🖊️📚 ముహద్దిస్ మదీనతుర్ రసూల్, అల్లామహ్ అబ్దుల్ ముహ్సిన్ బిన్ హమ్ద్ అల్ అబ్బాద్ అల్ బద్ర్ హఫిౙహుల్లాహ్ తమ సంతానానికి కొన్ని అమూల్యమైన హితోపదేశాలు చేసారు వాటికి “ వసాయా నఫీసహ్ ఉఖాతిబు బిహా ౙుర్రియ్యతీ – నఫఅహుముల్లాహ్ వ గైరహుమ్ బిహా “– అని నామకరణం చేయడం జరిగింది.
🎁అందరికి ప్రయోజనకరంగా ఉండేందుకు విలువ కట్టలేని ఈ హితోపదేశాల యొక్క తర్జుమా సమర్పిస్తున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఎంతో మంది మరచిపోయిన ప్రవక్తవారి 12 సున్నతులు – జుమా ఖుత్బా అనువాదం – 17-01-1445 హిజ్రి https://youtu.be/54NCOHrYgUQ [12 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ “అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.” (అల్ బఖర 2: 154)
మహాశయులారా!
పై ఆయతులో అల్లాహ్ ధన్యజీవుల గురించి ప్రస్తావించాడు. వారే ఇస్లాం మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు. అల్లాహ్ సన్నిధిలో వారికి మహోన్నత స్థానం ఉంది. మన ఊహకందని మహత్తర జీవితం, ఆనందం వారికి అక్కడ లభిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో అమరవీరుల గురించి, వారి విశిష్ఠత గురించి పలు ఆయతుల్లో చెప్పబడింది.
దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో అధర్మంగా, మోసగించబడి ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రముఖ అమరవీరుల గాథలను ఈ రోజు తెలుసుకుందాం. కాని కరుడుగట్టిన విరోధులు వారిని మోసగించి హతమార్చారు. పిరికిపందలైన తిరస్కారుల అలవాటే అది. సత్యవంతులను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. అందుకే మోసపూరిత సన్నాగాలు, కుట్రలు పన్ని వారిని అధర్మంగా హతమార్చారు. నేటి ఇస్లాం విరోధుల స్థితి కూడా అలానే ఉంది.
ముస్లిం సోదరులారా!
మీ ముందు చెప్పబోయే ఈ సంఘటన ఉహద్ యుద్దం తరువాత హిజ్ర శకం 4వ యేట జరిగింది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం:
ఉహద్ యుద్ధానంతరం తిరస్కారులు, ఇస్లాం విరోధులు ముస్లింల గౌరవ మర్యాదలను మట్టిపాలు చేయటానికి, వారికి నష్టం కల్గించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇంత నష్టం జరిగినా ముస్లింలు యుద్ధ వ్యూహరచనలతో, శక్తిసామర్థ్యాలతో, సైన్యాన్ని సమీకరిస్తూ పుంజుకోవటాన్ని వారు సహించలేకపోయారు. ఇస్లాంను దెబ్బతీయటానికి, నష్టం, కీడు తలపెట్టడానికి మరో దుష్టాలోచన చేశారు. ఖురైషులంతా కలసి అజల్ ఖిరా జాతిలోని 7 గురు వ్యక్తులను ఎన్నుకుని వారిని మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి పంపారు. వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, “దైవ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) ! మా వర్గమంతా ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. వారి శిక్షణ కోసం ఇస్లామీయా బోధకులను మీరు మా వెంట పంపించండి” అని అంటారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.
మీలో ఎవరైనాసరే తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించినంత మాత్రాన (నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన) వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
మరెవరైనా తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించి, తమ నోటి ద్వారా జారిపోయిన (తప్పుడు) మాటను ఉపసంహరించదలచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.
ఈ స్థోమత లేనివాడు, భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను రెండు మాసాలపాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు అరవై మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూడీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం.
అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమయిన శిక్ష తథ్యం.
ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కాని అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్ కు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. అరవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ఐదుగురి మధ్యన కూడా (రహస్య సమాలోచనలు సాగవు). అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా – వారెక్కడ ఉన్నా – ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయదినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.
