మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు [వీడియో ]

[20] మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు
https://youtu.be/xC-ulwWQX-o [52 నిముషాలు]

తప్పకుండా వినే ప్రయత్నం చేయండి, చాల మంచి వీడియో, ప్రవక్త గారి (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర అర్ధం చేసుకోవడం మనందరి విధి.

తబూక్ పోరాటం PDF డౌన్లోడ్ చేస్కోండి: (20 పేజీలు)
https://teluguislam.net/wp-content/uploads/2022/06/ghazwa-tabook.pdf

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

గజ్వయె తబూక్ (తబూక్ పోరాటం) 

మక్కా విజయం, సత్యాసత్యాల నడుమ జరిగిన ఓ నిర్ణయాత్మకమైన యుద్ధమే అనాలి. ఆ విజయానంతరం అరబ్బుల్లో, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క దైవ దౌత్యం గురించి ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ కారణంగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దైవధర్మం అయిన ఇస్లామ్ లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరడం ఆరంభమైంది. ప్రతినిధి వర్గాల రాకకు సంబంధించిన అధ్యాయంలో మేము ఇస్తున్న వివరాల ఆధారంగా ఈ విషయాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. అలాగే, హజాతుల్ విదా సందర్భంలో హాజరైన ప్రజా సమూహాన్ని బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు – మొత్తానికి, అరేబియాలో అంతర్గతంగా ప్రబలుతున్న తిరుగుబాట్లు, అడ్డంకులన్నీ ఇప్పుడు దాదాపుగా సమసిపోయి నట్లయింది. ముస్లిములు, దైవధర్మ సంవిధానాన్ని, ఇస్లామ్ షరీఅతను ఎల్లెడలా వ్యాపింపజేయడానికి, ఇస్లామ్ ధర్మప్రచారం కోసం ఏకాగ్రతను సంతరించుకొని ముందుకు పురోగమించడానికి అవకాశం లభించినట్లయింది. 

తబూక్ పోరాటం సంభవించడానికి గల కారణం 

అయితే ఇప్పుడు, ఎలాంటి కారణం లేకుండానే ముస్లిములతో తలపడడానికి ఓ శక్తి మదీనా వైపునకు దృష్టిని పెట్టింది. దీనికి సంబంధించిన వారు అప్పుడప్పుడు ముస్లిములను కవ్విస్తూ ఉన్నారు. ఈ శక్తి రోమను సామ్రాజ్యానికి సంబంధించినది. అది ఆ కాలంలో ప్రపంచంలోకెల్లా ఓ పెద్ద సూపర్ పవర్ గా అలరారే సామ్రాజ్యం . వెనుకటి పుటల్లో ఈ కవ్వింపు, షుజ్ల్ బిన్ అమ్రూ గస్సానీ చేతిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దూత హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ అజీ (రదియల్లాహు అన్హు) హత్యగావించబడడంతో ఆరంభమైంది. హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ బస్రా గవర్నరు వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సందేశాన్ని తీసుకు వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత హజ్రత్ జైద్ బిన్ హారిసా నేతృత్వంలో ఓ సైనిక పటాలాన్ని పంపించడం, అది రోమను సామ్రాజ్యంలో ‘మూతా’లో భీకరంగా యుద్ధం చేయడం, అయితే ఈ సైనిక పటాలం ఆ తలబిరుసుతనం గల రోమనులను అణచలేకపోవడం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే. అయితే, ముస్లిముల ఈ సైన్యం అప్పటి సూపర్ పవర్ అయిన రోమనులతో ఢీకొనడం, అరేబియా పౌరులపై మంచి ప్రభావాన్నే వేసింది. | 

రోమ్ చక్రవర్తి కైజరు, ఈ ప్రభావం విషయంలో, దాని ఫలితంగా అరబ్బు తెగల్లో రోమనుల నుండి స్వాతంత్ర్యం పొందే భావన జాగృతం అయ్యే విషయంలో, ముస్లిముల ఎడల అరబ్బుల్లో ఏర్పడే సానుభూతి విష 

యంలో ఎలా ఉపేక్షించగలడు? అవి అతణ్ణి కలచివేస్తున్న ప్రమాద సూచికలే మరి. ఆ ప్రమాదం ఒక్కో అడుగు అతని సరిహద్దుల వైపునకు కదిలివస్తోంది. అరేబియాతో కలిసిన సిరియా సరిహద్దుకు ఓ సవాలుగా నిలిచింది. కాబట్టి కైజరు, ముస్లిముల ఈ మహోన్నతమైన శక్తి, అజేయమైన ఈ ప్రమాదం ముంచుకు రాకపూర్వమే, రోము సామ్రాజ్యానికి ఆనుకొని ఉన్న అరబ్బు ప్రాంతాల్లో సంక్షోభం, తిరుగుబాట్లు చెలరేగక మునుపే దాన్ని అణచివేయా లనే దృఢసంకల్పానికి వచ్చాడు.

ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే, మూతా యుద్ధం జరిగి ఇంకా ఒక్క సంవత్సరం కూడా తిరిగిరాలేదు, 

రోము చక్రవర్తి రోమను ప్రజల్ని, తన ఆధీనంలో ఉన్న అరబ్బుల్ని, అంటే ఆలెగస్సాన్ తెగ వగైరాలతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని సమీకరించి, ఓ భయంకరమైన, నిర్ణయాత్మకమైన యుద్ధం కోసం సన్నాహాలు మొదలెట్టాడు. 

రోమనులు మరియు గస్సాన్ల యుద్ధ సన్నాహాల వార్తలు 

రోమను సామ్రాజ్యం ముస్లిములపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించిందన్న వార్తలు ఎడతెగకుండా మదీనాకు చేరుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ముస్లిములు అప్రమత్తులైపోయారు. ఏ చిన్న అనుమానం వచ్చినా రోమనులు తమపైకి వచ్చిపడ్డారనే భావనకు లోనైపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ సంఘటనను కూడా ఇక్కడ ఉటంకించక తప్పదు. అదే సంవత్సరం, అంటే హిజీ శకం 9లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణులతో అలిగి ఒక నెల్లాళ్ళు ‘ఈలా“చేసి వారికి దూరంగా ఉన్నారు. సహచరులకు ఈ విషయం తెలిసిరాలేదు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి తలాక్ ఇచ్చారనే అనుకొని బాధపడిపోయారు. 

[ఈలా అంటే స్త్రీ వద్దకు వెళ్ళనని ఒట్టేసుకోవడం. ఈ ఒట్టు నాల్గు నెలలు లేదా అంతకంటే తక్కువ గడువు కోసం వేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఫరవాలేదు. ఇదే గనక నాల్గు నెలలు దాటితే షరీఅత్ న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం కలుగజేసుకుని భర్త, భార్యను భార్యగానైనా ఉంచుకోవాలి లేదా ఆమెకు తలాక్ అయినా ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. కొందరు సహాబాల అభిప్రాయం ప్రకారం, నాల్గు నెలల గడువు తీరిపోగానే ఆ స్త్రీకి తలాక్ వర్తిస్తుంది.]

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన గురించి ఇలా వివరిస్తున్నారు: 

“నాకు అన్సారీ మిత్రుడొకడుండేవాడు. నేను (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధిలో) లేనప్పుడు అతను అక్కడ జరిగిన విషయాలు వచ్చి చెప్పేవాడు. నేను కూడా అతని గైర్హాజరులో వెళ్ళి జరిగిన విషయాలు అతనికి చెబుతూ ఉండేవాణ్ణి. ఈ ఇద్దరు మిత్రులు మదీనాలోనే ఉంటూ ఉండేవారు. ఇరుగుపొరుగున ఉంటూ వంతుల వారీగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవారు – ఆ కాలంలోనే మాకు గస్సాన్ రాజు వల్ల ప్రమాదం ఏర్పడుతుందనే శంక ఉంటూ ఉండేది. అతను మా పై దాడి చేయనున్నాడని వస్తున్న వార్తల వల్ల మేము అప్రమత్తులమై ఉండేవారం. ఓ రోజు హఠాత్తుగా నా ఆ అన్సారీ మిత్రుడు నా తలుపును తెగబాదుతూ తలుపు తెరవమని అరవనారంభించాడు. అది విన్న నేను, “ఏమిటీ? గస్సానీలు వచ్చిపడ్డారా?” 

అని అడిగాను. 

“కాదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణుల నుండి వేరైపోయారు” అన్నాడు నా మిత్రుడు. [సహీహ్ బుఖారీ-2/730 ]

మరో ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నట్లు ఉంది: 

“మా పై దండెత్తడానికి ఆలెగస్సాన్ తమ గుర్రాలకు నాడాలు వేస్తున్నా రనే పుకార్లు బాగా వ్యాపించిన రోజులవి. ఓ రోజు నా మిత్రుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి ఇషా నమాజు సమయానికి తిరిగివచ్చాడు. నా ఇంటి తలుపును పెద్దగా తడుతూ, “ఆయన నిద్రపోయారా?” అని అరుస్తున్నాడు. 

నేను బెదిరిపోతూ బయటకు వచ్చేశాను.

“ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయింది” అన్నాడతను. 

“ఏమిటి? గస్సానులు వచ్చేశారా?” అని అడిగాన్నేను. 

