలో ప్రతి సంవత్సరం 11వ తారీఖుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద చాలీస్వా చేసేవారంట. అది ప్రజలకు ఎంత ఇష్టమైంది అంటే, ప్రజలు ఎంత ఇష్టపడ్డారు అంటే చివరికి ప్రతి నెల 11వ తారీఖుకు చేయడం మొదలు పెట్టారంట. అరబీ హిజ్రీ ప్రకారంగా ప్రతి అరబీ నెల 11వ తారీఖుకు. ఇక షేఖ్ అబ్దుల్ ఖాదిర్ రహమతుల్లాహి అలై చనిపోయిన తర్వాత ప్రజలు ఆయన పేరు మీదనే ఉరుసు మొదలుపెట్టి, ఆయన పేరు మీదనే గ్యారవీలు చేయడం మొదలు పెట్టారు అని. వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇలాంటి ఏ పనులు చేయలేదు, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. మీరు సాఫల్యం పొందాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ఆయన అనుసరణను వదిలారంటే మీరు నాశనమైపోతారు, మీరు దుర్మార్గంలో పడిపోతారు అని చెప్పారు.
ఇంకా మహాశయులారా, గ్యారవీ ఎప్పటి నుండి మొదలైంది దీని గురించి ఖచ్చితంగా ఆధారం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొందరు రాశారు పుస్తకాలలో, కానీ అది ఏ మాత్రం నిజమైన మాట కాదు. మరొక విచిత్ర విషయం ఏంటో తెలుసా? షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇరాక్ లో పుట్టారు, అక్కడే జన్మించారు, అక్కడే మరణించారు, అక్కడే ఆయన బుగ్దాద్ లో ఉండి సేవలు, ధర్మ సేవలు అన్నీ కూడా అందించారు. అయితే ఆయన పేరు మీద దురాచారాలు ఎన్నో జరుగుతాయి ఇటు అరబ్ దేశాల్లో కూడా. కానీ గ్యారవీ యొక్క బిద్అత్ అరబ్ దేశంలో లేదు. కేవలం మన దేశాల్లోనే ఉంది. అంటే ఆయన పేరు మీద మన దేశంలో ఇది కొందరు ఎవరైనా మొదలుపెట్టి ఉంటారు.
మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, గ్యారవీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారి పేరు మీద చేయడం తప్పు లేదు అని మన వద్ద కొందరు మౌల్వీ సాబులు అంటారు. ఎందుకు? అంటే ముర్దోం కె నామ్ కా ఈసాలె సవాబ్ కర్ సక్తే. అంటే మన బంధువుల్లో గాని, ఇస్లాం ప్రకారంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద వారి యొక్క ఆత్మలకు, వారికి పుణ్యం లభించాలి అని మనం ఏదైనా సత్కార్యం చేయవచ్చు. దానధర్మాలు, సద్కాలు లాంటివి. ఈ గ్యారవీ కూడా అలాంటి ఈసాలె సవాబ్ అని ప్రజలతో చేయించడానికి వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ఈసాలె సవాబ్ కూడా కాదు. కేవలం కొందరు మౌల్వీ సాబులు చెబుతున్నారు ప్రజలు చేయాలి అని. కానీ ప్రజలు చేస్తున్నది ఏమిటి? ప్రజలు చేస్తున్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఈ రోజు మనం గ్యారవీ చేస్తే, ఈ సంవత్సరం మనం గ్యారవీ చేస్తే మన ఇంట్లో అంత శుభాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని కరుణా కటాక్షాలు కురుస్తూ ఉంటాయి, మన పంట పొలాలు అన్నీ బాగుపడతాయి, మన బర్రెలు, మన ఆవులు అన్నీ మంచిగా పాలు ఇస్తూ ఉంటాయి, మంచిగా వాటికి కూడా ఈ విధంగా లాభాలు కలుగుతాయి అన్నటువంటి అయితే ఎందరో ముస్లింలలో వారి యొక్క నమ్మకాలు ఏంటి? ఇవన్నీ మనం చేస్తే ఈ లాభాలన్నీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ద్వారా లేక ఆయన మాధ్యమంతో, ఉన్కె తవస్సుల్ సే మనకు లభిస్తాయి అని. ఒకవేళ చేయకుంటే మనకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా వాస్తవానికి తఖర్రుబ్ ఇలల్లాహ్, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క సంతృప్తి పొందడానికి మనం ఏ పుణ్య కార్యాలు అయితే చేస్తామో, ఏ దానధర్మాలు అయితే చేస్తామో, అలాంటిది ఇది గైరుల్లాహ్ (అల్లాహ్ యేతరుల ) కొరకు చేయడం జరుగుతుంది. దీనికి కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఈసాలె సవాబ్ పేరు కింద లెక్కింపబడదు. ఎవరైనా బ్రాందీ, విస్కీ ఇది చాలా ఆత్మ శుద్ధి చేస్తుంది, మన యొక్క రక్తంలో చాలా బలం చేకూరుస్తుంది విటమిన్ B మాదిరిగా అనుకుంటూ తాగితే దానిని హలాల్ అని అనవచ్చా? అనరాదు. అందు గురించి ఈ గ్యారవీ అనేది ఈసాలె సవాబ్ కింద లెక్కింపబడదు.
మరొక విషయం నేను ఇంతకు ముందు చెప్పాను కదా? అరబ్ దేశంలో ఇది లేదు. గ్యారవీ అని దీనిని ఏదైతే అంటున్నారో దానికి అరబీలో ఏం పదం వస్తుంది? హాదీ అషర్ అని వస్తుంది. యెహ్దా అషర్ పదకొండు. గ్యారహ్. గ్యారవీ, పదకొండవది. హాదీ అషర్ అని అంటారు. హాదీ అషర్ పేరుతో ఇస్లాంలో ఏదైనా ఈసాలె సవాబ్ కార్యం, ఇస్లాంలో ఏదైనా దానధర్మాల కార్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు.
మరొక విషయం మనం ఆలోచించాలి, అదేమిటంటే ఈసాలె సవాబ్ అని ఏదైతే అంటున్నారో సామాన్యంగా ఈసాలె సవాబ్ ఏం జరుగుద్ది? మనం మన తండ్రి వైపు నుండి, మన తల్లికి ఏదైనా పుణ్యం దొరకాలి అని బీదవాళ్లకు బట్టలు కుట్టిస్తాము. ఎవరైనా బీదవాళ్లు వారికి నెలంతా గడవడానికి వారి వద్ద ఎలాంటి తిండి సౌకర్యాలు లేకుంటే వారికి రేషన్ ఇప్పిస్తాము. లేదా ఇంకా ఎవరికైనా నీళ్ళు త్రాగడానికి కష్టంగా ఉండేది ఉంటే బోర్ వెల్, బావి అలాంటిది ఏదైనా వారికి చేసిస్తాము. వాటి యొక్క పుణ్యం మన ఆ తల్లికి, తండ్రికి, మనం ఎవరి గురించి ఆలోచించుకుంటున్నామో, దుఆ చేస్తున్నామో వారికి దొరుకుద్ది. కానీ ఈ గ్యారవీలో చేసినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ మనోళ్ళు, మన బంధువులు, మన మౌల్వీ సాబు, వాళ్ళకే, వాళ్ళే తిని వెళ్తూ ఉంటారు. బీదవాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? అయితే “ఈ రోజు నుండి మేము బీదవాళ్లకి ఇచ్చి గ్యారవీ చేస్తాము” అని అనకండి. అలా చేస్తే కూడా ఇది యోగ్యం కాదు.