రహస్య మంతనాలు జరపరాదని వారించబడినవారిని నీవు చూడలేదా? అయినాసరే వారు వారింపబడిన దానికే మళ్ళి పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినపుడు, అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, “మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు?!” అని లోలోపలే చెప్పుకుంటారు. వారికి నరకం (యాతన) సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయ భక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే (కుత్సిత) సమాలోచనలు షైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకూ వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్ నే నమ్ముకోవాలి.
ఓ విశ్వాసులారా! సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు, మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. ‘లేవండి’ అని మీతో అనబడినప్పుడు మీరు లేచినిలబడండి. మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది.
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో రహస్య సమాలోచన చేయదలిస్తే, మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్థోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే.
ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు (ఈ కపటులు) మీ వారూ కారు. వాళ్ళ పక్షాన చేరినవారూ కారు. తెలిసి కూడా వారు – ఉద్దేశ్యపూర్వకంగా – అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు.
వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున, వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకూ ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు.
షైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరచి పోయేలా చేశాడు. వాళ్ళు షైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి! ఎట్టకేలకు నష్టపోయేది షైతాను ముఠాయే.
అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ “స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు“. (36 : 55)
ముస్లిం సహోదరులారా!
ఖుత్బాలో నేను పఠించిన ఆయత్ అర్థాన్ని మీరు విన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంత మంది వృద్ధులు వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “ఓ దైవ ప్రవక్తా! ఇస్లాం స్వీకరించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాని మేము మహా పాపాలు చేశాము. మా కర్మలపత్రాలు వాటివల్ల నలుపై పోయాయి. ఇప్పుడు ఇస్లాం స్వీకరించి ఏమి చేయమంటారు?” అప్పుడు పై ఆయత్ అవతరింపజేయ బడింది. ఇందులో అల్లాహ్ తన దాసులకు ఎంతో ఓదార్పును నమ్మకాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఇస్లాం మానవుని పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది. ఖుర్ఆన్ మజీద్ ఈ అంశానికి సంబంధించిన అనేక ఆయతులున్నాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. పాపాలు చేసి పశ్చాత్తాపంతో మరలే వారికి క్షమాభిక్ష పెట్టటం ఆయన సుగుణం. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు:
“తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు“. (ఆలి ఇమ్రాన్ 3 : 135)
మహాశయులారా!
పాపాల మన్నింపు, దైవ కారుణ్యం గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. పైన పఠించిన ఆయత్తో నేను చెప్పబోయే విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఒక మహోన్నతమైన ప్రవచనాన్ని బోధించ బోతున్నాను. అందులో ప్రళయదిన దృశ్యాలు మన ముందుకొస్తాయి. అల్లాహ్ ప్రళయ దినాన తనదాసుల పాపాలను ఎలా మన్నించి స్వర్గానికి చేరుస్తాడో కూడా మనకు బోధపడుతుంది. దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ దివ్య వచనాన్ని వినేముందు అల్లాహ్ దుఆ చేసుకోవాలి. “ఓ ప్రభూ! ప్రళయదినాన నీ కృపతో మమ్మల్ని మన్నించు” అని వేడుకోవాలి. అల్లాహ్ మనందరి పాపాలను మన్నించి నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపుగాక.. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. (అల్ బఖర 2: 201)
ప్రియసోదరులారా!
నేటి జుమా ప్రసంగంలో ‘జీవనోపాధి’ గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో తెలుసుకుందాం. అల్లాహ్ సూరా మూమినూన్, 51వ ఆయతులో ప్రవక్తలందరినీ సంబోధిస్తూ ఇలా సెలవిస్తున్నాడు:
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ “ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.” (అల్ మూమినూన్ 23 : 51)
ప్రవక్తలకు గల గౌరవస్థానం సర్వ సృష్టిలో మరెవ్వరికీ లేదు. వారి స్థానం ఎంత గొప్పదో వారికి ఇవ్వబడిన పై ఆజ్ఞ కూడా అంతే గొప్పది! బ్రతుకు తెరువుకోసం పై ప్రపంచంలో జీవనం గడపటంకోసం ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన వస్తువులను సంపాదించాలని పై ఆయతులో ప్రవక్తలందరికీ ఆదేశించబడింది.
ఇక ఖుత్బాయే మస్నూన తరువాత నేను పఠించిన మరొక ఆయతులో ఇహపరాల మంచికై వేడుకోలు ఉంది.
