611. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-
ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ధైవప్రవక్తా! ఎవరి దానధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు.
“నీవు ఆరోగ్యంగా ఉండి, అత్యధిక ధనాశ కలిగి ఉన్న రోజుల్లో (ఖర్చు చేస్తే) పేదవాడిని అయి పోతానన్న భయంతో పాటు ధనికుడయి పోవాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ చేసే దానం అత్యంత శ్రేష్ఠమైనది. కనుక దానం చేయడంలో నీవు అంత్యకాలం దాపురించే దాకా వేచి ఉండకు. ప్రాణం కంఠంలోకి వచ్చి కోన ఊపిరితోకొట్టుకునే స్థితి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తికి అంతిస్తాను, ఫలానా వ్యక్తికి ఇంతిస్తాను అని చెబితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడది ఫలానా,ఫలానా వారిదయిపోయినట్లే (నీవిచ్చేదేమీ లేదు).”