మరొక విషయం గమనించాలి మహాశయులారా, అదేమిటంటే కొందరిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈసాలె సవాబ్ చేసేది ఉంటే మీ తల్లిదండ్రుల హక్కు మీకు ఎక్కువ ఉంది గనుక వారి పేరు మీద చేయండి. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీదనే ఎందుకు? “ఏ లేదు, ఆయన అల్లాహ్ యొక్క చాలా గొప్ప వలీ. ఆయన ధర్మ వ్యాప్తి కొరకు చాలా త్యాగాలు చేశారు. అందు గురించి ఆయన గురించి చేస్తున్నాము.” మరి అంతకంటే ఎక్కువ ఇస్లాం సేవలు చేసిన వారు ఇంకా వేరే ఇమాములు కూడా ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు సహాబాలు ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరి పేరు మీద కూడా ఈసాలె సవాబ్ లు చేసుకుంటూ పోతే ఏదైనా ఒక రోజు మనకు మిగులుద్దా? ఒకసారి గ్యారవీ ఉంటుంది, ఒకసారి బారవీ ఉంటుంది, ఇంకోసారి తేరవీ ఉంటుంది, ఇంకోసారి చౌదవీ ఉంటుంది. ఇక ప్రతి రోజు ఏదో ఒకటి చేస్తూనే పోవాలి. అల్లాహ్ మనకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
ముగింపు
అందు గురించి చెప్పే విషయం ఏంటంటే, మహాశయులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఇలాంటి కార్యాలు, గ్యారవీలు, ఆ జెండాలు గిట్ల పెట్టడం, ఇలాంటి చేస్తూ ఉండేది ఉంటే మాకు వ్యతిరేకంగా చెప్పాడు అని మాట వినడం వదులుకోకండి. అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ మనకు ఒక ఖుర్ఆన్ ఇచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులు ఇచ్చాడు. మనం
لا إله إلا الله محمد رسول الله [లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త.
అని చదువుతున్నాము. ఈ జెండాలు పెట్టాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీస్ లో చెప్పారా? ఈ గ్యారవీలు చేయాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? మనకు ఎక్కడైనా హదీస్ లో ఉందా?
ఈ రోజు ఒక వెబ్సైట్ చూస్తున్నాను నేను, ఎవరైతే సామాన్యంగా తమకు తాము అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వారి ఒక వెబ్సైట్. వారు తమ వెబ్సైట్ లో ఏం రాశారు? “గ్యారవీ చేయడం చాలా సున్నత్ పని, ముస్తహబ్ పని, మంచి కార్యం.” ఎందుకు? అందులో మనం అన్నీ మంచి కార్యాలు చేస్తూ ఉంటాము. ఏంటి? అందులో మనం జమా అయి ఖుర్ఆన్ చదువుతూ ఉంటాము. ఖుర్ఆన్ చదవడం తప్పా? అందులో ఆ ఆ రోజు మనం జమా అయి ఒకచోట మనం ఒకరికొకరు బోధ చేసుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము, ఆఖిరత్ గురించి, పరలోకం గురించి గుర్తు చేసుకుంటాము. ఇది తప్పా? ఆ రోజు ఏదైనా కొంచెం మంచి వంటకాలు వండుకొని స్వయం మనం తింటాము మరియు బీదవాళ్లకు తినిపిస్తాము. ఇది తప్పా? ఇలాంటి విషయాలు రాసి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు గ్యారవీ చేయాలి అని.
కానీ మీరే బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. ఖుర్ఆన్ చదవడం తప్పు అని ఎవరైనా అంటారా? కాదు కదా! దానికి ప్రత్యేకంగా గ్యారవీ అనే పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రతి రోజూ ఖుర్ఆన్ చదవండి. నలుగురు ఎక్కడైనా జమా అయి, సమకూరి ఏదైనా మనం ఖుర్ఆన్ విద్య నేర్చుకోవడం, పరలోక విషయం నేర్చుకోవడం, పరలోకం గుర్తించే అటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఇది తప్పా? కాదు. మరి దాని గురించి గ్యారవీ అని పేరు పెట్టి ఒకచోట ఎందుకు జమా కావడం? ప్రతి రోజూ లేక మీకు వీలున్నప్పుడు వారంలో ఒకసారి, నెలకొకసారి, పదిహేను రోజులకొకసారి మీరు కూర్చోండి, జమా అయి మీ యొక్క విద్యా గురువును పిలిచుకుని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. గ్యారవీ అని దానికి పేరు పెట్టే అవసరం ఏంటి? అలాగే దానధర్మాలు చేయడం, మంచి వంటకాలు వండుకోవడం, ఇస్లాం మనల్ని నిరాకరిస్తుందా? లేదు. మీరు మీ ఇంట్లో మీ బంధువులకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఎంతగా చెప్పారు? మీరు వండుకున్న కూరలో కొన్ని నీళ్లు ఎక్కువ పోసి మీ పొరుగువారికి ఇవ్వండి. సంతోషంలో పాలు పంచుకోండి. అయితే మనం మనకు ఇష్టమున్న రోజు ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి గ్యారవీ అని పేరు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేయడం? గ్యారవీ అని, పీరానే పీర్ పేరు మీద అని, ప్రజలు వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది వేరు. ఇక్కడ మొల్వి సాబులు చెబుతున్న విషయం వేరు. దానికి ఈసాలె సవాబ్ అని పేరు ఇవ్వడం, ఖుర్ఆనే కదా, ఇదే కదా, ఇదే కదా అని కొన్ని పుణ్యాలను లెక్కించడం, ఈ పుణ్యాలు చేస్తూ ఉండడానికి గ్యారవీ అన్న పేరు దాని గురించి ఎందుకు? ఆలోచించండి, గ్రహించండి, ఇస్లాం నుండి, ఇస్లాం పేరు మీద దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ హదీసును చదవడం మానుకుంటామో, చదవడం లేదో, ఇలాంటి కొందరు ఇస్లాం మీద వ్యాపారం చేసి మనల్ని ఇస్లాం నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ మనం గ్రహించలేకపోతాము. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి దురాచారాల నుండి దూరం ఉంచుగాక.
جزاكم الله خيرا والسلام عليكم ورحمة الله وبركاته [జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక, మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ముఖ్య సూచనలు
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వంటి ధార్మిక శ్రేష్ఠులను గౌరవించాలి, కానీ వారి విషయంలో అతిశయోక్తికి పాల్పడి, అల్లాహ్ కు ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వకూడదు.
‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటివి ధర్మంలో నూతనంగా కల్పించబడిన ఆచారాలు (బిద్అత్). వాటికి ఖుర్ఆన్ మరియు సున్నత్లో ఎలాంటి ఆధారం లేదు, కనుక వాటికి దూరంగా ఉండాలి.
లాభనష్టాలు కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ మనకు మేలు గానీ, కీడు గానీ చేయలేరని దృఢంగా విశ్వసించాలి.
ధర్మంలో ఏ ఆచరణ అయినా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మార్గనిర్దేశం ప్రకారమే ఉండాలి. ఆయనను అనుసరించడంలోనే సాఫల్యం ఉంది.
ధార్మిక విషయాలను గుడ్డిగా అనుసరించకుండా, ఖుర్ఆన్ మరియు సహీ హదీసుల వెలుగులో విశ్లేషించి, అర్థం చేసుకోవాలి.
దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు ఏ ప్రత్యేక రోజుకో పరిమితం చేయకుండా, నిరంతరం చేస్తూ ఉండాలి.
అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా – గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. (సూరా అల్ బఖర 2:173)
ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ కొందరు ఈ నెలను గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈ నెలలో అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీద మొక్క బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.
గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్పించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.
గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్ జీలానీని దైవస్థానానికి చేర్చివేసాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్ తన రచన కితాబుబరకాతి ఇమ్ దాద్ లో ఇలా వ్రాసాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్ధిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం . మన కు పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాసాడు- “నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని వదలి మహబూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్ పాక్ అనే రాసాగింది.” (మల్ పూజాజ్ అహ్మద్ రజా/ 307)
ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి – షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి, ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.’ (ఫత్ హుర్రబ్బానీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ).
ఈసంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కి తన జీవితంలో తాను కోరింది చేసే శక్తి ఉండేది కాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే అటువంటప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?
ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ డ్డాయి.
ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి :
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణం రబీ ఉస్సానీ 11వ తేదీన సంభవించింది అని భావిస్తారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం అనే మూఢాచారాన్ని నమ్ముతారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్ షేక్ లో ఇలా రచించారు – “అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా 8వ తేదిగా, 9వ తేదీగా, 11వ తేదీగా మరికొందరు 13, 14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు”. భాగ్దాద్లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణతేది గురించి హాఫిజ్ అబ్దుల్ అజీజ్ నక్ష్ బందీ ముహమ్మద్ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు – “షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్ లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీ లో 8 రబీ ఉస్సానీ ఆదివారం నాడు మరణించారు. తన మదరసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు“. (హదియదస్తగీర్/7)
ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణది నాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), హుసైన్ (రదియల్లాహు అన్హు) ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు. అందువల్లే ఆయన ఇలా అన్నారు.-
“అంటే ఒకవేళ హుసైన్ (రదియల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్ (రదియల్లాహు అన్హు),ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది.” (గునియతుత్తాలిబీన్)
షేఫ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించేపనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్ని అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటువంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఇలా ఉపదేశించారు.
“అంటే అల్లాహ్ గ్రంధాన్నీ, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి”
తన సంతానానికి కూడా ఈ విధంగానే బోధించారు. దీన్ని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.
వీలునామా
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ 470 హిజ్రీ లో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్ చేరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లామ్ మరియు ముస్లిముల సేవచేసి 561 హిజ్రీ లో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్ కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.
ఇలా బోధించారు :–
“కుమారా! అల్లాహ్ పై తప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు. కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినా అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తి నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వం (తౌహీద్) పైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది”. (ఫత్ హుర్రబ్బానీ: అబ్దుల్ ఖాదిర్ జీలానీ)
పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.
మనం అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కుబడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే. ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.
ఇమ్రాన్ భార్య అల్లాహ్ ను ఇలా ప్రార్ధించినపుడు – ‘ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించు కుంటున్నాను. అది నీ సేవకే అంకితం నా ఈ కానుకను స్వీకరించు నీవు అన్నీ వినేవాడవు, అన్ని తెలిసినవాడవూను‘. (ఆలిఇమ్రాన్ – 35)
“చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” (ఆలిఇమ్రాన్ – 37)
ఖుర్ఆన్లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికీ విరుద్ధంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.
అల్లాహ్ (త’ఆలా) మనం దరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికి ఏకత్వం పై ఏకదైవారాధన పై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్ మనందరికీ అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ షిర్క్ కి, కల్పితాలకూ, బిద్ఆత్ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రతి సున్నతును ప్రేమించే వ్యక్తి విన వలసిన మాటలు. ఏ సత్కార్యం సున్నత్ అవుతుంది, ఎప్పుడు సున్నతు అవుతుంది. ఈ ఆరు షరతులు లేకుంటే జాగ్రత్త సుమా! బిద్అత్ (నూతన ఆచారం) లో పడే ప్రమాదం ఉంది..
[ 32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఆరాధనలలో నూతన కల్పితాలు. దీనిలో ఆరు విధాలున్నాయి.
1. ఆరాధనల యొక్క ప్రధాన నియమాలలో కల్పించే నూతన కార్యాలు.
అంటే; అసలు ఇస్లాం ధర్మంలో లేని నూతన ఆరాధనలు. కొన్ని నఫిల్ నమాజులను లేక ఉపవాసాలను స్వయాన నిర్ధారించుకొని పాటించడం. లేక ధర్మంలో లేని నూతన పండుగలను కల్పించుకోవడం. మీలాద్ షరీఫ్, లేక మేరాజున్నబీ, లేక షాబాన్ నెలలో 15వరోజున జరుపుకొనే పండుగలు. మరియు ఆ రాత్రులను తహజ్జుద్ నమాజ్ మరియు పగలు ఉపవాసం పాటించడం వంటి ఆరాధనలు బిద్అత్ ఆరాధనలే.
నమాజ్ చేయడం మరియు ఉపవాసాలు పాటించడం ధర్మం అయినప్పటికి ఆ రోజులను మరియు ఆ రాత్రులను ప్రత్యేకించి ఆరాధనలు పాటించడం వల్ల బిద్అత్గా భావించబడతాయి.
2. ఆరాధనగా ధర్మం నిర్ణయించిన వస్తువులను చెల్లించడం.
అంటే; ఎవరైన గుర్రాన్ని లేక జింకను ఖుర్బానిగా చెల్లిస్తే స్వీకరించబడదు. ఎందుకంటే ఖుర్బాని కొరకు చెల్లించవలసిన జంతువులు: ఒంటెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు మాత్రమే.
అలాగే “ఫిత్రా దానం” ధాన్యం రూపంలో చెల్లించాలి. దానికి బదులు ఎవరైన డబ్బురూపంలో చెల్లిస్తే సున్నత్ విధానానికి విరుద్ధం.
3.ధర్మపరంగా నిర్ణయించబడిన ఆరాధనలలో పెంచడం లేక తగ్గించడం.
అంటే; అల్లాహ్ అదేశించిన కొన్ని ప్రత్యేక ఆరాధనలలో అదనపు విషయాలను చేర్చటం జుహ్ర్ లేక అస్ర్ లేక ఇషా నమాజ్ 4 రకాతులకు బదులు అయిదు రకాతులుగా హెచ్చించడం లేక తగ్గించడం.
4. ఆరాధనలను నూతన పద్ధతులలో పాటించడం.
అంటే; అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే క్రొత్త పద్ధతులలో ఆరాధించటం. ఉదాహరణకు; అల్లాహ్ నామస్మరణ సామూహికంగా హెచ్చు స్వరంతో మరియు వివిధ రాగాలతో చేయడం, లేక ఆరాధలను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానంకంటే కఠోరమైన విధానంలో చేయడం. అంటే ఎండలో నిలబడి నమాజు పాటించడం. లేక ఆరాధన క్రమాన్ని పాటించకపోవడం. అంటే వుజూ చేసేటప్పుడు ముందు కాళ్ళు కడిగి తరువాత ముఖం కడగటం వంటి క్రమం తప్పే పద్దతులు.
5. ఆరాధన సమయాన్ని తప్పడం.