విశ్వాసి సాఫల్యమార్గాన్ని ఎన్నుకుని తన ఇహలోక జీవితాన్ని ఎంత చక్కగా, అందంగా తీర్చిదిద్దుకుంటాడో దాని మీదనే అతని పరలోక జీవితం, సాఫల్యం ఆధారపడి ఉంటుంది. ప్రాపంచిక జీవిత సంస్కరణలో మొట్టమొదటగా ప్రాముఖ్యత ఇవ్వదగిన విషయం-మనిషి సంపాదన. మనిషి సంపాదన ధర్మసమ్మతమైనదైతే, పరిశుద్ధమైనదైతే అతని జీవితంలోని ఇతర విషయాలు కూడా శుభప్రదమవుతాయి.
మనిషి ప్రాపంచిక జీవితానికి ధర్మ సమ్మతమైన (హలాల్) సంపాదన ఎంతో అవసరం. ఖుర్ఆన్, హదీసులలో ఏ విధంగా నమాజ్, రోజా, జకాత్, హజ్ గురించి పదేపదే తాకీదు చేయబడిందో అదే విధంగా హలాల్ సంపాదన గురించి కూడా నొక్కి చెప్పటం జరిగింది. దానికి గల మార్గాలు ఎంతో చక్కగా విశ్లేషించబడ్డాయి. హలాల్ సంపాదనకుగల ప్రాముఖ్యతను, విశిష్ఠతను దాని లాభాలను, ప్రయోజనాలను స్పష్టపరచటం జరిగింది.
తన మార్గంలో హలాల్ సంపాదనకై కృషి చేయమని ప్రత్యేక ఆజ్ఞ ఇస్తూ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ “నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషిం చండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు“. (అల్ జుమఅ 62:10)
వ్యాపారం కోసం, సంపాదన కోసం దైవ అనుగ్రహాలను అన్వేషించాలని, ఆరాధన తరువాత మళ్ళీ తమ విధి నిర్వహణలో నిమగ్నమైపోవాలని, వ్యవసాయం చేసేవారు, ఇతర వృత్తి పనులు చేసుకునేవారు తమ తమ కార్యకలాపాల్లో చేరి పోవాలనేది ఈ ఆయత్ భావం.
‘హలాల్ సంపాదన’ కూడా మనిషి విధే. అది లేనిదే అతని జీవన రథం ధర్మపథంలో ముందుకు సాగదు మరి! దానిని సాధించటానికి శక్తికొలదీ శ్రమించాలి. ఇలా చేసే శ్రమకు ప్రతిఫలం, పుణ్యం లభిస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చివరకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు హిజ్రత్ అనుమతి లభించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నబవీ శకం 13వ యేట (27 సఫర్), క్రీ.శ 621 సెప్టంబర్ 12వ తేదీన మక్కా వదిలి మదీనాకు పయనమయ్యారు. మూడు పగళ్లు రాత్రుళ్ళు మక్కాకు సమీపంలోని సౌర్ గుహలో గడిపారు. ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేస్తూ చివరకు నబవీ శకం 13వ యేట రబీవుల్ అవ్వల్ 8వ తేదీ సోమవారం (అంటే క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ) మదీనా సమీపంలో గల కుబా ప్రాంతానికి చేరారు. అక్కడే బస చేసి తిరిగి 12 రబీవుల్ అవ్వల్ ఒకటవ హిజ్ర శకం శుక్రవారం అక్కడ నుంచి పయనమయ్యారు. బనీసాలిమ్ వాడకు చేరేవరకు జుమా సమయం అయ్యింది. అక్కడే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంద మంది అనుచరులతో జుమా ప్రార్థన చేశారు. అదే ఇస్లాంలో మొదటి జుమా.
ప్రియ సోదరులారా..!
జుమా సుభదినాన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ఆ ప్రసంగం చారిత్రాత్మకంగా చాలా గొప్పస్థానాన్ని కలిగి ఉంది. ఆనాటి ఆ ఖుత్బాను ఈనాటి జుమా ప్రసంగంలో వినిపించాలనుకుంటున్నాను. ఈ చారిత్రక ప్రఖ్యాత ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా వినండి అల్లాహ్ ఈ ఖుత్బాను శుభకరంగా చేయుగాక… ఆమీన్.
“సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభిస్తాయి. నేను అల్లాహ్ ను స్తుతిస్తున్నాను, ఆయన సహాయాన్ని కోరుతున్నాను. క్షమాబిక్షకై ఆయన్ను వేడుకొంటున్నాను. నేను అల్లాహ్ ను విశ్వసించాను. అల్లాహ్ పట్ల అవిధేయత చూపను. ఆయన పట్ల అవిధేయత చూపిన వారితో నేను విరోధిస్తాను. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ప్రవక్త, దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సన్మార్గాన్ని, జ్యోతిని ఇచ్చి యుగాలుగా ప్రవక్తలు లేని కాలంలో, జ్ఞానం విద్య లేని కాలంలో, మార్గభ్రష్టత్వం తాండవమాడుతున్న కాలంలో ప్రభవింపజేశాడు. చివరికాలంలో ప్రళయానికి దగ్గరగా, మృత్యువుకు అతి చేరువుగా ప్రభవింపజేశాడు. ఎవరయితే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ఆనుసరిస్తారో వారే సాఫల్యం విజయం పొందుతారు. అవిధేయత చూపేవారు, దైవాజ్ఞలను ఉల్లంఘించేవారు మార్గవిహీనులవుతారు. మార్గభ్రష్టతలో కూరుకుపోతారు.
ముస్లిములారా!
అల్లాహ్ పట్ల భయభీతిగా ఉండాలనీ తాకీదు చేస్తున్నాను. ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరునికి చెయ్యాల్సిన అత్యుత్తమ హితబోధ ఏమిటంటే పరలోకం గురించి ప్రేరేపించాలి. అల్లాహ్ కు భయపడాలని బోధించాలి. అల్లాహ్ వేటికి దూరంగా ఉండమని ఆజ్ఞాపించాడో, వాటికి బహుదూరంగా ఉండాలి. వాటి జోలికి పోకూడదు. దీన్ని మించిన హితబోధ ఏదీలేదు. దీనిని మించిన జిక్ర్ (నామస్మరణం) లేదు. గుర్తుంచుకోండి! అల్లాహ్ కు భయపడుతూ పనులు చేసే వ్యక్తికి పరలోకంలో దైవభీతి ఎంతో అత్యుత్తముగా తోడ్పడుతుంది. అల్లాహ్, అతని మధ్యగల అంతర, బాహ్య వ్యవహారాల్లో, విషయాల్లో అతడు ధర్మబద్ధంగా ఉండి ఆయా పనుల్లో అతని సంకల్పశుద్ధి కూడా అల్లాహ్ కోసమే నిష్కల్మషంగా ఉంటే అతని కొరకు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు, మృత్యువు తరువాత అతని కొరకు ఆ పనులు ఒక విధిగా మారు తాయి. ఒకవేళ ఎవరయినా అలా చేయకపోతే అలాంటి వారి గురించి అల్లాహ్ సెలవిస్తున్నాడు:
مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِلْعَبِيدِ నా దగ్గర మాట మార్చడం జరగదు, నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను. (ఖాఫ్ 50 : 29)
కావున అల్లాహ్ కు భయపడండి. మీ ప్రాపంచిక విషయాల్లోనూ, ధార్మిక విషయాల్లోనూ అంతర విషయాల్లోనూ, బాహ్య వ్యవహారాల్లోనూ దైవభీతి కలిగి ఉండండి. ఎవరయితే అల్లాహ్ కు భయపడతారో అల్లాహ్ అతన్ని పాపాలన్నింటిని ఆయన తుడిచి వేస్తాడు. వారికి గొప్పపుణ్యఫలితాల్ని అనుగ్రహిస్తాడు. దైవభీతి ఉన్నవారే నిశ్చయంగా గొప్ప విజయం పొందిన వారు. నిశ్చయంగా దైవభీతి అవిధేయత నుండి కాపాడుతుంది. శిక్షలనుండి రక్షిస్తుంది. నిశ్చయంగా దైవభీతి మొహాలను వికసింపజేస్తుంది, దైవ ప్రసన్నతను ప్రసాదిస్తుంది, అంతస్తులను పెంచుతుంది. ప్రపంచంలో ధర్మ సమ్మతమైన పవిత్ర వస్తువుల్ని తినండి, కాని అల్లాహ్ ఆదేశాల నిర్వర్తనలో ఎలాంటి తగ్గింపు చేయకూడదు. అందుకొరకే అల్లాహ్ మీకు గ్రంథాన్ని నేర్పించాడు. దైవ మార్గాలను చూపాడు. దీని ద్వారా అల్లాహ్ సత్యవంతుల్ని, అసత్య వాదుల్ని వేరుచేస్తాడు.