“లేదు. అంతకంటే పెద్ద ప్రమాదమే ముంచుకువచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు తలాక్ ఇచ్చేశారు.” [సహీహ్ బుఖారీ-1/334]

ఈ పరిస్థితినిబట్టి రోమనుల వల్ల ముస్లిములలో ఏర్పడిన వ్యాకులత ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మునాఫిక్లులు (కపట ముస్లిములు) వ్యాపింపజేస్తున్న పుకార్లు వారిని మరింత చీకాకుపర్చనారం భించాయి. ఈ మునాఫిలకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రంగంలోనూ నెగ్గుకు వస్తున్నారని, ఈ భూమ్మీదనున్న ఏ శక్తికీ వెరవడం లేదని, ఏ అడ్డంకులైతే ఆయన దారికి అడ్డువస్తున్నాయో అవన్నీ ఇట్టే తొలగిపోతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ వారు తమ మనస్సుల్లో దాచుకున్నది, ఎదురు చూస్తున్నది తప్పకుండా నెరవేరే తరుణం ఎంతో దూరంగా లేదని తలచి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్ననారంభించారు. వారు తాము భావిస్తున్నట్లుగానే ఓ మస్జిదను (ఆ మస్జిద్, మస్జిదె జిరా గా ఆ తరువాత ఖ్యాతిగాంచింది) కట్టుకొని ఆ మస్జిద్ లో కుట్రలు, కుతంత్రాలకు పథకాలు వేయనారంభిం చారు. దైవం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ల ఎడల తిరస్కార భావ పునాదులపై నిర్మించ బడిన మస్జి లోనికి వచ్చి నమాజు చేయించమని కూడా ఈ మునాఫిస్టు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను కోరి ఉన్నారు. అలా కోరడానికి కారణం, ముస్లిములను మభ్య పెట్టి వారికి తాము పన్నుతున్న కుతంత్రాలు తెలియకుండా ఉండాలని, ఆ మస్జిద్ లోకి వచ్చి పోయే వారిపై ముస్లిములు నిఘా ఉంచకుండా ఉండడానికే. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందు వలన ఆ మస్జిద్ లో నమాజు చేయించే కార్యక్రమాన్ని యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు వాయిదా వేశారు. ఇలా మునాఫిక్లులు తమ లక్ష్యసాధనలో కృతకృత్యులు కాలేకపోయారు. అల్లాహ్ వారి ఈ ఎత్తుగడను యుద్ధం నుండి తిరిగివచ్చే లోపలే బట్టబయలు చేశాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం నుండి తిరిగివచ్చిన తరువాత ఆ మస్జిద్ లో నమాజు చేసే బదులు దాన్ని నేలమట్టం చేయించారు. 

రోమనులు, గస్సానుల యుద్ధ సన్నాహాలకు చెందిన ప్రత్యేక వార్తలు 

ముస్లిములు యుద్ధ వార్తలను వింటూ చీకాకులో ఉన్న కాలంలోనే మదీనాకు సిరియా దేశం నుండి నూనె సరఫరా చేసే ‘బన్తీల’ (*)  ద్వారా హఠాత్తుగా హెరిక్స్ నలభై వేల మంది సైనికులతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసి పేరుమోసిన ఓ కమాండరు నేతృత్వంలో యుద్ధానికి పంపిస్తు న్నాడని, ఆ సైన్యం జెండా క్రిందికి క్రైస్తవ తెగలైన లబ్న్ మరియు జిజాములు కూడా వచ్చి చేరాయని, ఆ సైన్యం ముందస్తు దళం ఒకటి ‘బల్కా’ వరకు వచ్చేసిందనే పిడుగులాంటి వార్త వినిపించారు. ఇలా అది ఓ పెద్ద ప్రమాద రూపంలో ముస్లిముల ముందుకు వచ్చిన ప్రత్యేక యుద్ధ సంబంధమైన 

(*) సాబిత్ బిన్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఉత్తర హిజాలో మంచి పలుకుబడిగల ధనవంతులు. పతనావస్థకు చేరి క్రమక్రమంగా మామూలు రైతులుగా, వ్యాపారులుగా మారిపోయినవారు వీరు

మరింత జటిలంగా మారిన పరిస్థితులు 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, వాటికితోడు మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. విపరీతమైన ఎండ వేడిమికి తోడు ప్రజలు కరవు వల్ల బాధపడు తున్నారు. వెళ్ళడానికి వాహనాలు కూడా తక్కువే. మదీనాలో పండే పండు పంటకొచ్చాయి. కాబట్టి ప్రజలు మదీనాను వదలక నీడపట్టున ఉండి పంటను దక్కించుకుందామనే ధోరణిలో ఉన్నారు. వెంటనే బయలుదేరడానికి సిద్ధపడడం లేదు. అదేకాకుండా దూరప్రాంతానికి వెళ్ళడం, మార్గంలో ఏర్పడే అవరోధాలు ఓ ప్రక్క పీడించనారంభించాయి వారిని. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుని ఖచ్చితమైన నిర్ణయం

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితులను, జరుగబోయే మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాత్మకమైన ఘడియలో గనక ముస్లిములు రోమనులతో యుద్ధం చేయడానికి బద్దకించి ముస్లిముల ప్రాంతాల్లోనికి చొరబడే వీలు కలిగిస్తే, వారు మదీనా పై దండెత్తి వస్తే గనకా, ఇస్లామీయ సందేశం పై చెడు ప్రభావాలు పడతాయి. ముస్లిమ్ సైన్యానికి ఇప్పటి వరకు వచ్చిన కీర్తికాస్తా మంటగలిసిపోతుంది. ‘హునైన్’ యుద్ధంలో చావుదెబ్బ తిని తుది శ్వాస వదులుతున్న అజ్ఞానం తిరిగి బ్రతికి బట్టకడుతుంది. సమయం కోసం కాచుకొని అబూ ఆమిర్ ఫాసిక్ ద్వారా రోమను చక్రవర్తితో సంబంధాలు ఏర్పర్చుకున్న మునాఫిన్లు, రోమనులతో తలపడబోతున్న ముస్లిములకు వెన్నుపోటు పొడవడానికి కాచుకొని కూర్చున్నారు. ఇలా ఇప్పటి వరకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన అనుచరగణం ఇస్లామ్ వ్యాప్తికి చేసిన కృషి అంతా బూడిదలో బోసిన పన్నీరులా వృధా అయిపోగలదు. ఎడతెగని రక్తపాత సహిత యుద్ధాలు, సైనిక చర్యల ద్వారా సంపాదించిన విజయాలు కాస్తా అపజయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది. 

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఫలితాలను పూర్తిగా బేరీజు వేసుకుం టూనే ఉన్నారు. అందుకని, ఓ వైపు విషమ పరిస్థితులు, మరో వైపు దారిద్ర్యం పీడిస్తున్నప్పటికీ, రోమనులను దారుల్ ఇస్లామ్ (మదీనా) వైపునకు పురోగ మించే వెసులుబాటును కల్పించే బదులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామే స్వయాన వారి ప్రాంతాల్లోనికి చొరబడి వారికి వ్యతిరేకంగా ఓ నిర్ణయాత్మకమైన యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

రోమనులతో యుద్ధానికి సన్నాహాలు 

ఈ వ్యవహారాన్ని గురించి బాగా సమీక్షించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయులు సహాబా (రదియల్లాహు అన్హుమ్)లకు, యుద్ధం గురించిన సన్నాహాలు ప్రారంభిం చమని ప్రకటించారు. అరబ్బు తెగలు, మక్కా ప్రజల్ని కూడా యుద్ధం కోసం బయలుదేరండనే సందేశం పంపించారు. ఏ గజ్వాకైనా వెళ్ళేటప్పుడు దైవప్రవక్త 

(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల దృష్టిని మరో వైపునకు మళ్ళించడం రివాజు. కాని పరిస్థితి జటిలత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “మనం రోమనులతో యుద్ధానికి వెడుతున్నాం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జిహాద్’ గురించి ప్రజల్ని ప్రేరేపించారు. దివ్యఖుర్ఆన్లోని ‘తౌబా’ సూరాలోని ఓ భాగం ఈ సందర్భంలోనే అవతరించింది. దీనికితోడు, ఆయన దానధర్మాల ప్రాశస్త్యం గురించి చెబుతూ, అల్లాహ్ మార్గంలో ప్రియమైనది, మేలైనది అయిన దాన్ని వెచ్చించమని ప్రోత్సహించారు. 

యుద్ధ సన్నాహాలకు ముస్లిముల ఉరుకులు పరుగులు 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రకటన వినగానే, రోమనులతో యుద్ధం చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. తెగలు, మిత్రపక్షాలు నలువైపుల నుండి మదీనాకు వచ్చిచేరనారంభించాయి. ఎవరి మనస్సుల్లోనైతే కపటం నాటుకుపోయిందో వారు తప్ప ప్రతి ముస్లిమ్ ఆ గజ్వాకు వెళ్ళడానికి వెనుకాడలేదు. అయితే ముస్లిములలోనే ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే ఆ గజ్వాలో చేరకుండా ఆగిపోయారు. వారు కపట ముస్లిములు కారు, నిజమైన ముస్లిములే. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిములు సైతం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుల వద్దకు వచ్చి యుద్ధంలో పాల్గొనడానికి తమకు ఏదైనా వాహనాన్ని సమకూర్చమని ప్రాధేయపడనారం భించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వద్ద ఏదీ లేదని, ఈ విషయంలో నేను నిస్సహాయుడనని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. దివ్యఖుర్ఆన్ ఈ సందర్భాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది. 

“నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే, గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు.” (9 : 92) 

ఇలాగే ముస్లిములు దైవమార్గంలో ధనాన్ని వెచ్చించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు), సిరియా దేశం వెళ్ళడానికిగాను వ్యాపార సామగ్రి మూటలు గల రెండు వందల ఒంటెలను, వాటితో సహా రెండు వందల ఓకియాల వెండి (దాదాపు ఇరవై తొమ్మిదిన్నర కిలోల వెండి) తయారు చేసి ఉన్నారు. ఆయన దీన్నంతటిని యుద్ధం కోసం దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అదనంగా ఓ వంద ఒంటెల్ని ప్రయాణ సామగ్రితో సహా సదఖా చేశారు. అది ఇచ్చిన తరువాత ఒక వెయ్యి దీనారాలు (దాదాపు అయిదున్నర కిలోల బంగారం) తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒడిలో పొసేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ దీనారాలను చేతితో ఇటు అటు కదిలిస్తూ ఈ రోజు ఉస్మాన్ ఏది చేసినా ఆయనకు నష్టాన్ని చేకూర్చదు ‘* అననారంభించారు. ( *జామిఆ తిర్మిజీ: మనాఖిబ్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్-2/2111 )

అదే కాకుండా హజ్రత్ ఉస్మాన్ మళ్ళీ మళ్ళీ సదఖా చేస్తూనే ఉన్నారు. అలా ఆయన సదఖా చేసిన ధనం గాక, ఒంటెల సంఖ్య తొమ్మిది వందలు, గుర్రాల సంఖ్య నూరు వరకు చేరిపోయింది. 

ఇటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తన రెండొందల ఓకియాలు (అంటే ఇరవైతొమ్మిదిన్నర కిలోల వెండి) తీసుకొచ్చి సమర్పించారు. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన దగ్గర ఉన్నదంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చి పడవేశారు. ఆయన భార్యాపిల్లల కోసం మిగిల్చి ఉంచింది కేవలం అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మాత్రమే. ఆయన చేసిన సదఖా ధనం మొత్తం నాల్గు వేల దీర్ఘములు. ఆయనే ఈ సదఖా తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించినవారిలో ప్రథముడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వద్ద ఉన్న సొత్తులోని సగభాగం తీసుకొని వచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా పెద్ద మొత్తంలోనే ధనాన్ని తెచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. వారే కాకుండా హజ్రత్ తలా (రదియల్లాహు అన్హు), సఅద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)లు కూడా తగినంత డబ్బును సదఖాగా ఇచ్చారు. హజ్రత్ ఆసిమ్ బిన్ అద్దీ (రదియల్లాహు అన్హు) తొంభై వస్క్ ల (అంటే పదమూడున్నర వేల కిలోలు లేదా పదమూడున్నర టన్నుల) ఖర్జూరాలు తీసుకువచ్చారు. తక్కిన సహాబాలు కూడా ఒకరి తరువాత ఒకరు తమకు తోచిన సదఖా తెచ్చి ఇచ్చారు. చివరికి శక్తి లేనివారు కూడా ఒకటో రెండో ముద్దు (ఖర్జూరాలు) సదఖాగా ఇచ్చారు. మహిళలు కూడా తమ కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్ళ పట్టీలు, చెవుల రింగులు, ఉంగరాలు వగైరాలు వారి శక్తి మేరకు తెచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. ప్రతివారూ పిసినారితనాన్ని ప్రదర్శించకుండా సదఖ ఇచ్చినవారే. కేవలం మునాఫిన్లు ఒక్కరే ఒకరిని మించి ఒకరు సదఖా చేయడం చూసి (వీరు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్న సదఖా అని) తూలనాడనారంభించారు. తమ వద్ద ఇవ్వడానికి ఏమి లేని పేద ముస్లిములెవరైనా ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకొని వస్తే వారిని చూసి ఈ మునాఫిక్లు, ఓహో ఈ ఖర్జూరాలతో కైజరు సామ్రాజ్యాన్ని జయిస్తారు కాబోలు అని హేళన చేసేవారు. (9 : 97) 

తబూక్ కు బయలుదేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)ను, మరో ఉల్లేఖనంలో చెప్పబడి నట్లుగా సబా బిన్ అరఫ్తా (రదియల్లాహు అన్హు)ను మదీనాకు గవర్నరుగా నియమించారు. . హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని తమ కుటుంబ సభ్యులకు సంరక్షకులుగా చేసి మదీనా లోనే ఉండమని చెప్పి ఆదేశించారు. కాని మునాఫిన్లు ఆయన్ను తూల నాడడం వలన ఆయన బయలుదేరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఆయన్ను మదీనాకు పంపిస్తూ, “ఏమిటీ! నీకూ నాకూ ఉన్న అనుబంధం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)తో ఉన్న అనుబంధం లాంటిది అనే విషయాన్ని గ్రహించలేదా? అయితే నా తరువాత మరో ప్రవక్త రాడు అనే విషయం తెలుసుకో” అని అన్నారు. 

ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్తర దిశ వైపునకు బయలుదేరారు. (నిసాయీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రకారం అది గురువారం) గమ్యం తబూక్. సైన్యం పెద్దది. ముప్ఫై వేల మంది యోధులతో కూడిన సైన్యం అది. అంతకు పూర్వం ముస్లిములు అంత పెద్ద సైన్యాన్ని ఎప్పుడూ సమీకరించలేదు. అందుకని, ముస్లిములు దానికోసం తమ శాయశక్తులా ధనాన్ని సమకూర్చి నప్పటికీ సైన్యానికి కావలసిన హంగుల్ని సమకూర్చలేకపోయారు. అప్పటికీ వాహనాలు, తినుబండారాలు బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పద్దెనిమిదేసి మంది సిపాయీలకు ఒక్కొక్క ఒంటె కేటాయించబడింది. వారు దాని పై వంతుల వారీగా స్వారీ చేస్తూ వెడుతున్నారు. అలాగే తినుబండారాల కొరత వల్ల అప్పుడప్పుడు చెట్ల ఆకుల్ని సైతం తినవలసి వచ్చింది. ఆ ఆకుల్ని తినడం వలన వారి పెదాలు వాచిపోయాయి. విధిలేక ఒంటెల కొరత ఉన్నప్పటికీ వాటిని జిబహ్ చేసి దాని ప్రేవుల్లో ఉన్న నీటిని త్రాగవలసి వచ్చింది. అందుకొరకే ఆ సైన్యం పేరు ‘జైషే ఉగ్రత్’ (అంటే కష్టాలు అనుభవించిన సైన్యం) అని పడిపోయింది. తబూక్ కు వెళ్ళేటప్పుడు ఈ సైన్యం ‘ హిజ్ర్ (అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం) గుండా వెళ్ళవలసి వచ్చింది. సమూద్ జాతి ‘వాదియిల్ ఖురా’లో బండరాళ్ళను తొలిచి ఇండ్లను నిర్మించుకున్న జాతి. సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడి ఓ బావి నుండి నీటిని నింపుకున్నారు. కాని బయలుదేరే టప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో, “మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి, ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వుజూ కూడా చెయ్యొద్దు. ఆ నీటితో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో, దాన్ని పశువులకు పెట్టేయండి. ఆ పిండి తినకండి. మీరు సాలెహ్ (అలైహిస్సలాం)గారి ఒంటె నీళ్ళు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి” అని ఆదేశించారు. 

‘సహీ హీన్’ గ్రంథంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం ఒకటుంది. అందులో ఆయన ఇలా సెలవిస్తున్నారు: 

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ హిజ్ర్ (లేదా సమూద్ జాతి నివాసం) గుండా వెడుతూ, ‘ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి. వారి పై పడిన ఆపద మీ పైనా పడవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో మూలిగే హృదయాలు రోదిస్తూ నడిచినట్లు నడవండి’ అన్నారు. ఆ పిదప ఆయన తన తల పై వస్త్రం కప్పుకుని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను దాటారు.” [సహీహ్ బుఖారీ- హిజ్ర్ లోయలో ప్రవేశించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే అధ్యాయం-2/637]

మార్గమధ్యంలో సైన్యానికి నీరు కరవై విలవిలలాడిపోతోంది. ఈ విషయం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు కొందరు. ప్రవక్త మహ నీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను మొర పెట్టుకోగా అల్లాహ్ మేఘాలను పంపించాడు. అవి బాగా వర్షించగా జనం తనవితీరా దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా అవసరానికి కావలసినంత నీటిని నింపుకోవడం జరిగింది. 

ఇక తబూక్ దాపుకు చేరుతారనగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యాన్ని ఉద్దేశించి, “ఇన్షా అల్లాహ్, మీరు రేపటికల్లా తబూక్ యొక్క నీటి చెలమను చేరుకో గలరు. అయితే చార్జ్ సమయానికి ముందు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి 

అక్కడికి వెళ్ళినవాడు ఏ ఒక్కడు కూడా నేను చేరనంత వరకు ఆ నీటిని ముట్టుకోవద్దు సుమా!” అని హెచ్చరించారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “మేము అక్కడికి చేరేలోపలే ఇద్దరు వ్యక్తులు ఆ చెలమ దగ్గరికి వెళ్ళడం గమనించాం. ఊట బావి(చెలమ) నుండి కొద్దికొద్దిగా నీరు ఊరుతోంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిద్దరిని ఉద్దేశించి, ‘మీరు ఈ నీటిని ముట్టుకున్నారా?’ అని అడగగా, ‘అవును’ అని బదులిచ్చారు వారు. ఆ ఇద్దరికి దైవాదేశం మేరకు ఏం చేప్పాలో చెప్పి, ఆ చెలమ నుండి తన ఒక అర చేతిని దొప్పగా చేసి వచ్చిన నీటిని బయటకు తీయనారంభించారు. అలా తీయగా వచ్చిన కొద్దిపాటి నీటితో తన ముఖాన్ని, చేతుల్ని కడిగి తిరిగి ఆ నీటిని ఆ చెలమలో పోసేశారు. ఆ తరువాత ఆ చెలమలో పుష్కలంగా నీరు ఊరనారంభించింది. సహాబా (రదియల్లాహు అన్హుమ్) తనవితీరా ఆ నీటిని త్రాగారు. ఆ తరువాత నన్నుద్దేశించి, ‘ఓ ముఆజ్! నీవే గనక బ్రతికి ఉంటే ఈ ప్రదేశాన్ని తోటలతో సస్యశ్యామలంగా అలరారుతున్నట్లు చూస్తావు’ అని చెప్పారు.” [ ముస్లిమ్- ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం-2/246]