ఉదాహరణకు: బక్రీద్ పండుగ నమాజ్ తరువాత ఖుర్బాని చెయ్యడం సాంప్రదాయం, కాని ఎవరైనా పండుగ నమాజుకు ముందే ఖుర్బాని చేస్తే అది ఆమోదయోగ్యమైన ఆచారం కాదు.
6,ఇస్లాం కేటాయించిన స్థలంలోనే ఆరాధన పాటించాలి.
అంటే; ఏతెకాఫ్ కొరకు మసీదులోనే బస చేయడం ధర్మం. కాని ఎవరైన స్త్రీలు తమ ఇంట్లో నమాజు పాటించే స్థలంలో ఏతెకాఫ్ చేస్తే ధర్మం కాదు.
లేక హజ్ విధిని నెరవేర్చుటకు అరఫా మైదానంలో విధిగా బసచేయాలి, అరఫా మైదానంలో బస చేయని పక్షంలో అతని హజ్ నెరవేరదు.
ముఖ్య గమనిక: ఆరాధనలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం పొందాలంటే, దానిలో రెండు షరతులు తప్పనిసరిగా ఉండాలి.
ఒకటి; “అల్ ఇఖ్లాస్” (చిత్తశుద్ధి) అంటే; ప్రతి కార్యాన్ని అల్లాహ్ ప్రసన్నత పొందాలనే ఆకాంక్షతో చేయడం. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“మరియు వారికి ఇచ్చిన ఆదేశం, వారు అల్లాహ్నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్రచిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని…”(సూరతుల్ బయ్యినహ్:5)
ఎవరైనా అల్లాహ్ ప్రసన్నత కాకుండా ఇతరుల మెప్పు పొందుటకై ఆరాధనలు పాటిస్తే అది షిర్క్ అవుతుంది.
రెండవది; అల్లాహ్ మరియు ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయత.
అంటే; ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల వెలుగులోనే మనం ఆరాధనలను పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయతను మనం సరైన రీతిలో పాటించాలంటే, పైన ఇవ్వబడిన ఆరు షరతులకు అనుగుణంగా మన ఆరాధన విధానాలు ఉండాలి. అప్పుడే మన ఆరాధనలకు అల్లాహ్ వద్ద స్వీకార ముద్ర పడుతుంది.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కేవలం 28 నిమిషాల ఈ క్లిప్ లో ముహర్రమ్ మాసము అందులోని ఆషూరా (పదవ తేది) ఘనత ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తెలుపడంతో పాటు, ఉపవాసం ఘనత, ఏ రోజుల్లో ఉపవాసం ఉండడం ఉత్తమం అన్న విషయం సహీ హదీసుల ఆధారంగా తెలుపాము.
[28 నిమిషాల వీడియో] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్దమైనవి (గౌరవప్రదమైనవి) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.”(సూరతు తౌబా:336).
నాలుగు మాసాల గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;
“కాలం తరిగి తిరిగి యధాస్థితికి – అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన నాటి స్థితికి – వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటిలో నాలుగు మాసాలు విశిష్టమైనవి (పవిత్రమైనవి) వాటిలో మూడు మాసాలు ఒక దాని తరువాత ఒకటి వస్తాయి. అవే జుల్ ఖాదా, జుల్ హజ్, ముహర్రం. నాల్లవ మాసం రజబ్. ఇది జమాదివుల్ ఆఖిర్ నెలకీ – షాాబాన్నెలకీ మధ్యన ఉంటుంది.” (బుఖారి:2958, ముస్లిం:3179)
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;
“రమజాన్ తరువాత అల్లాహ్ మాసమయిన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అలాగే ఫర్జ్ నమాజుల తరువాత పాటించబడే (నఫిల్) నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శేష్టమైనది.”(ముస్లిం :1982)
ముహర్రం మాసపు ఘనతను తెలియజేయటానికి దానిని “అల్లాహ్ మాసం” అని అనటం జరిగింది. ఉదాహరణకు అల్లాహ్ గృహం, అల్లాహ్ ఒంటె అని ఖుర్ఆన్లో పేర్కొనడం జరిగింది. అల్లాహ్ అలా పేర్కొనంత మాత్రన అవి అల్లాహ్కు అవసరమైన వస్తువులు అని అర్ధం కాదు. కాని అల్లాహ్ వాటి విశిష్టతను వివరించటము దాని ఉద్దేశం.
ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం
హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఖురైష్ జాతి ప్రజలు ఇస్లాం రాక మునుపు అజ్ఞాన కాలంలో ముహర్రం నెలలో ఆషూరా నాటి ఉపవాసం పాటించేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మదినాకు వచ్చినప్పుడు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు, సహాబాలను కూడా ఆ ఉపవాసాన్ని పాటించమని ఆదేశించేవారు. ఆ తరువాత రమాజాన్ ఉపవాసాలు విధి గావించబడ్డాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా ఉపవాసం గురించి:
“ఇది ఆషూరా రోజు అల్లాహ్ మీపై ఈ ఉపవాసాన్ని విధిగావించలేదు. అయినా నేను ఉపవాసం ఉంటున్నాను. కనుక మీలో ఎవరైనా ఆ ఉపవాసాన్ని పాటించాలనుకున్న వారు పాటించండి, లేదంటే మానుకోండి”అని అన్నారు. (బుఖారి:1864, ముస్లిం: 1909)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి మదినాకు వలస వచ్చినప్పుడు మదినాలోని యూదులు ముహర్రం మాసపు పదొవ తేదీన ఉపవాసం పాటించటాన్ని గమనించారు. వారిని ఉద్దిశించి, “మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారు?” అని అడిగారు. దానికి యూదులు, అల్లాహ్ ఈ రోజు మూసా ప్రవక్తకు ఫిరౌన్ ఆగడాల నుండి విముక్తి ప్రసాదించాడు. ఆ సంతోష ఘడియల్ని పురస్కరించుకొని మేము ఈ రోజు ఉపవాసం పాటిస్తాం” అని చెప్పారు. అది విని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “మూసా ప్రవక్త సంతోషంలో పాలుపంచుకోవటానికి మీకంటే మేము ఎక్కువ హక్కుదారులం” అంటూ ఆయన కూడా ఆ రోజు ఉపవాసం పాటించారు. మరియు సహాబాలను కూడా ఉపవాసం పాటించమని ఆదేశించారు. (బుఖారి:1865,ముస్లిం:1911)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఒక వేళ నేను వచ్చే సంవత్సరం వరకు బతికుంటే ముహర్రం మాసపు తొమ్మిదో తేదిన కూడా ఉపవాసం పాటిస్తాను.”(ముస్లిం:1917)
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా రోజు (ముహర్రం నెల పదో తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు. మరియు ఆ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించారు” (బుఖారి:1865, ముస్లిం: 1911)
హజ్రత్ అబూ ఖతాదా (రజియల్లాహు అన్హుు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని ఆషూరా నాటి ఉపవాసం (ఘనతను) గురించి అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది” అని చెప్పారు. (ముస్లిం :1977)
“ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్నిరకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.”(సూరతుల్ అహజాబ్ :33)
ఈ ఆయతు ద్వారా మరియు ఖుర్అన్లో ఉన్న అనేక ఆయతుల ద్వారా కూడా తెలిసేదేమంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులందరూ ‘అహ్లెబైత్’ విశిష్ట స్థానానికి చెందినవారు. మరియు హజ్రత్ అలీ, ఫాతిమా, హసన్, మరియు హుసైన్ వారందరు కూడా ‘అహ్లెబైత్’ కి చెందినవారే.