అల్లాహ్ మీ పై ఎంతటి అనుగ్రహాన్ని ఉపకారాన్ని కురిపించాడో అలాగే మీరు ప్రజలతో ప్రవర్తించండి. అల్లాహ్ విరోధులను మీ విరోధులుగా భావించండి. అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీకు అల్లాహ్ విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. ఎందుకంటే దైవసందేశం, సూచనలు చూసి కూడా ఇస్లాం స్వీకరించనివాణ్ణి నాశనం చేయడానికి. ఇక ఎవరు దైవసూచనలు చూసి ఇస్లాం స్వీకరిస్తారో వారికి జీవితం ప్రసాదించడానికి, సర్వ పుణ్యాలు అల్లాహ్ ఆజ్ఞతోనే జరుగుతున్నాయి.
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్)ను అత్యధికంగా చేస్తూ ఉండండి. పరలోక విజయం కొరకు పుణ్యకార్యాలు చేయండి. ఎవరయితే దైవం మధ్య తమ మధ్య ఉన్న విషయాలను సరిగ్గా పాటిస్తారో అల్లాహ్ అతని మధ్య, ప్రజల మధ్యగల విషయాలను సరిచేస్తాడు.
నిశ్చయంగా అల్లాహ్ దాసులకు ఆజ్ఞలు జారిచేస్తాడు. ఆయనపై ఎవరి ఆజ్ఞా లేదు. అల్లాహ్ దాసులు యజమాని. అల్లాహ్ సన్నిధిలో దాసులకు ఎలాంటి ఆధిపత్యమూ అధికారము లేదు.
అల్లాహ్ మహోన్నతుడు. పుణ్యకార్యాలు చేసే సద్బుద్ధి, శక్తి ఆ మహోన్నతుని కటాక్షం దయవల్లే కలుగుతుంది.
(రహ్మతుల్లిల్ ఆలమీన్ 1:92-93)
ఇస్లామీయ సోదరులారా..!
ఎంతటి మహత్తర ప్రసంగం! ఎంతటి మహాభాగ్యం!! ఆనాడు ఆరంభమైన ఈ వారంవారం పండుగ ప్రళయం వరకు జారి చేయబడింది. ఇస్లామీయ చరిత్రలోని తొలి ఖుత్బాలో పాల్గొన్న ఆ సహాబాలు ఎంతటి ధన్యజీవులో ఇప్పటికి కూడా బనూ సాలీం వీధి ఖుబాలో ఉంది. అక్కడే ఒక మహాన్నతమైన మస్జిద్ నిర్మించడం జరిగింది గత చరిత్ర వైభవానికి నిదర్శనంగా.
అల్లాహ్ మనందరికి పవిత్ర మక్కా యాత్ర చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) హిజ్రత్ అర్థం 2) హిజ్రత్ విశిష్టత 3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది 4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు.
మొదటి ఖుత్బా
ధార్మిక సహోదరులారా!
హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి.
హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం ‘వదలిపెట్టడం‘ అని.
అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు.
‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు: “అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”.
అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు: “షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.”
బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు.
“అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది.
“అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి : 1/54)
ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు:
“హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొహర్రం మాసంలో ప్రత్యేకించి జరిగే దౌర్జన్యాలలో ఒకటి ఏమిటంటే – దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యులైన సహాబాల గురించి చెడుగా పలకడం మరియు వారిని తిట్టి పోయడం. వాస్తవానికి ప్రవక్త సహచరులను గూర్చి చెడు పలకడం, వారిని దుర్భాషలాడడం అనేవి పూర్తిగా నిషేధించ బడ్డాయి.