మార్గం మధ్యలోనో లేదా తబూక్ కు చేరిన తరువాతనో- ఉల్లేఖనాల్లో కొంత భేదం ఉంది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఈ రాత్రి మి మీదికి పెద్ద ఇసుక తుఫాను ఒకటి వచ్చిపడబోతోంది. అందుకని ఏ ఒక్కడూ లేచి నిలబడకూడదు. ఒంటెగలవాడు దాన్ని త్రాటితో గట్టిగా కట్టేయాలి” అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లుగానే ఆ రాత్రి తీవ్రమైన గాలి దుమారం చెలరేగింది. వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడగా ఆ గాలి దుమారం అతణ్ణి ఎగిరేసుకుపోయి రెండు కొండల నడుమ విసరేసింది. ” [ముస్లిమ్-ముఆజ్ బిన్ జబల్  ఉల్లేఖనం -2/246]

తబూక్ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జొహ్రీ మరియు అశ్ నమాజులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేసేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు నమాజుల్ని జమా తస్లిమ్ గాను, జమా తాఖీ గానూ చేసేవారు. (‘జమా తస్లీమ్’ అంటే జొహ్రీ మరియు అస్త్ నమాజులు జొహ్ర నమాజు వేళ అయినప్పుడు, మగ్రిబ్, ఇషా నమాజులు మగ్రిబ్ వేళ అయినప్పుడు చేయడం. ఇక ‘ జమా తాకీర్’ అంటే, జొన్గా, అత్ నమాజులు అన్ నమాజు వేళలో, మగ్రిబ్, ఇషా నమాజులు ఇషా నమాజు వేళలో చేయడం) 

తబూక్ కు చేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం తబూకకు చేరి గుడారాలను వేసుకొని, రోమనులతో తలబడడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానుద్దేశించి, విశాలమైన భావాలు స్ఫురించేటట్లుగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇహపరలోకాల సాఫల్యం గురించి ప్రోత్సహించారు. అల్లాహ్ శిక్ష ఎలాంటిదో చూపుతూ భయ పెట్టారు. యుద్ధానంతరం లభించబోయే వరాలు, బహుమానాలకు సంబంధించిన శుభవార్తనిచ్చారు. ఇలా సైన్యం యొక్క ధైర్యసాహసాలు పెరిగినట్లయింది. వారిలో ఇప్పటి వరకు, తినుబండా రాలు, ఇతర వస్తువుల లేమి గురించి బాధపడుతున్న లోపాలన్నీ తొలగి పోయాయి. మరో ప్రక్క రోమను సామ్రాజ్యానికి మద్దతుగా వచ్చిన తెగలు, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక గురించి విని భయభీతులైపోయాయి. ముందుకొచ్చి ముస్లిమ్ సేనను ఢీకొనడానికి ధైర్యం చాలక, దేశంలోని వివిధ పట్టణాల వైపునకు పారిపోనారంభించాయి. వారి ఈ వైఖరి ప్రభావం, అరేబియా ద్వీపం లోనే కాకుండా, బయటి వారి పైనా పడింది. ముస్లిముల ఘనకీర్తికి మరింత బలం చేకూరినట్లయింది. ముస్లిములకు, యుద్ధం ద్వారా సాధించ లేని రాజకీయ ప్రయోజనాలు ఒనగూడాయి. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇక్కడ సమీక్షిద్దాం. 

‘అయిలా’ పాలకుడు ‘యక్నా బిన్ రౌబా’ వెంటనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై జిజియా కట్టడానికి ఒప్పుకున్నాడు. సంధి ఒప్పందం చేసు కున్నాడు. ‘జర్ బా’ మరియు ‘అజ్ రూహ్’ పౌరులు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి జిజియా కట్టడానికి సిద్ధపడ్డారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఓ పత్రాన్ని రాయించి ఇచ్చారు. వారు దాన్ని సురక్షితంగా తమ వద్ద ఉంచు కోవడం జరిగింది. అలాగే ‘అయిలా’ లకునికి కూడా ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) పత్రాన్ని రాసి ఇచ్చారు. అది ఈ క్రింది విధంగా ఉంది.

“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరఫున, యహినా బిన్ రౌబా మరియు అయిలా ప్రజలకు రాసి ఇచ్చిన శాంతి ఒప్పంద పత్రం. భూతలంపైనా, సముద్రం మీదనూ వారి పడవలు మరియు బిడారాల బాధ్యత అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)దే. అలాగే ఈ బాధ్యత ‘యహినా’కు మిత్రులైన సిరియా వారి కోసం కూడాను. అయితే, వారి ఏ వ్యక్తి అయినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అతని ధనం అతని ప్రాణాన్ని రక్షించలేదు. అతని సొత్తును తీసుకున్నవాడికి అది ధర్మసమ్మతమే అవుతుంది. వారు ఏ ఒయాసిస్సుకు వెళ్ళడాన్నిగాని, భూమి మరియు సముద్ర మార్గం పై నడవడాన్నిగాని అడ్డుకోవడం జరుగదు.”

ఇదే కాకుండా మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కు నాల్గు వందల ఇరవై ఉ’రోహకుల పటాలాన్నిచ్చి దూమతుల్ జందల్ పాలకుడు ‘ఉకైదిర్’ వద్దకు పంపించారు. వెళ్ళేటప్పుడు ఆయనతో, “నీవు వెళ్ళేటప్పటికి అతడు జింక వేటలో ఉండగా జూస్తావు” అని కూడా చెప్పారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కోట అగుపడేటంత దూరం వెళ్ళి ఆగిపోయారు. అనుకోకుండా ఓ జింక ఎక్కడి నుండో వచ్చి కోట ద్వారాన్ని కొమ్ములతో చెలుగుతోంది. ఉకైదర్ దాన్ని వేటాడడానికి బయటకు వచ్చాడు. వెన్నెల రాత్రి కావడం వలన, హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు), ఆయనగారి అనుచరులు అతణ్ణి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి క్షమించి, రెండు వేల ఒంటెలు, ఎనిమిది వందల బానిసలు, నాల్గు వందల కవచాలు, నాల్గు వందల బరిశెలు ఇచ్చే షరతు పై ఒప్పందం కుదుర్చుకుని వదలివేశారు. అతను ఇక నుండి జిజియా కూడా కడతా నని ఒప్పుకున్నాడు. ఇలా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యహినాకు తోడు దూమా, తబూక్, అయిలా మరియు తైమాలతో షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్లయింది. 

ఈ పరిస్థితులను గమనించి, ఇప్పటి వరకు రోమనుల చెప్పుచేతల్లో ఉన్న తెగలు, ఇక తమ పాత సంరక్షకులను నమ్ముకొని ఉండే కాలం చెల్లిపోయిందని తలచి ముస్లిములకు సహకరించనారంభించారు. ఈ విధంగా ముస్లిము సామ్రాజ్య సరిహద్దులు విస్తరించి నేరుగా రోమను సామ్రాజ్యంతో కలిసిపోయాయి. రోమనుల తొత్తులు చాలా మట్టుకు అంతమైపోయారు. 

మదీనాకు తిరుగు ప్రయాణం 

ఇస్లామీయ సేన ఎలాంటి యుద్ధం చేయకుండానే విజయకేతనం ఎగురవేస్తూ మదీనాకు తిరిగి వచ్చింది. అల్లాహ్, యుద్ధం విషయంలో మోమిన్ (విశ్వాసుల)కు అండగా నిలిచాడు. అయితే మార్గమధ్యంలో ఓ లోయ వద్ద పన్నెండుగురు మునాఫిక్ కు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఆయన అప్పుడు ఆ లోయగుండా వెళుతున్నారు. హజ్రత్ అమ్మార్(రదియల్లాహు అన్హు) ఒంటె ముకుత్రాడు పట్టుకొని ముందు నడుస్తున్నారు. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఒంటె వెనకాల నడుస్తూ దాన్ని తోలుతున్నారు. మిగిలిన సహాబాలందరూ దూరంగా, ఆ లోయ పల్లపు ప్రదేశం గుండా వస్తున్నారు. అందుకని మునాఫిలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చే దుష్టావకాశం లభించిందనిపించింది. వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపునకు రానారంభించారు. ఇటు ప్రవక్తగారి సహచరులిద్దరు మామూలుగా నడుస్తూనే ఉన్నారు. వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు కాళ్ళ సవ్వడి వినబడింది. వీరంతా ముఖాలపై ముసుగులు కట్టుకొని దాడికి సిద్ధపడడం చూసి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) హుజైఫా (రదియల్లాహు అన్హు)ను వారిని అడ్డగించడానికి పంపారు. ఆయన వారి వాహనాల ముఖాలపై తన బౌలుతో కొట్టనారంభించారు. అల్లాహ్, ఆయన వేసిన దెబ్బలకు భయపడి పోయేటట్లుగా చేయడం వలన వారు పారిపోయి తమ వారి వద్దకు చేరారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేర్లు చెబుతూ వారెందుకు వచ్చారో తెలియజేశారు. అందుకనే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కు, ప్రవక్త ‘నమ్మిన బంటు’గా పేరుబడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించే దివ్య ఖుర్ఆన్లో, “వారు చేయదలిచిన పనిని చేయలేకపోయారు” అనే వాక్యం అవతరించింది. 

ప్రయాణం పూర్తిచేసి మదీనా దాపుకు రాగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీనా గురుతులు కానరాగా ఆయన, “అదిగో ‘తాబా’, అది ఉహద్ కొండ, మనల్ని ప్రేమించేది మనం దాన్ని ప్రేమిస్తున్న కొండ అదిగో” అని సంబరపడుతూ అన్నారు. ఇటు మదీనాలో ఆయన రాక గురించిన వార్త అందగానే స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో ఘనంగా ఆ సైన్యానికి స్వాగతం పలకుతూ ఈ పద్యపాదాలను చదవనారంభించారు° (దాని భావం ఇలా ఉంది): 

“సనీయతుల్ విదా దిగ్మండలం నుండి పొడిచిన పున్నమి చంద్రు డడిగో, మమ్మల్ని పిలిచేవాడు పిలుస్తున్నంత వరకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి.” 