హజ్రత్ ఉమ్మె సల్మా (రజియల్లాహు అన్హు ఉల్లేఖనం): ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఇంట్లో ఉండగా:
“ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది,…..”
అనే ఖుర్ఆన్ ఆయతు అవతరించింది. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు, ఒక వ్యక్తిని “అలీ, ఫాతిమా, హసన్ మరియు హుసైన్ (రజిఅల్లాహు అన్హుం) వైపు పంపిస్తూ ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! వారందరూ ‘అహ్లెబైత్’ చెందినవారు. అంతలో హజ్రత్ ఉమ్మే సల్మా (రజియల్లాహు అన్హ) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని; నేను ‘అహ్లెబైత్’ చెందిన దానిని కానా? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త గారు: “నీవు నాకు మంచి భార్యవి, వారు నా ‘అహ్లెబైత్’ చెందినవారు.ఓఅల్లాహ్! నా ‘ఇంటివారలు’ ఎక్కువ హక్కుదారులు, అని అన్నారు.
ఎందుకంటే? ఒక రోజున ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదాయాన్నే బయలుదేరారు, అప్పుడు ఆయన వద్ద ఒక నల్లటి దుప్పటి యున్నది. అంతలో ఆయన వద్దకు హసన్(రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయనను దుప్పటిలోపలికి తీసుకున్నారు, తరువాత హుసైన్ (రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయననూ లోపలికి తీసుకున్నారు, తరువాత ఫాతిమా (రజియల్లాహు అన్హ) వచ్చారు, ఆమెను లోపలికి తీసుకున్నారు, తరువాత హజ్రత్ అలి (రజియల్లాహు అన్హు) వచ్చారు ఆయనను కూడా ఆ దుప్పటి లోపలికి తీసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష” అని పఠించారు. (ముస్లిం)
హజ్రత్ హసన్ మరియు హుసైన్ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత :
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, వారు వీరిద్దరి (హసన్,హుసైన్)ని తప్పక ప్రేమించాలి.” (నసాయీ,ఇబ్ను ఖుజైమా, హాకిమ్, సిల్ సిల తుస్సహీహా :312)
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “వీరిద్దరు నా పుత్రులు, నా కూతురు పుత్రులు, ఓ అల్లాహ్ నేను వీరిని ప్రేమిస్తున్నాను, ఓ అల్లాహ్ నీవు కూడా వీరిని ప్రేమించు, వీరిని ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు.”(తిర్మిజీ:3 769)
హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హుమా) స్వర్గంలో యువకులకు నాయకులుగా ఉంటారు. (తిర్మిజి:3 768, ఇబ్ను మాజా:118)
కర్బలా సంఘటన:
ముహర్రం నెలలో హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) నలభై హిజ్రీ శకం, రమాజన్ నెలలో 21వ తేదిన షహీద్ చేయబడ్డారు. ఆ తరువాత ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు హజ్రత్ హసన్ (రజియల్తాహు అన్హు) అంగీకారంతో ఏకగ్రీవంగా ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత హజ్రత్ హసన్ (రజియల్లాహు అన్హు) గారు ద్రోహాల కుట్రలో భాగంగా విషంతో కూడిన భోజనం తిని షహాదత్ మరణాన్ని పొందారు. ఆ తరువాత హజ్రత్ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు అరవై హిజ్రీ శకంలో మరణించారు. ఆయన మరణించే ముందు తమ కుమారుడైన యజీద్ ను ఖలీఫాగా నియమించారు. యజీద్ గుణహీనుడైన ఒక రాజు అని చరిత్ర చెబుతుంది. అందుచేత కూఫా ప్రజలు యజీద్కు బదులుగా హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించడానికి ప్రయత్నాలు చేసారు. మరియు కూఫాలో ఉన్న కొంత మంది ప్రజలు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) ను ఖలిఫాగా ఎన్నుకుంటామనీ అనేక విధాలుగా ఆహ్వానించారు. అందువలన హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు ఆయన కుటుంబీకులు, మరియు అనుచరులతో కలిసి కూఫాకు చేరుకున్నారు. ఆయన కూఫాకు చేరుకున్న తరువాత హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారికి కూఫా ప్రజలు ద్రోహం చేసారు. ఆయనకు ఎలాంటి సహాయం చేయలేదు. మరియు యజీద్ తన ఖిలాఫత్ పదవిని వదులుకోవడం ఇష్టంలేని కారంణంగా, హజ్రత్ హుసైన్ మరియు వారితో వచ్చినవారిని బందీలుగా తమ వద్దకు తీసుకొరావలసిందిగా తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. తరువాత యజీద్ సైన్యం హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు వారి కుటుంబీకులను సులభంగా బందీలుగా చేసుకున్నారు. యజీద్ ఆజ్ఞ మేరకు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని యజీద్కు అప్పగించకుండా ఆ సైన్యం వారందరిని ఘోరాతి ఘోరంగా చంపివేసారు.
61వ హిజ్రి శకం ముహర్రం నెలలో 10వ తేదిన (ఆషూరా) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్ల౦) మనుమడు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు వారి అక్కచెల్లెళ్ళను అన్నదమ్ముళ్ళను, అన్న హసన్ గారి బార్యబిడ్డలను, జాఫర్ మరియు అఖీల్ భార్యబిడ్డలను మరియు అనేక కూఫా ప్రజలను చంపడం జరిగింది.
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారు ఫురాత్ అనే సముద్రం ఒడ్డున కర్బలా మైదానంలో చంపబడ్డారు. వారి భౌతికకాయాన్ని కర్బలా మైదానంలోనే ఖననం చేసారు. ఆయన మొండాన్ని అబ్దుల్లాహ్ బిన్ జియాద్ వద్దకు తీసుకువచ్చారు. అలా జరగకూడని ఒక దురదృష్టకరమైన సంఘటన కర్బలాలో జరిగింది. మరియు హజ్రత్ హుసైన్(రజియల్లాహు అన్హు) షహాదత్ అనే పుణ్యపరమైన మరణాన్ని పొందారు.
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని చంపినవారు లేక వారిని చంపుటకై ప్రోత్సహించినవారు సంతోషించారు. కాని అలాంటి వారిని అల్లాహ్ హీనమైన స్థితికి నెట్టివేసాడు, వారు కూడా భయంకరమైన మరణాన్ని పొందారు.
కర్బలా సంఘటన అనంతరం:
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరణానంతరం ముస్లిం సమాజం విభేదాలకు గురికాబడి అనక వర్గాలుగా చీలిపోయి, స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయి, ఇస్లామీయ రుజుమార్గాన్ని తప్పిపోయారు.
1- కొంత మంది మూర్ఖులు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారి మరణాన్ని కోరుకున్నారు. చివరికి వారు హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకులను షహీద్ చేసారు. వారి నాయకుడు ఉబైదుల్లాహ్ బిన్ జియాద్. హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) షహీద్ చేయబడిన తరువాత ప్రతి ఏట సంతోష కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరియు వారు అసత్యమైన హదీసులను రచించారు. ఉదాహారణకు: ఎవరైతే ఆషూరా రోజు తమ కుటుంబీకుల పట్ల ఎక్కువగా ఖర్చు చేస్తారో, వారికి ఆ సంవత్సరమంతా అల్లాహ్ అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే ఆ రోజున తమ కళ్ళలో సుర్మా రాసుకుంటాడొో అతనికి జీవితంలో ఎన్నడు కళ్ళవ్యాధి రాదు. మరియు ఎవరైతే ఆ రోజున స్నానం చేస్తాడో అతను ఆ సంవత్సరమంతా అస్వస్థకు గురికాడు. అలా అనేక తప్పుడు విషయాలను ప్రజల్లో వ్యాపింపజేశారు. వారినే నాసిబీయా ముస్లింలు అంటారు. ప్రస్తుత కాలంలో వారు లేనట్టుగానే భావించాలి. కాని వారి అసత్యమైన ప్రవచనాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి.