ప్రవక్త సహచరులను గూర్చి ‘అహ్లె సున్నత్ వల్ జమాత్’ యొక్క విశ్వాసాన్ని గూర్చి వివరిస్తూ ఇమామ్ తహావి (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు:
“మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమిస్తాము మరియు వారిని ప్రేమించడంలో ఏ ఒక్కరి విషయంలో కూడా అతిశయోక్తిని ప్రదర్శించము. అంతేగాక, ఏ ఒక్కరితో విముక్తిని కూడా ప్రకటించుకోము. సహాబాలను ద్వేషించే ప్రతి వ్యక్తినీ, వారిని చెడుగా చిత్రీకరించే ప్రతి ఒక్కరినీ మేము కూడా ద్వేషిస్తాము. మేమైతే సహాబాలను మంచి తలంపుతో స్మరించు కుంటాము. వారిని ప్రేమిచండం ధర్మం, విశ్వాసం మరియు ఎహసాన్లలో ఓ ముఖ్యభాగం అనీ మరియు వారిని ద్వేషించడం, తిరస్కారానికి (కుఫ్ర్), కాపట్యానికి (నిఫాక్) మరియు అవిధేయతలకు చిహ్నమని భావిస్తాము”. (షరహ్ అఖీదా తహావియ : 467 పేజీ)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సహాబాల మహత్యాన్ని గూర్చి వివరించిన తర్వాత – తిరస్కారులకు (అవిశ్వాసులకు) సహాబాల పట్ల అసహ్యం కలుగుతుంది మరియు ఎల్లప్పుడూ వారి గురించి (మనస్సుల్లో) ద్వేషాగ్ని రగులుకొని వుంటుంది అని సెలవిచ్చాడు.
అంటే సహాబాలను అసహ్యించుకోవటం, వారి పట్ల ద్వేషభావం కలిగి వుండడం తిరస్కారుల ప్రవృత్తి అన్న మాట. ముస్లిములది కాదు.
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్నీ నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖార విందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో వుంది. ఇంజీలులో (కూడా వీరి ఉపమానం వుంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తర్వాత అది లావు అయ్యింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించ సాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని. వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసివున్నాడు.” (ఫతహ్ : 29)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా తన సహచరుల గురించి దుర్భాషలాడడం నుండి గట్టిగా వారించారు. ఆయన ఇలా ఉద్బోధించారు:
“నా సహచరులను దుర్భాషలాడకండి. నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తివంతుని సాక్షి! మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారం దానం చేసినా సరే అది వీరి (సహచరులు) ఒక ముద్ లేదా అర ముద్ కు కూడా సమానం కాలేదు”. (ముద్ అంటే ఒక రకమైన కొలత)
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు ) ఇలా అంటూ వుండేవారు :
“ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను గూర్చి చెడుగా అనకండి. ఎందుకంటే – దైవప్రవక్తతో వారు నిలబడ్డ ఒక్క క్షణం అయినా మీ పూర్తి జీవితపు ఆచరణలకన్నా ఉత్తమమైనది
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటూ వుండేవారు:
“మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను దుర్భాష లాడకండి. ఎందుకంటే దైవప్రవక్త సహచరులలో ఎవరైనా ఒక్క క్షణం ఆయనతో నిలబడితే ఆ ఒక్క క్షణం కూడా మీ 40 సంవత్సరాల ఆచరణల కన్నా ఉత్తమమైనది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
మూడు (కఫ్ఫారాత్) పరిహారాలున్నాయి, మూడు (దరజాత్) స్థానాలను పెంచేవి ఉన్నాయి మూడు (ముంజియాత్) మోక్ష సాధనాలున్నాయి మూడు (ముహ్ లికాత్) వినాశనానికి గురి చేసేటివి ఉన్నాయి
కఫ్ఫారాత్: 1- విపరీత చలిలో సంపూర్ణ వుజూ చేయుట 2- ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు వేచించుట 3- జమాఅతుతో (సాముహిక) నమాజు చేయుట కొరకు కాలి నడకతో వెళ్ళుట.
దరజాత్: 1- అన్నం తినిపించుటు, 2- సలాం వ్యాపింపజేయుట 3- రాత్రి ప్రజలు పడుకున్నప్పుడు లేచి తహజ్జుద్ నమాజు చేయుట.
ముంజియాత్: 1- కోపం, సంతోషం అన్ని స్థితుల్లో న్యాయం పాటించుట 2- పేదరికం, సిరివంతం అన్ని స్థితుల్లో మధ్యేమార్గాన్ని అవలంభించుట 3- ఏకాంతంలో ఉన్నా, నలుగురి మధ్యలో ఉన్నా అల్లాహ్ తో భయపడుతూ ఉండుట.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.