[ఇది ఇబ్నె ఖయ్యిమ్ గారి సూక్తి. దీనిపై చర్చ ఇది వరకే వచ్చింది]

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ కు రజబ్ నెలలో బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి రమజాన్ నెల నడుస్తోంది. ఈ ప్రయాణం మొత్తం యాభై రోజుల ప్రయాణం. ఇరవై రోజులు తబూక్ లో గడిపినవి, ముప్ఫై రోజులు అక్కడికి వెళ్ళిరావడానికి జరిగిన ప్రయాణ రోజులు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవితకాలంలో స్వయంగా పాల్గొన్న గజ్వాల్లో ఈ గజ్వా చిట్టచివరి గజ్వా (పోరాటం). 

ముకల్లిఫీన్ (యుద్ధంలో పాల్గొనకుండా వెనుక ఉండిపోయినవారు) 

ఈ పోరాటం, దాని ప్రత్యేక పరిస్థితులననుసరించి, అల్లాహ్ తరఫున ఓ గట్టి పరీక్ష కూడాను. ఈ పోరాటం ద్వారా, విశ్వాసులెవరో, విశ్వాసులు కానివారెవరో తేలిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి వారిని ఏరి చూయించడం అల్లాహ్  సంప్రదాయం. దివ్యఖుర్ఆన్ ఈ విషయాన్ని ఇలా సెలవిస్తోంది: 

“మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏ మాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను, అపవిత్రుల నుంచి తప్పకుండా వేరుచేస్తాడు.” (3:179) 

కాబట్టి ఈ పోరాటంలో విశ్వాసులు, సత్యవంతులందరూ పాల్గొన్నవారే. ఆ యుద్ధంలో పాల్గొనకపోవడమంటే, అది నిఫా కు (కాపట్యానికి) గుర్తు. ఎవరైనా యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో ఆ విషయాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకునేవారు సహాబా (రదియల్లాహు అన్హుమ్). ఆయన దానికి జవాబుగా, “వదిలేయండి! అతని మనస్సులో శ్రేయం పొందాలనే కోరికే ఉంటే, అల్లాహ్ త్వరలోనే అతణ్ణి నా వద్దకు పంపించేస్తాడు. అలా కాకపోతే అతని నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించినట్లే” అని అంటూ ఉండే వారు. ఎలాగైతేనేమి,యుద్ధసామగ్రి, వాహనాలులేక యుద్ధంలో పాల్గొనలేక పోయిన వారు కొందరైతే, మునాఫిక్ కు మరికొందరు. ఈ మునాఫిస్టు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించామని దొంగ నటన చేసినవారు. ప్రస్తుతం వారే దొంగసాకులు చెప్పి ఈ గజ్వాలో పాల్గొనకుండా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతిని పొంది వెనుక ఉండిపోయినవారు. మరికొందరైతే ఎలాంటి అనుమతి లేకుండానే ఇండ్లలో కూర్చుండిపోయారు. అయితే పోరాటంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ముగ్గురు మాత్రం నిజమైన ముస్లిములు, గట్టి విశ్వాసం గలవారే. వారు ఎలాంటి కారణం లేకుండానే యుద్ధంలో పాల్గొనలేదు. వారిని అల్లాహ్ పరీక్షకు గురిచేసిన తరువాత వారి పశ్చాత్తాపాన్ని మన్నించడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

తిరుగు ప్రయాణం చేసి మదీనాకు చేరిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పటిలాగే మస్జిదె నబవీ కి వెళ్ళారు. అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు. ప్రజలు చుట్టుముట్టగా అక్కడనే కూర్చుండిపోయారు. ఇటు మునాఫిక్లులు – వారు ఎనభై మందికంటే ఎక్కువే.”(*) ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదో సాకులు చెప్పనారంభించారు. అల్లాహ్  పై ప్రమాణాలు చేస్తూ తాము రాలేకపోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పైకి చెప్పే దాన్ని స్వీకరించి వారితో బైక్ కూడా చేస్తూ వారి మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. వారి మనస్సులోని విషయాన్ని దైవానికే వదలివేశారు

(*) వాకిదీ కథనం ప్రకారం, ఈ సంఖ్య అన్సారులలోని మునాఫిక్ లది. వారే కాకుండా బనీ గిఫ్ఫార్ వగైరా బద్దూ తెగల వారి సంఖ్య ఎనభై ఇద్దరు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై, అతని సహచరులు వారికి అదనం. వారు కూడా చాలా మందే ఉన్నారు. (చూడండి, ఫహుల్ బారి-8/119) 

ఇక మిగిలిన వారు ముగ్గురు మోమిన్లు, సత్యసంధులు – అంటే హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), మురారా బిన్ రబీ (రదియల్లాహు అన్హు), హిలాల్ బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు)లు- వారు నిజాన్నే అనుసరిస్తూ, “మేము ఎలాంటి కారణం లేకుండానే పోరాటంలో పాల్గొనలేదు” అని ఉన్న విషయం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సంభాషణ చేయవద్దని సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను ఆదేశించారు. కాబట్టి ఈ ముగ్గురికి వ్యతిరేకంగా తీవ్రమైన బాయికాట్ (సామాజిక వెలి) ప్రారంభం అయింది. ప్రజలంతా ఒక్కసారే మారిపోయారు. జీవితం భయంకరంగా మారిపోయింది. ఇంత పెద్ద వైశాల్యం గల భూమి ఒక్కసారే ఇరుకైనట్లనిపించింది వారికి, అదేకాదు ప్రాణాలు కూడా పోయేటంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అలా నలభై రోజులు గడిచిన తరువాత భార్యల వద్దకుపోవడం కూడా మానుకొమ్మనే ఆదేశం వెలువడింది. బాయికాట్ కు సంబంధించిన యాభై రోజులు పూర్తి అయిన తరువాత అల్లాహ్ వారి తౌబా స్వీకరించబడినట్లు శుభవార్త అందించాడు. దివ్యఖుర్ఆన్ లోని ఈ శుభవార్త వాక్యాలు ఇలా ఉన్నాయి. 

“ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా, భూమి వారికి ఇరుకై పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించే వాడూను.” (9 : 118) 

ఈ తీర్పు వెలువడగానే ముస్లిములందరూ సాధారణంగానూ, ఆ ముగ్గురు సహాబాలు (6) ప్రత్యేకంగాను సంబరపడిపోయారు. ప్రజలు పరుగున వచ్చి వారికి ఈ శుభవార్తను అందించనారంభించారు. వారి ముఖాలు ఆనందాతిశయంతో విప్పారిపోయాయి. ప్రజలు వారికి కానుకలు అర్పించనారంభించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వారికి ఎంతో విలువైన రోజు. 

అలాగే మరెవరైతే చేతకాక వివశులై ఆ సంగ్రామంలో పాల్గొనలేక పోయారో వారిని గురించి అల్లాహ్ ఈ క్రింది ఆయత్ లను అవతరింపజేశాడు. 

“వృద్ధులు, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనడానికి దారి భత్యాలు లేని వారూ ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విశ్వాసపాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.” (9 : 91,92) 

మదీనాకు దాపుగా వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విషయంలోనే, “మదీనాలో కొందరున్నారు. వారు మీరు ఏయే ప్రదేశాల నుండి ప్రయాణం చేశారో, ఏ లోయల్ని దాటారో అప్పుడు మీ వెంటే ఉన్నారు, వారిని కొన్ని అనివార్య కారణాలు మీ వెంట రాకుండా చేశాయి” అని అనగా, “ఓ దైవప్రవక్తా! వారు మదీనాలో ఉంటూనే మన వెంట ఉన్నారా?” అని అడిగారు అనుచరులు. “అవును, మదీనాలో ఉండి కూడా వారు మీ వెంటే ఉన్నారు” అని సమాధానమిచ్చారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). 

ఈ పోరాట ప్రభావం 

ఈ సంగ్రామం అరేబియా ద్వీపంపై, ముస్లిముల ప్రభావం విస్తరింప జేయడానికి, బలం చేకూర్చడానికి ఎంతో దోహదపడింది. ఇక అరేబియా ద్వీపంలో ఇస్లామ్ శక్తి తప్ప మరే శక్తి జీవించి ఉండజాలదు అనే విషయం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అదను కోసం ఎదురుచూస్తున్న మునాఫిక్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. వీరు రోమను సామ్రాజ్యంపై పెట్టుకున్న 

ఆశలు ఈ సంగ్రామంతో అడుగంటిపోయాయి. అందుకని వారి ధైర్యం కాస్తా సన్నగిల్లి, యదార్థం ముందు మోకరిల్లడం తప్ప మరే మార్గం వారికి లభించలేదు. 

ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇక ముస్లిములు, మునాఫిక్స్ ఎడల మృదువైఖరిని అవలంబించే అవసరమే లేకుండాపోయింది. అల్లాహ్ వారి ఎడల కఠిన వైఖరిని అవలంబించమని ఆదేశం ఇస్తూ, చివరకు వారు ఇచ్చే దానధర్మాలను కూడా స్వీకరించడంగాని, వారి జనాజా నమాజు చేయడం గాని, వారి మన్నింపు కోసం ప్రార్థించడంగాని చేయవద్దని ఆదేశించడం జరిగింది. అలాగే వారి సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని, మస్జిద్ పేరు మిద వారేదైతే కుట్రల గూడు కట్టుకున్నారో దాన్ని పడవేయమని ఆదేశిం చాడు. వాటి గురించి అవతరింపజేసిన ఆయలు వారిని పూర్తిగా బట్టబయలు చేసివేశాయి. ఇక వారిని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు లేకుండా పోయింది. అంటే, ఈ ఖుర్ఆన్ ఆదేశాలు, మదీనా ప్రజలు తెలుసుకునేటట్లు వారి బండారం బయట పెట్టాయన్నమాట.” *

* ఈ గజ్వా (సంగ్రామం) గురించిన వివరాలు ఈ క్రింది ఆధారాల నుండి గ్రహించ బడ్డాయి. ఇబ్నె హషామ్-2/515 – 517, జాదుల్ ముఆద్-3/2 – 13; సహీ బుఖారి -2/633 – 637, 1/252, 414 వగైరా; సహీహ్ ముస్లిమ్ షరా నూవీ-2/246; ఫత్ హుల్ బారి-8/110 – 126, ముక్తసరుస్సీరత్- షేక్ అబ్దుల్లాహ్, పుట. 291 – 407) 

ఈ సంగ్రామానికి సంబంధించి అవతరించిన ఖుర్ఆన్ ఆదేశాలు 

ఈ గజ్వాకు సంబంధించి తౌబా సూరా (కౌ అధ్యాయం)లో అనేక ఆయలు అవతరించాయి. కొన్ని గజ్వాకు బయలుదేరక పూర్వం అవతరిస్తే, మరికొన్ని బయలుదేరి వెళ్ళిన తరువాత ప్రయాణ సందర్భంగాను, మరికొన్ని మదీనాకు తిరిగి వచ్చిన తరువాతనూ అవతరించాయి. ఈ ఆయత్ లలో చిత్తశుద్ధిగల విశ్వాసుల ఔన్నత్యం ఎలాంటిదో చెప్పడం జరిగింది. అదే కాకుండా, ఈ ఆయత్ లలో, గజ్వాలో పాల్గొన్నవారు, గజ్వాలో పాల్గొనలేక పోయిన విశ్వాసులు, సత్యసంధుల తౌబా (పశ్చాత్తాపం) స్వీకరించబడిన విషయమూ వగైరాలు ఉన్నాయి.

ఆ సంవత్సరపు కొన్ని ప్రముఖ సంఘటనలు 

ఆ సంవత్సరం (అంటే హిజీ శకం 9)లో చారిత్రాత్మకమైన సంఘట నలు అనేకం చోటు చేసుకున్నాయి. 

1. తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత, ఉవైమిర్ అజ్ఞానీ మరియు ఆయన భార్య నడుమ ‘లిఆన్’ (రంకు విషయమై ఏర్పడిన జగడం) జరిగింది. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తాను వ్యభిచరించినట్లు చెప్పిన స్త్రీకి ‘రజ్మ్’ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) వేయబడింది. ఆ స్త్రీ పురుడు పోసుకొని, పిల్లవాడు పాలు త్రాగడం మానినప్పుడు గాని ఆమెను రజ్జ్ చేయడం జరగలేదు. 

3. అబిసీనియా చక్రవర్తి ‘అస్మహా నజాషీ’ మరణించగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ‘గాయిబానా’ (పరోక్ష) నమాజె జనాజా చేశారు. 

4. ఆ సంవత్సరమే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుత్రిక ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) చనిపోయారు. ఆమె మరణం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శోకసముద్రంలో ముంచివేసింది. తన అల్లుడు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒకవేళ నాకు మూడవ కుమార్తె ఉండి ఉంటే ఆమె వివాహం కూడా నీతో చేసేవాన్నే” అన్నారు. 

5. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత మునాఫిక్స్ సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని మన్నింపు కోసం దుఆ చేశారు. హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఆయన్ను వారిస్తున్నప్పటికీ అతని నమాజె జనాజా చేశారు. ఆ తరువాత దివ్యఖుర్ఆన్లో, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను బలపరుస్తూ, మునాఫిక్స్ నమాజె జనాజా చేయకూడదనే ఆదేశం అవతరించింది. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.


اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.

ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.

మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.

ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.

ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.

ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.

అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.

ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.

అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.

కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.

ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!

ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.

సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.

సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.

అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.

సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.

ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741

సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

షవ్వాల్ మాసంలో జరిగిన సీరత్ (చారిత్రిక) సంఘటనలు – అరబీ ఖుత్బా తెలుగు అనువాదం [వీడియో]

షవ్వాల్ మాసంలో జరిగిన సీరత్ (చారిత్రిక) సంఘటనలు – అరబీ ఖుత్బా తెలుగు అనువాదం [వీడియో]
వక్త: షేక్ రాషిద్ అల్ బిదా (హఫిజహుల్లాహ్) | ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [35 నిముషాలు]
https://youtu.be/8O-gyQXN6oE

సీరతే సహాబియ్యాత్ – ఉమ్ముల్ ఫజ్ల్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర (ఇబ్నె అబ్బాస్ తల్లి గారు) [వీడియో]

బిస్మిల్లాహ్
ఉమ్ముల్ ఫజ్ల్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర (ఇబ్నె అబ్బాస్ తల్లి గారు) – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[35 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

సీరతే సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

సీరతే సహాబియ్యాత్ – హజ్రత్ ఉమర్ సోదరి – ఫాతిమ బిన్తె ఖత్తాబ్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హావారి సోదరి జీవిత చరిత్ర మస్జిదె హరామ్ లో హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) గారి మీద దాడి జరిగిన తర్వాత ఉమ్మె జమీల్ ఫాతిమా బిన్తె ఖత్తాబ్ ఎలా సహాయపడ్డారు? తన అన్నయ్య హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించడానికి ఆమె ఎలా కారణం అయ్యారు?

సీరతే సహాబియ్యాత్ – హజ్రత్ ఉమర్ సోదరి – ఫాతిమ బిన్తె ఖత్తాబ్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర- వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[37 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

తప్పక వినండి, కన్నీటి పర్యంతం అవుతారు. ఈమె భర్త జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) మరణించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎటువంటి శుభవార్త ఇచ్చారో తెలుసుకోండి..ఆమె ప్రవక్త యొక్క ముగ్గురు సహచరులను వివాహం చేసుకున్నందుకు ప్రసిద్ధి చెందింది: జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ , అబూ బకర్ మరియు అలీ ఇబ్న్ అబి తాలిబ్ (రదియల్లాహు అన్హుమ్)

أَسْمَاء بِنْت عُمَيْس‎ – అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[47 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

అస్మా బిన్త్ అబూబక్ర్ (రజియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
అస్మా బిన్త్ అబూ బక్ర్ (రజియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[35 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) – Sumayyah (radhiyallaahu anha)
వీరి గురించి ప్రవక్త “ఓపిక వహించండీ, మీకు స్వర్గవాగ్దానం ఉంది“ అని అన్నారు

సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు)
https://youtu.be/0RpTYePDBes [38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి మహిళా షహీద్ అయిన సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరించబడింది. ఆమె జీవితంలోని మూడు ముఖ్యమైన గుణపాఠాలు- ఈమాన్ (విశ్వాసం), సబర్ (సహనం), మరియు ఇస్తిఖామత్ (స్థిరత్వం) – ఎలా మనకు ఆదర్శంగా నిలుస్తాయో చర్చించబడింది. సూరహ్ అల్-అహ్జాబ్ మరియు సూరహ్ అల్-ముల్క్ నుండి ఆయతులను ఉటంకిస్తూ, ఒక విశ్వాసి యొక్క లక్షణాలను మరియు జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయబడింది. యాసిర్ (రది యల్లాహు అన్హు) కుటుంబం ఇస్లాం ప్రారంభ రోజులలో ఎదుర్కొన్న కఠినమైన హింసలు, మరియు అబూ జహల్ చేతిలో సుమయ్య (రది యల్లాహు అన్హా) యొక్క దారుణమైన షహాదత్ (అమరగతి) గురించి వివరించబడింది. చివరగా, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందడానికి అవసరమైన మూడు లక్షణాల గురించిన హదీసును వివరిస్తూ, సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవితం నుండి ప్రేరణ పొంది మన విశ్వాసాన్ని, సహనాన్ని మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రబోధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మాబాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు నా ప్రసంగాంశం, ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

ఆవిడ జీవిత చరిత్రలో ముఖ్యమైన మూడు విషయాలు మనకు ఆదర్శం. అన్నిటికంటే విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, దానికి మించినది ఏదీ లేదు అనే విషయం ఈమాన్, విశ్వాసం. అలాగే రెండవది సబర్, సహనం. మూడవది ఇస్తిఖామత్, స్థిరత్వం. ముఖ్యమైన ఈ మూడు విషయాలు మనకి సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో బోధపడుతుంది.

ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణాలు, గుణాలలో కొన్ని గుణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అహ్జాబ్, సూరహ్ నంబర్ 33, ఆయత్ నంబర్ 35లో ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

“నిశ్చయంగా, ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు, అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు- వీరిందరి కోసం అల్లాహ్ మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”

ప్రియ సోదరులారా! ఈ సూర అహ్జాబ్ ఆయత్ నంబర్ 35 కి ఇది అర్థం.

కాకపోతే ఇక ఈ ఆయత్ యొక్క వివరము, తఫ్సీర్ లో నేను వెళ్ళదలచలేదు. కేవలం ఈ ఆయత్ లో వివరించబడిన గుణాలలో ఒక్క ముఖ్యమైన గుణం – వస్సాబిరీన వస్సాబిరాత్. సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు. సబర్ గురించి. సబర్ అంటే సహనం. సాబిర్, సహనం చేసేవారు, వహించేవారు.

సహనశీలి అయిన స్త్రీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. మరొకసారి నేను ఈ అర్థానికి రిపీట్ చేస్తున్నాను. సహనశీలి అయిన స్త్రీ అంటే ఏమిటి? సాబిరహ్ అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. నిరాశ చెంది దైవాభిష్టానికి వ్యతిరేకమైన ఎటువంటి పనులకు పాల్పడకూడదు. తూఫాను భీభత్సంలో చిక్కుకొని భయంకరమైన కెరటాలకు ఊగిపోయే జీవిత నౌకను సహన స్థైర్యాలు కలిగిన నావికురాలు అల్లాహ్ మీద భారం వేసి అంతిమ శ్వాస వరకు దాన్ని తీరానికి తీర్చడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి స్త్రీయే సుమయ్య రది యల్లాహు అన్హా.

సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే ధృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్న సాహసవతులలో యాసిర్ రది యల్లాహు అన్హు, ఆయన యొక్క అర్ధాంగి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హు కూడా ఉన్నారు.

సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రది యల్లాహు అన్హుని మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో ఒళ్ళు హూనం చేశారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. మక్కాలో ఇస్లాం ప్రారంభ కాలంలో ఆ యాసిర్ రది యల్లాహు అన్హు, భార్య సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు, ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితిని చూసి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కళ్ళారా చూసి, ఏమీ చేయలేని సమయం అది. ఆ సమయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట వచ్చిన మాట: “ఇస్బిరూ యా ఆల యాసిర్, ఫ ఇన్న మౌయిదకుముల్ జన్నహ్.” ఓ యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి ఎందుకంటే మీ నివాస స్థలం స్వర్గం. చివరికి యాసిర్ రది యల్లాహు అన్హు అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు.

సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా గాథ కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రది యల్లాహు అన్హా మీదికి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేల కొరిగారు. ఈ విధంగా ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన, అమరగతి నొందిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముల్క్ లో ఇలా సెలవిచ్చాడు, ఆయత్ నంబర్ రెండు సూర ముల్క్ లో:

الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ
(అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లు వకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, వహువల్ అజీజుల్ గఫూర్)
“మీలో ఎవరు ఉత్తమమైన కర్మలు చేస్తారో పరీక్షించడానికి, ఆయనే మరణాన్ని, జీవితాన్ని సృష్టించాడు. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.”

అంటే ఈ జీవన్ మరణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్షించే నిమిత్తం మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సదాచరణ చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు, మంచి వారు ఇవి చూడటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ చావుని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని సృష్టించాడు. కనుక ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు, విచారాలు కూడా ఉన్నాయి. ఆనందము ఉంది. బాధా ఉంది. ప్రశాంతత, అప్రశాంతతలు రెండూ ఉన్నాయి. ఏ కష్టాలు వచ్చినా, ఏ కడగండ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంతో, సంపూర్ణ విశ్వాసంతో సహనంతో ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టం అయిపోయినా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనే పాఠం మనకు బోధపడుతుంది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలో.

అభిమాన సోదరులారా! సుమయ్య రది యల్లాహు అన్హా అసలు ఆవిడ ఎవరు? ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఇది ప్రారంభ కాలం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబువ్వత్ వచ్చిన ప్రారంభంలో మక్కాలో ఒక వీధి ఉంది. దాని పేరు బనూ మఖ్జూమ్ వీధి. ఆ మక్కాలో బనూ మఖ్జూమ్ ఆ వాడ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా ఒక ముసలావిడని ఇనుముతో తయారు చేసిన ఆ వస్త్రాలలో, దానికి ఉర్దూలో జిరాహ్ అంటారు. దాంట్లో బాగా కట్టేసి మండుటెండలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అంటే ఒక సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వీధులలోని ఒక వీధి, వాడలోని ఒక వాడ బనూ మఖ్జూమ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ శుభప్రదమైన, పవిత్రమైన తమ కళ్ళతో చూసిన దృశ్యం ఇది. ఒక ముసలావిడను ఇనుముతో తయారు చేసిన దానితో బాగా కట్టేసి భగభగ బాగా విపరీతమైన వేడిలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అసలు సుమయ్య రది యల్లాహు అన్హా ఎవరంటే అజ్ఞాన కాలంలో మక్కాలో ధనవంతులలో ఒక ధనవంతుడైన అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి యొక్క బానిసరాలు సుమయ్య రది యల్లాహు అన్హా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రవక్త పదవి లభించక, అంటే బేసతే నబవి, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవక్త పదవి లభించక 45 సంవత్సరాల ముందు, అంటే ఇంకా అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టనే లేదన్నమాట, 45 సంవత్సరాల ముందు యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి మక్కాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యొక్క ఒక తమ్ముడు వ్యాపార నిమిత్తమో, ఏదో నిమిత్తమో యమన్ నుంచి వేరే దేశాలకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పోలేదు. తప్పిపోయారన్నమాట. తన తప్పిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ మక్కాకి వచ్చారు యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి. ఆ విధంగా వచ్చి మక్కాలోనే ఉండిపోయారు. తమ నివాసంగా మార్చుకున్నారు.

ఆ యాసిర్ బిన్ ఆమిర్ తో అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా అంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క యజమాని, ఆ అబూ హుజైఫా తన బానిస అయిన సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యమన్ నుంచి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన యాసిర్ బిన్ ఆమిర్ తో జరిపించాడు. ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యాసిర్ బిన్ ఆమిర్ తో జరిగింది.

ఆ విధంగా వారి జీవితం కొనసాగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే యాసిర్ రది యల్లాహు అన్హు వేరే దేశం నుంచి వచ్చారు గనుక, సుమయ్య రది యల్లాహు అన్హా ఒక దగ్గర బానిసగా ఉన్నారు గనుక, వారికి ఆదుకోవటానికి, వారికి కష్ట సమయాలలో సహాయం చేయటానికి, ఆర్థిక పరంగా వారికి సహాయం చేయటానికి, సుఖదుఃఖాలలో పాల్గొనటానికి వారికి రక్త సంబంధీకులు మక్కాలో ఎవరూ లేరు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. తౌహీద్ సందేశం మొదలెట్టారు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, విశ్వాసం గురించి, వాస్తవాల గురించి, జీవన విధానం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించే వారిలో ముందున్న వారు ఆల యాసిర్. అంటే యాసిర్ రది యల్లాహు అన్హు, సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు.

ఇక ఆ తర్వాత మనము మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే మక్కాలో వహీ వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో ఎవరెవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వారి స్థితి ఎలా ఉన్నిందో మనకు అర్థం అవుతుంది. రకరకాలుగా, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారో, బంధువులు లేని వారు, రక్త సంబంధం లేని వారు, అటువంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. వారిలో ఈ కుటుంబం కూడా, ఆల యాసిర్.

చాలా విధాలుగా హింసించబడ్డారు. వారిని కొట్టటం, వారిని తిట్టటం, హింసించటం, బట్టలు తీసేసి విపరీతమైన వేడి కాలంలో మిట్ట మధ్యాహ్నం బట్టలు తీసి ఇసుక మీద పడుకోబెట్టేవారు. అల్లాహు అక్బర్. తండ్రి ఓ పక్కన, తల్లి ఓ పక్కన, కొడుకు ఓ పక్కన, ఒకరి ముందర ఒకరికి శిక్ష ఇస్తున్నారు.

కాస్త మనము గమనించాలి. ఈ రోజు మనం అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆర్థికంగా కూడా పస్తులు ఉండే సమయం కాదు. రెండు రోజులు, మూడు రోజులు తినటానికి తిండి లేదు అనేది లేదు. అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుష్కలంగా మనకి వరాలు ప్రసాదించాడు. అయినా కూడా ఇస్లాం పరంగా జీవించటానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ మనము చాలా విషయాలలో నిర్లక్ష్యం పాటిస్తున్నాం, చేస్తున్నాం.

మన కళ్ళ ముందర కూడా చెడు జరిగితే మనకెందుకేలే అని చెప్పి మౌనం వహిస్తున్నాం. ఒకవేళ మనలో కొందరు దీన్ పరంగా నడుచుకున్నా వారి కుటుంబంలో ఎంత మంది? భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మా నాన్న వారు దీన్ పరంగా ఉన్నారా? తౌహీద్ లో ఉన్నారా? షిర్క్ లేకుండా ఉన్నారా? బిద్అత్ చేయకుండా ఉన్నారా? దీన్ ప్రకారం నడుచుకుంటున్నారా?

దీన్ పరంగా నడుచుకోవటానికి, తౌహీద్ పైన నిలకడగా ఉండటానికి, షిర్క్ చేయకుండా ఉండటానికి, తౌహీద్ విశిష్టత తెలుసుకోవటానికి, దాని అనుగుణంగా జీవితం గడపటానికి, అల్లాహ్ ను స్మరించటానికి, నమాజులు నెలకొల్పటానికి మనకు ఎవరైనా అడ్డు వస్తున్నారా? చేతిలో కర్ర తీసుకొని కొడుతున్నారా? ఆ విధంగా మనము పోల్చుకుంటే లెక్కలేని అనేక వరాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ప్రసాదించాడు. ఈ విషయం గురించి మనందరమూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, నేను ప్రారంభంలోనే చెప్పాను. అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ చనిపోయారు సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హు. చనిపోయారు. అలాగే సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హాను కూడా పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి, అంటే కొంతమంది చరిత్రకారులు కడుపు మీద అంటారు, కొందరు నాభి కింద అంటారు, అక్కడ బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేలకొరిగారు. ఇంత దారుణంగా ఇస్లాం ప్రారంభ కాలంలో, ఎందుకంటే అప్పుడే వారి పెద్ద వయసు వారిది, వృద్ధాప్యానికి చేరుకున్నారు యాసిర్ రదియల్లాహు అన్హు, సుమయ్య రదియల్లాహు అన్హా. ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. బంధువులు ఎవరూ లేరు, రక్త సంబంధీకులు ఎవరూ లేరు. ఇస్లాం ప్రారంభం. ఆ సమయంలో ఎన్ని బాధలు వచ్చినా, అవిశ్వాసుల తరపు నుండి, బహుదైవారాధకుల తరపు నుండి, ఇస్లాం శత్రువుల తరపు నుండి రకరకాల బాధలు వచ్చినా, వారి యొక్క విశ్వాసంలో కొంచెం కూడా మార్పు రాలేదు, బలహీనతకి వారు గురి కాలేదు. ఇది మనకోసం ఉన్న గుణపాఠం.