2- కొంతమంది ప్రజలు అహ్లె బైత్ అభిమానులంటూ అతిగా వ్యవహరించారు. వారి నాయకుడు ముఖ్తార్ బిన్ ఉబైద్ అల్ కజ్జాబ్. అతని వర్గానికి చెందినవారు. కర్బలా షహీదుల పట్ల శోకాన్ని, దుఃఖాన్ని వెలిబుచ్చడానికి విలపించడం, మాతం చేయడం వంటి ఆచారాలను పుణ్యమైన ఆచారాలుగా భావించి ప్రతి ఏట “మాతం” పేరుతో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను నిర్వహించి ఆరాధనలుగా భావిస్తున్నారు.
హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకుల షహాదత్ (మరణాంతరం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట వారి షహాదత్ రోజును శోకదినంగా భావించారు, ఆ శోకాన్ని బహిరంగంగా వెలబుచ్చుట కొరకై అనేక విధాలుగా చేస్తున్నారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులను, హజ్రత్ అబూబకర్ (రజియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రజియల్తాహు అన్హు), హజ్రత్ ఉస్మాన్ (రజియల్లాహు అన్హు), మరియు అనేక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రాయమైన సహాబాలను, వారి కుటుంబీకులను అసభ్యకరమైన పదజాలాలతో కించపరుస్తున్నారు. మరియు వారి గౌరవోన్నతలు భంగమయ్యేటట్టు కట్టుకథలు రచించారు. ముహర్రం నెల రాగానే ఆ కట్టుకథలను తమ సమావేశాలలో ప్రసంగిస్తుంటారు. మరియు అహ్లె బైత్ అభిమానులంమంటూ ముసలి కన్నీళ్ళు కురిపిస్తారు. వారంతా “కర్బలా” బాధితుల పట్ల తమ గోడును ఇలా తెలిపే ప్రయత్నాలు చేస్తారు: “ముహర్రం నెలలో నల్ల దుస్తులు ధరిస్తారు, యా హసన్, యా హుసైన్ అంటూ తమ ఛాతీలపై బాదుకుంటుంటారు. కత్తులతో ఖడ్లాలతో కోసుకుంటారు. రక్తం కారేలా బ్లేడ్లతో గాయం చేసుకుంటారు. అగ్ని గుండం తయారు చేసి దానిలో పరుగులు పెడతారు. సామూహికంగా విలపించి మహా సభలను నిర్వహించి కేకలు పెడుతుంటారు. ముహర్రం నెల పవిత్రమైనప్పటికి అపవిత్రంగా, శుభప్రదమైనప్పటికి అశుభమైనదిగా భావిస్తున్నారు. అందుచేత వారు ఆ నెలంతా ఎలాంటి సంతోషమైన కార్యాన్ని నిర్వహించరు, వివాహాలు చేసుకోరు. మరియు పంజాలను (పీర్లను) స్థాపిస్తారు. వాటిని అనేక విధాలుగా ఆరాధిస్తారు” వారినే షియాముస్లింలు అంటారు.
భారత దేశంలో లక్నో, హైదరాబాద్, ఢిల్లీ, మరియు ముంబై వంటి మహా నగరాలలో ‘షియా’ జాతులు ఉన్నారు. మరియు వారు ఇరాన్లో అతి ఎక్కువగా ఉన్నారు. వారీ ఇరాన్ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మరియు అమెరికా యుధ్ధం తరువాత ఇరాఖ్లో కూడా షియా ముస్లింలు పరిపాలన చేస్తున్నారు. అలాగే వారు లెబనాన్ మరియు సిరియా, బహ్రైన్ దేశాలలో కూడా ఉన్నారు.
మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం:
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారి మరణం మనందరికీ దుఃఖింపబడే మరియు బాధపడే సంఘటన. అయినా మనం సమంజసమైన రీతిలో, ధర్మ విధానంలో శోకాన్ని తెలుపడం ధర్మం. కనుక అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా తెలియజేసాడు:
“వారికెప్పుడు ఏ ఆపదవచ్చిపడినా, నిశ్చయంగా “మేము స్వతహాగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకేకదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (సూరతుల్ బఖరా:156-15 7)
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
ఎవరికైనా కష్టం వాటిల్లినపుడు “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైెహి రాజివూన్” మరియు “అల్లాహుమ్మ అజుర్ని ఫీ ముసీబతీ వఖ్లిఫ్ లీ ఖైరమ్ మిన్హా‘ పఠించడం ఎంతో మహత్ పూర్వకమైనది . (ముస్లిం:1525)
అలాగే మనకు ఎప్పుడైతే దుఃఖమైన సంఘటనలు గుర్తుకు వస్తాయో అప్పుడల్లా మనం “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్” అని చదువుకుంటే ఆ దుఃఖానికి బదులు మనకు పుణ్యం లభిస్తుంది” అని హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) తెలియజేసారు.
హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రజి యల్లాహు అన్హు) గారి సోదరుడు మరణించారు. మూడు రోజుల తరువాత ఆమె పరిమళాన్ని తెప్పించి పూసుకున్నారు. తరువాత ఇలా ప్రవచించారు: “నాకు పరిమళం అవసరమేమీ లేదు కాని నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించగా ఇలా విన్నాను: “ఏ మహిళ అయితే అల్లాహ్ను, పరలోక దినాన్ని విశ్వసిస్తుందో! ఆమె మూడు రోజులకంటే ఎక్కువగా శోకం చెయ్యడం నిషిద్ధం. కాని తన భర్త శోకం గడవు నాలుగు నెలల పది రోజుల వరకు ఉంది” (బుఖారి:1202, ముస్లిం: 2731).
అతిశయిల్లటం (హద్దు మీరటం):
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయిల్లటం నుండి ఇలా హెచ్చరించారు: “జాగ్రత్త! మీరు ధర్మం విషయంలో అతిశయిల్ల (హద్దు మీరి ప్రవర్తించ) కండి. నిశ్చయంగా మీకంటే ముందు జాతులు ధర్మం విషయంలో అతిశయిల్లటం వల్లనే నాశనమయ్యారు.”(అహ్మద్, ఇబ్ను మాజా:3029)..
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా (అలైహిస్సలాం) గారి పట్ల హద్దు మీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: 3189)
హజ్రత్ అబూ హురైరా(రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రార్ధన నాకు చేరుతుంది.”(అబూదావూద్: 2042)
హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:
“అల్లాహ్ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.”(బుఖారి:1301, ముస్లిం:823)
కాని విచారకరమైన విషయం ఏమంటే, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంత హెచ్చరించినప్పటికి ముస్లిం సమాజం ఈ “అతి“కి దూరంగా ఉండలేకపోయింది. హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకుల షహాదత్ (మరణం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. మరియు అహ్లెబైత్ అభిమానులంమంటూ అధర్మరీతిలో అతిశయిస్తున్నారు.
ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు:
౩- “అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్” కు చెందిన కొంత మంది ప్రజలు అజ్ఞానంతో ముహర్రం పండుగ పేరుతో అనేక కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు తమను తాము సున్నీలుగా పేర్కొంటారు. అయినా రుజు మార్గాన్ని తప్పిన వర్గాల (షియా ముస్లింలు మరియు నాసిబియా ముస్లింలు)కు అనుగుణంగా మన పట్టణాలలో, పల్లెలలో ప్రతి ఏట అవే కార్యాలను పుణ్యంగా భావించి ముహర్రం ఉత్సవాలను నిర్వవాస్తుంటారు.
1- మొదటి ముహర్రం రోజున పంజాలను “మకాన్” అనే ప్రత్యేకమైన స్థలంలో నిలబెట్టటం జరుగుతుంది.
2-కొంత మంది ప్రజలు క్రొత్తగా పంజాను నిలబెడ్తానని మొక్కుబడులు చేసుకుంటారు.
౩-పది రోజుల వరకు పంజాలను పూల హారాలతో అలంకరిస్తారు మరియు ఆ పదిరోజులు ఫాతిహాలు (అర్పణాలు) చేస్తుంటారు.
4-ఏడవ రోజు నుండి ప్రతి రాత్రి స్నానం చేసి అగ్ని గుండంలో నడుస్తుంటారు. పీర్లకు ఫాతిహాలు కూడా సమర్పిస్తారు.
5-ఏడవ రోజునుండి బెల్లం లేక ఇతర షర్బత్ కడవలు కడవలుగా తయారు చేస్తారు. స్వయంగా త్రాగుతారు, ఇతరులకు కూడా తాపిస్తారు.
6-ముహర్రం బతాసాలు, మరియు చోంగాలు (తీపు అప్పట్లు) ఆచారంగా చేసి తింటారు, ఇతరులకు కూడా పంచుతారు.
7-పంజాల (పీర్లను)ను నిలబెట్టిన కొంతమంది పుణ్యాత్ముల ఆత్మలు తమ శరీరంలో వచ్చిందంటూ ఊగుతుంటారు. మరియు తమ పంజాను ఎత్తుకొని అగ్ని గుండంలో నడుస్తారు.
8-పంజాలు ఎత్తుకొని వీధులంతా ఊరేగిస్తూ, అనేక కనికట్టు నాటకాలు చేస్తూ, ఇంటింటా నిలబడి ఫాతిహాలు చేస్తూ, విరాళములు సేకరిస్తారు.
9-పంజాలను పట్టణము పొలిమేరకు తీసుకుపోయి, వాటిపై ఉన్న పూలహారాలను తీసి చెరువులలో లేక బావులలో పడేస్తారు.
10-చివరిగా “అల్విదా యా షుహదావు హుసైన్” అంటూ “మర్సియా” గీతాలు పాడుకుంటూ తిరిగి అదే ‘మకాన్’కు వస్తారు. తరువాత ఆ పంజాలను ఆ ‘మకాన్‘ లోనే భద్రపరుచుకుంటారు.
11-కొంత మంది సున్నీ ముస్లింలు కూడా ముహర్రం నెలను అపశకునంగా భావిస్తారు. ఈ నెలంతా పెళ్ళిళ్ళు చేయరు, కొత్త పనులను ప్రారంభించరు.
ముస్లిం ప్రజలారా! మనం “అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్”కు చెందినవారము. మనం అల్లాహ్ను మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి అనుగుణంగా అనుసరించేవారము. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 50 సంవత్సరాల తరువాత అధర్మ వ్యక్తుల చేత జొప్పించబడిన తప్పుడు ఆచారాలను ఎలా ధర్మంగా మనం భావించాలి? వాటిని మనం ఎలా ఆచరించాలి? ఒక వేళ మనం వాటిని ఆచరించినా పుణ్యం మాత్రం లభించదు, పైగా మహా పాపాలకు గురికాబడుతాము సుమా.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 52-66). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ వీడియోలో గౌరవప్రదమైన మాసాలు ఏమిటి? వాటిలో చేసేవి, చేయరాని పనులు ఏమిటి? దౌర్జన్యం చేసుకోకండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయితే దౌర్జన్యం అంటే ఏమేమి భావాలు వస్తాయి. ప్రత్యేకంగా ముహర్రంలో మన సమాజంలో జరుగుతున్న దురాచారాలు ఏమిటో తెలుపడం జరిగింది
[6 నిమిషాల వీడియో] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అపశకునాల నమ్మకాలు కలిగిన ప్రజలు పూర్వపు కాలం నుండి ఈ రోజు వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొ విధమైన నమ్మకం. కనుక కొంత మంది రాహు కాలాన్ని నమ్ముతారు. ఆ కాలానికి అనుగుణంగా తమ జీవితాలను గడుపుతారు. ఇంకా కొంత మంది గర్బవతి చనిపోతే అపశకునంగా భావించి, ఆమె అంతక్రయలు జరపకుండా కాకులు, గద్దలు పెక్కు తినుట కొరకు ఊరు బయట ఆమె దేహాన్ని పడేసిన సంఘటనలు ఉన్నాయి. మరియు కొంత మంది ప్రజలు ఉదయాన్నే వితంతువు ఎదురుపడితే అపశకునంగా భావిస్తారు. ఒకవేళ తమ అమ్మ లేక చెల్లి లేక కూతురు విధవరాలు ఉంటే, వారిని కూడా ఎదురుగా రాకూడదని నివారిస్తారు. మరియు కొందరు వారి నివాసాలను ఇంటి వరండాలకే పరిమితం చేస్తారు.
మరియు కొందరు ఇంటి నుండి బయలదేరేటప్పుడు పిల్లి గనుక ఎదురు వస్తే, లేక ఎవరైనా వారి ముందు తుమ్మినట్లయితే అపశకునంగా భావిస్తారు. తిరిగి ఇంట్లోకి పోయి కొన్ని నిమిషాలు కూర్చొన్న తరువాత తమ పనిపై బయలదేరుతారు. మరియు వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే “వీధి పోటు” అని అపశకునంగా భావించేవారు కూడా ఉన్నారు. మరి కొంత మంది తమ ఇంటి వాస్తు సరిలేక పోతే, దానిని అపశకునంగా భావించి కట్టిన ఇల్లును కూలదీసిన సంఘటనలు లేకపోలేదు.
సూర్య గ్రహణాన్ని, చంద గ్రహణాన్ని కూడా అపశకునంగా నమ్ముతారు. గర్భిణీలపై వాటి ఛాయ పడితే పుట్టబోయే పిల్లలు గుడ్డివారిగానో, కుంటివారిగానో పుట్టుతారని భావిస్తారు. మరియు ఫలానా తేదిలలో లేక సమయాలలో పిల్లలు జన్మిస్తే భాగ్యవంతులు కారని, కాన్పు కాక మునుపే సిజేరియన్ చేసి కడుపులో నుండి పిల్లలను బయటకు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరియు గ్రహణాల ప్రభావం దేవాలయాలపై ఉంటుందని పూజారులు నమ్ముతారు. కనుక వారు దేవాలయాలను సైతం మూసివేస్తారు.
మరియు కొంత మంది ప్రజలు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్నిబట్టి వారు శకునాలుగా నమ్ముతారు. తాము అనుకున్న దిశలో గాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావిస్తారు. లేక అనుకున్న దిశలో ఎగిరిపోతే మంచి శకునంగా భావిస్తారు. ఇలా రక రకాల శకునాల నమ్మకాలు దేశ విదేశాల సమాజ ప్రజలలో విస్తరించి ఉన్నాయి.
ఇస్లామీయ ధర్మం ప్రకారం అపశకునం అనేది లేనే లేదు. మరియు లాభ నష్టాల అధికారం అల్లాహ్కు తప్ప మరెవరికీ లేదు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
ఓ ప్రవకా! ఇలా అను:“మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిది చేయగల సమర్థుడు.”(సూరతుల్ అన్ఆమ్:17)
“ఒక వేళ అల్లాహ్ నీకు ఏదైన ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అను(గహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు” (సూరత్ యూనుస్:107)
“అల్లాహ్ నాకు కీడు చేయదలుచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్)ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు.”(సూరతు జుమర్:38)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కథనం: నేను ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వాహనంపై ఆయన వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు:
“ఓ అబ్బాయి! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతాను. నీవు అల్లాహ్ను గుర్తుంచుకో (అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉండు) అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. నీవు అల్లాహ్ను గుర్తుంచుకో, ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు (అల్లాహ్ సహాయం నీ కొరకు నిత్యం ఉంటుంది). నీవు అర్ధించ దలుచుకున్నప్పుడు అల్లాహ్నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే, అల్లాహ్నే సహాయం కోసం అర్ధించు. జా(గత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్ నీ కోసం వ్రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒక వేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమి అది కలిగించజాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (విధివ్రాత (వాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది.”
శకునమైనా అపశకునమైనా, దౌర్చాగ్యమైనా, కలిమి అయినా- లేమి అయినా అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయనీ, అమాయుకులను, అన్యం పుణ్యం తెలియని జంతువులను, నెలలను, దినాలను లేక సమయాలను దోషులుగా నిలబెట్టడం అర్ధం పర్ధం లేని విషయమేననీ మనం తెలుసుకోవాలి.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 75 -78). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త, సూరహ్ అల్ మాయిదాలోని 3వ ఆయతును వివరిస్తూ, అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఎలా సంపూర్ణం చేశాడో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి సుమారు 83-84 రోజుల ముందు, అరఫా మైదానంలో అవతరించిన ఈ ఆయతు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దీని గురించి ఒక యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను సహీహ్ బుఖారీ హదీసు ద్వారా ఉదహరించారు. నిండుగా ఉన్న గ్లాసులో నీరు ఎలాగైతే ఇంకా పట్టదో, అలాగే సంపూర్ణమైన ఇస్లాంలో కొత్తగా చేర్చడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. చివరగా, ధర్మంలో లేని మొహర్రం పీరీలు, రజబ్ కుండల వంటి బిద్అత్ (నూతన కల్పనల) కు ఆస్కారం లేదని, ఖురాన్ మరియు హదీసులను మాత్రమే అనుసరించాలని హెచ్చరించారు.
ధర్మం పరిపూర్ణం చేయబడింది
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
మహాశయులారా ! సూరతుల్ మాయిదా ఆయతు నంబర్ మూడులోని ఒక భాగం:
అల్లాహ్ ఏమంటున్నాడు?
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا [అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా] “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను మరియు నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా ఇష్టపడ్డాను”.(5:3)
ఈ ఆయతు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే 83, 84 రోజుల ముందు మాత్రమే అవతరించింది. అంటే ఇంచుమించు ప్రవక్త జీవితంలోని చివరి రోజుల్లో అవతరించింది. ఈ ఆయతు ఎంత గొప్ప ఆయతు, ఇందులో ఎంత గొప్ప సందేశం ఇవ్వబడింది అంటే, సహీహ్ బుఖారీలో ఈ హదీస్ వచ్చి ఉంది.
యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) సంభాషణ
యూదులలోని ధర్మ పండితుడు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హుతో కలిసి, “ఓ ఉమర్! మీ ఖురాన్ లో ఒక ఆయతు ఉంది, అది గనక తౌరాత్ లో అవతరించి ఉంటే, ఆ అవతరించిన దినాన్ని మేము పండుగ రోజుగా చేసుకునేవాళ్ళము” అన్నాడు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు అడిగారు, “ఏ ఆయతు గురించి నీవు అంటున్నావు?”. ఆ యూదుడు:
హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తెలిపారు: “నాకు తెలుసు, ఇది ఏ రోజు అవతరించింది, ఏ సందర్భంలో అవతరించింది, ఏ ప్రదేశంలో అవతరించింది, అప్పుడు ప్రవక్త ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో నాకు బాగా తెలుసు. అది విశ్వాసుల కొరకు ఒక వీక్లీ ఫెస్టివల్ (వారాంతపు పండుగ) లాంటిది, అంటే వారము రోజుల్లో ఒక రోజు ఏదైతే పండుగ రోజుగా ఉందో, ‘ఈదుల్ మోమినిన్’ జుమా రోజు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో లక్ష కంటే పైగా సహాబాల మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతు అవతరించింది. ఈ రకంగా ఆ రోజు ముస్లింల కొరకు రెండు రెండు పండుగలు ఉండేవి, అప్పుడు అవతరించింది”.
ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది – బిద్అత్ (నవీన పోకడల) ఖండన
అంటే దీని భావం ఏంటో అర్థమైందా మీకు? అల్లాహ్ యే ఇస్లాం ధర్మాన్ని ఇక సంపూర్ణం చేశాడు. ఇస్లాం ధర్మమే సర్వ మానవాళి కొరకు అతి పెద్ద అనుగ్రహం, అతి గొప్ప వరం. దీనిని అల్లాహ్ యే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిపూర్ణం చేశాడు. ఇక సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఒక గ్లాస్ ఈ గ్లాస్ నీళ్లతో సంపూర్ణంగా నిండి ఉన్నది అని ఎప్పుడైతే మనం అంటామో, అందులో ఇంకా నీళ్లు చేర్చడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఉండదు కదా.
అలాగే ఈ ధర్మం సంపూర్ణమైనది అని అంటే, ఇందులో ఏ విషయాన్ని కూడా మనం ధర్మం పేరుతో కలపడానికి, యాడ్ చేయడానికి అవకాశం లేదు, అలాంటి అవసరం లేనే లేదు. మరియు సంపూర్ణమైనది అన్నదానికి మరొక భావం, ఇందులో నుండి ఏ విషయం కూడా తీయకూడదు. అందుగురించే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఏం తెలిపారు? “ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే ముందు ఏదైతే ధర్మంగా ఉండినదో, అదే ధర్మం. ఆ తర్వాత ఏవైనా విషయాలు పుట్టుకొచ్చాయి అంటే అవి ధర్మంలోనివి కావు. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను”.
ఇక మొహర్రం మాసంలో నిలబెట్టే పీరీలు గాని, వాటికి సంబంధించిన ఎన్ని దురాచారాలు, షిర్క్ పనులు ఉన్నాయో. రజబ్ మాసంలో రజబ్ కే కుండే అని, లేదా ఇంకా వేరే రోజుల్లో ఏ ఏ ఉత్సవాలు పండుగల పేరు మీద ముస్లింలు జరుపుకుంటున్నారో, అవి వాస్తవానికి వాటి ప్రస్తావన ఖురాన్ లో ఉన్నాయా? హదీసులో వాటి ప్రస్తావన ఉందా? మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేని విషయాల్ని వదిలేసేయాలి. లేదా అంటే మనం చాలా నష్టానికి గురవుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.