చివరికి బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడు కదా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు సుమయ్య మరియు యాసిర్ లేరు కదా రది యల్లాహు అన్హుమా, తనయుడు కొడుకు అమ్మార్ ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హును ఉద్దేశించి ఇలా అన్నారు: “ఖద్ ఖతలల్లాహు ఖాతిల ఉమ్మిక్.” ఓ అమ్మార్! నీ తల్లిని చంపినవాడు ఈరోజు చంపబడ్డాడు.

అభిమాన సోదరులారా, సుమయ్య రది యల్లాహు అన్హా ఇస్లాం ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆవిడ జీవించలేదు. అంటే అనేక మంది తండోపతండాలుగా ముస్లింలు అయిపోయారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు, అది ఆ జీవితము, ఆ సమయము సుమయ్య రది యల్లాహు అన్హా జీవితంలో రాలేదు. ప్రారంభంలోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు, ప్రారంభంలోనే ఆవిడ అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు.

నేను ఈరోజు నా ప్రసంగానికి సారాంశం ఏమిటంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మనకోసము ఉండే అనేక గుణపాఠాలలో మూడు విషయాలు, వారు మాకోసం ఆదర్శం. ఈమాన్, సబర్, సాబిత్ ఖద్మీ. ఈమాన్ – విశ్వాసం, సబర్ – సహనం, సాబిత్ ఖద్మీ – నిలకడ, స్థైర్యం. ఇవి మూడు ముఖ్యమైనవి. ఎందుకంటే సుమయ్య రది యల్లాహు అన్హాకి భర్త తరపు నుంచి పరీక్ష. ఎందుకంటే తన కళ్ళ ముందర భర్తని కొడుతున్నారు. భర్త శరీరం నుంచి బట్టలు తీసేసి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో ఎడారిలో పడుకోబెడుతున్నారు, కళ్ళతో చూస్తున్నారు భర్త పడే, భరించే ఆ బాధలు. స్వయంగా సుమయ్య రది యల్లాహు అన్హాని కూడా ఆ ఐరన్ తో తయారు చేసిన ఆ సంకెళ్ళతో బాగా బిగించి ఆవిడని కూడా, అల్లాహు అక్బర్, ముసలావిడ. ఆ ముసలావిడని ఈ విధంగా బంధించడం. కొడుకు అమ్మార్ ని కొట్టటం. ఆ తల్లికి, ఆ విశ్వాసమూర్తికి, ఆ విశ్వాసమూర్తి పడిన బాధ కొంచెం ఊహించుకోండి. ఓ పక్క భర్త, ఓ పక్క కొడుకు, ఓ పక్క స్వయంగా ఆవిడ, అన్ని విధాల అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల, కుఫ్ఫార్ల తరపు నుంచి బాధలు పడతా ఉంటే, ఆమె ఎంత స్థిరంగా, ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో, తన విశ్వాసంలో మార్పులు ఏ విధంగా కూడా రాకుండా, రానివ్వకుండా ఆవిడ ఉన్నిందంటే, అర్థమవుతుంది

ఈమాన్ అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ కొన్ని రోజుల జీవితం కోసం మనము మాటిమాటికి విశ్వాసాన్ని లెక్క చేయకుండా ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని మనము అమ్మేస్తున్నాం. చిన్న కారణాల వల్ల నమాజ్ చేయటం ఆలస్యం చేస్తాం మనం. మనలో చాలా మంది. ప్రతి ఒక్కరు కాదు, చాలా మంది. మనం గమనిస్తున్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కారణం ఉంటుంది, అది తర్వాత కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. అయినా కూడా ఆ ప్రాపంచిక చిన్న లబ్ధి కోసము మనము నమాజ్ వదిలేస్తాము, జమాత్ వదిలేస్తాము, తర్వాత నమాజ్ చేస్తాం. ఇది మన జీవితం.

అంటే కొంచెం ప్రాపంచిక కొంత లాభం కోసం మన ఈమాన్ లో ఎంత మార్పు వస్తా ఉంది. ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. కానీ వారు అన్ని కష్టాలు వారికి వచ్చినా వారి విశ్వాసంలో ఎటువంటి తేడా జరగలేదు.

అభిమాన సోదరులారా, ఇక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ సెలవిచ్చారు, ఆ హదీస్ మనం తెలుసుకొని నేను ముగిస్తాను. అదేమిటంటే ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:

ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ وَجَدَ حَلَاوَةَ الْإِيْمَانِ
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్)
“మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు.”

మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటే, ఏ వ్యక్తిలో మూడు విషయాలు, మూడు గుణాలు ఉంటే ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు. ఇప్పుడు మనము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందామా లేదా అనేది ఈ హదీస్ తెలుసుకొని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మూడు విషయాలలో మొదటిది ఏమిటి?

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
“అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి.”

మొదటి విషయం ఇది. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము అన్నిటికంటే ఎక్కువ, అంటే తన భార్య కంటే, పిల్లల కంటే, స్త్రీ అయితే భర్త కంటే, పిల్లల కంటే, అమ్మా నాన్న కంటే ఎక్కువ, బంధుమిత్రుల కంటే ఎక్కువ, ఈ ధనం కంటే ఎక్కువ, ఆస్తుల కంటే ఎక్కువ, ఆప్తుల కంటే ఎక్కువ, హోదా కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఇది మొదటిది.

రెండవది:

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ
(వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లా లిల్లాహ్)
“ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.”

అంటే ఇతరులను స్వార్థం కోసం కాకుండా, అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. ఉర్దూలో ఒక కవి ఇలా అంటాడు, ఉర్దూలో ఒక కవిత్వం ఉంది, ఒక పద్యము, దాంట్లో ఒక షేర్, ఒక వాక్యం ఇలా ఉంటుంది: “దిల్ మే ఆగ్, లబోం పే గులాబ్ రఖ్తే హైఁ, హమ్ అప్నే చెహ్రే పే దోహ్రీ నఖాబ్ రఖ్తే హైఁ.” మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉంది, మంట రగిలిపోతుంది. పెదవులపై నటిస్తాము. పువ్వులు ఉంటాయి, పెదవుల పైన పువ్వు ఉంది, కానీ లోపల మంట ఉంది. అంటే మన జీవితం ఈ విధంగా ఉంది. స్వార్థం ఉంటే మాట్లాడతాము, లాభం ఉంటే మాట్లాడతాము, అవసరం ఉంటే మాట్లాడతాము. ఆ అవసరాన్ని బట్టి మనము చేసే సలాం కూడా అలాగే ఉంటుంది. సలాం చేసే పద్ధతి, సలాం చేసే విధానము అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? రెండవ గుణం అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఎవరు పొందారు? ఆ పొందటానికి రెండవ గుణం ఏమిటి? ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.

ఇక మూడవది:

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ
(వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్)
“నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు.”

అంటే నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. అంటే ఇస్లాం స్వీకరించాము లేకపోతే పుట్టుకతోనే ముస్లింగా ఉన్నాము, కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవిశ్వాసిగా పోవటం అతని దృష్టిలో “నాకు భగభగ మండే అగ్నిలో వేసేస్తున్నారు. నేను భగభగ మండే ఆ అగ్నిలో నాకు వేసేస్తే అది నాకు ఇష్టమా? ఇష్టం ఉండదు. ఆ విధంగా విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపునకి మరటం కూడా నాకు ఇష్టం ఉండదు”.

ఈ విధంగా ఈ మూడు గుణాలు ఉంటే అటువంటి వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందినట్లే. ఈ మూడు విషయాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, ఈ విధంగా మొదటి విషయం సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఈమాన్, దాని ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ విషయంలో, నాన్న ఏ విధంగానైనా, అన్ని విధాల కుడి వైపు నుంచి, ఎడమ వైపు నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైన నుంచి, అన్ని విధాల ఆర్థిక పరంగా, మానసికంగా, అన్ని విధాలా కూడా బాధలు వచ్చినా, హింసలు పెట్టినా, విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. తౌహీద్ లో తేడా రానివ్వకూడదు. షిర్క్ కి పాల్పడకూడదు. ఇది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మొదటి పాఠం. రెండో పాఠం ఏమిటి? సబర్, సహనం. మూడవది స్థిరత్వం, నిలకడ.

ఒక వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: ఓ దైవ ప్రవక్తా, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అన్నాడు. అంటే ఇస్లాం గురించి బోధనలు చాలా ఉన్నాయి కదండీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించి, దానికి తగిన విధంగా, సమయ సందర్భాన్ని బట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు ఇచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్తా నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అంటే, అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకరిని అడగవలసిన అవసరం రాకూడదు. ఇస్లాం గురించి ఒక విషయం చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకెవ్వరికీ అడిగే అవసరం రాకూడదు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటంటే: “ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్.” అంటే నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నేను విశ్వసించాను, నేను ముస్లింగా ఉన్నాను, నేను మోమిన్ గా ఉన్నాను అని చెప్పు, ఆ తర్వాత ఆ మాట పైనే నిలకడగా ఉండు. చెప్పటమే కాకుండా నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ఆదర్శంగా తీసుకొని, కష్టాలలో కూడా మొదటి విషయము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బాధ నుండి కాపాడుగాక. ఒకవేళ అల్లాహ్ ఇష్టం నిమిత్తం ఏదైనా సమస్య, బాధ వస్తే సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, సహనంతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17185

ముస్లిం వనిత (మెయిన్ పేజీ):
https://teluguislam.net/muslim-woman/

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

ప్రవక్త ﷺ గారి మేనత్త: సఫియ్య బిన్తె అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హా) [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త ﷺ గారి మేనత్త: సఫియ్య బిన్తె అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హా) –
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM